23, ఆగస్టు 2009, ఆదివారం

వినాయక చవితి శుభాకాంక్షలు.

వినాయక చవితి సందర్భం గా నా బ్లాగు చదివే వారందరికీశుభాకాంక్షలు.

విఘ్నేశుడు ఓంకార స్వరూపుడు. ఆయన ఆకారం కూడాఓంకార రూపమే. ఓమిత్యేకాక్షరం బ్రహ్మా అని వేదంచెబుతుంది. దీని
ర్థం: ఓం అనబడే ఏకాక్షరమే బ్రహ్మము. ఈశ్వరునికి గల పేరు ఏదైనా ఉంది అంటే అది ఓం అనుఏకాక్షరమే. కనుక దీనిని శబ్ద బ్రహ్మము అంటారు. గాఢధ్యానములో నాదాన్ని మనం వినగలుగుతాము. ఇది జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలలో వినిపించదు. కొండ కోనల్లో, ప్రశాంత ప్రక్రుతి మధ్యలో, జన సంచారం లేని చోట్ల, లేదాహిమాలయ పర్వతాలలో వేల అడుగుల ఎత్తులో ఉన్నప్రదేశాలలో తెల్లవారు జామున నాదాన్ని సాధకులువినవచ్చు.

తస్య వాచకః ప్రణవః- అని పతంజలి మహర్షి కూడాపరబ్రహ్మము యొక్క వాచకం ప్రణవం అని తన యోగ సూత్రములలో చెబుతాడు. మాండూ
క్యోపనిషత్తు ప్రణవస్వరూపాన్ని అత్యంత వివరంగా వర్ణించింది. అన్ని శబ్దములకు ప్రధమం గా పుట్టిన శబ్దం ఓంకారం. కనుక అన్ని మంత్రములకు ముందు ఓంకారం ఉంటుంది. గణపతి ఓంకార స్వరూపుడు కనుక అన్ని పూజలలో ప్రథమంగా గణపతి పూజ ఉంటుంది.

యోగ మార్గములో కూడా మొదటిది అయిన మూలాధార చక్రమునకు అధిపతి గణపతి. దీన్ని ఆధార చక్రం అని కూడాఅంటారు. సర్వ ప్రపంచానికి ఓంకారమే ఆధారము. అలాగే అన్ని క్రతువులకూ, ఉపాసనలకూ, సాధనలకూ గణపతిఆధారం. గణపతి మంత్ర మూర్తి. అలాగే ప్రణవం కూడా సర్వ మంత్ర మయం. గణపతి బ్రహ్మచర్య మూర్తి. కనుక అన్ని యోగ సాధనలకూ బ్రహ్మచర్యం అతి ముఖ్యం.


ప్రణవ నాదాన్నే అనాహత నాదం అంటారు. అనగా ఆహతము కానిది, కొట్టబడనిది. శబ్దాలన్నీ ఒక వస్తువు ఇంకొకవస్తువుతో తగిలితే వస్తాయి. కాని ప్రణవ నాదం స్వతఃసిద్ధము. కనుక అనాహతము. శబ్దమును అనాహత ధ్వనిఅని కూడా అంటారు. ఇది పరమాత్ముని నాభి స్థానం నుంచి నిరంతరమూ వస్తున్న ధ్వని గా యోగులు చెబుతారు. లోతైన ధ్యానములో మునిగి ఉన్నపుడు ఈ నాదాన్ని తనలో తానె వినవచ్చు. శ్రీ రామకృష్ణులు దీనిని "టాం......" అనే దీర్ఘ ధ్వనిగా ఉంటుంది అని చెప్పారు. గుడిలో గంట మొగించినపుడు ఒక్క సారి కొట్టి వదిలితే ఆ ధ్వని "టాం....." అని దీర్ఘ ధ్వనిగా వినిపిస్తూ చివరికి
శూన్యంలో కలుస్తుంది. ఈ ధ్వని ఓంకార నాదానికి చాలా దగ్గరగా ఉండే ధ్వని. అందుకే గుడిలో ఘంటా నాదం చెయ్యాలి. కాని కొందరు అందే పనిగా సైకిలు బెల్లు కొట్టినట్లు గంట కొడతారు. అది చాలా తప్పు.

Milky way అనేది పాలసముద్రం. గెలాక్సీ ని ఆవరించి ఉన్న, అంటే దీనిపైన శయనించి ఉన్న శక్తి ఆదిశేషువు అనేసహస్ర ఫణ
ములు కల మహా సర్పము. సర్పము శక్తికి మార్మిక సూచన అని యోగులకు తెలుసు. అనగా పాలపుంతను ఒకటిగా పట్టి ఉంచుతున్న ఆకర్షణ శక్తియే ఆదిశేషుడు. మహా సర్పము పైన శయనించి ఉన్న ఈశ్వర శక్తి విష్ణువు. అనగా విశ్వములో గల గురుత్వాకర్షణ శక్తికి మూలమైన శక్తి- విష్ణువు. గణపతిని కూడా శుక్లాంబర ధరంవిష్ణుం అని పూజిస్తాము. శక్తి యొక్క మూలం అనగా గెలాక్సీ యొక్క కేంద్రం అయిన గెలాక్టిక్ సెంటర్ అనేది విష్ణునాభి. ఇక్కడనే మూలా నక్షత్ర మండలం ధనూ రాశిలో ఉంటుంది. ఇది పాలపుంత కు మూలం కనుక దీనిని మూలానక్షత్రం అన్నారు.

మూలా నక్షత్ర మండలం కేంద్రంగా చేసుకొని ఓంకార నాదం Milky way అంతటా నిరంతరమూ ప్రవహిస్తూఉంటుంది. బహుశా ఇది ఇప్పటివరకూ అర్థం కాని ఏదో ఒక రకమైన కాస్మిక్ రేడియేషన్ కావచ్చు. దీన్ని పాశ్చాత్యులు Music of the spheres అనీ logos అనీ అన్నారు. అస్త్రోనమీ కూడా మన పాలపుంతకు కేంద్ర స్థానం మూలా నక్షత్ర మండలం ప్రాంతంలోనే ఉంది అని చెబుతున్నది. వేదంలో వేల సంవత్సరాల క్రితంచెప్పిన విషయాలు ఇప్పటి సైన్సు మళ్ళీ నిజాలుగా వప్పుకుంటున్నది. కాకపోతే వేదం విష్ణు నాభి అంటే సైన్సు గలక్టిక్
సెంటర్ అంటున్నది. భాష తేడా- కాని భావం ఒకటే.

విధంగా నిరంతరం విశ్వంలో తనంత తానుగా ప్రతిధ్వనిస్తున్న ఓంకార స్వరూపమే గణపతి స్వరూపం. ఇదే నాదం మనలో నాడిగా ఉన్నది, హృదయ స్పందన గా ఉన్నది. ప్రాణ స్పందన గా ఉన్నది. ప్రాణ రూపమైన ఓంకారం మనలోఉన్నంత వరకూ మనం జీవిస్తాం. అది ఆగిన మరుక్షణం మరణిస్తాము. విధంగా గణపతి సమస్త జీవులకు ఆధారంగా ఉన్నాడు. జీవులన్నీ గణములు అయితే ఆయన గణములకు పతి లేక గణపతి.

అట్టి ఓంకార రూపుడైన గణపతిని ఆరాధన చేసే నవరాత్రులకు మొదలు ఈరోజు. మంత్ర సాధన చేసే వారు రోజునుంచి నియమంగా తొమ్మిది రోజులు మంత్ర పునశ్చరణ చేయటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. సాధకమిత్రులు ప్రయత్నించండి.

మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు.
read more " వినాయక చవితి శుభాకాంక్షలు. "

21, ఆగస్టు 2009, శుక్రవారం

గీతా శ్లోకానికి యోగపరమైన వివరణ

క్రిందటి భాగంలో ఈ శ్లోకానికి వేదాంత పరమైన అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకానికి యోగపరమైన అర్థం తెలుసుకుందాం.

శ్లోకం||బుద్ధి యుక్తో జహాతీహ/ఉభే సుకృత దుష్క్రుతౌ/
తస్మాద్ యోగయా యుజ్యస్వ/యోగః కర్మసు కౌశలం||

సుకృత దుష్క్రుతములనగా మంచి చెడు కర్మలు అని మనకు తెలుసు. కాని యోగ పరంగా చూస్తె ఈ మంచి చెడు కర్మలు వేరు. మామూలుగా మనం అనుకునే కర్మలు కావు. యోగపరంగా కర్మ అనగా శరీరంలో ప్రాణ సంచారం. యోగపరమైన అర్థం చెప్పేటపుడు సామాన్యార్థం వర్తించదు.

ఇడా పింగళా సుషుమ్నా నాడులు యోగమున సుప్రసిద్ధములు. కుండలినీ యోగములో, స్వర శాస్త్రములో వీటి వినియోగం ఉంటుంది. ఇడా నాడి చంద్ర నాడి, అనగా చల్లని ప్రభావం కలిగినట్టిది. ఇడా నాడినుంచి ప్రాణ సంచారం జరిగే టపుడు జరిగేది సౌమ్య కర్మ. దీనికే మంచి కర్మ అనిపేరు .

పింగలా నాడి సూర్య నాడి, అనగా ఉష్ణ తత్త్వం కలిగినట్టిది. పింగలా నాడినుంచి ప్రాణ సంచారం జరిగేటపుడు మనుష్యులు చేసేది క్రూర కర్మ. దీనికే చెడుకర్మ అని ఇంకొక పేరు. మనుష్యులకు ఎప్పుడూ ప్రాణ సంచారం ఈ రెండు నాడులలో ఏదో ఒక నాడి గుండా ప్రధానం గా జరుగుతుంది. కనుక వారు మంచిచెడూ కర్మలు చేస్తూ కర్మ బద్ధులై ఉంటారు.

కాని రెండింటియందు సమంగా ప్రాణసంచారం జరిగే సమయాలు కొన్ని ఉంటాయి. అప్పుడు సుషుమ్నా నాడిమేలుకొంటుంది. అటువంటి సమయంలో మానవుడు చేసే కర్మలు దగ్ద కర్మలుఅంటారు. అనగా అవి ఫలితాన్ని ఇవ్వవు. ఈ సుషుమ్నా సంచారం జరిగే సమయం ఒక్క ధ్యానానికి మాత్రమె అనుకూలం గా ఉంటుంది.

అటువంటిసమయంలో ధ్యానానికి కూర్చుంటే మనస్సు తేలికగా ఏకాగ్రమై భ్రూ మధ్యంలోకుదురుకుంటుంది. ఈ భ్రూ మద్యం బుద్ధి స్థానం. కనుక మనస్సు బుద్ధి స్థానమైన త్రికుటిలో ఏకాగ్రం అయినపుడు, మంచి చెడు కర్మలకు ప్రతిరూపాలైన ఇడా పింగలానాడుల ప్రవాహం అధిగమించబడి, సుషుమ్నలో ప్రాణ సంచారం కుదురుగాజరుగుతుంది.

ఇది గాక సూక్ష్మ సుషుమ్నా ప్రవాహం అని ఇంకొకటి కూడా ఉంది. అప్పుడు దాదాపు శ్వాస ఆగిపోతుంది. సుషుమ్నా నాడి మేలుకోనటమే మంచీ చెడు కర్మలను దాటి పోవుట. ఇదే ప్రాణాయామంలో కుశల కర్మ అన బడుతుంది. ఇట్టి స్థితిలో ఉన్నంత వరకు కర్మాతీత స్థితిలో మనిషి ఉండగలుగుతాడు. భగవంతుడు ఇట్టి కుశల కర్మను చెయ్యమని మానవునికి ఉద్బోధ చేస్తున్నాడు.

ఈస్థితిలో మనస్సు అత్యంత ప్రశాంతం అవుతుంది, నాడి మందగిస్తుంది, గుండెకొట్టుకునే వేగం చాలా వరకు తగ్గుతుంది. శరీర స్పృహ చాలా తక్కువగా, అంటే ఒకభావనా మాత్రంగా ఉంటుంది. మానసిక ఆలోచనలు పూర్తిగా ఆగిపోతాయి. ప్రాణసంచారం శరీరం నుంచి తిరోహితమై వీణా దండం అనబడే వెన్నెముకలోని సుషుమ్నా నాడిలో మాత్రమె జరుగుతూ ఉంటుంది. ఇది అకర్మ స్థితి.

అంటేమనస్సులోని ఆలోచనలే గాక, శరీరం లోని ప్రాణ వ్యవస్థ కూడా విశ్రాంత స్థితిలోకివస్తుంది. ఇట్టి స్థితిలో పది నిమిషాలు ఉండగలిగితే ఎనిమిది గంటలు గాఢ నిద్రపోయినంత విశ్రాంతి అనుభవంలోకి వస్తుంది. తరువాత నిద్ర రమ్మన్నా రాదు. కాని అలసట ఉండదు. ఈ కోణంలో కుశల కర్మ అనగా ఇడా పింగలా నాడుల నుంచి ప్రాణసంచారం తిరోహితం చేసి దానిని సుషుమ్నాన్తర్గతం చేసి భ్రూ మధ్య స్థితిలోనిలకడగా ఉంచగలిగే సామర్ధ్యం.

ఇట్టి కుశల కర్మ చెయ్య గలగటమే యోగం. దీనివల్ల యోగి మంచి చెడులను అధిగమించి ఆత్మ స్థితిలో కుదురుగా ఉండగలుగుతాడు. అట్టి వాడు పుణ్య పాపాలకు అతీతుడు అవుతాడు. ఎందుకంటే ఆత్మ పాప పుణ్యాలకు అతీతమైనది. కనుక ఆత్మ స్థితిలో ఉన్నవాడుకూడా కర్మాతీతుడు అవుతాడు. శుద్ధ బుద్ధి మరియు శుద్ధ ఆత్మ ఒక్కటే అని శ్రీ రామక్రుష్ణులంటారు.

మనస్సులో ఆలోచనలు ఆగిపోయి, శరీరంలో ప్రాణ సంచారం నామ మాత్రం గా ఉన్నపుడు, శుద్ధ బుద్ధి మేలుకొంటుంది. అనగా బుద్ధి స్థాయి అనుభవంలోకి వస్తుంది. ఆ శుద్ధ మైన బుద్ధిలో ఆత్మ జ్యోతి ప్రకాశం దర్శనం ఇస్తుంది. ఇది కర్మాతీతం కనుక ఇట్టి స్థితిలో నిలకడగా ఉన్నటువంటి యోగి ఆత్మానుభావంలో మునిగి కర్మాతీత స్థితిలో ఉండగలుగుతాడు.

కనుక యోగ పరంగా చూచినపుడు,
జహాతీహ ఉభే సుకృత దుష్క్రుతౌ= ఇక్కడనే ఇడా పింగలా నాడులను అధిగమించి,
బుద్ధియుక్తో= బుద్ధి స్థానమగు భ్రూ మధ్యమున స్థితుడవై,
తస్మాద్ యోగయా యుజ్యస్వ= ఈ విధమగు యోగమును చెయ్యి,
యోగః కర్మసు కౌశలం= ఇదే కుశల కర్మ, ఇదే యోగం.
అనే నిగూఢమైన అర్థం ఈ శ్లోకంలో ఉంది.

ఈ స్థితిలో హృదయంలో ఉన్న కామములు అన్నీ శమిస్తాయి. రాగ ద్వేషాలనే బంధాలు విడిపోతాయి. కనుక కర్మాతీత స్థితిని మానవుడు అందుకొంటాడు. శరీరం ప్రాణం పూర్తిగా విశ్రాంత స్థితిలో ఉన్నవానికి కర్మ ఎక్కడిది? ఇంద్రియ తాదాత్మ్యత లేనివాడికి కర్మ ఫలం ఎలా అంటుతుంది?

||యదా సర్వే ప్రముచ్యన్తె కామా యస్య హృది స్థితాః||
అథ మర్త్యో అమృతో భవతి యెతావద్యనుశాసనమ్|| (కఠోపనిషత్ )

||యదా సర్వే ప్రభిద్యన్తె హృదయస్యేహ గ్రంధయః||
అథ మర్త్యో అమృతో భవతి యెతావద్యనుశాసనమ్||
(కఠోపనిషత్ )

read more " గీతా శ్లోకానికి యోగపరమైన వివరణ "

20, ఆగస్టు 2009, గురువారం

యోగః కర్మసు కౌశలం

శ్రీ మద్ భగవత్ గీతలో రెండవ అధ్యాయంలో 50 శ్లోకం ఇది. యోగాన్ని అనేకమంది ఆచార్యులు అనేక విధాలుగా నిర్వచనం ఇచ్చినారు. కాని సాక్షాత్తు భగవంతుని ముఖతా వచ్చిన మాట కావటంతో దీనికి అర్థ గాంభీర్యత, నిర్వచనా స్పష్టత హెచ్చు.

||బుద్ధి యుక్తో జహాతీహ/ఉభే సుకృత దుష్క్రుతౌ/తస్మాద్ యోగయా యుజ్యస్వ/యోగః కర్మసు కౌశలం||

అర్థం: బుద్ధి యుక్తుడైనవాడు ఇక్కడనే మంచి చెడు కర్మలను జయిస్తున్నాడు. కనుక నీవు యోగాన్ని అభ్యసించు. కర్మలయందు కౌశలమే యోగం.

యోగానికి భగవంతుడే చెప్పిన చక్కనైన నిర్వచనం ఇది. చూడటానికి స్వల్పమైనదైనా లోతైనట్టి అర్థం కలిగినట్టిది.

మనిషిని అతడు చేసిన కర్మలు బందిస్తున్నాయి. అవి మంచివైనా చెడ్డవైనా ఆయా ఫలితాలకు అతడు బద్దుడే. ఒక కర్మ చేసిన తర్వాత ఫలితం నాకు వద్దు అంటే పోదు. ఈ విధంగా మంచి చెడు కర్మలు, పాప పుణ్యాలకు కారణాలౌతూ వాటికి తగిన ఫలితాన్ని అతని చేత అనుభవింప చేస్తూ తద్వారా మళ్ళీ తదను గుణములైన కర్మలను అతనిచే చేయిస్తూ మళ్ళీ మళ్ళీ జన్మ పరంపరలకు కారణాలు అవుతున్నవి. ఈ కర్మ పరంపరనుంచి విడిపడే మార్గమే యోగం.

కర్మల యందు కౌశలమే యోగం అని భగవానుని ఉవాచ. అంటే ఏ పనినైనా కుశలంగా చక్కగా చేస్తే అది యోగం అవుతుందా? ఉదాహరణకు దొంగతనం కూడా ఒక కర్మయే, దానిని చక్కగా చేస్తే అది యోగం అవుతుందా? అనేది ప్రశ్న. ఇక్కడ భగవంతుడు- మంచి పనిని చక్కగా చేస్తే అది యోగం అవుతుంది అని చెప్పలేదు. కర్మను కుశలంగా చేస్తే అది యోగం అవుతుంది అన్నాడు. బుద్ధి మంతుడైన వాడు కర్మను దాటిపోతాడు అని కూడా ఆయన చెప్పాడు. కనుక ఇక్కడ చక్కగా అర్థం చేసుకోవాలి.

మనిషి బ్రతికినంత వరకూ కర్మను చెయ్యక తప్పదు. కర్మను చెయ్యకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండలేరు. కర్మ తిరిగి ఫలితాన్ని ఇవ్వక తప్పదు. కనుక ఈ చక్రం నుంచి విముక్తి ఎలా? తాదాత్మ్యత నుండి విడివడటమే దీనికి మార్గం. ఇంద్రియములు తమతమ విషయముల యందు ప్రవర్తిల్లుతూ ఉండగా, ఇదంతయూ ప్రక్రుతి లీల అన్న విషయాన్ని అనుభవం ద్వారా చక్కగా తెలిసికొని, వాటి వ్యాపారములలో చిక్కక, తనను ఈ లీలకు భిన్నుడైన, నిత్యుడైన సాక్షిగా తెలిసికోవటమే దీనికి మార్గం.

ఈ రహస్యమును అనుభవము ద్వారా తెలిసికొన్న వాడే, కర్మ బంధములో చిక్కకుండా ఉండగలదు. బుద్ధి పరంగా అర్థం చేసుకుంటే చాలదు. అనుభవం లో కి అది రావాలి. అనుక్షణం ఈ స్పృహలో ఉంటూ సమస్త ఇంద్రియ వ్యాపారమును తనకంటే భిన్నమైనదిగా చూస్తూ ఉండగలిగితే ఇది సాధ్యం అవుతుంది. అట్టివాడే కుశల కర్మ చెయ్య గలడు.

ఇక్కడ కుశల కర్మ అంటే పనిని చక్కగా చెయ్యటం అని మాత్రమె అర్థం కాదు. కుశాలమైన కర్మ అంటే తిరిగి ప్రతికర్మను సృష్టి చెయ్యనిది అని అర్థం. ప్రతి కర్మా తిరిగి ఇంకొక కర్మకు కారణం అవుతుంది. కాని కుశలం గా చెయ్యబడిన కర్మ తిరిగి ఇంకొక కర్మకు కారణం కాదు. ఆ కర్మ అంతటితో అంతరిస్తుంది. ఇదెలా జరుగుతుంది?

కర్మ కొనసాగింప బడటానికి కారణం దాని వెనుక ఉన్న సంగం- ద్వేషం. ఈ రెండు ఒకే నాణానికి బొమ్మ బొరుసూ వంటివి. ఆత్మకు అన్యమైన ఏ వస్తువుతోనైనా ఈ రెండు రకాలైన బంధాలు కలిగి ఉండవచ్చు. ఒకటి ప్రేమతో ఉండే బంధం దీన్ని రాగం అంటుంది వేదాంతము. రెండవది ద్వేషంతో ఉండే బంధం. మనం ఒక వస్తువును గాని మనిషిని గాని ప్రేమించినా ద్వేశించినా ఎల్లప్పుడూ దాని గురించే ఆలోచిస్తాము. అంటే పాజిటివ్ గానో నెగటివ్ గానో ఆ వ్యక్తి to గాని వస్తువుతో గాని సంబంధం కలిగి ఉంటాము. ఈ రాగ ద్వేషములే, కర్మ ఫలితంతో కర్తకు సంబంధాన్ని కలుగ జేసే తాళ్ళు.

ఎవరైతే ఈ రాగ ద్వేషాలు లేక ఉండగలడో , అతడు కర్మ చేసినా దానికి కట్టు పడడు. మరి ఈ రాగ ద్వేషాదులు ప్రపంచాన్ని మొత్తాన్ని నడుపుతున్నాయే? వీటి చిక్కులో పడకుండా ఉండటం ఎలా? అంటే దీనికి ఉపాయం యోగమే. బుద్ధి యుక్తుడవై ఈ రహస్యాన్ని తెలుసుకో. ఇంద్రియములకు బాహ్య విషయములయందు గల ఆకర్షణ చేత వాటియందు ప్రవర్తిల్లుతూ ఉన్నాయి. ఇది ప్రక్రుతి లీల అన్న విషయాన్ని తన శరీరంలో జరుగుతున్నా క్రీడగా ఎవడైతే ధ్యాన సాధనలో గమనించి, అర్థం చేసుకొని, తనను ఈ ఆటకు సాక్షియైన చిత్ స్వరూపునిగా అనుభవ పూర్వకంగా తెలుసుకొన గలడో అతడు కర్మ బంధాలకు చిక్కు బడదు. కారణం అతన్ని బంధించే రాగ ద్వేషాల వల్ల అతని ఇంద్రియ వ్యాపారాలు జరుగవు. ప్రకృతి నిమిత్తం గా జరుగుతుంటాయి. తానూ సాక్షీ మాత్రునిగా ఈ ఆటను గమనించాలి.

ఎప్పుడైతే ఇట్టి స్థితిలో ఉండగలుగుతాడో, అప్పుడు రాగ ద్వేషాలు అనబడే తాళ్ళు అతన్ని బంధించలేవు. కనుక కర్మ ఫలం అతనికి అంటదు. కనుక మంచి చేసినా, చెడు చేసినా ఆయా కర్మలకు అతడు అతీతుడు అవుతాడు. శ్రీ కృష్ణ భగవానుడు ఇట్టి స్థితిలో ఉండే లీలా నాటకంగా తన జీవితాన్ని గడిపాడు. కనుక ఆయనకు ఏ కర్మ ఫలమూ అంటలేదు. అంతే గాదు, జనక మహారాజు, జడ భరతుడు, అస్తావక్రుడు మొదలైన జ్ఞానులు ఇట్టి స్థితిలో ఉండే కర్మాతీతులైనారు.

ఇట్టి స్థితిలో ఉంది చేసిన కర్మ తిరిగి ఇంకొక కర్మను సృష్టి చెయ్యలేదు. ఎందుకంటే దానికి మరొక అడుగు ముందుకు వేశే చోదక శక్తులైన రాగ ద్వేషాలు ఉండవు. కనుక ఇట్టి కర్మ కుశల కర్మ అనిపించుకుంటుంది. ఇట్టి స్థితిలో ఉండి చేసిన కర్మయే యోగం అనిపించుకుంటుంది. ఇట్టి కర్మ వల్లనే మనిషి పుణ్య పాపములను దాటి పోగలడు.

కనుక బుద్ధి మంతుడైన వాడు ఇట్టి కుశల కర్మను ఆచరించి కర్మాతీతుడు కావాలని భగవానుడు గీతలో లోకానికి అమృత బోధ చేశాడు. తద్వారా జీవన్ముక్త స్థితిని అందుకొని జననమరణాలకు అతీతుడు, ముక్త పురుషుడు కావచ్చు. కాని ఇది చెప్పినంత తేలికా అంటే కానే కాదు. తెలికైతే, కోటిలో ఒకడు మాత్రమె దీనిని పొందగలడు అని మళ్ళీ తానె ఎందుకు చెబుతాడు? ఆధ్యాత్మిక సాధన ఏదైనా చాలా కష్టం తో కూడుకున్నదే. ఇది తనతో తానె చేసే పోరాటం. ఇందులో బయట శత్రువులు ఎవ్వరూ ఉండరు. తన మనసే తనకు శత్రువు, తన మనసే తనకు మిత్రుడు.

బుద్ధి ప్రస్తావన ఎందుకు వచ్చింది? బుద్ధి మనస్సుకు పై మెట్టు. కనుక మనస్సును దాటి, అనగా మనో వ్యాపారములను గమనిస్తూ, బుద్ధి స్థాయిలో స్థితుడై ఉండగలిగితే, ఈ యోగం సాధ్యం అవుతుంది అని అన్యాపదేశం గా చెప్ప బడింది.

ఈ శ్లోకానికి ఇంకా నిగూఢములైన యోగార్ధాలు ఉన్నాయి. ఇప్పుడు వ్రాసింది అందరికీ తెలిసిన అర్థం మాత్రమె. యోగులకు మాత్రమె తెలిసిన నిగూఢ అర్థాలు మరోసారి ముచ్చటించుకుందాం.
read more " యోగః కర్మసు కౌశలం "

17, ఆగస్టు 2009, సోమవారం

మానవ జీవితం పైన గ్రహాల ప్రభావం


మనిషి ఆకారాన్ని బట్టి, మాట్లాడే తీరును బట్టి, ప్రవర్తించే తీరుని బట్టి ఏ గ్రహం ఆ సమయంలో అతనిపైన పనిచేస్తోందో తెలుసుకోవచ్చు. అలాగే జాతకంలోని బలీయమైన గ్రహాన్ని కూడా వెంటనే తెలుసుకోవచ్చు. తరువాత జాతకాన్ని పరిశీలిస్తే ఇది నిజం కావటం జరుగుతుంది. దీని ద్వారా కొన్ని ఆశ్చర్య పరిచే విషయాలు తెలుస్తాయి.

గ్రహాల ప్రభావాలు స్థూలం గా ఇక్కడ ఇస్తున్నాను. ఇవన్నీ జ్యోతిష గ్రందాలనుంచి సేకరించబడినవి, మరియు నా అనుభవంలో అనేకసార్లు నిజాలుగా రుజువు అయినవి.

> సూర్యుడు-అధికారం చెలాయించటం, ఉన్నతులమని భావించటం మాత్రమె కాక అలాగే ప్రవర్తించటం, నాయకత్వ లక్షణాలు, పదిమందిలో తేలికగా గుర్తింపు ఉంటే వారు సూర్యుని ప్రభావం లో వారు.
>పూర్ణ చంద్రుడు- మృదు స్వభావం, జాలిపడే తత్త్వం, సహాయ పడే తత్వం, మానవ సంబంధాలు.
>క్షీణ చంద్రుడు-ఏదీ తేల్చుకోలేని ఊగిసలాట ధోరణి, బలహీన మనస్తత్వం, పిచ్చి ధోరణి, విపరీత ఆలోచనలు.
>బుధుడు-తెలివి తేటలు, బహుముఖ ప్రజ్న,హాస్య చతురత, కలుపుగోలు తనం.
>కుజుడు-ధైర్యం, దురుసుతనం, కయ్యానికి కాలుదువ్వటం,సాహసం, మొండి పట్టుదల.
>గురువు- ధార్మిక మనస్తత్వం, మంచితనం, సహాయపడే గుణం, అడ్డదారులు తొక్కని మనస్తత్వం, ముక్కుసూటితనం.
>శుక్రుడు-అందం, విలాసాలు, జల్సాలు, కళా కౌశలం , ఖరీదైన జీవితం .
>శని- కాయకష్టం చెయ్యటం, సోమరితనం, అశుభ్రం గా ఉండటం, పిరికితనం, చొరవ లేకపోవటం.
>రాహు- మోసం, ఇతరుల సొమ్ము ఆశించటం, కుట్రలు, దౌర్జన్యాలు, సంప్రదాయాన్ని ప్రశ్నించటం, ఎదురు తిరగటం, వృధాగా తిప్పట, కాళ్ళరిగేలా తిరిగే ఉద్యోగాలు, అతి వాగుడు, గమ్యం లేని జీవితాలు గడపటం .
>కేతు-చాప కింద నీరులాంటి మనస్తత్వం, పిరికి ఆధ్యాత్మికత, మెట్ట వేదాంతము, ప్రమాదకర కుట్రలు చెయ్యటం, లేక ముచ్చు లాంటి ప్రవర్తన.

ఇక రెండు మూడు గ్రహాల కలయికలో ఆయా గుణాల సమ్మిలిత ప్రభావం మనిషి మీద ఉంటుంది. ఆయా గ్రహాల దశలు జరిగేటప్పుడు పైన చెప్పిన లక్షణాలు ఎక్కువగా కనిపించటం, ఆలోచనలు అలాంటివే కలగటం, ప్రవర్తనలు కూడా అలాగే ఉండటం చూడవచ్చు.

కొందరు మనుషులను చూస్తె వారిలో కొన్ని గ్రహాల మూర్తీభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇంకొందరి ప్రవర్తన చూస్తె వారికి ఏ దశ జరుగుతున్నదో అంచనా వెయ్యవచ్చు. అంతే కాదు కొన్నికొన్ని శరీరభాగాల తీరును బట్టి కొన్ని గ్రహాల ప్రభావం చాలావరకూ అంచనా వెయ్యవచ్చు.

ఉదాహరణకు ఎత్తుపళ్ళు ఉన్నవారికి రాహువు రెండవభావంలో ఉండటం చాలా జాతకాల్లో చూచాను.అంతేకాక పిల్లికళ్లు ఉన్నవారిమీద రాహు/కేతువుల ప్రభావం ఉండటం వారి మాటలలో చేతలలో గమనించవచ్చు. అలాగే ఒక కాలు కుంటివారికి ఎక్కువగా శనిగ్రహప్రభావం ఉండటం గమనించాను.అలాగే బట్టతల ఉన్నవారి మీద శని రాహుగ్రహాల ప్రభావం అమితంగా ఉండటం చూడవచ్చు. 

పొట్టిగా బొద్దుగా ఉన్నవారిమీద బుధ గ్రహప్రభావం ఉంటుంది.అవకాశ వాదులు అతిగా వాగే వారిమీద బుధ రాహుగ్రహాల ప్రభావం ఉంటుంది. అలాగే మొండిపిల్లలు,క్రమశిక్షణ లేని పిల్లల మీద రాహు,కుజుల ప్రభావం ఉంటుంది.ఇవన్నీ గ్రంధాలలో సూటిగా చెప్ప బడకపోయినా,అన్యాపదేశంగా చెప్పబడ్డాయి.నా పరిశీలనలో ఇవన్నీ నిజాలు కావటం గమనించాను.

తెల్లగా అందంగా ఉన్నవారు ఎక్కువగా వృషభ,తులాలగ్నాలలో పుట్టటం గమనించవచ్చు.అలాగే కురూపుల మీద కేతు ప్రభావం ఉండటం చూడవచ్చు. వయసుకంటే ఎక్కువ ముసలివారిగా కనిపించేవారి మీద శని ప్రభావం, సాంప్రదాయ మతవాదులు,వేషభాషలలో ఆచారపరుల మీద గురుప్రభావం జాతకంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.దురుసుగా ప్రవర్తించేవారు,రౌడీలు ఇటువంటి జాతకాలలో కుజ/రాహువుల పాత్ర కనిపిస్తుంది.నాటక,సినీ రంగాల వారిమీద శుక్ర/రాహు ప్రభావం ఉంటుంది.

ఆయా వ్యక్తుల మీద ఆయాగ్రహాల ప్రభావం,జాతకంలో ప్రముఖ గ్రహ పరంగానూ(అది లగ్నం అధిపతిగా కావచ్చు,లేదా ఆత్మ కారకునిగా కావచ్చు, లేదా బలీయమైన గ్రహంగా కావచ్చు) లేదా అప్పుడు నడుస్తున్న దశ/అంతర్దశల పరంగానూ ఉంటుంది.

ఈ విధంగా పరిశీలన జరిపెకొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ, మనిషిని చూట్టంతోనే, అతని జాతకంలో ముఖ్యవిషయాలు మనసుకు స్పురించటం మొదలౌతుంది. అలాగే అతనికి అప్పుడు జరుగుతున్న దశ చూచాయగా తెలియటం జరుగుతుంది.ఇలా నాకు చాలా సార్లు జరిగింది.త్వరలో మీకు ఫలానా సంఘటన జరుగుతుంది అని మనసుకు తోచటం,అవి చెప్పటం,అవే సంఘటనలు జరగటం కూడా చాలాసార్లు జరిగింది.

అయితే జాగ్రత్తగా ఉండమని మనం చెప్పినప్పటికీ వారు వాటిని తప్పించుకోలేక పోవటం ఎక్కువసార్లు జరిగింది. దీనికి కారణం నూటికి తొంభై పాళ్ళు ఆయా వ్యక్తుల నిర్లక్ష్యధోరణి మాత్రమె కారణం అవుతుంది. కర్మ బలీయంగా ఉన్నపుడు, మనల్ని పరిహారాలు చెయ్యనివ్వదు.అంతేకాక ఆ వ్యక్తి మీద రకరకాలుగా పనిచేసి ఆ కర్మను అనుభవించేటట్టు చేస్తుంది. ఏలాగంటే, నిర్లక్ష్యధోరణి,అహంకారం, లేదా వీడికేమి తెలుసులే అనే తిరస్కార ధోరణి,జరిగేది జరుగక మానదు అనే నిరాశాపూరిత ధోరణి,పరిహారాలు మొదలు పెట్టి మధ్యలో వదిలెయ్యటం ఇలా రకరకాలుగా మనిషి మీద పనిచేసి మొత్తానికి రేమేడీలు చెయ్యలేకపోవటం,ఆ కర్మను అనుభవించటం చేయిస్తుంది.అంతేకాక మాట తీరు, ప్రవర్తనను బట్టి వారి జాతకంలో ఉన్న దోషాలు మనస్సుకు స్పురించటం కూడా జరుగుతుంది.

ఇదెలా జరుగుతుంది? అంటే నాకు తెలిసి ఒక కారణం కనిపిస్తోంది. అనుభవజ్ఞుడైన డాక్టరుకు రోగిని చూడటంతోనే ఒక ఊహ వస్తుంది. ఇతనికి రక్తహీనత ఉంది, లేదా బీపీ ఉండవచ్చు,లేదా గుండెజబ్బు ఉండవచ్చు ఇత్యాదిగా ప్రాధమికంగా ఎలాగైతే ఒక అవగాహన కలిగి తరువాత ప్రశ్నల ద్వారా పరీక్షల ద్వారా ఆ ఊహను నిజమా కాదా నిర్థారించుకుంటారో, అలాగే జ్యోతిర్విజ్ఞానంలో కూడా జరుగుతుంది.

ఏళ్ళతరబడి మనకు ఈ విధమైన విశ్లేషణ అలవాటు అయినప్పుడు, మన అన్తఃచ్చేతనలో మనకు తెలీకుండానే కొన్నిరకాల ఆలోచనా విధానాలు (thought patterns)తయారై ఉంటాయి. అవి అలవాటు మీద, కొన్నికొన్ని పరిస్థితులలో వాటంతట అవే ఉత్తెజితాలై మనకు కొంత సమాచారాన్ని అందిస్తాయి.దాన్నే మనం స్ఫురణ అని అనుకుంటాము.అంటే సమాచారం మనకు తెలీకుండానే ఒక రూపాన్ని సంతరించుకొని మనకు స్పురించటం జరుగుతుంది. ఆయా ఆలోచనల మధ్యన సంక్లిష్ట సమీకరణాలు మనకు తెలీని అన్తఃచ్చేతనలో జరిగి ఫలితం మాత్రం పైకి ఉబికి ఉపరితలానికి వస్తుంది. ఇదెలా ఉంటుందంటే కంప్యూటరు క్లిష్టమైన లెక్కలను లోపల్లోపల చేసి ఫలితాన్ని మాత్రం తెరమీద చూపినట్లు ఉంటుంది.

కొంతమందిని చూచి మీది ఫలానాలగ్నం లేదా ఫలానా నక్షత్రం అవునా అని అడిగితే వారు ఆశ్చర్యపోయి నిజమే మీకెలా తెలుసు అని అనటం నాకు చాలా సార్లు జరిగింది. కొన్ని సార్లు ఫెయిల్ కూడా అయ్యాను.కాని చాలాసార్లు సరిగ్గా జరిగినపుడు తప్పకుండా వీటికి ఏవో లింకులు ఉన్నాయి, ఇది మనకు అర్థం కాక పోయినా ఒక గొప్ప శాస్త్రమే అని అనిపించక మానదు.

దీనివల్ల ఇంకొక లాభం కూడా ఉంది. ఈ విధమైన పరిశీలన అలవాటైతే, మనిషికి బోరు అనేది ఉండదు. దానికి తోడూ లోతైన పరిశీలనాశక్తి అలవాటు అవుతుంది.మనుషుల మధ్యన ఉండికూడా, మౌనంగా ఉంటూ, ఏ పుస్తకాలు, టీవీలు,సెల్ ఫోన్లు లేకుండానే బోరు అనేది లేకుండా ఉండటం అలవాటు అవుతుంది.

ఇంకొంచెం అనుభవం మీద, అతి దగ్గిరలో జరుగబోయే విషయాలు స్పురించటం చాలాసార్లు జరిగింది. ఫలానా వ్యక్తి మీద ఫలానా గ్రహం ప్రభావం ఉంది అని తెలిసినపుడు, త్వరలో ఆ గ్రహానికి గోచారరీత్యా పట్టబోతున్న అవస్త మనకు తెలుసు గనుక ఈవ్యక్తికి కూడా అదే అవస్త పడుతుంది అని అనిపించటం అలాగే జరగటం చాలాసార్లు జరిగింది.

ఉదాహరణకు గురుగ్రహ ప్రభావంలో ఉన్న వ్యక్తికి గురువు నీచలో ఉన్నపుడు, నీచజీవితం గడపటం,మంచికి పొతే చెడు ఎదురు కావటం, అనుకున్న పనులు జరుగకపోవటం ఊహించి చెప్పాను.ప్రస్తుతం అవే జరుగుతూ ఆ వ్యక్తిని నన్నూ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దీన్నే కొంచెం పొడిగించి, గ్రహంయొక్క,అతిచార,స్తంభన,వక్ర,అస్తన్గత,గ్రహయుద్ధ, ఉచ్చ,నీచ స్థితులను గమనిస్తూ పోతే ఆ వ్యక్తి జీవితంలో ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. ఈ గ్రహస్థితులకు వ్యక్తుల జీవితంలో జరిగే సంఘటనలకు ఖచ్చితమైన సంబంధం కనిపించింది.

ఇదే రీజనింగును ఇంకొంచం పొడిగించి, కొన్నికొన్నిసార్లు ఫలానా రోజు నీకు ఈ సంఘటనా జరుగవచ్చు అని చెప్పటం అదే జరగటం కూడా జరిగింది. కొన్ని సార్లు ఫెయిల్ అవటం కూడా అయింది. కాని ఫెయిల్ అయినపుడు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తే కొన్ని కొత్త విషయాలు అర్థం అయ్యాయి. ఆ గ్రహానికి గల ఒక కారకత్వానికి సంబంధించిన సంఘటన జరుగవచ్చు అని మనం అనుకుంటే ఇంకో కారకత్వానికి సంబంధించిన సంఘటన జరిగింది. కాని ఆ గ్రహ కారకత్వాన్ని దాటి ఇంకో గ్రహ కారకత్వానికి సంబంధించిన సంఘటన మాత్రం జరుగలేదు. అంటే చాలావరకూ విశ్లేషణ సరిగ్గా ఉన్నప్పటికీ సూక్ష్మ స్థాయిలలో ఇంకా పరిపూర్ణత రాలేదు అని అర్థం అయింది. 

ఉదాహరణకు ఒక వ్యక్తి కుజ గ్రహ పరిధిలో ఉన్నపుడు, గోచారరీత్యా శనిగ్రహ ప్రభావం కుజుని మీద పడుతుంది అనుకున్న రోజున లేదా ఆ పీరియడ్ లో ప్రమాదం జరుగవచ్చు అని చెప్పాం అనుకుందాం.ఆ సమయంలో ప్రమాదం జరుగకుండా,ఎవరితోనో గొడవ జరగటం,తద్వారా దెబ్బలు తగలటం,రక్త దర్శనం కలగటం జరుగుతుంది.ప్రమాదంలో కూడా రక్తదర్శనం జరుగవచ్చు, లేదా గొడవలో కూడా జరుగవచ్చు, లేదా పొరపాటున ఏ వేలో కోసుకొని కూడా జరుగవచ్చు.వీటిలోని సూక్ష్మభేదాలు పట్టుకోవటం,అంచనా వెయ్యటం కష్టం.రక్తం కళ్ళచూడటం జరుగుతుంది అనిచెబితే అది సరిగానే జరుగుతుంది.

కాని ఏ కారణం వల్ల, ఏ పరిస్థితుల్లో అది జరుగుతుందో కూడా సరిగ్గా ఊహిస్తేనే దానికి పరిపూర్ణత వచ్చినట్లు. ఇటువంటి పరిపూర్ణతకు దారితీసే గ్రహస్థితుల పైన కొన్ని లీడ్స్ ఆధారంగా ఇంకా రీసెర్చి చేస్తున్నాను. జ్యోతిషమిత్రులకు ఆసక్తిని కలిగిస్తాయని ఈ విషయాలు వ్రాయటం జరిగింది.
read more " మానవ జీవితం పైన గ్రహాల ప్రభావం "

16, ఆగస్టు 2009, ఆదివారం

స్వైన్ ఫ్లూ తో కూడా దోపిడీ యేనా?

నేను జూన్ 9 తేదీన స్వైన్ ఫ్లూ గురించి వ్రాశాను. రెండు నెలల తరువాత ఇప్పుడు గగ్గోలు మొదలైంది. అంటు వ్యాధిప్రమాద కరమైనదే. కాని దీన్ని బూతద్దంలో చూపిస్తూ ప్రజల భయ భ్రాంతులను ఆధారంగా చేసుకొని లక్షలలో అప్పుడేవ్యాపారాలు జరిగిపోతున్నాయి.

ప్రసార మాధ్యమాలు వాటికి సహజమైన రీతిలో గోరంతలు కొండంతలు చేసి చూపిస్తూ, ప్రజలలో సమాచారాన్ని, జాగరూకతను పెంచుతూ వాటిలో భాగంగా భయ భ్రాంతులను కూడా పెంచుతున్నాయి. నిన్న పని మీద తిరుపతిలోఉన్నాను. అసలే పుణ్య క్షేత్రం యాత్రా స్థలం. కృష్ణ జన్మాష్టమి, స్వాతంత్ర దినోత్సవం, ఆదివారం సెలవలు కలిశి రావటంతో
జనం విపరీతంగా ఉన్నారు. చాలా మంది మాస్కులు ధరించి కనిపించారు.

ప్రజలలో జాగరూకత ఎంత ఉందొ చూద్దామని పరిశీలిస్తూ నగరంలో కొన్ని మైళ్ళు నడిచాను. రోడ్ల పక్కన చిన్న చిన్నవ్యాపారాలు చేసుకునే స్థానికులు దీనిని పెద్దగా పట్టించుకోవటం లేదు. వారెవరూ మాస్కులు ధరించి లేరు. యాత్రికులేభయం భయం గా ఉన్నారు. ఇంతలొ ఒక వింత సంఘటన జరిగి నవ్వు తెప్పించింది. గుంపులుగా జనం ఉన్న ఒక చోట, దారిన పోతున్న ఒక వ్యక్తి బహుశా వాహనాల పొగ వల్లో లేక డస్ట్ అలెర్జీ వల్లో, నాలుగైదు తుమ్ములు వరుసగాతుమ్మాడు. అంతే. చుట్టూ ఉన్న జనం అతన్ని ఒక ఏయిడ్సు రోగిని చూచినట్లు చూస్తూ భయం భయం గా దూరం జరిగారు. ఆడాళ్ళు అయితే చీర కొంగులతో ముక్కులు కప్పుకుని భయం గా చూస్తున్నారు . నాకు నవ్వాగలేదు.

వినటానికి వింతగా ఉండవచ్చు. కాని కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలలో గత రెండు రోజులుగా నీలగిరి తైలంసీసాలు కొన్ని లక్షలు అమ్ముడు పోయాయి. 5 రూపాయలు ఉండే సీసా ఒక్క సారి 15 రూపాయలై కూచుంది. ఇంతకంటే ఇంకో వింత జరుగుతున్నది. పాపం పల్లెటూరి జనాలు అజ్ఞానులు. టీవీలు చూచి భయ పడుతున్నారు అనుకుందాం. హైదరాబాదు లాటి సిటీలో కూడా కొందరు హోమియో మందులు విచ్చల విడిగా వాడమని అమ్ముతూప్రజలలో భయాన్ని సృష్టించటమే కాక ప్రజారోగ్యాన్ని తీవ్రం గా దెబ్బ తీస్తున్నారు. కాదేదీ దోపిడీకి అనర్హం అని నాకు అనిపించింది.

"Influenzinum" అనే నోసోడ్ ను రోజుకు మూడు మాత్రల చొప్పున వారం రోజులు వరుసగా వాడమని చెప్పి వాడిస్తు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. నోసోడ్ లు అనేవి వ్యాధికారక పదార్థాల నుండి తీసే మందులు. ఫ్లూవ్యాధితో బాధ పడుతున్న వ్యక్తి ముక్కు నుండి కారే స్రావాన్ని పోటేన్సీ లోకి మార్చి తయారు చేసేదే పైన చెప్పిన మందు. దానిని ఇలా రోజుకు మూడు డోసు లు చొప్పున వరుసగా వారం రోజులు వాడితే, స్వైన్ ఫ్లూ నుంచి రక్షించటం మాట అటుంచి, అసలు ఫ్లూ లక్షణాలను శరీరంలో కలిగిస్తుంది. దీనినే రేమేడీ ప్రూవింగ్ అంటారు. అప్పుడు ఆ బాధలు తగ్గటానికి మళ్ళీ ఒక విరుగుడు (anti dote) ను మళ్ళీ ఇవ్వ వలసి వస్తుంది .ఈ మందును విధంగాఎన్నటికీ వాడ కూడదు.

కాని చాలా మంది మెడికల్ షాపు వాళ్లు చెప్పి మరీ వాడిస్తున్నారు. నోసోడ్లు సాధారణంగా వాడకూడదు. మామూలుమందులు పనిచెయ్యని స్థితిలోనే వీటిని వాడాలి. కాని జనాల భయాన్ని ఆధారం గా తీసుకొని విచ్చల విడిగావాడిస్తున్నారు. దీనివల్ల మనిషి శరీరంలో దీర్ఘకాలిక తీవ్ర మార్పులు వస్తాయి. గమనించండి. కొండ నాలికకు మందిస్తేఉన్న నాలిక ఊడింది అన్నట్లు జరుగుతుంది. కాబట్టి నోసోడ్ లను ఇష్టానుసారం వాడకండి.

హోమియో ఔషధాలను చాలా జాగ్రత్తగా వాడాలి. కనుక తెలిసీ తెలియక వాడటం కంటే, తులసి, అశ్వగంధ, తిప్ప తీగ(అమృత లత) వంటి ఆయుర్వేద మందులు వాడటం మంచిది. ఎందుకంటే వీటి వాడకం వల్ల శరీరంలో సైడ్ ఎఫ్ఫెక్ట్స్ఉండవు. కాని హోమియో ఔషధాలు వైద్యుని పర్యవేక్షణ లేకుండా చాలా రోజులు వాడితే శరీరంలో కొత్త రోగాలు పుట్టేప్రమాదం ఉంది. సైడ్ ఎఫ్ఫెక్ట్ లు తీవ్రం గా వచ్చే అవకాసంఉంది.
హోమియో మందులతో సైడ్ ఎఫ్ఫెక్ట్స్ రావు అనేది చాలా తప్పు భావన. ఇవి జీన్ లెవెల్ లో పని చేసే పోటేన్సీలు. తెలిసీ తెలియక రోజూ వాడితే తీవ్రమైన సైడ్ ఎఫ్ఫెక్ట్స్ శరీరంలో తీసుకు వస్తాయి. వాటిని పోగొట్టటం చాలా కష్టం అవుతుంది. కనుక తస్మాత్ జాగ్రత్త.
read more " స్వైన్ ఫ్లూ తో కూడా దోపిడీ యేనా? "

12, ఆగస్టు 2009, బుధవారం

వివేకానందస్వామి జాతకం-4

ఆధ్యాత్మిక జీవితాన్ని పట్టి చూపే వర్గ చక్రం విమ్శాంశ. అంటేఇరవయ్యో వర్గ చక్రం. దానిలో ఏ ఏ విశేషాలు ఉన్నవోచూద్దాం. ఉడుంపట్టు వంటి పట్టుదలను చూపే మకర లగ్నం విమ్శాంశ లగ్నం అయ్యింది. అంటే పట్టుదలతో సాధన చేసి తన గమ్యాన్ని చేరుతాడు అని తెలుస్తున్నది. స్వామికి పద్దెనిమిది పందొమ్మిది ఏళ్ళ వయసులో శ్రీ రామకృష్ణునితో పరిచయం కలిగింది. ఇరవై మూడో ఏట ఆయనకునిర్వికల్ప సమాధి కలిగింది. అంటే మూడు నాలుగేళ్లసాధనతో ఆయన మామూలు మనుషులకు అనేక జన్మలు పట్టే సాధనను పూర్తి చెయ్య గలిగాడు. అంటే ఎంతటిపట్టుదలతో సాధన చేసాడో అర్థం చేసుకోవచ్చు. పరమ స్వతంత్రం అనే మోక్షగమ్యాన్ని చేరాలంటే ఎటువంటి శ్రద్ధ అవసరమో ఆయన మాటలలోనేవిందాము. "Live for an ideal, and that one ideal alone. Let it be so great, so strong, that there may be nothing else left in the mind; no place for anything else, no time for anything else".

"Take up one idea. Make that one idea your life—think of it, dream of it, live on that idea. Let the brain, muscles, nerves, every part of your body, be full of that idea, and just leave every other idea alone. This is the way to success, and this is the way great spiritual giants are produced."

ఇక పోతే లగ్నాధిపతి అయిన శని సహజంగా ఆధ్యాత్మిక చింతనకూ, అంతర్ముఖత్వానికీ, ఏకాంత సాధనకూ కారకుడు. ఆయన మంత్ర స్థానం అయిన వృషభంలో ఉండి చంద్రునీ, లాభ స్థానం లోని ధర్మ స్థానాధిపతి అయిన బుధునీ, వాక్స్థానం లో ఉన్న రాహు కేతువులనూ చూస్తున్నాడు. కనుక చంద్రుని వల్ల ఆధ్యాత్మిక మైన మనస్సు, ధర్మ యుతమైనబుద్ధి, వాక్ స్థానంలో ఉన్న రాహు కేతువుల వల్ల, అనేక విషయాలపైన అనర్గళమైన లోతైన వాగ్ధాటి కలిగాయి. స్వామికి ఆధ్యాత్మిక విషయాలే కాక ప్రపంచ చరిత్ర, కళలు, మతాలు, తత్వ శాస్త్రాలు, సంస్కృతుల పైన అధికారిక మైనజ్ఞానం ఉండేది. దానికి కారణం ఈ గ్రహ స్తితేను. అష్టమ మోక్ష త్రికోణం అయిన సింహ రాశిలో కుజ శుక్రుల స్థితి వల్లఆయనలోని కామ వాసనలు పూర్తిగా నిర్మూలింప బడినాయి అని తెలుస్తున్నది. అష్టమ అధిపతి అయిన రవి ఉచ్ఛస్థితికి దగ్గరిగా ఉండి నవమ భావాన్ని చూస్తున్నాడు. ఇది ఆయనకు గల బలీయమైన ఆత్మ జ్ఞానాన్ని చూపుతున్నది. నవమాదిపతి యగు బుధుడు లాభ స్థానం లోఉండటం తో ఆయనకు దేవతా సాక్షాత్కారము, ధార్మిక జ్ఞానములు తేలికగా కలిగాయి అని చెప్ప వచ్చు.ఆత్మకారకుడగు రవి తృతీయ స్థానములో ఉండుట తో, అతి బలీయమైన ఆధ్యాత్మిక ప్రసంగాలు చెయ్య గలడనితెలుస్తున్నది. ఇదీ విమ్శాంశ చక్రం యొక్క విశ్లేషణ. ఇప్పుడు దశా విశేషాలు చూద్దాము. స్వామి జన్మించినది హస్తా నక్షత్రం మూడవ పాదం కనుక ఆయన పుట్టినపుడు చంద్ర మహా దశ జరుగుతున్నది. చంద్ర/శని/రాహు దశ జరుగుతున్నది. నవమ స్థానంలో చంద్ర శనుల యుతి మరియు ద్వాదశ స్థానంలో రాహు స్థితిగమనిస్తే ఈయన సామాన్య సాధకుడు కాదు, పుట్టుక తోనే ఒక మహా పురుషుడనే విషయం తెలుస్తూంది. బాలుడిగా స్వామి జీవితం కుజ దశలో జరిగింది. అందుకే ఎప్పుడూ చురుకుగా ఉండే అల్లరి పిల్లవాడు. కాని మంత్రస్థానంలో కుజ స్థితితో అతి పసి తనంలోనే శరీర స్పృహను దాటి పోయే అగాధ ధ్యానంలో కూర్చునేవాడు. ఆయనకుపసి తనం నుంచి నిద్రకు ఉపక్రమించినపుడు కళ్లు మూసుకుంటే నుదురు ప్రాంతం లో గుండ్రని బంతి వంటి వెలుగుకనిపించేది. ఆ వెలుగులో మునిగి నిద్ర పోయేవాడు. అది అందరికీ సహజం అనుకునేవాడు. అందుకనే శ్రీ రామకృష్ణుడుఒకనాడు నరేంద్రుని " నీకు భ్రూ మధ్యంలో వెలుగు కనిపిస్తుంది కదా?" అని అడిగినపుడు, ఆశ్చర్యపోయి, "అవును, అందులో వింత ఏముంది? అందరికీ కనిపించదా?" అని అమాయకంగా ప్రశ్నిస్తాడు. ఆయనకు పసి తనం నుంచే ఆజ్ఞాచక్రం జాగృతం చెంది ఉండేది అనటానికి ఇదే నిదర్శనం. ఇట్టి స్థితి రావాలంటే మామూలు మనుషులకు అనేక జన్మలసాధన అవసరం అవుతుంది. మామూలు మనుషులకు నిద్రా సమయంలో అంతచ్చేతన (Unconscious) మేలుకొంటుంది. కనుక మనము చీకటిలోతుల్లోకి జారిపోయి పిచ్చి పిచ్చి కలలు కంటాము. కాని స్వామి వంటి ఆజన్మ మహాయోగులు నిద్రలో ఊర్ధ్వ లోకాలతోసంధానితులై, వెలుగులో నిద్రిస్తారు. వారికి కలలు రావు. ఇదే మనకూ వారికీ తేడా. తరువాత స్వామి చిన్న తనం అంతా రాహు దశలో గడిచింది. అందుకనే అనేక మతాలు, తత్వ శాస్త్రాలు మొదలైనవిషయాలు తెలుసుకున్నాడు. అంతే కాదు, రాహు దశలోనే ఆయన ఒకనాడు తన గదిలో ధ్యానంలో ఉన్నపుడు, హఠాత్తుగా భగవాన్ బుద్ధుడు తేజోమయ శరీరంతో ఆయన ఎదురుగా శరీరంతో ప్రత్యక్షం అయ్యాడు. జ్యోతిర్విద్యలో రాహువు, బుద్ధ మతానికి ఇంకా ఇతర మతాలకు కారకుడనే విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అప్పుడు రాహు దశలో నే ఎందుకు ఆయనకు బుద్ధ దర్శనం కలిగింది అనే విషయం అర్థం అవుతుంది. అంతకు ముందే ఆయనలో జనించిన తీవ్ర తృష్ణతో, అనేకమంది సాధకులను, జ్ఞానులనబడే వారిని కలిశి దేవుని ఉనికినిజమేనా అని అడుగుతూ వచ్చాడు. దేవేంద్రనాథ్ టాగూర్ గొప్ప తపస్వి. ఆయన తన పడవలో గంగా నదిలో రోజంతాఉంటూ అందులోనే ధ్యానంలో ఉండేవాడు. ఒకనాడు నరేంద్రుడు గంగా నదిని ఈదుకుంటూ ఆ పడవ వద్దకు వెళ్లి దానినిఎక్కి, దేవేంద్రనాధ్ ను " మీరు దేవుని చూచారా" అని ప్రశ్నిస్తాడు. ఆయన దానికి జవాబు చెప్పకుండా, నరేంద్రుని తేరిపార చూచి " నీవి యోగులకు ఉండే నేత్రాలు. ఒకనాటికి నీ గమ్యాన్ని తప్పక చేరగలవు" అని మాత్రం చెబుతాడు. నరేంద్రుని అన్వేషణ శ్రీ రామకృష్ణుని దర్శనంతో పరి సమాప్తి అయ్యింది. దేవుని నేను చూచాను. నీకు చూపగలను అని ఆయన అధికారికంగా జవాబిస్తాడు. అంతే కాదు తానన్న మాటను రుజువు చేస్తూ, నరేంద్రుని సున్నితంగా హృదయ స్థానంలో తాకటం ద్వారా అతని మనస్సును ఇంద్రియాతీత, ప్రపంచాతీతo, సమాధి స్థితిలోకి పంపి సంభ్రమానికి గురి చేస్తాడు. శ్రీ రామకృష్ణుని దివ్య స్పర్శ తో, తన కళ్ళ ముందే సమస్త ప్రపంచం అదృశ్యం కావటం, చివరికి నేను అనే భావన కూడా ఎక్కడో లయం అయ్యి అనిర్వచనీయమైన స్థితిని నరేంద్రుడు అందుకొని నిర్ఘాంత పోతాడు. ఇదే విషయాన్ని స్వామి అభేదానంద తరువాత శ్రీ రామకృష్ణ స్తోత్రంలో " సంస్పర్శ మాత్రేణ నృణాం సమాధిం విహాయ సద్యో భువి రామకృష్ణ" అంటూ శ్రీ రామకృష్ణునికి ఉన్న అమానుష శక్తిని గురించి వ్రాశాడు. ఆయన కు శ్రీరామకృష్ణుని మొదటగా కలిశే మహాదృష్టం 1881 నవంబర్ లో కలిగింది. అప్పుడు ఆయనకు రాహు/ శని/రాహు జరుగుతున్నది. రాహువు, శనుల ప్రభావం ఇక్కడ స్పష్టం గా చూడ వచ్చు. రాహు శనుల కలయిక కాళికా మాతనుసూచిస్తుంది. కనుక జగన్మాత యొక్క అవతారం అయిన శ్రీ రామకృష్ణుని ఆ దశలో కలవటం జరిగింది. 1886 ఆగస్టు 15 రాత్రి శ్రీ రామకృష్ణుడు దేహాన్ని వదలి పెట్టి తన దివ్య ధామం చేరుకున్నాడు. మన దేశానికి అదే తేదీన స్వతంత్రం రావటం గమనించండి. ఆరోజు న రాహు/శుక్ర/రవి జరుగుతున్నది. రాహువు వ్యయంలోఉండటము, రవి- గురువును సూచించే నవమాదిపతి కావటమూ, శుక్రుడు నవమాత్ మారక స్థానం అయిన కన్యకు అధిపతి అయిన బుదునితో కలిశి లగ్నాత్ ద్వితీయ మారక స్థానంలో ఉండటం, నవమాత్ ఇది రోగ స్థానం అయిన షష్ఠం కావటం చూడవచ్చు. అక్కడ నుంచి 1893 లో రాహు దశ చివరి వరకూ పరివ్రాజక సన్యాసి గా దేశమంతాతిరుగుతూ దేశ ప్రజల స్థితిని ఆకళింపు చేసుకున్త్o గడిపాడు. రాహు దశ ఆయనను దేశమంతా తిప్పటమే కాక, విభిన్న మతాలు, జాతులు, వారి చరిత్రలు, సంస్కృతులపైన లోతైన విషయ పరిజ్ఞానాన్ని ఇచ్చింది. అందుకనే స్వామితో కొద్దిసేపు మాట్లాడి, ఆయన అంటే ఆకర్షితులు కాని వారు లేరు. 1893 లో గురు దశ ప్రారంభం కావటం తోనే కన్యాకుమారిలో మూడు రోజులపాటు సముద్రంలో ఉన్న రాళ్ళ గుట్టపైనధ్యాన సమాధిలో గడిపి తనకు కలిగిన శ్రీ రామకృష్ణుని దర్శనం తో విదేశాలకు పోయి భారత దేశపు మతం అయినసనాతన ధర్మాన్ని అక్కడ జరుగుతున్న సర్వ మత మహా సభలలో ప్రచారం చెయ్యాలి అనే నిశ్చయానికి వచ్చాడు. ఇంకొక్క విషయం-- ఆయన మొట్ట మొదటి సారిగా ఇచ్చిన పబ్లిక్ ఉపన్యాసం మన ఆంద్ర దేశంలోనే, అదికూడా సికింద్రాబాద్ లోని మహబూబ్ కాలేజీలో అని తెలిస్తే ఆంధ్రులుగా మనకు గర్వ కారణం కాదూ? సంఘటన 1893 సంవత్సరంలో జరిగింది. కాని మన తెలుగు వారికి ఉన్న సహజ మైన తెగులు తో, దాన్ని నిర్లక్ష్యం గా తీసుకొని ఊరుకున్నాం. అదేబెంగాలీ సోదరులైతే ఆ పవిత్ర వేదికను ఇప్పటికి ఒక స్మారక చిహ్నం గా మార్చి ఉండేవారు. 1893 మే ముప్పై ఒకటిన బాంబే నుంచి ఓడలో బయలుదేరి కెనడాలోని వాంకోవర్ లో దిగి అక్కణ్ణించి చికాగో వచ్చి అష్టకష్టాలు పడుతూ చివరకు ఎలాగైతేనేమి విశ్వ మత మహాసభలో ఇచ్చిన ఒక్క ఉపన్యాసంతో సెలెబ్రిటీ గా మారిపోయితరువాత తూర్పు తీరం లో అంతటా ఉపన్యాసాలు ఇస్తూ, హార్వర్డ్ యూనివర్సిటీ లో ప్రసంగించి, తరువాత వేదాంతసొసైటీ అఫ్ న్యూ యార్క్ ను స్థాపించటంతో గురువు/గురువు దశ 1894 తో ముగిసింది. లాభ స్థానంలో బలంగాఎ ఉన్నటువంటి లగ్నాధిపతి గురు దశ ప్రారంభం కావటం తోనే ఎలా జీవితం లో మార్పులువచ్చాయో చూడండి. ఆ గురువు పంచమాదిపతి తనకు మిత్రుడూ అయిన కుజుని చిత్తా నక్షత్రం లో ఉంటూ, ఆ కుజునిచేత సప్తమ ద్రుష్టి తో బలం గా చూడ బడుతున్నాడు గమనించండి. 1895 లో గురువులో శని దశ మొదలు కావటం తోనే న్యూ యార్క్, న్యూ హెంప్ షైర్a లలో వేదాంత క్లాసులు మొదలుపెట్టటం జరిగింది. ఈ సమయం లోనే స్వామి జీవితంలో ఇంకొక ముఖ్య సంఘటన జరిగింది. న్యూ యార్క్ లో గలసెయింట్ లారెన్స్ నదీ తీరంలో గల థౌజండ్ ఐలాండ్ పార్కులో స్వామి తన క్లాసులు ఇస్తూ ఉన్నప్పుడు ఆయనకుఅమెరికాలో కూడా నిర్వికల్పn సమాధి మరొక్క సారి కలిగింది. ఒకరోజు విశాల మైన పచ్చిక బయళ్ళలో నదీ తీరం వెంట స్వామి ధ్యాన మగ్నుడై నిర్వికల్ప సమాధిని అందుకున్నాడు. ఎంతకీ ఆయన ఇంటికి తిరిగి రాక పోయేసరికి వెతుకుతూ ఆయన అమెరికన్ శిష్యులు వచ్చి చూచి, శిలా విగ్రహం లాబాహ్య స్పృహ లేనిa ఆయన్ను ఎంత కుదిపినా స్పృహలోకి రాకపోవటంతో, శరీరం చల్లగా ఉండటం, గుండె స్పందన మరియు నాడి లేక పోవటంతో, స్వామి మరణించాడని తలచి బిగ్గరగా ఏడవసాగారు. చాలా సేపటికి నిదానం గా జీవంతిరిగి వస్తున్న చిహ్నాలు ఆయన శరీరంలో కలిగాయి. కళ్లు తెరిచిన స్వామి చిరునవ్వు నవ్వుతూ అటువంటిy పరిస్తితిఎదురైతే అలా మనిషిని కుదప రాదనీ చెబుతూ ఏమి చెయ్యాలో వివరిస్తాడు. ఈ సంఘటన గురువులో/ శని దశలోజరిగింది. తరువాత పారిస్ లండన్ లలో ఉపన్యాసాలు ఇస్తూ, హార్వర్డ్ విశ్వ విద్యాలయం లో ఉపన్యాసం ఇచ్చినపుడు వారుముగ్ధులై విశ్వ విద్యాలయం లోని Eastern Philosophy Chair ను ఆయనకు ఇవ్వ జూపుతారు. ఆ పదవిని సున్నితంగా తిరస్కరించిన స్వామి, ఆక్స్ ఫోర్డ్ విశ్వ విద్యాలయం లో ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్ ను కలుసుకుంటాడు. స్వామి దివ్యమైన వ్యక్తిత్వానికి మాక్స్ ముల్లర్ ఆశ్చర్యపోయి ప్రణామాలు అర్పిస్తాడు. ఈ విధంగా జగన్మాత అనుగ్రహం తో ప్రపంచ జైత్ర యాత్ర ముగించుకొని 1897 జనవరి 15 న భారత మాత గర్వించదగిన ముద్దుబిడ్డ గా తిరిగి భారత దేశంలో అడుగు పెడతాడు. చేతిలో చిల్లి గవ్వ లేని బికారిగా దేశాన్ని వదలిన స్వామి అమెరికాయూరోప్ ఖండాలను పాదాక్రాంతం చేసుకొని, ప్రపంచ ప్రఖ్యాత తాత్వికుల చేత నీరాజనాలందుకొని, తర తరాల ఋషిఋణం తీర్చుకొని, భారత దేశాన్ని పునరుజ్జీవన పథంలో నిలిపి తిరిగి తన దేశానికి వస్తాడు. ఈ సంఘటనను గురించి వొళ్లు గగుర్పొడిచే మాటలలో మహా యోగి అరవిందులు ఏమన్నారో చూడండి. "The going forth of Vivekananda, marked out by the Master as the heroic soul destined to take the world between his two hands and change it, was the first visible sign to the world that India was awake not only to survive but to conquer." 1897 జనవరి లో కొలంబో చేరి అక్కడనుంచి మద్రాసు మీదుగా ప్రయాణిస్తూ ఫిబ్రవరి లో కలకత్తా చేరేవరకూ స్వామి దారిలో ఇచ్చిన దివ్యమైన ఉపన్యాసాలు "Lectures from Colombo to Almora" అనే పుస్తకంగా వచ్చాయి. ఆదివ్యమైన భాషనలలో స్వామి మన మతాన్ని గురించి వివరంగా ఉపన్యసించట కాక, మన దేశం తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకోవాలంటే చేయవలసిన పనులు, మార్చుకోవలసిన పద్ధతులు వివరంగా చెబుతాడు. ఆఉపన్యాసాలు చదివితే ఒళ్ళు పులకరించని మనిషి ఉంటాడంటే నేను నమ్మను. తరువాత వచ్చిన గాంధీ మొదలిన దేశ నాయకులూ, అంబేద్కర్ మొదలైన దళిత నాయకులూ, సంస్కర్తలూ వారికితెలిసో తెలియకో ఆభావాలలో కొంత భాగాన్ని మాత్రమె అనుసరించ గలిగారు. పూర్తిగా అనుసరించి ఉంటే ఈ నాడుమన దేశ పరిస్థితి భిన్నం గా ఉండేది. ఇక స్వతంత్రం వచ్చిన తరువాత వచ్చిన చీడపురుగు నాయకులు, భ్రస్టు పట్టినవారి స్వార్థ పూరిత విధానాలతో దేశాన్ని అధోగతికి తీసుకెళుతున్నారు. ఎంతటి మహనీయులు మనలో జన్మిస్తేనేమి?. సాక్షాత్తూ భగవంతుడే మన మధ్య ఎన్నో సార్లు జన్మించినా మనలో చలనం రాదుకదా? మన స్వార్థ పరతకు అంతులేదేమో అనిపిస్తుంది. 1897 మే ఒకటిన కలకత్తాలో శ్రీ రామకృష్ణా మిషన్ ను స్థాపించాడు. శ్రీ రామకృష్ణుడు యుగ యుగాల భారతీయఆత్మకు ప్రతిరూపం. ప్రాచీన ఋషుల అవతారాల సమస్త భావ రాశి ఆయనలో రూపు దాల్చి ఉంది. వేల సంవత్సరాలభారతీయుల సాధనా ఫలితంగా అట్టి దివ్య అవతారం మన మధ్య కలిగింది. అట్టి మహనీయుని ఆదర్శాలనుకొనసాగించే ఒక సంస్థ అవసరం అని తలచి దానికి ఒక రూపాన్నిచ్చాడు. 1898 ఆగస్టు లో తన విదేశీ శిష్యులతోఅమరనాథ యాత్ర చేసాడు. అమర్నాథ్ గుహలో స్వామికి అద్భుతమైన శివ దర్శనం కలిగింది. అక్కడే స్వామికి ఇచ్చామరణ వరం ( అనుకున్నపుడు శరీరాన్ని వదలి పెట్ట గలిగే శక్తి) శివానుగ్రహంతో వచ్చింది. అక్కడ కలిగిన శివ దర్శనంతో స్వామి తన్మయుడై తరువాత కొన్ని నెలలు పూర్తిగా అంతర్ముఖుడిగా ఉండిపోయాడు. ఆ సమయంలో స్వామి సమక్షంలో ఊరకే కూర్చున్నవారికి మనసు తేలికగా ఊర్ధ్వ భూమికలకు ఎగసి దుర్లభమైన బ్రహ్మ సాక్షాత్కారం దానంతట అదే కలిగేది అని ఆయన సాన్నిధ్యాన్ని ఆరోజులలో పొందిన అదృష్టవంతులైన స్వామీజీలు వ్రాశారు. 1899 మార్చి నెలలో స్వామి హిమాలయాలలోని కనఖాల్ లో అద్వైత ఆశ్రమాన్ని స్థాపనచేసాడు.అక్కడ పూర్తిగా అద్వైతమే అనుసరణీయం అని చెబుతూ, తన గురుదేవుడైన శ్రీ రామకృష్ణుని పూజఆరాధనలను కూడా అక్కడ నిషేధించాడు. స్వామి ఆదేశంతో ఈనాటికీ అద్వైత ఆశ్రమం లో ఎటువంటి పూజలు, ఆరాధనలూ ఉండవు. ఏ దేవీ దేవతల విగ్రహాలు కనిపించవు. పూర్తిగా శుద్ధ అద్వైతాన్నే అక్కడ పాటించటం జరుగుతుంది. నిరాకార నిశ్చల అద్వయము అఖండము కేవల చిత్స్వరూపము అయిన పరబ్రహ్మ తత్వాన్నే అక్కడ ఉపాసించటం ఈనాటికీ జరుగుతున్నది.
read more " వివేకానందస్వామి జాతకం-4 "

5, ఆగస్టు 2009, బుధవారం

వర్షం కురిపించటం ఎలా?

పంచ ప్రాణాలు గా మన ప్రాచీన యోగ శాస్త్రాలలో చెప్ప బడినవె బాహ్యంగా ప్రకృతిలో పంచ భూతములు గా ఉన్నాయి. కనుక యోగి తన శరీరంలో ఉన్నటువంటి పంచ భూతములను వాటి వాటి సహజ అమరికలోకి తేగలిగితే దాని ప్రభావంఅతని చుట్టూ ఉన్న పంచ భూతముల మీద ఉంటుంది. అతని చుట్టూ ఉన్న వాతావరణం సహజ అమరికలోనికిమారుతుంది.

మన మానసిక ఆలోచనలు, ప్రాణిక స్థితులు మన చుట్టూ ఉన్న వాతావరణం మీద ప్రభావం చూపుతాయి. అలాగేవాతావరణం కూడా మన మనస్సు మీద ప్రభావం చూపుతుంది. కొంత సున్నిత మనస్సు ఉన్న వారికి ఇది తేలికగాఅర్థం అవుతుంది.ఇటువంటి Sensitivity ఉన్నవారు కొన్ని కొన్ని ప్రదేశాలలోని స్పందనలను తేలికగా "రుచి
చూచి" తెలుసుకోగలుగుతారు. ప్రదేశాలలో ఉన్న స్పందనలలోని తేడా తెలియాలంటే ఒక చిన్న ప్రయోగం చెయ్య వచ్చు. కిక్కిరిసి ఉన్న చవకబారు "బార్" లోకి వెళ్లి అక్కడి వాతావరణాన్ని "ఫీల్" అవ్వండి. అలాగే విశాల ప్రకృతిలో కొలువైవున్న ఒక ప్రశాంత దేవాలయానికి వెళ్లి అక్కడి వాతావరణాన్ని "ఫీల్" అవ్వండి. తేడా మనకే తెలుస్తూంది.

ఎప్పుడూ అరుచుకుంటూ, తిట్టుకుంటూ ఒకరంటే ఒకరికి పడని కుటుంబ సభ్యులు ఏళ్ళ తరబడి నివసించిన ఇంటిలోకివెళ్లితే ఆ వాతావరణల స్పందన లకు కాసేపు కూడా ఉండలేని పరిస్థితి కలుగుతుంది. అలాగే ప్రేమ మయ వాతావరణం
తో ఎప్పుడూ చక్కని హాస్యపూరిత మాటలతో ఉల్లాసంగా జీవితాన్ని గడిపే కుటుంబాలు ఉన్నటువంటి ఇళ్ళ యొక్కస్పందనలు భిన్నం గా ఉంటాయి.

మన ఆలోచనలు, ప్రాణిక స్థితి మన చుట్టూ ఒక రకమైన వాతావరణాన్ని కలుగజేస్తుంది. దాన్నే తెజోవలయం (aura) అంటారు. దీన్ని ధ్యానాభ్యాసంలో కొంత అనుభవం ఉన్నవారు ఫీల్ అవగలుగుతారు. ఇంకొంత పురోగమించినసాధకులు ఈ వలయాన్ని చూడ గలుగుతారు. మనిషికీ మనిషికీ ఉన్న తేజో వలయాలు పరస్పరం కలవకపోతే వారికిఅకారణ మానసిక ఎడం ఏర్పడుతుంది. అందుకే కొందరిని చూస్తె చెలిమి చేయాలని పిస్తుంది. కొందరిని చూస్తె దూరంపారిపోవాలనిపిస్తుంది. కొందరిని చూస్తె నిష్కారణంగా తన్నాలనిపిస్తుంది. కొందరిని చూస్తె చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. దీనికి ప్రత్యెక కారణాలు ఏమీ కనిపించవు.

మొత్తానికి చెప్పేదేమంటే మనిషి యొక్క మానసిక ప్రాణిక స్థితి, బయటి వాతావరణం ఈ రెండూ ఒకదానినొకటిపరస్పరం ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రాచీన మహర్షుల ఆశ్రమాలలో విరోధులైన జంతువులు కూడా చెలిమిగాఉండేవని చెబుతారు. పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో "అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధె వైరత్యాగః." అనిచెబుతూ ఎవరైతే ఆహింసలో చక్కగా ప్రతిష్టితులై ఉంటారో వారి సమక్షంలో వైరం ఉండదు. అంటాడు. అంటే వారి ప్రాణతేజో వలయం మొత్తం ఈ అహింసా తరంగాలతో నిండి ఉండి, తద్వారా ఆ ఆవరణలోకి వచ్చిన వారిని అది ప్రభావితంచేసి వారి మనసులలోనుంచి వైర భావాలు అదృశ్యం అయ్యేట్టు చేస్తుంది. బుద్ధుడు తన మీదికి చంపాలని వచ్చినమత్తెక్కిన మదపుటేనుగును మైత్రీ భావనా తరంగాలతో శాంత పరచి తన కాళ్ళ వద్ద కుక్క పిల్లలా పడుకునేటట్లుచేశాడు.

శ్రీ రామకృష్ణుని వల్ల విద్యా వంతులైన యువకులు వైరాగ్య భావ పూరితులై సంసారాన్ని వదలి సన్యాసులు గామారుతున్నారని కోపించిన ఒక శిష్యుని తండ్రి, శ్రీ రామకృష్ణుని చంపమని మన్మధ్ అనే ఒక కిరాయి హంతకునినియోగిస్తాడు. ఆ రోజు శ్రీ రామకృష్ణుడు ఒక శిష్యుని ఇంటికి వస్తాడని ముందుగానే తెలిసిన మన్మధ్ అక్కడ కాపుకాస్తాడు. శ్రీ రామకృష్ణుడు గుర్రపు బండి లోనుంచి దిగటం తోనే దాడి చేసి ఆయన్ను హత మార్చాలని మన్మధ్ పధకంవేసి అక్కడే జనం లో నిలబడి ఉంటాడు. చూస్తునడగానే శ్రీ రామకృష్ణుడు వస్తున్నా గుర్రపు బండి వచ్చి ఆగింది. శ్రీరామకృష్ణుడు బండి లోనుంచి దిగుతూ మన్మధ్ వైపు ఒక చూపు చూచి చిరునవ్వు నవ్వుతాడు. వెంటనే మన్మధ్ఒళ్ళు తెలీక నేలమీద పడి ఏడుస్తూ శ్రీ రామకృష్ణుని కాళ్ళు పట్టుకొని వదలటం లేదు. అక్కడి వారు ఏమైందో తెలియకఆశ్చర్య పోతారు. శ్రీ రామకృష్ణుడు కూడా ఏమీ జరగనట్లే ఉంటాడు. శ్రీ రామకృష్ణుని రూపంలో ఈ లోకానికి ఏ మహా శక్తిఅవతరించిందో ఆయనకే తెలుసు, కొద్ది మంది అంతరంగ శిష్యులకు తెలుసు.

ఆ రోజునుంచి మన్మధ్ లో అద్భుత మార్పు కలిగింది. క్రూరుడైన హంతకుడు మాయమై అతని స్థానంలో వైరాగ్యపూరితుడైన ఆలోచనా పరుడు జన్మించాడు. సంసార జీవితాన్ని త్యజించి ధ్యాన సాధనలో మునిగి చివరకు ఒక మహాయోగివలె శరీరాన్ని త్యజించాడు. ఈ సంఘటనా జరిగిన తరువాత కొన్నేళ్ళకు శ్రీ రామకృష్ణుని శిష్యుడొకాయనమన్మధ్ ఎలా ఉన్నాడో చూద్దామని అతన్ని వెతుక్కుంటూ వెళతాడు. మన్మధ్ ఒంటి మీద స్పృహ లేని స్థితిలోసూర్యుని వైపు తదేకంగా చూస్తూ ధారలుగా కన్నీరు కారుతుండగా శ్రీ రామకృష్ణుని నామాన్ని స్మరిస్తూ కనిపిస్తాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మానసిక శక్తి తో బాహ్య పరిస్థితులలో మార్పు తేవడం ఖచ్చితం గా సాధ్యంఅవుతుంది అన్న విషయాన్ని చెప్పటం కోసం ఇదంతా చెప్ప వలసి వచ్చింది.

తాయిచి విద్యలో అంతర్గత ప్రాణశక్తిని ప్రత్యేకమైన విధానాలతో సక్రమమైన స్థితిలో ఉంచటం జరుగుతుంది. కనుకతాయిచి మాస్టర్లు ఉన్న ఇల్లు సుభిక్షం గా ఉంటుంది. తాయిచి సిద్ధాంతాలు మరియు చైనీస్ వాస్తు అయిన ఫెంగ్శూయి సిద్ధాంతాలు ఒకటే. ఫెంగ్ శూయి వల్ల దిద్దబడిన ఇల్లు ఎలా చక్కని తరంగాలతో ఉండి సుభిక్షంగా ఉంటుందో, అలాగే తాయిచి అంతర్గత ధ్యాన విధానాల వల్ల దిద్దబడిన పంచ ప్రాణాలు కల శరీరం కూడా ప్రకృతితో సమ స్థితిలోఉంటుంది. అట్టి వ్యక్తి ఉన్న ప్రదేశం కూడా చక్కని సమ స్థితిలో ఉంటుంది. తాయిచి అనే వీర విద్య ప్రాచీన తావోయిష్టుఆచరణలపైన ఆధారపడినట్టి విద్య.
తావోయిస్టు సిద్ధాంతాలు మన యోగ సాంప్రదాయానికి ముఖ్యంగా కుండలినీ యోగానికి చాలా దగ్గరివి. దాదాపు ఒకటే అని చెప్పవచ్చు.

మన మానసిక, ప్రాణిక స్థితిని బట్టి మన చుట్టూ వాతావరణం ఉంటుంది అనే రహస్యం ప్రాచీనులకు తెలుసు. అందుకేమహాభారతంలో పాండవులు ఎక్కడ ఉంటే అక్కడ సుభిక్షం గా ఉంటుంది, కనుక ఏ రాజ్యంలో నైతే కరువు కాటకాలులేక సుభిక్షం గా ఉందొ అదే రాజ్యంలో వారు దాగి ఉన్నట్లు అని వారి అజ్ఞాత వాసంలో వారిని పట్టుకోవాలనే పథకంరచిస్తారు దుర్యోధనాదులు. అలాగే కరువుతో ఉన్న రాజ్యంలోకి రుష్య శృంగ ఋషి వస్తే మళ్ళీ వర్షాలు పడుతాయి అనిఆ ఋషిని తన రాజ్యానికి ఎలాగైనా రప్పిస్తాడు లోమపాద మహారాజు.

ఇరవయ్యో శతాబ్దం మొదట్లో చైనాలో మిషనరీ గా పని చేసిన రిచర్డ్ విల్హెల్మ్ తాను చూచిన ఒక సంఘటనను ప్రఖ్యాతమానసిక శాస్త్రవేత్త కార్ల్ జంగు కు చెప్పాడు. చైనాలో అతనున్న ప్రాంతంలో వానలు పడక కరువు వచ్చింది. అప్పుడుప్రజలంతా ఎవరి మత ప్రార్థనలు వారు చేసారు. కాని వాన పడలేదు. అప్పుడు పక్క ప్రావిన్సులో ఉన్న వర్షాకర్షక శక్తికల ఒక వృద్దున్ని పిలిపిస్తారు. అతను
(rain maker) వచ్చి ఏమో చేస్తాడని అంతా ఎదురు చూచారు. కాని అతనువచ్చి ఏ ప్రక్రియా చెయ్యకుండా తన కిచ్చిన ఇంటిలో మూడు రోజులు బయటకు రాకుండా ప్రశాంతం గా మౌనంగాకూర్చొని ఉన్నాడు. మూడో రోజునించి కుంభ వృష్టి పడి అంతా జలమయం అయ్యింది.

అపుడు విల్ హెల్మ్ ఆ వృద్ధుని వద్దకు వెళ్లి ఆ రహస్యం ఏమిటో చెప్పమని అడుగుతాడు. దానికి ఆ వృద్ధుడు వానపడటానికి తానేమీ చెయ్యలేదు అని చెబుతాడు. మరి మూడు రోజులూ ఇంటిలో ఏమి చేసావు అని రిచర్డ్ అడిగాడు. దానికి వృద్ధుడు ప్రశాంతం గా చెప్పాడు. నేను ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ ప్రాంతపు అసమత్వ స్పందనలు నాలో కూడాప్రవేశించాయి. నాలో ప్రాణ శక్తి చెదిరి పోయింది. అందుకే మూడు రోజులు సాధన చేసి మళ్ళీ నా అంతర్గత ప్రాణం యొక్కసమ స్థితిని స్థిరపరిచాను. తద్వారా బాహ్య ప్రకృతిలో కూడా సమత్వం వచ్చింది. అందుకే వెంటనే వర్షం పడింది. ఇదే నారహస్యం అని చెబుతాడు. ఆ వృద్ధుడు ఒక తాయిచి ప్రక్రియను వాడాడు. అతడు టావోయిష్టు మాస్టర్ కనుక ఆ పనిచెయ్య గలిగాడు.

అందుకే మన పూర్వులు అనేవారు. ధర్మాత్ములు ఉన్న చోట వర్షాలు క్రమం తప్పక పడుతాయి అని. ఎందుకంటేధర్మాన్ని అనుసరించి నడిచేవారి అంతఃకరణ, మనసు, పంచ ప్రాణాలు ఎక్కడ ఉండవలసినవి అక్కడ చక్కని స్థితిలోఉంటాయి. కనుక ప్రకృతి కూడా దానికి తగినట్లే స్పందిస్తుంది. అధర్మ పరులకు అన్నీ వైకల్యం చెంది ఉంటాయి; వారిఅంతః ప్రకృతి చెడిపోయి ఉంటుంది. కనుక బాహ్య ప్రకృతి కూడా చెడిపోతుంది. వారు లోపలా తమను తాము పాడుచేసుకుంటారు. బాహ్యం గానూ ప్రకృతిని పాడు చేస్తారు. కనుక ప్రకృతి కూడా దానికి తగినట్లే స్పందిస్తుంది. వర్షాలు లేకకరువు కాటకాలు వస్తాయి.

ప్రకృతికీ మనకూ అవినాభావ సంబంధం ఉన్నది. అది బయటకు కనిపించక పోవచ్చు. కాని అది ఉన్నది. మనంఉండవలసిన తీరులో
ఉంటే ప్రక్రుతి చక్కగా ఉంటుంది. మనం చేతులారా మన మనస్సులనూ, ప్రాణ స్థితినీ పాడుచేసుకుంటున్నాం. తద్వారా ప్రకృతినీ పంచ భూతాలనూ అపవిత్రం, కలుషితం చేస్తున్నాం. అందుకే ప్రక్రుతికూడా చెడిపోతున్నది. తద్వారా మనకు వినాశం కలుగుతున్నది.

సైన్సు ద్వారా మనకెంతో తెలుసని విర్ర వీగుతూ, ఇంద్రియ దాస్యం పెరిగిపోయి మన వినాశనం మనమే కొనితెచ్చుకుంటున్నాం. సుఖాలు ఎక్కువ అయ్యాయి. భోగాలు ఎక్కువయ్యాయి. కాని స్వాస్థ్యం తగ్గి పోయింది. మనిషిలోపల సమత్వం, స్థిరత్వం, స్వాస్థ్యం తగ్గి పోయాయి. కనుకనే రోగాలు ఎక్కువైతున్నాయి. ఈరోజు రోగం లేని మనిషిలేడు అంటే వింత కాదు. చిన్న పిల్లలు కూడా బీ పీ తో బాధ పడుతున్నారంటే మనం ఎంత పురోగామించామోతెలుస్తున్నది. ఇంకొక పక్క ప్రకృతీ కోపిస్తున్నది. పూర్వ కాలం ఇన్ని రోగాలు లేవు, ఇంత ప్రకృతి వైపరీత్యాలూ లేవు. ఇంత అధర్మమూ లేదు.

విదేశీ వెర్రి వేషాలు తలకేక్కించుకొని అదే ఏదో గొప్ప గా భావిస్తూ విర్ర వీగుతూ పతనం వైపు పరుగేడుతున్నాం. ఈరోజులలో రాత్రి పదకొండు గంటలలోపు భోజనాలు చేసే కుటుంబాలు తగ్గిపోయాయి. పొద్దున్న లేచింది మొదలు TV లేకపోతే తోచక పిచ్చేక్కే జీవులు ఎన్నో. ఒక్క రోజు TV చానెళ్ళు అన్నీ ఆపితే దేశం మొత్తం మీద పిచ్చాసుపత్రుల్లో చేరేవారు లక్షల్లో ఉంటారు. ఇక పోతే అనేక కుటుంబాలలో నిద్రకుపక్ర మించేసరికి రాత్రి పన్నెండు ఒంటిగంట అవుతున్నది. తాగుడు సర్వ సాధారణం అయ్యింది. తిరుగుడు సహజం అయ్యింది. ఎక్కడ చూచినా స్వార్థం తాండవిస్తున్నది. ఇదిమానవుని అంతర్గత పరిస్థితి.

ఇక బయట చూద్దామంటే, రసాయనిక ఎరువులతో, ప్లాస్టిక్ వంటి చెత్త తో భూమిని కలుషితం చేస్తున్నాం, ఫేక్టరీ వ్యర్థపదార్థాలను, సిటీ డ్రైనేజీలను జీవ నదులలోకి వదులుతూ ప్రాణ హితమైన జలాన్ని విష తుల్యం గా మారుస్తున్నాం. నీళ్ళను కొనుక్కుని తాగుతూ అదేదో గొప్పగా భావిస్తూ ప్లాస్టిక్ సీసాలను ప్రకృతిలోకి వదులుతున్నాం. వాహనాలకలుషిత పొగనూ, ఫేక్టరీల పొగలనూ గాలిలోకి ఒదులుతూ, చెట్లను నరికి పారేస్తూ గాలిని కలుషితం చేసుకుంటున్నాం. aఆలోచనా రహిత మైనింగ్ చేస్తూ భూమిని డొల్లగా మారుస్తున్నాం. కొండల్ని కూడా తవ్వి పారేశి కంకరను కూడావదలకుండా అమ్ముకుంటూన్నాం. పాపం ఇంత చేసినా ప్రకృతి కరుణించి అప్పుడప్పుడూ వర్షాలు కురిపిస్తూ కరువులేకుండా కాపాడుతున్నదంటే అది మన గొప్ప కాదు. ప్రకృతి దయ.

వర్షాలు పడటమే కాదు. ఇతర ప్రకృతి విలయాలు కరువు, అంటు వ్యాధులు, ప్రకృతి భీభత్సాలు వగైరాలు లేకుండాఉండాలంటే మనిషి అంతర్గత సమత్వ స్థితిలోకి రావాలి. అట్టి మనిషి ప్రకృతిని పాడు చెయ్యడు. ప్రకృతిని ఆరాధిస్తాడు. మనవాళ్ళు చెట్లను కొండలను నదులనూ ఆరాధించిన రహస్యం ఇదే. భగవంతుని శక్తి వాటిలో ఉంటూ మనజీవితాలను పోషిస్తున్నది. అందుకే అవి ఆరాధనీయాలు అయ్యాయి. అంతే గాని అవి రాళ్ళు, చెట్లు పుట్టలు అనిమనకు తెలియక కాదు.

మనలను పోషిస్తున్న ప్రకృతిని తల్లిగా పూజించిన సంస్కృతి మనది. ఆ ప్రాచీన మూలాలనుతిరిగి అర్థం చేసుకొని ఆచరణలోకి తెచ్చినపుడే మనకు కళ్యాణ కారకమౌతుంది . లేదా ఇదే పిచ్చి ధోరణిలో ముందుకుపోతూ, మనం కూచుని ఉన్న కొమ్మలను మనమే నరుక్కుంటుంటే ఒక నాటికి విలయం తప్పదు.
read more " వర్షం కురిపించటం ఎలా? "

1, ఆగస్టు 2009, శనివారం

వివేకానందస్వామి దివ్యజాతకం-2


శనిచంద్రుల కలయిక అంతర్ముఖత్వాన్ని ఇస్తుందని ఇంతకూ ముందే చెప్పా కదా. శనిదృష్టి ద్వాదశంలోఉన్న రాహువు మీద ఉంది.ద్వాదశం ఇతర అనేక విషయాలతోబాటు లోతైన ఆధ్యాత్మిక భావనలను సూచిస్తుంది. అంతేకాక రాహువు యొక్క స్థితితో తనదైన మతమేకాక అనేక ఇతరమతాలమీద అనుభవాత్మకమైన అధికారాన్ని చూపుతుంది. వివేకానంద స్వామి తన పరివ్రాజకదశలో గోవాలో మూడురోజులు ఉండి అక్కడి ప్రాచీనచర్చిలో భద్రపరుచబడిఉన్న ఎడిట్ చెయ్యబడని లాటిన్ ప్రతులద్వారా క్రీస్తుయొక్క అసలైన బోధనలు సిద్ధాంతాలను అధ్యయనం చేసారు. వాటికీ వేదాంతానికీ ఏమీ భేదంలేదని ఆయన దీన్నిబట్టి గ్రహించారు.


ఆ మూడురోజుల స్వామియొక్క సాన్నిహిత్యాన్ని పొంది ధన్యులైన క్రైస్తవబిషప్పులు వీడుకోలు సమావేశ సమయంలో ఆయనను వదలలేక బాధతో వీడ్కోలు చెప్పారు. తనతో ఒక్కరోజు కలిసి జీవించినవారిని జీవితాంతం ప్రభావితం చెయ్యగల వ్యక్తిత్వ అయస్కాంతశక్తి (personal magnetism) ఆయనకు ఉండేది. ఈ శక్తి పరిధి లోకి వచ్చినవారు, వారే దేశంవారైనా, ఏ కులమతాలకు చెందినా వారైనా మంత్రముగ్దులయ్యేవారు.

తన ఏకసందాగ్రాహిత్వ శక్తితో క్రైస్తవ మూలసిద్ధాంతాలను ఆయన సులువుగా గ్రహించారు. ఆయనకుగల అఖండ బ్రహ్మచర్యబలంతో ఒకసారి చూచిన విన్న విషయాన్ని యదాతధంగా గుర్తుంచుకొని ఎన్నేళ్ళ తర్వాతైనా మళ్ళీ చెప్పగల అమానుష ప్రజ్ఞాశక్తి ఆయనకు ఉండేది. అందువల్లే అమెరికాలో క్రైస్తవమిషనరీలతో ఆయన మాట్లాడినప్పుడు వారు స్వామికి క్రైస్తవమతంమీద గల అధికారిక అవగాహనకు మంత్రముగ్ధులైనారు.

అంతేకాక తన విద్యార్ధిదశలో ఆయన కాంట్ హెగెల్ మొదలైన పాశ్చాత్యతాత్వికులను క్షుణ్ణంగా అధ్యయనం చేసారు. అరబ్బీ,పర్షియన్ సాహిత్య అధ్యయనం ద్వారా సూఫీతత్వాన్ని కూలంకషంగా ఆయన గ్రహించారు. బౌద్ధమత అధ్యయనంద్వారా ఇంకా లోతైన ధ్యానంద్వారా ఆయన బుద్ధుని హృదయాన్ని గ్రహించారు. చిన్నపిల్లవానిగా ఉన్నపుడు ఆయనకు తనగదిలో ఏకాంత ధ్యానంలో బుద్ధుని తేజోమయ సజీవదర్శనం కలిగింది అన్న విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఇంకా అనేకానేక గ్రంథాలపఠనంద్వారా ఆయామతాలలో నిజమైన పాండిత్యం కలిగినవారితో సంభాషణలద్వారా స్వామి ప్రపంచమతాలలో లోతైన ప్రజ్ఞను పొందారు.

తన పరివ్రాజకదశలో స్వామి దేశమంతా పర్యటన చేసినపుడు ఆయనవెంట రెండేపుస్తకాలు ఉండేవి. ఒకటి భగవద్గీత,రెండవది ధామస్ అకేంపిస్ రాసిన "The Imitation of Christ".స్వామికి ఇతర మతాలంటే ఏమాత్రం ద్వేషం లేదు.సర్వమత సమన్వయాన్ని బోధించిన శ్రీరామకృష్ణుని ప్రియకుమారునికి సంకుచితదృష్టి ఎలా ఉంటుంది? క్రీస్తుపైన,మహమ్మద్ పైన,బుద్ధునిపైన ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు చదివితే వారిలోని కొన్నికొన్ని వ్యక్తిత్వలక్షణాలను స్వామి ఎంతగా మెచ్చుకున్నారో మనం చూడవచ్చు.

సప్తమద్రుష్టితో శని,లగ్నాత్ చతుర్థస్థానాన్ని చూస్తున్నాడు. ఈ యోగంవల్ల ఆయన మనస్సు ఎల్లప్పుడూ ఆధ్యాత్మికభావాలతో నిండిఉండేదని తెలుస్తున్నది. అంతేకాక ఆయన పుట్టిపెరిగిన ఇంటి వాతావరణం ఉన్నతములైన ఆధ్యాత్మికభావాలతో నిండి ఉండేదని తెలుస్తున్నది. ఇక సప్తమంమీద శనియొక్క దశమద్రుష్టితో, వివాహ విముఖత్వం,ఆజన్మ బ్రహ్మచర్యం పాటించటం జరిగాయి. వాక్స్థానంలో రెండు శుభగ్రహాల స్థితివల్ల శ్రోతలను సమ్మోహపరిచే వాక్శక్తి కలిగింది. ద్వితీయ దశమ అధిపతులైన శనిబుదులపరివర్తన దీనికి బలాన్ని చేకూరుస్తూ ఆ ప్రసంగాలు ఆధ్యాత్మికశక్తితో నిండి ఉండేవని చెబుతున్నది.

ఆత్మకారకుడిగా ఉన్న సూర్యుడు లగ్నసంధిలో పడటంతో చిన్నవయసులో శరీరాన్ని విడిచి పెట్టాడు. లగ్నాధిపతి గురువు లాభస్థానంలో మరియు శనిచంద్రులు వృత్తిస్థానంలో ఉండటంతో ఆధ్యాత్మిక గురుత్వం వహించాడు.కాలస్వరూపాలైన రాహుకేతువులు నీచలలో ఉండుటవల్ల జీవితాన్ని కాలాన్ని తన లాభంకోసం కాకుండా లోకంకోసం వెచ్చించి నిస్వార్థపూరితజీవితాన్ని గడిపాడు.

గురువుయొక్క పంచమద్రుష్టి, తృతీయం మీద ఉంది. కనుక ధార్మికమైన ఉపన్యాసాలతో ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేసే ప్రజ్ఞ కలిగింది. తృతీయం వాగ్ధాటికి కారకం అని జ్యోతిర్వేత్తలకు వేరే చెప్పవలసిన పనిలేదు. సప్తమద్రుష్టి మంత్రస్థానం అయిన పంచమంలోని స్వక్షేత్ర కుజునిమీద ఉంది. పంచమకుజునివల్ల మంత్రస్థానానికి విపరీతమైన శక్తి వస్తుంది. దానిపైన గురుద్రుష్టితో, గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మంత్రస్థానానికి కలిగి త్వరితంగా మంత్రసిద్ధి నిచ్చింది. 

సాక్షాత్తు భగవంతుడే ఆయనకు గురువుగా నిలిచాడంటే ఇంక అంతకంటే అదృష్టం ఎవరికైనా ఏముంటుంది? గురువు యొక్క నవమద్రుష్టి, సమాజంతో సంబంధాలను చూపే సప్తమంమీద ఉంది. కనుక గురుదశ ప్రారంభం కావటంతోనే అమెరికావెళ్లి వేదాంతభేరి మ్రోగించి భారతదేశ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్నిలోకానికి చాటాడు. అంతేగాక సప్తమం మారకస్థానం కావటంతో గురువు లగ్నకారకత్వంతో-- లోకంలో తనపని అయిపొయింది అని తెలియటంతోనే, స్వయానా తన ఇచ్చాబలంతో యోగశక్తిద్వారా బ్రహ్మరంద్రభేదనం చేసుకొని తన స్వస్థానమైన సప్తర్షిమండలానికి ఊర్ధ్వముఖంగా మెరుపులా సాగిపోయాడు. ఇదికూడా గురుదశలోనే జరిగింది అన్న సంగతి గుర్తుంచుకోవాలి.

మంత్రస్థానంనుంచి శక్తిస్వరూపుడైన కుజుని చతుర్ధదృష్టి మార్మిక మోక్షత్రికోణములలో ఒకటైన అష్టమస్థానం పైనఉంది. దీని అర్థం వివరించవలసిన పనిలేదు. గురునిపైన కుజద్రుష్టివల్ల తనశక్తితో గురువుగా శిష్యులకు ఆత్మికఔన్నత్యాన్ని ఇవ్వగల సామర్థ్యం కనిపిస్తున్నది. ఇంకొక మోక్షత్రికోణంలో ఉన్న రాహువుమీద కుజుని అష్టమద్రుష్టివల్ల బయటకు కనిపించని గూఢమైన మార్మిక ఆత్మికఅనుభవాలు కలిగిన సిద్ధపురుషుడు అని, మానవాతీత యోగశక్తులు కలిగినవాడని తెలుస్తున్నది. 

శరీరంతో ఎక్కువగా మమేకం అయ్యి, దాని తోడే లోకంగా గడిపేవారికి లగ్నంనుంచి విశ్లేషణ బాగా సరిపోతుంది. కాని మనోజీవులకు, ఆధ్యాత్మికపరులకు, ఆలోచనా భూమికలో ఎక్కువగా కాలం గడిపేవారికి చంద్రలగ్నం నుంచి విశ్లేషణ ఇంకాబాగా సరిపోతుంది.వివేకానందస్వామి జీవితంలో కూడా, చంద్రలగ్నంనుంచి చూస్తె అధ్బుతమైన విశ్లేషణ వస్తుంది. అది మూడోభాగంలో చూద్దాం.
read more " వివేకానందస్వామి దివ్యజాతకం-2 "