“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, సెప్టెంబర్ 2014, గురువారం

షష్టి-సప్తమి-యోగజాతకుల జనన సమయం

ఒక స్నేహితురాలు అమెరికానుంచి మొన్న మాట్లాడుతూ షష్టి సప్తమి రోజులలో బాగా డిస్టర్బ్ అయ్యాననీ ఎందుకో తెలియడం లేదనీ చెప్పింది.తనకు సైకిక్ ఎబిలిటీస్ ఉన్నాయి గనుక విశ్వంలో ఒక మార్పు జరిగినప్పుడూ కొన్ని ప్రత్యెక సందర్భాలు ఖగోళంలో ఏర్పడినప్పుడూ ఇటువంటి వ్యక్తులకు అలా ఏదో తెలియని మానసిక అలజడి కలగడం సహజమే.అదే విషయం తనకు చెప్పాను.

మొన్న 14-9-14 న షష్టి రోజున ఖగోళంలో ఒక మంచి యోగసమయం వచ్చింది.అదే పరిస్థితి 15-9-2014 సప్తమి రోజున కూడా ఉన్నది.ఈ రెండురోజుల్లో మంచి యోగజాతకులు కొందరు ఈ భూమి మీద జన్మించారు.వారు ఇంతకు ముందు జన్మలలోనే ఆధ్యాత్మికంగా మంచి స్థాయిని అందుకున్న ఆత్మలు.ప్రస్తుతం ఈ జన్మలో వారికీ లోకంతో ఉన్న ఋణానుబంధాన్ని తీర్చుకోడానికి మళ్ళీ జన్మ ఎత్తారు.

గురువూ శనీశ్వరుడూ ప్రస్తుతం ఉచ్చస్థితిలో ఖగోళంలో ఉన్నారు.ఆ రెండురోజుల్లో చంద్రుడు కూడా ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు.బుధుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు.సూర్యుడు స్వక్షేత్రం లో ఉన్నాడు.కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు.కనుక నాలుగుగ్రహాలు ఉచ్ఛస్థితిలోనూ రెండు గ్రహాలు స్వక్షేత్రం లోనూ ఉన్న స్థితి ఈ రెండురోజుల్లో ఉన్నది.కనుక యోగజాతకులైనవారు భూమిపైన జన్మించడానికి ఇది చాలా మంచి సమయం.

జూలైలో గురువుగారు కర్కాటక రాశిలో ప్రవేశించారు.శనీశ్వరుడు నవంబర్లో తులారాశినుంచి పక్కకు వెళ్ళిపోతాడు.కనుక మధ్యలోని నాలుగు నెలల కాలం మాత్రమె వారిద్దరూ ఉచ్చస్థితిలో ఉంటారు.

ఈ నాలుగు నెలల్లో చంద్రుడు నాలుగుసార్లు ఉచ్చస్తితిలోకి వస్తాడు.కానీ సూర్యుడు ఆగస్ట్-సెప్టెంబర్ మధ్యలోనే సింహరాశిలో స్వక్షేత్రంలో ఉంటాడు. అలాంటి ఒక యోగకారక కాలం మొన్న ఈ రెండురోజుల్లో ఖగోళంలో వచ్చింది.

ఆ రెండు రోజులలో శనివర్గ రాశులైన మకర,వృషభ,మిధున,తులా రాశులలో జన్మించిన శిశువులు పెరిగి పెద్దవారైనప్పుడు మంచి యోగజీవితాన్ని (అంటే ఆధ్యాత్మికపరమైన జీవితాన్ని) గడుపుతారు.రాహుకేతువులు ప్రస్తుతం అనుకూల స్థితులలో లేరు గనుక వీరిది ఖచ్చితంగా ఆధ్యాత్మిక పరమైన జీవితాలే అవుతాయి గాని లౌకిక పరమైన జీవితాలు కావు. 

పైగా ఇక్కడ ఒక మర్మం ఉన్నది.

గురువూ శనీశ్వరుడూ ఇద్దరూ ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు గురువుగారి దృష్టి శనీశ్వరుని మీద ఉండదు.కానీ శనీశ్వరుని దృష్టి గురువుగారి మీద ఉంటుంది.పైగా వీరిద్దరి మధ్యన కేంద్ర దృష్టి ఉంటుంది.

కనుక అలాంటి సమయంలో పుట్టే జాతకులు లోకంతో ఆధ్యాత్మికపరమైన కర్మఋణాన్ని కలిగిఉంటారు.భోగపరమైన ఋణాన్ని కాదు.ఆ ఋణాన్ని తీర్చుకోడానికే ఈ సమయంలో వారు పుడతారు.పెద్దవారైనాక వారు ఆధ్యాత్మికంగా మంచి స్థాయులు అందుకుంటారు.లోకానికి ధర్మబోధను ఆధ్యాత్మిక బోధను గావిస్తారు.

ఈ అవకాశం గురువర్గాలలో పుట్టినవారికి లేదు.శనివర్గాలలో పుట్టినవారికే ఈ యోగాలు పడుతున్నాయి.కనుక వీరివి కర్మజాతకాలని చెప్పక తప్పదు. అంటే లౌకిక సుఖాలు అనుభవించే జాతకాలు వీరివి కావు.లోకంతో ఉన్న ఆధ్యాత్మిక ఋణాన్ని తీర్చుకోవడానికి ఈ సమయంలో ఆ జీవులు భూమిమీదకు వచ్చారు.

పైగా ప్రస్తుతం పితృదేవతలకు చెందిన మహాలయ పక్షాలు నడుస్తున్నవి. కనుక పితృలోకాలనుంచి ఈ జీవులు ఇప్పుడు భూమిమీదకు వచ్చారని నేను చెబుతున్నాను.

మొన్న ఆ రెండురోజుల్లోనూ భాద్రపద బహుళ షష్టి మరియు సప్తమి తిధులు నడిచాయి.వీరిలో మళ్ళీ షష్టినాడు పుట్టిన వారికంటే సప్తమినాడు పుట్టినవారి జాతకాలు ఎక్కువ ఆధ్యాత్మికమైన బలంతో ఉంటాయి.నేను చెప్పిన లగ్నాలలో పుట్టిన పిల్లల తల్లిదండ్రులను గమనించండి.వారిలో ఖచ్చితంగా ఆధ్యాత్మిక జీన్స్ ఉంటాయి.వారివారి వంశాలలో పాతకాలంలో మహనీయులైన వ్యక్తులు ఖచ్చితంగా ఉండి ఉంటారు.

ఈ విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదంటే,అలా చెబితే,ఆశపోతులూ ఆత్రగాళ్లైన కొందరు తల్లితండ్రులు ఆయా సమయాలకు ఆపరేషన్లు చేయించి మరీ వారివారి శిశువులను ముందే బయటకు తీయించే ప్రయత్నం కూడా చేస్తారు.నేటి ఆశపోతు ప్రజలకు ఇది సహజమే.అందుకే ఈ విషయాన్ని ముందుగా నేను వ్రాయలేదు.

సృష్టిలోని కర్మవలయాన్నీ,గ్రహప్రభావాన్నీ,మనమీద మన కంటికి కనిపించని సూక్ష్మశక్తుల ప్రభావాలనూ  గమనిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.

ఆ సమయాలలో ఆపరేషన్ ద్వారా కాకుండా సహజంగా పుట్టిన శిశువుల తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను.

ఇప్పుడు పుట్టిన మీమీ పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచండి.ఎందుకంటే,వాళ్ళు ముందుముందు మహనీయ వ్యక్తులుగా రూపుదిద్దుకోబోతున్నారు.వాళ్ళు ఎవరో కాదు.మీ పితృదేవతలలోని మహనీయులే ఇప్పుడు మీ పిల్లలుగా జన్మించారు.వారిని జాగ్రత్తగా పెంచండి.అందుకోసం ముందుగా మీమీ జీవితాలను చక్కదిద్దుకోండి.మీ పిల్లలకు చెప్పాలంటే ముందు మీరు సక్రమంగా ఉండాలన్న విషయం గుర్తుంచుకోండి.

వారి జీవితగమనంలో మీ పాత్రను సరిగ్గా పోషించి మీ జీవితాలకు కూడా సార్ధకతను తెచ్చుకోండి.

మరొక్కసారి ఆ శిశువుల తల్లిదండ్రులకు నా అభినందనలు.
read more " షష్టి-సప్తమి-యోగజాతకుల జనన సమయం "

10, సెప్టెంబర్ 2014, బుధవారం

కాశ్మీర్ వరదలు-రాబోతున్న దుర్ఘటనలకు చిన్న సూచిక మాత్రమే








































ఒక వారం క్రితమే,త్వరలో జరుగబోతున్న శనీశ్వరుని వృశ్చికరాశి ప్రవేశం గురించీ తద్వారా మానవులకు రాబోతున్న ఘోర విపత్తుల గురించీ వ్రాశాను.

రెండురోజులు కూడా గడవకముందే కాశ్మీర్లో గత ఏభై ఏళ్ళలో కనీవినీ ఎరుగనంత తీవ్రస్థాయిలో వరదలు మొదలయ్యాయి.జనజీవనం అత్యంత ఘోరంగా దెబ్బ తిన్నది.

ఇప్పటికే దాదాపు 200 పైబడి జనం చచ్చారని అంటున్నారు.ఇది ప్రభుత్వ అంచనా మాత్రమే.వాస్తవం దీనికి ఇంకా కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది.

ఇప్పటికే మన ప్రభుత్వం వెయ్యి కోట్ల సహాయాన్ని ప్రకటించింది.ఇంకొక వెయ్యి కోట్లు ఇస్తామని అంటున్నది.

అమాయకులైన కాశ్మీరీ పండిట్లను అనేక వేలమందిని నిర్దాక్షిణ్యంగా దారుణంగా చంపి,వారి రక్తాన్ని నేలపైన చిందించి,లక్షలాది కుటుంబాలను దిక్కులేనివారుగా డిల్లీ పేవ్ మెంట్ల మీద బ్రతకమని కాశ్మీరు నుంచి పారద్రోలినందుకూ,అయిదు దశాబ్దాలుగా కాశ్మీర్లో మారణ హోమాన్ని సృష్టిస్తున్నందుకూ ప్రకృతి ఈరకంగా కాశ్మీరీలకు శిక్ష విధిస్తున్నదా?

నిజమే కావచ్చు.

ప్రకృతి విధించే శిక్షలు చాలా విచిత్రంగా దారుణంగా కనిపించినా,అవి చాలా కరెక్ట్ గా పొల్లుపోకుండా ఉంటాయి.ప్రకృతి న్యాయస్థానంలో జాలి అన్నపదానికి తావు లేదు.కత్తితో ఎదుటి మనిషిని చంపినవాడు అదే కత్తితో ఒకనాటికి చావక తప్పదు.ఇది తిరుగులేని దైవన్యాయం.

ఇతరుల పట్ల జాలి లేనివారికి,తమకు ఆపద వచ్చిన సమయంలో 'భగవంతుడా జాలి చూపించు' అని అడిగే హక్కు లేదు.అప్పుడు అరిచి 'గీ' పెట్టినా భగవంతుడు పట్టించుకోడు.దారుణం అని మనకు అనిపించినా, దైవన్యాయం ఇలాగే ఉంటుంది.

అదలా ఉంచితే ఇంకొక్క నెలలో శనీశ్వరుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించ బోతున్నాడు.ముందు ముందు ప్రపంచవ్యాప్తంగా జరుగనున్న ఘోరాలకు ఈ వరదలు మచ్చుకు సూచనలా?

ఆలోచిస్తే ఇది కూడా నిజమే అని అనిపించక మానదు.

మానవులారా!! మీమీ అహంకారపూరిత ప్రవర్తనలకు తగిన శిక్షలు త్వరలో అనుభవించడానికి సిద్ధపడండి.
read more " కాశ్మీర్ వరదలు-రాబోతున్న దుర్ఘటనలకు చిన్న సూచిక మాత్రమే "

8, సెప్టెంబర్ 2014, సోమవారం

యుగ సిద్ధాంతం-1 (మనుస్మృతి)

మన పురాణాల ప్రకారం యుగాలు నాలుగని మన అందరికీ తెలుసు.

అవి-కృతయుగం,త్రేతాయుగం,ద్వాపరయుగం,కలియుగం.

కానీ మన పురాణాలలోని యుగాల లెక్కలలో చాలా గందరగోళాలున్నాయి. మన పురాణాలలో చెప్పబడిన ప్రకారం అవి కోటానుకోట్ల సంవత్సరాల నిడివిని కలిగి ఉన్నాయి.ఒ క్క కలియుగమే 4,32,000 సంవత్సరాల కాలం ఉంటుందని ప్రస్తుతం నమ్ముతున్నారు. మిగతా యుగాలు దీనికి 2,3,4  రెట్లు ఉంటాయి. అంటే,

కృతయుగం -   17,28,000 
త్రేతాయుగం -  12,96,000
ద్వాపరయుగం- 8,64,000
కలియుగం-        4,32,000
---------------------------------------
   ఒక మహాయుగం    43,20,000 సంవత్సరాలు
---------------------------------------
ఇది తార్కికమూ కాదు.సంభవమూ కాదు.ఎందుకంటే 4,32,000 సంవత్సరాల పాటు భూమిమీద కలియుగం ఉండి, దాని లక్షణాలైన అధర్మమూ అన్యాయమూ అలాగే విచ్చలవిడిగా రాజ్యం ఏలుతూ ఉంటే,ఆ కలియుగం అయిపోయేసరికి ఈ భూమ్మీద మానవులనేవారు ఒక్కరు కూడా మిగలరు.మానవులే కాదు,జంతువులూ పక్షులూ చెట్లూ కూడా మిగలవు.అన్నింటినీ మనిషి స్వాహా చేసేసి తను కూడా దురాశా రాక్షసి నోటిలో పడి ఆహుతి అయిపోతాడు.

అదీగాక మహాభారతం ద్వాపర యుగంలో జరిగిందని మనకు తెలుసు.ఆ కాలం BC 3000 అంటున్నారు.అంటే నేటికి 5000 సంవత్సరాలు అయింది.పోనీ ఈ లెక్కలూ పురాణాలూ అన్నీ ఎవరో బ్రాహ్మణులు సృష్టించిన కట్టుకధలు ,అనుకున్నా కూడా,మహాభారత యుద్ధం తరువాత కొంతకాలానికి సముద్రంలో మునిగి పోయిందని చెప్పబడుతున్న ద్వారకా నగరం గుజరాత్ తీరంలో మన కళ్ళెదురుగానే సముద్రగర్భంలో కనిపిస్తున్నది.ఆ నగరపు కట్టడాలలోనూ వాటిలో వాడిన రాళ్ళు,చెక్కలు మొదలైన వాటిలోనూ అనేక పొరలు(layers) ఉన్నాయనీ వాటి వయస్సులు 2000 BC నుంచీ 12000 BC వరకూ ఉన్నాయనీ పరిశోధకులు అంటున్నారు.

ఒకవేళ పురాణాలు కట్టుకధలు అనుకున్నా కూడా,సముద్ర గర్భంలో కనిపిస్తున్న ద్వారకానగరాన్ని ఎవరూ కాదనలేరు.మహాభారతం  నిజంగా జరిగిందనీ,శీ కృష్ణుడు శరీరంతో ఈ భూమి మీద తిరిగినది నిజమే అనీ వేల సంవత్సరాలుగా సముద్రంలో నిలిచి ఉన్న ద్వారకా నగరం తిరుగులేని రుజువును చూపిస్తున్నది.

మరి మహాభారతం 3000 BC లో జరిగి ఉంటే,అప్పుడు ద్వాపరయుగం జరుగుతూ ఉంటే,ఈ కాస్తలోనే కలియుగం ఎలా వస్తుంది?మన లెక్కల ప్రకారం ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు ఉండాలి కదా? 

కనుక ఎక్కడో ఈ లెక్కలలో ఏదో పొరపాటు దొర్లిందనేది స్పష్టం.

ఆ పొరపాటును సవరించి,ఈ లెక్కలను ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం ఎందఱో చేశారు.వారిలో కొంతవరకూ సఫలీకృతుడు అయినది స్వామి యుక్తేశ్వర్ గిరిగారు.పరమహంస యోగానందగారి గురువుగా, క్రియాయోగ సంప్రదాయపు గురువులలో ఒకరుగా ఈయన లోకానికి సుపరిచితుడే. ఆయన వ్రాసిన The Holy Science అనే పుస్తకం ఉపోద్ఘాతంలో దీనిని గురించిన వివరణను ఆయన ఇచ్చారు.

ఒక క్రియాయోగ సాంప్రదాయపు గురువుగానే ఆయన అందరికీ తెలుసు. కానీ ఆయన ఒక గొప్ప జ్యోతిష్యపండితుడన్న విషయం చాలామందికి తెలియదు.ఒక మనిషి చేతిని క్షణకాలంపాటు చూచి, ఆ మనిషి జాతకంలోని లగ్నం ఏమిటో జాతకచక్రం అవసరం లేకుండానే ఆయన ఖచ్చితంగా గుర్తించగలిగేవారు.

ఆయన చేసిన విశ్లేషణకు ఆధారంగా 'మనుస్మృతి' మొదటి అధ్యాయం నుంచి ఈ క్రింది శ్లోకాలను ఆయన ఉదాహరించారు.

శ్లో||చత్వార్యాహు: సహస్రాణి వర్షాణామ్ తు కృతం యుగమ్
తస్య తావచ్చతీ సంధ్యాం సంధ్యాంశ్చ తధావిధ:
ఇతరేషు ససంధ్యేషు ససంధ్యాంశేషు చ త్రిషు
ఏకాపాయేన వర్తన్తే సహస్రాణి శతానిచ
యదేతత్ పరిసంఖ్యాతమాదావేవ చతుర్యుగమ్
ఏతద్ ద్వాదశ సాహస్రం దేవానాం యుగముచ్యతే
దైవికానాం యుగానాంతు సహస్రం పరిసంఖ్యయా
బ్రహ్మమేక మహజ్ఞేయం తావతీ రాత్రిరేవచ

(నాల్గువేల సంవత్సరాలు కృతయుగం అనబడుతుంది.అన్ని వందల సంవత్సరాలు ఇరుసంధ్యలుంటాయి.మిగిలిన మూడు యుగాలూ కూడా అలాగే ఉంటాయి.అలా వచ్చిన మొత్తం 12,000 సంవత్సరాలు ఒక దైవయుగం అనబడుతుంది.అటువంటి దైవయుగములు ఒక వెయ్యి జరిగితే అది బ్రహ్మదేవునికి ఒక పగలు అవుతుంది.రాత్రి కూడా అదే ప్రమాణం కలిగినట్టిది)

(మనుస్మృతి 1:69-72)

దీనిప్రకారం:--

కృతయుగం -4000 సం.
దీని ముందు వెనుకల సంధికాలం -400+400=800 సం.
మొత్తం -4800 సం.

త్రేతాయుగం-3000 సం.
సంధికాలం-300+300=600 సం.
మొత్తం-3600 సం.

ద్వాపర యుగం-2000 సం.
సంధికాలం-200+200=400 సం.
మొత్తం-2400 సం.

కలియుగం-1000 సం.
సంధికాలం-100+100=200 సం.
మొత్తం-1200 సం.

కనుక ఒక మహాయుగం నిడివి
=4800+3600+2400+1200
=1200(4+3+2+1)
=1200x10
=12,000 సంవత్సరాలు

ఇక్కడ కొంత ఖగోళ గణితం ఉపయోగిద్దాం.దీని గురించిన ప్రాధమిక అవగాహన కొంత ఉన్నవారికి ఈ పదాలు అర్ధమౌతాయి.లేకుంటే ముందు ఆ పదాలను అర్ధం చేసుకుని ఆ  తర్వాత ఇది చదివితే సరిగ్గా అర్ధమౌతుంది.

మనకు తెలిసిన లెక్కల ప్రకారం,సరాసరిగా ఒక 24,000 సంవత్సరాల కాలంలో విషువు (Equinox) ఖగోళంఒక ఆవృత్తి చలనాన్ని పూర్తి చేస్తుంది.కనుక ఒక విషువత్ ఆవృత్తి జరిగే సమయానికి రెండు మహాయుగాలు అయిపోతాయి.ఇవి ఒక ఆరోహణా యుగం,ఇంకొక అవరోహణా యుగంగా ఉంటాయి.

ఖగోళంలో విషువద్బిందువు (Equinoctial point) తన తిర్యక్చలనంలో (retrograde motion) భాగంగా 0 డిగ్రీ మేషం నుంచి 180 డిగ్రీ వరకూ వెనక్కు జారడాన్ని అవరోహణా యుగంగానూ, తిరిగి అక్కడనుంచి మేషం 0 వరకూ ప్రయాణించడాన్ని ఆరోహణా యుగంగానూ భావించాలి.అవరోహణకు 12000 సంవత్సరాల కాలం పడితే మళ్ళీ ఆరోహణకు ఇంకొక 12000 సంవత్సరాల కాలం పడుతుంది.మొత్తం 24000 సంవత్సరాల కాలాన్ని ఒక మహాయుగం అనుకుందాం.

మనకు తెలిసిన నవీన మంచుయుగం 12,500 BC -10,500 BC మధ్యలో ముగిసింది.దీనికి సైన్స్ పరమైన ఆధారాలున్నాయి.

11,501 BC లో మంచుయుగం అయిపోయి మళ్ళీ జీవం భూమిమీద కదలాడటం మొదలయ్యే సమయానికి సరిగ్గా శరద్విషువత్ (Autumnal equinox) మేషం 0 లో ఉన్నదని ఆయన ప్రతిపాదించారు.అక్కడ నుంచి యుగాలు ప్రారంభం అయ్యాయనీ, అప్పటినుంచి 12000 సంవత్సరాలకు,అంటే 500 AD సమయానికి ఒక అవరోహణా మహాయుగం అయిపొయిందనీ.అక్కడనుంచి ఆరోహణా మహాయుగ ప్రమాణమైన మరొక్క 12,000 సంవత్సరాల కాలం మొదలైందనీ ఆయన వ్రాశారు.

ఆ క్రమంలో 1700 AD కి ఆరోహణా కలియుగపు 1200  సంవత్సరాల కాలం అయిపోయి అప్పటినుంచీ 2400 సంవత్సరాల నిడివి గల ఆరోహణా ద్వాపర యుగంలో మనం అడుగు పెట్టామని ఆయన సిద్ధాంతీకరించారు.దానికి రుజువులుగా ఆయన అనేక సంఘటనలను చూపించారు.

ఆయన శిష్యుడైన పరమహంస యోగానందగారు ఆ పుస్తకానికి ముందు మాట వ్రాస్తూ సంతకం చేసిన తేదీని 249 Dwapara(AD 1949) అన్నారు.

అంటే నేటికి,అంటే,2014 AD కి మనం ప్రస్తుతం ద్వాపరయుగం 314 వ సంవత్సరంలో ఉన్నామన్న మాట.

ఇదంతా నిజమే అయితే,మనం ప్రస్తుతం చదువుతున్న 'కలియుగే ప్రధమే పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే..." ఆదిగా గల నిత్యసంకల్పం అంతా శుద్ధ తప్పై కూచుంటుంది.అంటే ప్రస్తుతం ప్రతి దేవాలయంలోనూ,ప్రతి ద్విజుడూ ప్రతిరోజూ చేస్తున్న సంధ్యావందనం లోనూ చదువుతున్న సంకల్పం అంతా తప్పుల తడిక అన్నమాట.

అవునా?

అయితే,స్వామి యుక్తేశ్వర్ గిరిగారు చెప్పినది అంతా నిజమేనా? ఆయన క్రియాయోగపు గురువులలో ఒకరు. గొప్ప యోగి అయిన ఆయన చెప్పినది తప్పెలా అవుతుంది?ఆయన అబద్దం ఎందుకు చెబుతారు?

అయితే మనవాళ్ళు ప్రతిరోజూ చదివే సంకల్పం అంతా తప్పేనా?

అన్న అనుమానాలు మనందరికీ కలగడం సహజం.
read more " యుగ సిద్ధాంతం-1 (మనుస్మృతి) "

5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

రోహిణీ శకట భేదనం-5(శనీశ్వరుని కర్మక్షాళనా విధానాలు)

రోహిణీ శకట భేదనాన్ని గతంలోని కాలవ్యవధిలో గమనించడం ద్వారా మనకు ఒక విషయం అర్ధమైంది.పురాణాలలో చెప్పబడిన ఈ విషయం నిజమే.శనీశ్వరుడు రోహిణీ నక్షత్రాన్ని స్పర్శించిన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా అనేక ఉపద్రవాలూ దుర్ఘటనలూ జరిగాయి.

దీనికి కారణం ఉన్నది.

రోహిణీ నక్షత్రానికి అధిపతి ప్రజాపతి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రజలను సృష్టించేది ఆయన గనుకా ప్రజలు ఈ నక్షత్రంతో సూచింప బడుతున్నారు గనుకా,ఈ నక్షత్రాన్ని శనీశ్వరుడు పీడించినప్పుడు(అంటే దీనిమీద సంచరించినప్పుడు) ప్రజలకు వినాశం జరగడం తార్కికమే. ఎందుకంటే శనీశ్వరుడు కర్మకారకుడు.కర్మను పెంచేదీ తుంచేదీ కూడా ఆయనే.

అంతే కాదు.తనకున్న 27 మంది భార్యలలో(నక్షత్రాలలో) చంద్రునికి రోహిణీ నక్షత్రం అంటేనే అత్యంత ఇష్టం అని పురాణాలు అంటాయి.దీని వెనుక గల గూడార్ధాలను,యోగ తంత్రపరమైన అర్దాలనూ మళ్ళీ ఇంకోసారి (చెప్పాలి అనిపిస్తే) వివరిస్తాను.ప్రస్తుతానికి మాత్రం రోహిణీ నక్షత్రానికి ఉన్న ప్రత్యేకతను అర్ధం చేసుకుంటే చాలు.

కనుక అధర్మాచరణలతో అహంకారాలతో విర్రవీగుతున్న వారిని శిక్షించే పనిని శనీశ్వరుడు రోహిణీ నక్షత్రాన్ని స్పర్శించిన లేదా చూచిన ప్రతిసారీ చేస్తున్నాడు.రాహువు కుజుడు మొదలైన మిగతా గ్రహాలు కూడా ఇదే పనిని చేస్తున్నాయి.ఆయనకు సహాయపడుతున్నాయి.

సృష్టిలో ఒక లాజిక్ ఉన్నది.గ్రహాల నడకలో ఒక లాజిక్ ఉన్నది.మనిషి జీవితంలో కూడా ఒక లాజిక్ ఉన్నది.

సృష్టిలోని లాజిక్ ను 'ఋతమ్' అని వేదం పిలిచింది.మనిషి జీవితంలోని లాజిక్ ను 'కర్మ' అని చెప్పింది.గ్రహాల నడకలను 'దశలు'గా జ్యోతిశ్శాస్త్రం దర్శించింది.సృష్టిలోని సమస్తగోళాలూ ఒక క్రమంలో నడుస్తున్నాయి.అవి క్రమం తప్పితే విధ్వంసం జరుగుతుంది.అలాగే మనిషి జీవితం కూడా ఒక క్రమంలో నడిస్తే బాగుంటుంది.ఆ క్రమాన్ని తప్పితే కష్టాలు మొదలౌతాయి. విశ్వంలోనూ మనిషి జీవితంలోనూ ఉన్న ఈ క్రమాన్నీ సమతుల్యతనూ అర్ధం చేసుకునే ప్రయత్నాన్ని మహర్షులు చేశారు.

ప్రాచీనమైన ఈ పరిశోధనలోనుంచి కొన్ని శాస్త్రాలు పుట్టినవి.

సృష్టిలో ఉన్న లాజిక్ నూ,మనిషి జీవితంలో ఉన్న లాజిక్ నూ దర్శించేవే జ్యోతిష్యం,వేదాంతం,యోగం,తంత్రం మొదలైనవి.ఇవన్నీ ప్రాచీన విజ్ఞానఖనులు.వీటిని అర్ధం చేసుకోవడం వల్లా ఆచరించడం వల్లా మనిషి జీవితం పరిపూర్ణం అవుతుంది.సార్ధకం అవుతుంది.అత్యంతమైన ఆత్మసంతృప్తితో జీవితం అప్పుడు నడుస్తుంది.

ఇవన్నీ ఉబుసుపోని హాబీలు కావు.ఏమీ తోచక చెప్పుకునే పిచ్చి మాటలూ కబుర్లూ కావు.ఇవి జీవితాన్ని నడిపించే దిక్సూచులు.వీటిని అనుసరిస్తూ జీవితాన్ని చక్కదిద్దుకోవడమే జీవనవేదం.

శనీశ్వరుడు వృషభంలో మనం ప్రస్తుతం పరిశీలిస్తున్న ప్రాంతంలో ఉన్న సంవత్సరాన్ని 0 సంవత్సరం అనుకుంటే,

వృషభం-0 సం.
సింహం-7.5 సం.
వృశ్చికం-14 సం.
మీనం-24 సం.

దాదాపు కొంచం అటూఇటూగా ఆయా ఎనిమిది సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుర్ఘటనలు ఉంటాయి.అయితే,ఆయా రాశులను బట్టి ఆయా ఫలితాలులో స్వల్పమైన తేడాలు ఉంటున్నాయి.అవేంటో ఇప్పుడు గమనిద్దాం.
  • వృషభం భూతత్వరాశి గనుకా,రోహిణీ శకటంలో శనీశ్వరుడు ఏదో విధంగా ఈ రాశిని చూస్తున్నాడు గనుకా భూకంపాలు ప్రతిసారీ జరుగుతున్నాయి.
  • సింహం అగ్నితత్వ రాశిగనుక,ఆ సమయంలో అగ్ని ప్రమాదాలూ దానికి వ్యతిరేకమైన జలప్రమాదాలూ ఎక్కువగా జరిగాయి.
  • వృశ్చికం జల తత్వరాశి గనుక,ఆ సమయంలో రసాయన, జలయాన ప్రమాదాలూ తుఫాన్లూ వరదలూ ఎక్కువగా వచ్చాయి.
  • మీనం కూడా జలతత్వ రాశేగనుక ఆ సమయంలో కూడా నీరు,పెట్రోల్ మొదలైన ద్రవాలకు సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి.
మనిషి మనుగడకు కారణాలు పంచమహాభూతాలు.మనిషిని అంతం చేసేవి కూడా అవే.కనుక రోహిణీ శకటం సమయంలో భూమి,నీరు,అగ్ని, వాయువులకు చెందిన ప్రమాదాలు విస్తృతంగా జరుగుతున్నాయి. మనుషులను అంతం చేస్తున్నాయి.ఆకాశం సర్వవ్యాపకం గనుక అన్నింటికీ ఆధారంగా ఉండనే ఉంటుంది.

ఆయా సమయాలలో కూడా మనుష్యులు అందరూ చనిపోరు.ఎవరి సామూహిక కర్మ అయితే తీవ్రంగా ఉండి,పరిపక్వానికి వచ్చి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ ప్రమాదాలలో భయంకరంగా చనిపోతున్నారు.మిగతా వారికి ఏమీ అవదు.ఆ ప్రమాదాలు కూడా ఏదో శక్తి కావాలని ఎంచుకున్నట్లుగా అలాంటి మనుష్యులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోనే జరుగుతాయి.మిగతా ప్రాంతాలలో జరగవు.ఇదే సృష్టిలోని విచిత్రం.

సృష్టిలోని న్యాయం ఇదే.ఎవరెవరి తప్పులకు తగినట్లు వారివారికి శిక్షలు పడటం ఇక్కడ తప్పదు.దైవన్యాయాన్ని తప్పుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.

మన గ్రంధాలలో నిత్య,నైమిత్తిక,మహా ప్రళయాలని రకాలున్నాయి.

మహాప్రళయం అనేది ఎప్పుడో కొన్ని కోటానుకోట్ల సంవత్సరాలకు కల్పాంతంలో గాని రాదు.

నిత్యప్రళయం అనేది ప్రతిరోజూ జరుగుతూనే ఉంటుంది.ఎందఱో ఎన్నో రకాలుగా అనేక ప్రమాదాలలోగాని,విచిత్రరోగాలతో గాని,ఘోరాలలో గాని ప్రతిరోజూ చనిపోతూనే ఉంటారు.ఇది నిత్యప్రళయం.

కొన్నికొన్ని సమయాలలో జరిగే ప్రత్యేక ఘోరవిపత్తుల వల్ల సామూహిక దుర్మరణాలు జరగడం నైమిత్తిక ప్రళయం.దీనిగురించే నేనిప్పుడు పరిశోధన చేశాను.కొన్ని తిరుగులేని సూత్రాలు కనుక్కున్నాను.

గ్రహములు రాశిచక్రంలో సంచరించే సమయంలో మనుష్యుల కర్మలకు తగినట్లు వారివారికి ఆయా ఫలితాలు అందిస్తూ ప్రయాణం సాగిస్తారు.మంచికి మంచి,చెడుకు చెడు జరుగుతూ మానవ జీవితయానం సాగుతూ ఉంటుంది.తెలివైనవారు ఈ క్రమాన్ని దర్శించి వారిని వారు మార్చుకుని ధర్మానుసారం జీవితాలను దిద్దుకుంటారు.వారి కర్మ బాగుపడుతుంది. అహంతో విర్రవీగుతూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుండే వారికి కర్మ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది.వారి సమయం వచ్చినప్పుడు ఆయా ఫలితాలు ఎలా ఉంటాయో అనుభవించేటప్పుడు అర్ధమౌతుంది. అప్పుడు ఎంత ఏడిచి మొత్తుకున్నా ఏమీ ఫలితం ఉండదు.

కర్మ పెంచుకునేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది.ఉత్సాహంగా ఉంటుంది.ఎందుకంటే అనుకున్న వన్నీ అనుకున్నట్లు అయిపోతూ ఉంటాయి.కానీ ఆ క్రమంలో పెరుగుతున్న కర్మ గురించి తెలియదు.కానీ అది పక్వానికి వచ్చి అనుభవకాలం మొదలయినప్పుడు దాని బాధ ఏమిటో తెలుస్తుంది.

ఆ సమయాలలో ప్రతి మనిషీ ఇలా అనుకుంటాడు.

'నేనెవ్వరికీ హాని చెయ్యలేదు.ఏ పాపమూ చెయ్యలేదు.నాకెందుకీ శిక్ష?నేనేం తప్పు చేసానని నన్ను దేవుడు ఇలా శిక్షిస్తున్నాడు?'

ఏ పాపమూ చెయ్యకపోతే ఏ శిక్షా పడదు.శిక్ష పడిందీ అంటే పాపం చేసినట్లే లెక్క.అది ఎలాంటి పాపమో మనకు తెలియక పోవచ్చు,మనం మర్చిపోయి ఉండవచ్చు,లేదా దానిని పాపంగా గుర్తించేటంత బుద్ధి మనకు లేకపోవచ్చు.మనకు బుద్ధి లేనంత మాత్రాన ప్రకృతి బుద్ధి లేనిది కాదు.దానికి బుద్ధీ జ్ఞానమూ బాగానే ఉన్నాయి.మనం చేసిన చేస్తున్న పనులు ప్రకృతిలో చక్కగా రికార్డ్ అవుతున్నాయి.వాటికి తగిన శిక్షలు కూడా సమయం వచ్చినపుడు చక్కగా అమలు అవుతాయి.

ఆ సమయం రావడం అనేదే 'శనీశ్వరుని' అధీనంలో ఉంటుంది.ఆయన రాశిచక్రంలో చేసే ప్రయాణంలో జీవులకు ఎవరెవరి కర్మానుసారం వారికి ఆయా శిక్షలు వేస్తూ ఉంటాడు.ఆయనకేమీ పక్షపాతం లేదు.వీటిని ఎవరూ తప్పించుకోలేరు.

ఏలినాటి శని 7.5 సంవత్సరాలు,అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు,అష్టమ శని ఇంకొక 2.5 సంవత్సరాలు వెరసి 12.5 సంవత్సరాల కాలం ఆయన అధీనంలో ఉంటుంది.లగ్నమూ చంద్రలగ్నమూ వేర్వేరు అయితే దీనికి మళ్ళీ ఇంకొక 12.5 సంవత్సరాల కాలం కలుస్తుంది.సూర్య లగ్నం నుంచి ఇంకొక 12.5 కలుస్తుంది.వెరసి 30 ఏళ్ళ కాలవ్యవధిలో మన కర్మ ఇంకా పూర్తి కానే కాదు.ఈలోపల రోహిణీ శకట సమయం వస్తుంది.దానికి 8 ఏళ్ళ సమయం ఉన్నది.ఈ రకంగా చూస్తె మనిషి జీవితం మొత్తం శనిభగవానుని చేతులలోనే గడుస్తున్నది.ముగుస్తున్నదని చెప్పవచ్చు.

కర్మ చెయ్యడమూ దాని ఫలం అనుభవించడమే జీవన సారాంశం.క్లుప్తంగా చెప్పాలంటే ఇంతకంటే మనిషి జీవితంలో ఇంకేమీ లేదు.

శనీశ్వరుడు రాశిచక్రాన్ని చుట్టి వస్తూ,రోహిణీ నక్షత్రాన్ని స్పర్శిస్తున్న లేదా చూస్తున్న సమయాలలో మిగతా కర్మగ్రహాలైన రాహువు,కుజుడు కూడా రోహిణీ నక్షత్రాన్ని స్పర్శించడమో లేక దానిని వీక్షించడమో చేస్తే,అప్పుడు అది Compounding effect అవుతుంది.ఆ సమయంలో లోకులు పడే బాధలు పరమ భయంకరంగా ఉంటాయి.అంటే అలాంటి కర్మలు చేసుకున్న వారికి ఆయా సమయాలలో ఆయా కర్మలకు తగిన శిక్షలు పడతాయి.అవి "దృఢకర్మ" సమయాలు.వాటిని తప్పించడం ఎవరికీ వీలు కాదు.

అలాంటి సమయాలు మన పరిశీలనలో ఎప్పుడు వచ్చాయో గమనిద్దాం.

వృషభంలో శనీశ్వరుని స్థితిలో గమనింపబడిన సూత్రాలు:

  • 2002 లో శనిరాహువులు వృషభ రాశిలో కలసి ఉన్నారు.
  • 1972 లో శని వృషభంలో ఉన్న సమయంలో రాహువు మకరంలో ఉండి తన పంచమ దృష్టితో వృషభరాశిని వీక్షించాడు.
  • 1942 లో శని కుజులు వృషభరాశిలో కలిసి ఉన్నారు.
  • 1912 డిసెంబర్ ప్రాంతంలో శని వృషభంలో ఉన్నాడు.కుజుడు వృశ్చికం నుంచి తన సప్తమ దృష్టితో శనిని వీక్షించాడు.
  • 1883 జూలై లో శని కుజులు ఇద్దరూ వృషభ రాశిలో కలసి ఉన్నారు.
  • 1854 లో శని రాహువులు కలసి వృషభ రాశిలో ఉన్నారు.అదే సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలలో అయితే కుజుడు తులా వృశ్చిక రాశులలో ఉంటూ వీరిద్దరినీ తన అష్టమ సప్తమ దృష్టులతో వీక్షిస్తున్నాడు.
  • 1824 ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలలో వృషభంలో ఉన్న శనిని,తులా వృశ్చిక రాశులలో సంచరించిన కుజుడు వీక్షించాడు.ఫిబ్రవరి 1825 లో కుజుడు కుంభరాశిలో ఉంటూ తన చతుర్ధ దృష్టితో శనిని వీక్షించాడు.

ఈ పరిశీలనను బట్టి అర్ధమైన విషయాలు:

సూత్రం 1:--

శనీశ్వరుడు వృషభరాశిలో ఉండే 2.5 ఏళ్ళలో కుజుడు దాదాపు రెండు లేదా మూడు సార్లు ఆయనను స్పర్సిస్తాడు.అలాగే తన 4,7,8 దృష్టులతో కనీసం మూడునుంచి అయిదు సార్లు ఆయన్ను చూస్తాడు.ఆయా నెలలలో ఖచ్చితమైన ప్రపంచవ్యాప్త దుర్ఘటనలు జరిగాయి.ఇక ముందు కూడా జరుగుతాయి.

అలాగే ఆయా సమయాల్లో రాహువు కూడా ఏదో ఒక విధంగా శనిని వీక్షించడమో ఆయనతో కలసి ఉండటమో చేస్తాడు.అలాంటప్పుడు కూడా ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి.

సూత్రం 2:--

ఇదే విధమైన పరిస్థితి శనీశ్వరుడు వృశ్చికంలో ఉంటూ తన సప్తమ దృష్టితో వృషభాన్ని వీక్షించినప్పుడు కూడా కలుగుతుంది.ఆయా సమయాలలో కూడా ఈ సంఘటనలు జరిగాయి.

సూత్రం 3:--

శనీశ్వరుడు సింహ రాశిలో సంచరించే 2.5 సంవత్సరాల కాలంలో ఆయనతో బాటు కుజ రాహువుల పరస్పర స్థితి దృష్టులు రోహిణీ నక్షత్రం మీద పడిన సమయాలలో కూడా విపరీతమైన దుర్ఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి.

సూత్రం 4:--

అదే విధంగా శనీశ్వరుడు మీనరాశిలో సంచరించే 2.5 సంవత్సరాలలో కూడా కుజ రాహువుల పరస్పర స్థితి దృష్టులు వృషభరాశి మీద పడిన సమయంలో కూడా ప్రపంచవ్యాప్త దుర్ఘటనలు జరిగాయి.

కనుక పై నాలుగు సూత్రాల పరిశీలనను బట్టి ఒక మూలసూత్రాన్ని మనం క్రోడీకరించవచ్చు.

ముఖ్య సూత్రం:--

వృషభరాశి మీద శని,రాహు,కుజులలో ఎవరో ఒకరుగాని,ఇద్దరు గాని,లేక ముగ్గురూ గాని,పరస్పర సంచారం గాని, దృష్టిగానీ వచ్చిన సమయం జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయంకర నష్టాలూ దుర్ఘటనలూ జరిగి జనం వేలల్లో లక్షల్లో చనిపోతారు.తీవ్రమైన ఆస్తినష్టం జరుగుతుంది. ఇది తిరుగులేని జ్యోతిష్యసూత్రం.

దీనికి మూలం రామాయణ,మహాభారతాల్లో చెప్పబడిన 'రోహిణీ శకట భేదనం' అనబడే సూచన.

ఈ సూత్రానికి ఆధారాలుగా గత నాలుగు పోస్ట్ లలో వ్రాయబడిన ప్రపంచవ్యాప్త దుర్ఘటనలే ప్రబల సాక్ష్యాలు.ఆయా సాక్ష్యాలూ దుర్ఘటనలూ ప్రతిరోజూ జరిగే చిల్లర మల్లర సంఘటనలు కావు.ప్రతి ముప్పై ఏళ్ళ కొకసారి సైక్లిక్ గా జరుగుతున్నఅతితీవ్రమైన దుర్ఘటనలు.గత 300 ఏళ్ళలో వచ్చిన దాదాపు 28 టైం స్లాట్స్ లో లెక్కలేనన్ని సార్లు ఈ సూత్రం రుజువౌతూ వచ్చింది.వాటిల్లో ఒక pattern ఉన్నది.ఒక cyclic repetition ఉన్నది.ఆ pattern ని నేను ఈ పరిశోధనలో పట్టుకోగలిగాను.

ఈ 5 పోస్ట్ లలో నా పరిశోధనను మీ ముందు ఉంచాను.

మనకు లభించిన పై సూత్రాల ఆధారంగా 2015-16 లో రాబోతున్న రోహిణీ శకట భేదన సమయంలో ఏయే నెలలు ముఖ్యంగా అతి ప్రమాదకరములో చూద్దామా?

  • నవంబర్ 3,2014 న శనీశ్వరుడు వృశ్చికరాశిలో అడుగు పెట్టబోతున్నాడు. అప్పటినుంచి 2.5 సంవత్సరాల కాలం అక్కడే ఉంటాడు.ఆ సమయంలో ప్రజలకు మళ్ళీ మూడబోతున్నది.
  • ఫిబ్రవరి 2015 లో కుజుడు కుంభరాశిలో సంచరిస్తూ తన చతుర్ధ దృష్టితో వృషభంలో ఉన్న రోహిణీ నక్షత్రాన్ని వీక్షిస్తాడు.
  • ఏప్రిల్ 2015 లో కుజుడు మేషరాశిలో సంచరిస్తూ తన అష్టమదృష్టితో శనిని వీక్షిస్తాడు.
  • మే,జూన్  2015 నెలలలో మళ్ళీ కుజుడు వృషభరాశిలో సరాసరి రోహిణీ నక్షత్రం పైనే సంచరిస్తూ శనిని తన సప్తమ దృష్టితో వీక్షిస్తాడు.
  • అక్టోబర్ 2015 లో కుజుడు సింహరాశిలో సంచరిస్తూ శనిని తన చతుర్ధ దృష్టితో వీక్షిస్తాడు.
  • నవంబర్ 2015 లో కన్యారాశిలో కుజ రాహువులు కలుస్తారు.
  • మార్చి-సెప్టెంబర్ 2016 ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైన కాలం. ఎందుకంటే,ఒకటిన్నర నెల వ్యవధిలో రాశి మారే కుజుడు,ఆసమయంలో మాత్రం దాదాపు ఆరునెలల కాలం స్తంభన,వక్ర స్థితులలోకి ప్రవేశిస్తూ వృశ్చికంలో ఉన్న శనీశ్వరునితో కలసి ఉండబోతున్నాడు.ఆ సమయంలో వారిద్దరి భయంకరమైన సప్తమదృష్టి వృషభం మీద పడుతున్నది.కన్యారాశిలో ఉన్న రాహువు యొక్క పంచమదృష్టి కూడా ఆ సమయంలో వృషభం మీద పడుతున్నది.కనుక ఇదొక భయంకరమైన Compounding effect ను సృష్టించబోతున్నది.కాబట్టి ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా భయంకర దుర్ఘటనలు ఖచ్చితంగా జరుగబోతున్నాయని నేను ఈరోజు(ఒకటిన్నర సంవత్సరం ముందుగా) చెబుతున్నాను.కావలసిన వారు వ్రాసి పెట్టుకోండి.అవి జరిగినప్పుడు మళ్ళీ గుర్తు చేస్తాను.
  • మళ్ళీ జనవరి 2017 లో కుజుడు కుంభంలో సంచరిస్తూ తన చతుర్ధ దృష్టితో వృషభరాశిని వీక్షిస్తాడు.
  • జనవరి 26,2017 న శనీశ్వరుడు వృశ్చిక రాశిని వదలి ధనూరాశిలోకి ప్రవేశించడంతో ప్రపంచ కర్మ ప్రక్షాళనా కార్యక్రమం ఒక అంకం అప్పటికి ముగుస్తుంది.

కనుక స్థూలంగా చూస్తే నవంబర్ 2014 నుంచి జనవరి 2017 వరకూ ప్రపంచానికి గడ్డుకాలమే అని స్పష్టంగా చెప్పవచ్చు.దానికి సూచికగా మళ్ళీ ఇస్లాం తీవ్రవాదం తలెత్తుతున్న సూచనలు అప్పుడే కనిపిస్తున్నాయి చూచారా?

ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో మళ్ళీ పైన సూచించిన నెలలు అత్యంత ప్రమాదకర సంఘటనలు జరిగే సమయాలు.అవి జరిగినప్పుడు వాటిని గురించి మళ్ళీ గుర్తు చేస్తుకుందాం.

అంతవరకూ శని,కుజ,రాహుగ్రహాల అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటూ,కొత్తగా చెడుకర్మ పెంచుకోకుండా ఉంటూ,ఇప్పటికే ఉన్న గత చెడుకర్మను ప్రక్షాళనం చేసుకుంటూ జాగ్రత్తగా ఉండమని అందరికీ నా సూచన.

(సంపూర్ణం)
read more " రోహిణీ శకట భేదనం-5(శనీశ్వరుని కర్మక్షాళనా విధానాలు) "

4, సెప్టెంబర్ 2014, గురువారం

రోహిణీ శకట భేదనం-4 (శనీశ్వరుని తృతీయ దృష్టి-ఇదీ భయానకమే)

శనీశ్వరునికి తృతీయ దృష్టి కూడా ఉన్నది.

రోహిణీ నక్షత్రాన్ని ఆ దృష్టితో చూడాలంటే ఆయన మీనరాశిలో 17 వ డిగ్రీ మీద సంచారం చెయ్యవలసి ఉంటుంది.

ఆయా సమయాలు ఎప్పుడు వచ్చాయో,ఆ సమయాలలో ఏమేమి జరిగాయో గమనిద్దాం.

1) 1997-98 లో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించాడు.
  • సరిగ్గా 1997-98 లో ElNino Winter వచ్చింది.దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా మలేరియా,డెంగూ,MVE(Murray Valley Encephalitis), Rift Valley Fever,Kawasaki Disease మొదలైన వ్యాధులు విజ్రుంభించాయి.ఇండియా ఆస్ట్రేలియాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులూ మరికొన్ని దేశాలలో అతి వర్షాలూ వరదలూ కలిగాయి.ప్రపంచం మొత్తం మీద వాతావరణం మీద ఈ ఎల్ నినో ఎఫెక్ట్ అనేది తీవ్ర ప్రభావం చూపింది.
  • మన దేశంలో Uphaar Cinema Fire accident జరిగింది.డిల్లీలో ఉపహార్ అనే సినిమా హాలు తగలబడి ఆ పొగకు ఊపిరాడక లోపలున్న దాదాపు 60 మంది చచ్చారు.ఇంకొక 110 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.
  • 7-6-1997 న తంజావూర్ బృహదీశ్వరాలయంలో సంప్రోక్షణ సమయంలో జరిగిన అగ్ని ప్రమాదం(Brihadeeswarar temple fire) లో 50 మంది చచ్చారు.ఇంకొక 200 మందికి ఆ తొక్కిసలాటలో తీవ్ర గాయాలయ్యాయి.
  • 16-4-1997 న మక్కా లో జరిగిన అగ్ని ప్రమాదం(Mecca fire of 1997) లో 217 మంది చచ్చారు.ఇంకొక 1300 మంది ఆ తొక్కిసలాటలో గాయపడ్డారు.
  • 1997 Indonesian Forest fires అనే అగ్నిప్రమాదాలలో ఇండోనేషియాలోని అడవులు తగలబడి 4.5 billion dollars నష్టం వాటిల్లింది.పర్యావరణం భయంకరంగా పాడయింది.ఇటువంటి ప్రమాదాలు ఇండోనేషియాలో గత 200 ఏళ్ళలో జరగలేదు.దీనివల్ల 1997 South East Asian Haze అనే పర్యావరణ కాలుష్యం తలెత్తింది.
  • 1996-97 Australian Bush fire season వల్ల ఆస్ట్రేలియాలో దాదాపు 13 ప్రాంతాలలో తీవ్ర అగ్నిప్రమాదాలు జరిగి వందల ఎకరాలు తగలబడ్డాయి.
  • 1997 Aisin fire అనే అగ్నిప్రమాదం వల్ల Toyota Car Company కి చెందిన ప్రొడక్షన్ యూనిట్ మూతబడే పరిస్థితి తలెత్తింది.
  • 11-3-1997 న Tokaimura Nuclear Accident అనేది జరిగింది.
  • ఆ సమయంలో వచ్చిన భూకంపాలు,వరదలు,తుఫాన్లకు అయితే లెక్కే లేదు.అన్ని ప్రకృతి భీభత్సాలు ఆ సమయంలో జరిగాయి.
  • 21-3-1997 న మన దేశంలో Sangrampora Massacre అనే ఉదంతం జరిగింది.ఇస్లాం తీవ్రవాదులు సంగ్రాంపూర్ అనే ఊరిలో కాశ్మీర్ పండిట్లను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు.
  • 23-2-1997 న అమెరికాలో Empire state building shootout జరిగింది.
  • రైల్వే,రోడ్డు,జలయాన ప్రమాదాలు లెక్కలేనన్ని జరిగాయి.
  • ఆగస్ట్ 1998 లో మన దేశంలో జరిగిన Malpa Landslide దుర్ఘటనలో ఆ ఊరు మొత్తం తుడిచి పెట్టుకుపోయింది.మానస సరోవర్ యాత్రకు వెళుతున్న 70 మంది యాత్రికులు ఆ లాండ్ స్లైడ్ లో చనిపోయారు. వీరిలో నర్తకి ప్రతిమా బేడీ కూడా ఒకరు.
  • అక్టోబర్ 1998 లో స్వీడన్లో జరిగిన Gothenberg Discotheque fire సంఘటనలో 63 మంది చచ్చారు.200 మంది గాయాల పాలయ్యారు.
  • డిసెంబర్ 1998 లో Linton Bushfire అనే అగ్నిప్రమాదం జరిగి 660 హెక్టేర్ల స్థలాన్ని తగలబెట్టింది.
  • జూన్ 1998 లో Oso Complex fire అనే అగ్ని ప్రమాదం జరిగి 5185 ఎకరాల అడవిని తగలబెట్టింది.
  • 2-9-1998 న Swissair flight 111 అనే విమానం అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయింది.అందులో ఉన్న 229 మంది ప్రయాణీకులు హరీమన్నారు.
  • 14-2-1998 న Yaounde' train explosion అనే సంఘటనలో కామెరూన్ లో రెండు ఆయిల్ ట్యాంకర్ రైళ్ళు గుద్దుకొని భయంకర అగ్నిప్రమాదం జరిగింది.
  • అదే సంవత్సరంలో మన దేశంలో జరిగిన కల్తీ ఆవనూనె (1998 Delhi Oil poisoning) సంఘటనలో 60 మంది చచ్చారు.3000 మంది ఆస్పత్రి పాలయ్యారు.ఆవనూనె రాహువుకు సూచిక అన్న విషయమూ అప్పుడు శనిరాహువులు షష్టాష్టక స్థితిలో ఉన్నారనీ మరచిపోరాదు.
  • అప్పుడే అమెరికాలో 1998 United States listeriosis outbreak అనే ఫుడ్ పాయిజనింగ్ సంఘటన జరిగింది.
  • జపాన్లో శీతాకాల ఒలింపిక్స్ జరుగుతున్న సమయంలో ఫ్లూ విజ్రుమ్భించి 1998 Winter olympics flu outbreak అనే సంఘటన జరిగింది.
  • మే 1998 లో స్పెయిన్లో Acerinox accident అనబడే రేడియో ధార్మిక కాలుష్య సంఘటన జరిగింది.
  • ఆస్ట్రేలియాలో Esso Longford gas explosion అనే సంఘటనలో గ్యాస్ ప్లాంట్ ఒకటి పేలిపోయింది.
  • నైజీరియాలో 1998 Jesse pipeline explosion అనే సంఘటన జరిగింది.ఆ ప్రమాదంలో దాదాపు 200 మంది చనిపోయారు.
  • మిన్నేసోటాలో 1998 St.Cloud explosion అనే దుర్ఘటన జరిగి నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పేలిపోయింది.
  • ఇక హరికేన్లూ,టోర్నడోలూ,తుఫాన్లూ,భూకంపాలూ ఎన్నెన్ని జరిగాయో లెక్కే లేదు.అవన్నీ వ్రాస్తే అవే ఒక పది పేజీలకు వచ్చేటన్ని ఉన్నాయి.
మొత్తం మీద 1997-98 మాత్రం ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన దుర్ఘటనలు చాలా చాలా జరిగిన సమయం అని ఇవన్నీ చూస్తుంటే అర్ధమౌతున్నది.

2) మళ్ళీ 1967-68 లో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించాడు.
  • బెల్జియం లో జరిగిన L'Innovation department store fire అనే అగ్ని ప్రమాదంలో 323 మంది చనిపోయారు.
  • కాలిఫోర్నియా లోని MGM Studio లో జరిగిన 1967 MGM Vault fire అనే అగ్నిప్రమాదంలో అనేక మూకీ సినిమాల రీళ్లు కాలిపోయాయి.
  • టాస్మానియా లో జరిగిన 1967 Tasmanian Fires అనే అగ్నిప్రమాదాలలో 62 మంది చచ్చారు.దాదాపు 1000 మందికి కాలిన గాయాలయ్యాయి.దాదాపు 7000 మంది ఇళ్ళు కాలిపోయి దిక్కులేనివాళ్ళయ్యారు.
  • న్యూజీలాండ్ లో Strongman Mine అనే బొగ్గు గనిలో గ్యాస్ పేలుడు సంభవించింది.
  • యధావిధిగా భూకంపాలూ హరికేన్లూ టైఫూన్లూ చాలా జరిగాయి.
  • సముద్ర,భూ రవాణా ప్రమాదాలు లెక్కలేనన్ని జరిగాయి.
  • The inferno 1968 అనే సంఘటనలో గ్లెన్ పార్క్ అనే నైట్ క్లబ్ తగలబడిపోయింది.
  • స్కాట్లాండ్ లో జరిగిన James Watt Street fire అనే సంఘటనలో ఒక ఫర్నిచర్ ఫేక్టరీ తగలబడి పోయింది.
  • ఆగస్ట్ 1968 లో జరిగిన అగ్నిప్రమాదంలో గ్లాస్గో లోని Kelvinbridge Railway Station తగలబడి పోయింది.
  • మళ్ళీ యధావిధిగా హరికేన్లూ, టైఫూన్లూ, టోర్నడోలూ, వరదలూ, భూకంపాలూ లెక్క లేనన్ని జరిగాయి.
  • సముద్ర,రోడ్డు రవాణా ప్రమాదాలు లెక్కలేనన్ని జరిగాయి.
  • 4-4-1968 న మార్టిన్ లూథర్ కింగ్ హత్య చెయ్యబడ్డాడు.
  • 5-6-1968 న R.F.Kennedy హత్య చెయ్యబడ్డాడు.
3) మళ్ళీ 1937-38 లో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించాడు.
  • అమెరికాలో పిడుగు పడి 1937 Blackwater fire అనే దుర్ఘటనలో 1700 ఎకరాల అడవి తగలబడిపోయింది.ఇది నమ్మశక్యం గాని నిజం.
  • అమెరికాలో జరిగిన ఔషధ పాయిజనింగ్ కేసులలో ముఖ్యమైన Elixir Sulfanilamide poisoning అనేదానిలో100 మంది పైన చచ్చారు.
  • ఇంగ్లాండ్ లో జరిగిన  Holdich colliery disaster అనే దుర్ఘటనలో బొగ్గుగనిలో జరిగిన పేలుడులో 30 మంది చచ్చారు.
  • ఓహియోలో 1937 Anna Earthquake అనే అతిపెద్ద భూకంపం వచ్చింది.
  • మెక్సికోలో 1937 Orizaba Earthquake అనే భూకంపం వచ్చింది.
  • Ohio River flood అనే అతి పెద్ద వరదలో దాదాపు పది లక్షలమందికి ఇళ్ళు నాశనమయ్యాయి.500 million dollars నష్టం వాటిల్లింది.
  • యధావిధిగా సముద్ర రైల్వే ప్రమాదాలు లెక్కలేనన్ని జరిగాయి.
3) మళ్ళీ 1908-09 లో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించాడు.
  • అమెరికాలో జరిగిన Collinwood School fire అనే సంఘటనలో స్కూలు తగలబడి 175 మంది కాలిపోయి చనిపోయారు.
  • పెన్సిల్వేనియాలో జరిగిన Rhoads Opera House fire అనేది ఒక ఘోర దుర్ఘటన.ఒక చిన్న కిరోసిన్ దీపం దొర్లి ఒక మిషన్లో ఉన్న పెట్రోల్ అంటుకుని ఒపేరా హౌస్ మొత్తం తగలబడిపోయింది.ఫైనల్ డేస్టినేషన్ సినిమాలో జరిగిన సంఘటనల లాగా ఇది జరిగింది.ఈ దుర్ఘటనలో జరిగిన తొక్కిసలాటలో 171 మంది చనిపోయారు.
  • దక్షిణ ఇటలీలో వచ్చిన 1908 Messina Earthquake అనే భూకంపం అతి ఘోరమైన భూకంపాలలో ఒకటి.దీనిలో 1,23,000 మంది చనిపోయారు.
  • ఆ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 30 పైనే భూకంపాలు వచ్చాయి.
  • అమెరికాలో అప్పుడు వచ్చిన 1908 Dixie tornado outbreak చాలా ఘోరమైనది.మొత్తం అమెరికాలో 13 రాష్ట్రాలలో 29 టొర్నడో లు తలెత్తాయి.అనేకమంది చనిపోయారు.గాయపడ్డారు.ఇల్లూ వాకిలీ కోల్పోయారు.
  • మెక్సికో దేశ చరిత్రలోనే అతి పెద్ద బొగ్గు గని ప్రమాదం అప్పుడు జరిగింది.1908 Mina Rosita Vieja disaster అనే దీనిలో బొగ్గు గనిలో ఒక పేలుడు సంభవించి దాదాపు 200 మంది భూస్థాపితం అయి చనిపోయారు.
  • ఆస్ట్రేలియాలో జరిగిన 1908 Sunshine rail disaster లో 44 మంది చనిపోయారు.200 మంది గాయాలపాలయ్యారు.
  • ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18 పెద్ద ఓడలు మునిగాయి.
  • 1909 లో పర్షియా లో వచ్చిన Borujerd Earthquake లో దాదాపు 8000 మంది చనిపోయారు.
  • అదే ఏడాది ఫ్రాన్స్ లో వచ్చిన Provence Earthquake లో 2000 ఇళ్ళు ధ్వంసం అయ్యాయి.
  • అమెరికా ఇండియానా స్టేట్ లో Wabash River Earthquake అనే భూకంపం వచ్చింది.
  • అమెరికాలో అదే సంవత్సరంలో వచ్చిన 1909 Tornado outbreak లో 37 టొర్నడోలు తలెత్తాయి.ఈ ప్రభావానికి మిసిసిపి టెన్నెస్ లు ఎక్కువగా గురయ్యాయి.
  • ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ 18 ఓడలు మునిగిపోయాయి.
4) మళ్ళీ 1878-79 లో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించాడు.
  • అమెరికాలోని కనెక్టికట్ లో వచ్చిన Wallingford Tornado ఆ టౌన్ మొత్తాన్నీ ధ్వంసం చేసింది.ఆ రాష్టాన్ని తాకిన అతి విధ్వంసకరమైన టొర్నడో లలో ఇదే అతి పెద్దది.
  • హంగేరీలో వచ్చిన The great flood of Miskolc అనే వరదలో ఆ సిటీ మొత్తం ధ్వంసమైంది.అక్కడ ఎన్నో వరదలు వచ్చినా,అన్నింటిలోకీ ఇదే అతి పెద్దది.ఎక్కువ ప్రాణనష్టం కూడా దీనిలోనే జరిగింది.
  • అమెరికాలో వచ్చిన Gale of 1878 అనే హరికేన్ క్యూబా నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకూ దాదాపు పదిహేను రాష్ట్రాలను అతలాకుతలం చేసింది.
  • మన దేశంలో ఆ సమయంలో అతి తీవ్రమైన కరువు వచ్చింది.దానిపేరే The great famine of 1876-78.అప్పటి మద్రాస్, మైసూరు, హైదరాబాద్,బాంబే ప్రాంతాలలో 7 లక్షల చరదపు కి.మీ పరిధిలో రెండేళ్లపాటు అది విలయం సృష్టించింది.దాదాపు 60 లక్షల మంది ఆ కరువు దెబ్బకు చనిపోయారు.
    5) మళ్ళీ 1848-50 లో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించాడు.
    • Great gale of 1848 అనే హరికేన్ దెబ్బకు Tampa Bay area మొత్తం అతలాకుతలం అయ్యింది.
    • 1848 Marlborough Earthquake అనే భూకంపం న్యూజీలాండ్ లో విధ్వంసం సృష్టించింది.
    • 1849 Sauve's Crevasse అనే జలప్రమాదంలో మిసిసిపి నదికి వరదలొచ్చి న్యూ ఆర్లియన్స్ ను ముంచేసింది.దాని తర్వాత ఇప్పటివరకూ మళ్ళీ అలాంటి వరద రాలేదు.
    6) మళ్ళీ 1820-21 లో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించాడు.

      • ఇంగ్లాండ్ లో Holmfirth Floods అనే వరదలోచ్చాయి.ఈ వరదలు 1821 లో ఒకసారి వచ్చి మళ్ళీ శనైశ్చరుడు మీనరాశిలోకి 30 ఏళ్ళ తర్వాత వచ్చినపుడు 1852 లో ఖచ్చితంగా మళ్ళీ వచ్చాయి.
      • 1821 Norfolk and Long island hurricane అనేది వచ్చి అమెరికాలో విలయం సృష్టించింది.
      • 1821 New England Tornado Outbreak అనే దుర్ఘటనలో 5 టొర్నాడోలు తలెత్తి అమెరికాలో విధ్వంసం సృష్టించాయి.
      --------------------------------------------------------------
      ఈ విధంగా శనీశ్చరుడు మీనరాశిలో సంచరించిన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా అనేక పెద్ద పెద్ద దుర్ఘటనలు జరిగాయి.

      వీటిని క్రోడీకరించి చూడగా శనైశ్చరుడు మీనరాశిలో సంచరించిన ప్రతిసారీ ,ఈ క్రింది సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరిగినట్లు కనిపిస్తున్నాయి.
      • అగ్నిప్రమాదాలు,జల ప్రమాదాలు.
      • తుఫాన్లు,వరదలు.
      • రవాణా ప్రమాదాలు
      • భూకంపాలు
      • కరువు కాటకాలు
      • సహజ వాయువు,అణుసంబంధ ప్రమాదాలు.
      • ప్రముఖుల హత్యలు
      దీనివల్ల ఇంకొక విషయం స్పష్టంగా కనిపిస్తున్నది.

      శనీశ్చరుని దశమదృష్టి కంటే తృతీయదృష్టి విధ్వంసకరమైనది.దీనికొక కారణం కనిపిస్తున్నది.దశమ దృష్టి ఆయన యొక్క వృత్తిపరమైన కారకత్వానికి దగ్గరగా ఉంటుంది.అందుకే ఆ సమయంలో దుర్ఘటనలు జరిగినా ఇంత పెద్ద మోతాదులో జరగలేదు.తృతీయ దృష్టి సమయంలో మాత్రం మళ్ళీ వృషభరాశి స్థితి,వృశ్చిక రాశి స్థితి అంత ఘోరంగా ఈ దుర్ఘటనలు జరిగాయి.

      మొత్తం మీద రోహిణీ శకటం ఇక్కడ కూడా ఋజువైంది.

      ఖగోళంలోని- వృషభం,సింహం,వృశ్చికం,మీనం-ఈ నాలుగు రాశులలో శనిసంచార సమయాల్లో ఇప్పటివరకూ మనం గమనించిన దుర్ఘటనలను క్రోడీకరించి తులనాత్మక పరిశీలన చేస్తూ ఏమేమి నిర్ణయాలకు రావచ్చో, ఏయే సూత్రాలను ప్రతిపాదించ వచ్చో,వచ్చే పోస్ట్ లో చూద్దాం.

      (ఇంకా ఉన్నది)
      read more " రోహిణీ శకట భేదనం-4 (శనీశ్వరుని తృతీయ దృష్టి-ఇదీ భయానకమే) "

      3, సెప్టెంబర్ 2014, బుధవారం

      రోహిణీ శకట భేదనం -3(శనిగ్రహ సప్తమ దృష్టి - భయంకర విధ్వంసం)

      అన్ని గ్రహాలకున్నట్లే శనీశ్చరునకు కూడా సప్తమ దృష్టి ఉంటుంది.సప్తమ దృష్టి చాలా బలమైనది.కనుక ఆయన రోహిణీ నక్షత్రాన్ని తన సప్తమ దృష్టితో వీక్షించిన ప్రతిసారీ భూమ్మీద ఏఏ సంఘటనలు జరిగాయో చూద్దాం.

      రోహిణీ నక్షత్రాన్ని అలా సప్తమ దృష్టితో వీక్షించాలంటే ఆయన వృశ్చికరాశి 3 డిగ్రీ నుంచి 20 డిగ్రీ దాకా సంచరించాలి.గతంలో అలాంటి సందర్భాలు ఎప్పుడు జరిగాయో గమనిద్దాం.

      అదీగాక-- ఈ పరిశోధనకు ఇంకొక ప్రాముఖ్యత ఉన్నది.

      శనీశ్చరుడు ఇంకొక ఆరేడు నెలలలో అంటే 2015 లో వృశ్చికరాశిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రాంతంలోకి అడుగుపెట్ట బోతున్నాడు,అక్కడ నుంచి రోహిణీ నక్షత్రాన్ని వీక్షించబోతున్నాడు.కనుక ఇంకొక ఏడాదినుంచి రెండేళ్ళ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఘోరమైన విపత్తులు మళ్ళీ జరుగబోతున్నాయని ఖచ్చితంగా ఊహించవచ్చు.

      అవి ఎలా ఉంటాయో, ఏ ఏ రకాలుగా ఆ విధ్వంసం జరుగనుందో గతాన్ని గమనిస్తే మనం చక్కగా అర్ధం చేసుకోవచ్చు.

      ఇప్పుడు మన పరిశోధన ప్రారంభిద్దాం.

      1) 1985 నవంబర్ నుంచీ 1987 జనవరి వరకూ శనీశ్చరుడు సప్తమ దృష్టితో రోహిణీ నక్షత్రాన్ని వీక్షించాడు.
      • 26-4-1986 న ప్రపంచంలోనే అతి ఘోరమైన "చెర్నోబిల్ న్యూక్లియర్ యాక్సిడెంట్" జరిగింది.అతి వినాశకరమైన విధ్వంసాలలో ఇదొకటి.
      • అప్పుడు జరిగిన నూక్లియర్ రియాక్టర్ పేలుడులో అణు ధార్మిక రేణువులు రష్యా యూరప్ ల మీద విచ్చలవిడిగా వెదజల్లబడ్డాయి.
      • తత్ఫలితంగా ఆ దగ్గరలోనే ఉన్న 'ప్రిప్యాట్' అనే నగరం పూర్తిగా పాడుపెట్టబడింది.
      • అణుధార్మిక రేణువుల ఫలితంగా అక్కడి ప్రజలకు వచ్చిన థైరాయిడ్ కేన్సర్లూ ఇతర రోగాలూ లెక్కలేనన్ని ఉన్నాయి.ఆ వివరాలన్నీ నేను మళ్ళీ వ్రాయనవసరం లేదు.కావలసిన వారు ఇక్కడ చూడండి.
      • ఆ సమయంలో విచిత్రంగా,రకరకాల దేశాలలో కొన్ని హోటళ్ళు మాత్రమే తగలబడ్డాయి.
      • Dupont Plaza Hotel arson అనే హోటల్ అగ్నిప్రమాదం అప్పుడే జరిగింది.ఇది ప్యూర్టోరికా చరిత్ర లోనే అతి పెద్దది.
      • నార్వే లో Hotel Caledonian fire అనేది అప్పుడే జరిగింది.
      • స్విట్జర్లాండ్ లో Sandoz chemical spill అనబడే భయంకర పర్యావరణ ప్రమాదం జరిగింది.రసాయన ప్రమాదాలలో ఇది చెప్పుకోదగ్గ ప్రమాదం.
      • 1986 లో లెక్కలేనన్ని హరికేన్లూ,టైఫూన్లూ,భూకంపాలూ,వరదలూ వచ్చాయి.
      • 1987 Daxing'anling wildfire అనే అగ్నిప్రమాదం చైనాలో వచ్చి దాదాపు 25 లక్షల ఎకరాలను తగలబెట్టింది.ఆ మంటలు ఒక నెలపాటు అలా మండుతూనే ఉన్నాయి.
      • లండన్ అండర్ గ్రౌండ్ స్టేషన్లో జరిగిన King's cross fire అప్పుడే జరిగింది.
      • 1987 లో హర్యానాలో Punjab Killings జరిగాయి.రెండు బస్సులలో పోతున్న హిందువులను కిందకు దించి వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేశారు ఖలిస్తాన్ కమెండో ఫోర్స్ కు చెందిన తీవ్రవాదులు.
      • బ్రెజిల్ లో Goiania accident అనబడే రేడియో ధార్మిక విపత్తు జరిగింది.
      • న్యూజెర్సీ న్యూయార్క్ లలో The Syringe tide అనబడే విచిత్రమైన పర్యావరణ ప్రమాద సంఘటన అప్పుడే జరిగింది.ఆ సందర్భంలో,వాడిపారేసిన సిరెంజిలూ,మెడికల్ వేష్టూ,చెత్తా చెదారాలు సముద్రపు బీచ్ లలోకి కొట్టుకుని వస్తే,అట్లాంటిక్ బీచ్ లన్నింటినీ మూసివెయ్యవలసిన పరిస్థితి తలెత్తింది.
      • ఫిలిప్పైన్స్ ని వరుసగా మూడు టైఫూన్స్ ఎటాక్ చేశాయి.
      • న్యూయార్క్ రాష్ట్రంలో స్కోహారీ క్రీక్ బ్రిడ్జి అనే రోడ్డు రవాణా బ్రిడ్జి కూలిపోయింది.
      • ఇక మామూలుగా వచ్చే వరదలూ భూకంపాలూ వగైరాలు వ్రాయ దలుచుకోలేదు.అవి అమెరికాలోనే చాలా జరిగాయి.పెద్దపెద్ద ప్రమాదాలనే నేను లెక్కలోకి తీసుకున్నాను.చిన్నచిన్న వాటిని లెక్కలోకి తీసుకోలేదు.
      2) మళ్ళీ 1956 -1957 లలో శనీశ్చరుడు వృశ్చిక రాశిలో సంచరిస్తూ తన సప్తమదృష్టితో రోహిణీ నక్షత్రాన్ని వీక్షించాడు.
      • నార్వే లో అతి పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది.దానిని Dalsenget fire అంటారు.ఒక ట్రాం డిపో మొత్తం తగలబడి అందులో ఉన్న ట్రాములు అన్నీ కాలిపోయాయి.
      •  టెక్సాస్ రాష్ట్రంలో McKee refinery fire అనే అగ్నిప్రమాదం జరిగింది.ఇది అమెరికాలో జరిగిన అతి పెద్ద అగ్ని ప్రమాదాలలో ఒకటి.ఇందులో విచిత్రం ఏమంటే అరమిలియన్ గ్యాలన్ల పెంటేన్ హేక్సేన్ వాయువులున్న ట్యాంకులు దీనిలో తగలబడిపోయాయి.
      • పాదరస విషప్రభావం వల్ల వచ్చే ఘోరమైన Minamata disease అనే రోగం జపాన్లో కనిపించింది.కెమికల్ ఫేక్టరీ లలోనుంచి వచ్చిన వేస్ట్ వాటర్ దగ్గరలోనే ఉన్న సముద్రంలో కలవడం వల్ల ఈ పొల్యూషన్ వ్యాపించి దాదాపు 36 ఏళ్ళ పాటు కుక్క,పిల్లి,పంది,మనిషి అందరినీ చంపుతూ వచ్చింది.పిల్లుల్లో ఈ వ్యాధి తీవ్రంగా ఉండేది.అందుకనే దానిని "డాన్సింగ్ కేట్ ఫీవర్" అనేవారు.
      • అట్లాంటిక్ పసిఫిక్ ప్రాంతాలలో మొత్తం 9 హరికేన్లూ టైఫూన్లూ వచ్చాయి.
      • గుజరాత్ లోని అంజార్ లోనూ,దక్షిణ లెబనాన్లో లోనూ, నికారాగ్వా లోనూ,బర్మా Sagaing లోనూ భూకంపాలు వచ్చాయి.వీటిలో బర్మా భూకంపం పెద్దది.
      • ఆస్ట్రేలియాలో Murray river flood అనేది వచ్చి మూడు రాష్ట్రాలలోని అనేక నగరాలను ముంచింది.
      • వీటన్నిటి కంటే కూడా అమెరికాలో వచ్చిన 1956 Tornado outbreak చాలా విధ్వంసకరమైనది.దీనిలో మొత్తం 47 టొర్నడోలు పుట్టి అమెరికా లో మహావిధ్వంసం సృష్టించాయి.
      • అలబామా రాష్ట్రంలో వచ్చిన 1956 Alabama tornado కూడా ఘోరమైనదే.
      • అదే 1957 ని "టొర్నడో సంవత్సరం" అని పిలవవచ్చు.ఆ సంవత్సరంలో అమెరికాని దాదాపు 203 టొర్నడోలు ఊపి పారేశాయి.
      • 1957 లో స్పెయిన్ లో Valencia flood అనేది వచ్చింది.
      3) మళ్ళీ 1926 -1927 లలో శనీశ్చరుడు వృశ్చికరాశిలో సంచరిస్తూ తన సప్తమదృష్టితో రోహిణీ నక్షత్రాన్ని వీక్షించాడు.
      • 1926 ని భూకంపాల సంవత్సరం గా చెప్పుకోవచ్చు.ఆ ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 80 భూకంపాలు వచ్చాయి.కానీ పెద్దగా జననష్టం జరగలేదు.ఇక్కడ గమనించవలసిన ఒక విచిత్రం ఏమంటే ఆ సంవత్సరంలో గురువు శనిక్షేత్రంలో నీచస్థితిలో ఉన్నాడు.కుజుడు వక్రస్తితిలో స్తంభనస్థితిలో మేషరాశిలో చాలాకాలం ఉన్నాడు.
      • 1926 లో Louisiana hurricane అనేది అమెరికాలో వచ్చి అక్కడి గల్ఫ్ కోస్ట్ లో చాలా విధ్వంసం చేసింది.
      • ఇక 1927 లో చూస్తే అప్పుడొచ్చిన The great Mississipi flood అనేది అమెరికా చరిత్రలోనే అతి పెద్ద వరద.అదోచ్చినప్పుడు 27,000 చదరపు మైళ్ళ మేర 30 అడుగుల నీటితో ముంచి పారేసింది.
      • మన దేశంలో 1927 Nagpur riots జరిగాయి.నాగపూర్లో లక్ష్మీపూజ సందర్భంగా హిందూ ముస్లిం గొడవలు తలెత్తి అది చిలికి చిలికి గాలివానగా మారింది.
      4) మళ్ళీ 1897 -1898 లలో శనీశ్చరుడు వృశ్చికరాశిలో సంచరిస్తూ తన సప్తమదృష్టితో రోహిణీ నక్షత్రాన్ని వీక్షించాడు.
      • 1897 లో అస్సాంలో వచ్చిన భూకంపం(The great Assam Earthquake of 1897) మన దేశచరిత్రలోనే అతి పెద్దది.దాని విధ్వంసం చూస్తే దిగ్భ్రమ కలుగుతుంది.బర్మా నుంచి డిల్లీ వరకూ 6.5 లక్షల చదరపు కి.మీ పరిధిలో ఈ భయంకర భూకంపం వచ్చింది.ఇది చేసిన ఆస్తి నష్టానికి లెక్కే లేదు.
      • నార్త్ డకోటాలో Red river flood అనేది వచ్చింది.
      • చైనాలో Yellow river flood అనే అతి పెద్ద వరద వచ్చింది.
      • 1898 Fort Smith Arkansas Tornado అనేది సంభవించి అమెరికాలో అనేక ఇళ్ళను నేలమట్టం చేసింది.
      • Portland gale అనేది విజ్రుమ్భించి న్యూ ఇంగ్లాండ్ తీరాన్ని ధ్వంసం చేసింది.ఆ కార్యక్రమంలో SS Portland అనే ఓడను అది ముంచి పారేసింది. 
      5) మళ్ళీ 1868 -1869 లలో శనీశ్చరుడు వృశ్చికరాశిలో సంచరిస్తూ తన సప్తమదృష్టితో రోహిణీ నక్షత్రాన్ని వీక్షించాడు.
      • 1868 Arica Earthquake అనేది పెరూ దేశంలో అప్పుడే సంభవించింది.దాని ప్రభావంతో పసిఫిక్ సముద్రంలో సునామీ వచ్చి హవాయ్,జపాన్, న్యూజీలాండ్ వరకూ దాని ప్రభావం చూపింది.
      • 1868 Equador Earthquakes అప్పుడే వచ్చాయి.వాటి ప్రభావంతో దాదాపు 70,000 మంది చనిపోయారు.
      • 1868 Hawaii Earthquake అనేది ఇప్పటివరకూ ఆ ద్వీపాల చరిత్రలోనే అతి పెద్ద భూకంపం.దాని ప్రభావం ఇప్పటికీ అక్కడనుంచి పోలేదంటే అదెంత భయంకరమైన భూకంపమో అర్ధం చేసుకోవచ్చు.
      • 1868 Hayward Earthquake (The Great San Francisco Earthquake) అనేది అప్పుడే వచ్చింది.హేవార్డ్ అనే టౌన్ ధ్వంసమైంది.
      • బ్రిటన్ లో Abergele rail disaster అనే రైల్వే ప్రమాదం అపుడే జరిగింది.అప్పట్లో బ్రిటన్లో అది అతిఘోరమైన రైలు ప్రమాదంగా రికార్డ్ చెయ్యబడింది.
      • 1869 లో The great fire of whitstable అనే భయంకర అగ్ని ప్రమాదం బ్రిటన్లో జరిగింది.
      • న్యూజీలాండ్ లో Christchurch Earthquake అనేది అప్పుడే వచ్చింది.
      • 1868-69 లలో జరిగిన సముద్ర ప్రమాదాలూ రవాణా ప్రమాదాలూ కావాలనే వ్రాయడం లేదు.అవి చాలా ఉన్నాయి.
      • 1868 లో మనదేశంలో అహమదాబాద్ లో భూకంపం వచ్చింది.
      • The great Rajputana famine of 1869 అనే భయంకర కరువు రాజస్థాన్ పంజాబ్ ప్రాంతాలలో తలెత్తి దాదాపు 5 కోట్ల మందిని హింసించింది.
      6) మళ్ళీ 1838 -1839 లలో శనీశ్చరుడు వృశ్చికరాశిలో సంచరిస్తూ తన సప్తమదృష్టితో రోహిణీ నక్షత్రాన్ని వీక్షించాడు.
      • రోమానియా లో Vrancea Earthquake అనే భూకంపం వచ్చింది.
      • సముద్ర ప్రమాదాలాలలో రెండు యుద్ధనౌకలు మునిగిపోయాయి.
      • మన దేశంలో Agra famine of 1837-38 అనబడే భయంకరమైన కరువు వచ్చి దాదాపు 80 లక్షల మందిని హింసించింది.వారిలో దాదాపు 8 లక్షలమంది ఆకలితో మాడి చచ్చిపోయారంటే అదెంత భయంకరమైన కరువో అర్ధం చేసుకోవచ్చు.
      • 1839 లో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కళింగపట్నం ఓడరేవులో అతిపెద్ద భయంకర తుపాను విజ్రుమ్భించి దాదాపు 3 లక్షల మందిని కబళించింది.దీనినే 1839 Coringa Cyclone అంటారు.
      ఇప్పటి వరకూ చూచిన సంఘటనలు చాలు.

      ఇక వెనక్కు పోవడం అనవసరం.ఎందుకంటే,150 సంవత్సరాల పరిధిలో గనుక మనం గమనిస్తే ప్రతి 30 ఏళ్ళకొకసారి ఈ సంఘటనలు మళ్ళీ మళ్ళీ దర్శనం ఇస్తూనే ఉన్నాయి.

      ఈ పరిశీలన వల్ల ఇంకొక విషయం స్పష్టంగా దర్శనం ఇస్తున్నది.

      రోహిణీ నక్షత్రంలో శనైశ్చరుడు సంచరించినప్పుడు ఎంత విధ్వంసం జరిగిందో సరిగ్గా దానికి ఎదురుగా ఉన్న వృశ్చికరాశిలో సంచరించినప్పుడు కూడా అంతే విధ్వంసం జరిగింది.సప్తమదృష్టి చాలా బలమైనది అని ముందే చెప్పినాను. ఇది దృష్టి అయినా,స్థితి అంత బలంగా పని చేసింది.

      సప్తమ దృష్టి పరంగా గమనించదగ్గ కొన్ని అంశాలు:--
      • రేడియో యాక్టివ్ అణుధార్మిక పదార్ధాలు,కెమికల్స్,గ్యాస్ మొదలైన వాటికి సంబంధించిన ప్రమాదాలు వీటిలో అధికంగా జరిగాయి.
      • తర్వాత స్థాయి భూకంపాలది.ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద భూకంపాలు ఆ సమయాలలో వచ్చాయి.
      • ఆ తర్వాత స్థాయి వరదలు తుఫాన్లది.ఈ తుఫాన్లలో ఎక్కువ శాతం అమెరికాలో వచ్చాయి.ఎక్కువగా నష్టపోయింది కూడా ఆ దేశమే.
      • ఆ తర్వాత స్థాయి కరువు కాటకాలది.ఇంతకు ముందు జరిగిన సంఘటనలలో కరువు కాటకాలు లేవు.కానీ శనైశ్చరుడు వృశ్చిక రాశిలో సంచరించిన సమయంలో అవి కనబడ్డాయి.అప్పట్లో మన దేశంలో పరిపాలన ఒక దారీ తెన్నూ లేకుండా ఉన్నది గనుక,ఆహారపధకాలూ ప్లానింగూ లేవు కనుక కరువులు వచ్చాయి.
      మళ్ళీ మనకు అతి దగ్గరగా 2015-16 లలో శనీశ్చరుడు వృశ్చికరాశిలో సంచరించ బోతున్నాడు.ఆయా సంఘటనల ఋజువుల దృష్ట్యా, పైన వ్రాసిన వాటిలో కొన్నైనా ఈసారి కూడా ఖచ్చితంగా జరుగుతాయని ఊహించవచ్చు.

      (ఇంకా ఉన్నది)
      read more " రోహిణీ శకట భేదనం -3(శనిగ్రహ సప్తమ దృష్టి - భయంకర విధ్వంసం) "