“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, జూన్ 2022, బుధవారం

కన్హయ్యా లాల్ హత్య - ముస్లిం దేశాలు మాట్లాడవేంటి? మేధావులు మాట్లాడరేంటి?

రాజస్థాన్ లోని ఉదయపూర్ లో కన్నయ్యా లాల్ అనే పేద టైలర్ని ఇద్దరు ముస్లిం రాక్షసులు కిరాతకంగా గొంతు నరికి చంపేశారు. కారణం? నూపుర్ శర్మను సపోర్ట్ చేస్తూ అతను పేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ !  

అంతేకాదు ! ఆ హత్యను వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టి, ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు !

చాలా బాగుంది కదా !

పైగా, ఇస్లాంపైన జరిగిన దాడికి ప్రతీకారంగా ఈ పని చేస్తున్నామని వాళ్ళు చెప్పారు.

విచిత్రంగా, ఇప్పుడు ఒవైసీ ఏమీ మాట్లాడడు. గల్ఫ్ దేశాలైన, కతార్, ఇరాన్, కువైట్, బహ్రెయిన్, ఒమాన్, ఇరాక్, లిబియా, టర్కీలు ఏమీ మాట్లాడవు. మానవహక్కుల సంఘాలూ, కమ్యూనిస్టులూ, మేధావులూ, శాంతిదూతలైన క్రైస్తవులూ, ఎవరూ ఏమీ మాట్లాడరు. ఇది వాళ్లకు చాలా మానవత్వం ఉన్న చర్యగా, చాలా మంచిపనిలాగా కనిపిస్తుంది !

కన్నయ్యా లాల్ కి మాత్రం తన అభిప్రాయాలను శాంతియుతంగా వ్యక్తీకరించే హక్కు లేదు. ఈ ఇద్దరు ముస్లిమ్స్ కి మాత్రం సాటిమనిషిని మెడ నరికి చంపేసే హక్కు ఉంది.

షరియా న్యాయం ఇలా ఉంటుందేమో? భలే ఉంది కదూ !

మనం ఇండియాలో, ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నామా? లేక ఆటవిక షరియా అమలులో ఉన్న రాతియుగపు అరేబియాలో బ్రతుకుతున్నామా?

ఈలోపల బెంగాల్ ఇమామ్స్ అసోసియేషన్ పెద్దలొచ్చి, 'ఇది చాలా పాపం. సాటి మనిషిని చంపడాన్ని ఇస్లాం ఒప్పుకోదు. ఎవరో ఇద్దరు చేసిన పనికి ఇస్లాంను దూషించడం తప్పు' అని గొప్ప స్టేట్ మెంట్ ఇచ్చారు.

అవునా? నిజంగా?

మీ మాటే నిజమైతే, ఇస్లాం మూలపురుషులందరూ పాపులే కదా? ఇస్లాం చరిత్రే రక్తసిక్తమైన చరిత్ర. స్వయానా మహమ్మద్ ప్రవక్త కొన్ని వేలమందిని తన కత్తికి బలిచేశాడు. ఆయన మామగారు, అల్లుడు, అనుచరులూ ఒక్కొక్కరూ వేలాదిమందిని చంపేశారు. సుల్తానులందరూ యుద్ధాలలో లక్షలాదిమందిని చంపేశారు. భూమిని మానవరక్తంతో తడిపారు. ఇస్లాం ప్రకారం సాటిమనిషిని చంపడం పాపమైతే, మరి వీళ్లంతా చేసినది కూడా పాపమేగా?

ఒప్పుకుంటారా?

'అలాకాదు. వాళ్ళు ఇస్లాం కోసం చంపారు. అది ధర్మం' - అని మీరంటారు అంతే కదా !

అంటే, ఇస్లాం కోసం ముస్లిమ్స్ కానివారిని చంపవచ్చని ఖురాన్ చెబుతున్నది. ఆ సూరాలు మీకూ తెలుసుగా? మరి ఈ కోణంలో చూసినప్పుడు, ఈ ఇద్దరు ముస్లిమ్స్ చేసినది తప్పుకాదు. దీనినే పాకిస్తాన్ నమ్ముతున్నది. ఇతర ముస్లిం దేశాలన్నీ నమ్ముతున్నాయి. అందుకే ఖండించకుండా మౌనంగా ఉన్నాయి. అలాంటప్పుడు, మీరిచ్చిన ఈ స్టేట్ మెంట్ తప్పే కదా !

మరి, IPC ప్రకారం వీళ్ళిద్దరినీ శిక్షించడం తప్పా? రైటా? అసలు మన దేశంలో షరియా ఏంటి? మనకున్నది IPC, CRPC లే గాని, షరియా కాదు. అది ఆటవిక న్యాయం. ఏడో శతాబ్దంలో అరేబియాలో ఉండేది. 21 శతాబ్దంలో ఇండియాకూ దానికీ సంబంధం ఏమిటి?

ఎందుకీ విధంగా లోకాన్ని ఇంకా ఇంకా నమ్మించాలని చూస్తారు?

సాక్షాత్తూ ఒక దేశపు ప్రధానమంత్రికే వార్ణింగ్ ఇచ్చే స్థాయిలో ఒక కిరాణాకొట్టు నడిపేవాడూ, ఒక మసీదులో పనిచేసేవాడూ ఉన్నారు. వాళ్లకు నచ్చనివారిని నరికి చంపేస్తున్నారు. దీనిని మీ మతం సమర్ధిస్తున్నది. దానిని మీరు సమర్ధించుకుంటున్నారు. చాలా బాగుంది మీ మతం ! మేధావులు మాట్లాడరేంటి?

ఇది 21 వ శతాబ్దం. ఇంకా ఏడో శతాబ్ధాన్ని వదల్లేకుండా ఉన్నారట్టుంది మీరు. రాతియుగాన్ని దాటి కొంచం నవీనకాలం లోకి రండి. జంతువులుగా బ్రతకడం కాదు. మనుషులుగా బ్రతకడం నేర్చుకోండి.

శాంతిమతంలో ఎంత 'శాంతి' ఉందో అందరికీ తెలుస్తూనే ఉంది. రక్తం కారుతున్న మీ దైవగ్రంధాన్ని చూపిస్తూ, 'ఇది లోపల చాలా తెల్లగా ఉంటుంది' అని మీరు చెబితే నమ్మడానికి లోకం సిద్ధంగా లేదు !

read more " కన్హయ్యా లాల్ హత్య - ముస్లిం దేశాలు మాట్లాడవేంటి? మేధావులు మాట్లాడరేంటి? "

మా ఆశ్రమం మొదలైంది - 7 (గురువు - సద్గురువు)

ఆదివారంనాడు జిల్లెళ్ళమూడిలో ఉన్నపుడు వర్ధని అక్కయ్య ఒక మాటంది.

అమ్మ ఎప్పుడూ 'నేను గురువును' అని చెప్పలేదు. 'నాకు శిష్యులు లేరు అందరూ శిశువులే' అనేది. అయితే ఒక సందర్భంలో మాత్రం, ఎవరో ఏదో అడిగితే, 'నేను గురువును కాదన్నాను గాని, సద్గురువును కాదనలేదుగా?' అన్నది.

ఈ మాటను వినడంతో నాకు చాలా సంతోషం కలిగింది.

అమ్మ సాహిత్యంలో ఈ మాటను నేనెక్కడా చదవలేదు. అయితే, ఆ విధంగా చెప్పినా చెప్పకపోయినా, అమ్మ సద్గురువే అని నేనెప్పుడూ అనుకుంటాను. మాతృభావంతో, 'నేను తల్లిని మీరు నా పిల్లలు' అని అమ్మ అని ఉండవచ్చు. కానీ, ఆ విధంగా చూచినా  కూడా,తల్లిని మించిన గురువెవరుంటారు? ప్రతి మనిషికీ మొదటి గురువు తల్లే కదా !

ఇంతకీ గురువుకూ సద్గురువుకూ భేదం ఏమిటి?

దేనిని నేర్పించేవాడైనా గురువే. 'సత్' ను గురిగా చూపించేవాడే సద్గురువు.

ఇంతే ఈ మాటలకున్న భేదం.

'సత్' అంటే? 'సత్' అంటే సత్యమని, 'ఉన్నది' అని, బ్రహ్మమని అర్ధాలు. దానికి దారిచూపేవాడు సద్గురువు. అమ్మ చెప్పిన మాటలలో సత్యం తొణికిసలాడుతూ ఉంటుంది, మరి అమ్మ సద్గురువు కాకుండా ఎలా ఉంటుంది?

'సద్గురు' అని మనకి మనం పేరు పెట్టుకోవడం కాదు. అలా పెట్టుకున్నంతమాత్రాన మనం సద్గురువులం అయిపోము. 'మహాత్మా' అని ఎవరో మనకి బిరుదునిస్తే మనం మహాత్ములం అయిపోతామా? బెంగాలీలు 'చక్రవర్తి' అని పేరు పెట్టుకుంటారు. అంతమాత్రాన వారందరూ చక్రవర్తులైపోతారా? ఇదీ అంతే.

సత్యాన్ని గురిగా చూపించేవాడే సద్గురువు. అలా చూపాలంటే, ముందు అదేంటో అతనికి తెలిసి ఉండాలి. దానిని అతడు చేరుకొని ఉండాలి. అనుభవంలో తెలుసుకుని ఉండాలి. అప్పుడే ఇంకొకరికి గురిగా, గురుతుగా దానిని చూపించగలుగుతాడు.

అతని యోచనలలో, మాటలలో, చేతలలో, సత్యం తప్ప ఇంకేదీ ఉండకూడదు. అతడు సత్యస్వరూపుడై, సత్యంతో నిండినవాడై ఉండాలి.

అలాంటివాడే 'సద్గురువు' అనిన పదానికి అర్హుడు.

(ఇంకా ఉంది)

read more " మా ఆశ్రమం మొదలైంది - 7 (గురువు - సద్గురువు) "

మా ఆశ్రమం మొదలైంది - 6 (సత్యాన్వేషణ)

సత్యాన్వేషకులు చాలామంది ఏసీ రూములలో కూచుని సోషల్ మీడియాలో పోస్టులు రాస్తుంటారు. వీడియోలు చేస్తుంటారు. లేదా అమెరికాలో విలాసవంతమైన జీవితాలు గడుపుతూ, అప్పుడప్పుడూ అన్నమాచార్య కీర్తనలు పాడుకుంటూ, అదేదో గొప్ప ఘనకార్యమని భ్రమిస్తూ ఉంటారు. యూట్యూబు వీడియోలు చూసి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు.

కానీ, సత్యాన్వేషణ అనేది సుఖంతో కూడిన జీవితంతో రాదు. త్యాగాలతోనూ, కష్టాలతోనే అది వస్తుంది.

మెహర్ బాబా గారైతే, 'నీ అంతట నువ్వు ఎంతగా బాధల్ని వరిస్తావో అంతగా ఆధ్యాత్మికంగా ఎదుగుతావు' అనేవారు. స్వయానా ఆయన జీవితమంతా అలాగే గడిచింది మరి !

మొన్న శనివారం రాత్రి, ఆశ్రమ ప్రారంభానికి వచ్చిన 42 మందీ, ఆశ్రమస్థలంలోనే ఉన్నాం. పొలంలోని మట్టిలో టార్పాలిన్ పట్టనొకదానిని పరుచుకుని దానిపైనే రాత్రంతా పడుకున్నాం.  కొంతమంది కటికనేలమీద పొలం మట్టిలోనే పడుకున్నారు. ఎటు చూసినా జనసంచారం లేదు. దగ్గరలో ఉన్న పల్లెటూరికి పోవాలంటే 2 కి, మీ నడవాలి. కరెంట్ లేదు. వసతులు లేవు. సభ్యులందరూ ఏసీ రూములలో హాయిగా పడుకునేవారే. కానీ ఇక్కడ కనీసం ఫ్యాన్ కూడా లేదు. అయినా సరే, హాయిగా నీలాకాశం క్రింద గాలికి నిద్రించారు.  అందరికీ హాయిగా మంచి నిద్ర పట్టింది. వాళ్ళ ఇళ్లలో కూడా అంత హాయిగా నిద్రపట్టలేదని నాతో అన్నారు. పాములొస్తాయని, పురుగులు కుడతాయని, దొంగలొచ్చి దోచుకుంటారని ఏ భయమూ లేదు. ఆ కటికచీకట్లో రాత్రంతా హాయిగా నిద్రపోయారు. ఏమౌతుందో అనే ఆలోచనే రాలేదు. సేఫ్టీ గురించి చింతే లేదు. ఆడవాళ్ళందరినీ, దగ్గరలోని పల్లెటూరిలో మేము తీసుకున్న ఇంటికి వెళ్లి అక్కడ నిద్రించమని, పొద్దున్నే లేచి కార్లలో రమ్మని చెప్పాను, కానీ వాళ్ళు కూడా మాతోనే అక్కడే ఉంటామన్నారు. అలాగే ఉన్నారు కూడా.

ఆదివారం జిల్లెళ్ళమూడికి వెళ్ళినపుడు, వసుంధరక్కయ్యతో ఈ విషయాన్నీ చెబితే, ఆమె ఇలా అన్నారు.

'1960 లలో జిల్లెళ్ళమూడిలో కూడా అలాగే ఉండేది. ఏ వసతులూ లేవు. అమ్మ మాతోబాటే నేలమీదే పడుకునేది.  మేము అమ్మ చుట్టూ కటిక పొలాలలో నేలమీదనే పడుకునేవాళ్ళం. అమ్మ దర్శనం కోసం వచ్చిన వాళ్ళు కూడా, అలాగే మట్టిలోనే నిద్రపోయేవారు. మట్టిలోనే కూచునేవారు, ఉండేవారు. అదే మట్టిని వచ్చినవాళ్ళను ప్రసాదంగా ఇచ్చేది అమ్మ'.

'ప్రస్తుతం మా పరిస్థితీ అంతే' అన్నాను.

ఒక ఆశయం కోసం తపించేవాళ్ళు సౌకర్యాలను ఎందుకు పట్టించుకుంటారు? సుఖాలే కావాలంటే హాయిగా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఏసీల క్రింద ఉండవచ్చు కదా? పడుతూ లేస్తూ ఇంతదూరం వచ్చి, బేసిక్ సౌకర్యాలు కూడా లేనిచోట, ఇంత రిస్క్ చేసి అడవిలో ఉంటూ, ఒక మనిషిని ఇంతగా నమ్ముతున్నారంటే, ఇది సత్యాన్వేషణ కాకపోతే మరేమిటి?

జిల్లెళ్ళమూడి నుండి మా ఆశ్రమానికి తిరిగి వచ్చాక, రాత్రిపూట కూర్చొని మాట్లాడుతూ, మా వాళ్ళతో ఇలా చెప్పాను.

'మీ అందరూ అతిత్వరలో ఎన్నో అతీతానుభవాలను పొందబోతున్నారు. ఈరోజు నేను చెబుతున్న ఈ మాటను రికార్డ్ చేసి పెట్టుకోండి. దైవాన్ని మీరు ప్రత్యక్షంగా దర్శిస్తారు. అంతేకాదు, మిమ్మల్ని చూచి, ముందుముందు ఎంతోమంది నేర్చుకుంటారు. మన సాధనామార్గాన్ని గురించి తెలుసుకుంటారు. ధన్యులౌతారు. నన్ను నమ్మి, ఈరోజున మీరు పడుతున్న కష్టం వృధా కాదు. నా మాట నిజం కావడాన్ని అతి త్వరలో మీరు చూస్తారు,  మన ఆశ్రమంలో ముందుముందు ఎంతో సాధన జరుగుతుంది. మీరే చేస్తారు. ఇక్కడికి వచ్చినవాళ్లు ధన్యులౌతారు.'

తనకోసం ఇంతగా తపించేవారికి భగవంతుడు మాత్రం దూరంగా ఎలా ఉండగలడు? ఎంతకాలం ఉండగలడు? 

(ఇంకా ఉంది)

read more " మా ఆశ్రమం మొదలైంది - 6 (సత్యాన్వేషణ) "

ఈ అమావాస్య గిఫ్ట్ - వరుస దుర్ఘటనలు

ఈ అమావాస్య చాలా బహుమతులనిచ్చింది. వరుసగా చూద్దాం.

ముంబై కుర్లాలో కూలిన భవనం

27 వ తేదీన రాత్రి 11. 52 కి కుర్లాలో ఒక బిల్డింగ్ కూలిపోయింది. ప్రస్తుతానికి 19 మంది శవాలు దొరికాయి. 

టెక్సాస్ లో బార్డర్ స్మగ్లింగ్ లో 46 మంది మృతి

టెక్సాస్ బార్డర్ దాటి అమెరికాలోకి వస్తున్న ఒక ట్రక్కులో 46 శవాలు దొరికాయి. దొంగచాటుగా భూతలస్వర్గంలోకి ప్రవేశించే క్రమంలో వీళ్ళు అసువులు బాశారు.

ఉక్రెయిన్ షాపింగ్ మాల్ ను కొట్టిన మిసైల్. 10 మంది మృతి

రష్యా  వేసిన మిసైల్ ఒకటి ఉక్రెయిన్ లోని బిజీ షాపింగ్ మాల్ ని కొట్టింది. 18 మంది చనిపోయారు.  ఎంతో మంది గాయపడ్డారు.

జోర్దాన్ రేవులో క్లోరిన్ గ్యాస్ లీక్ - 12 మంది మృతి, 250 మంది అస్వస్థత

క్లోరిన్ గ్యాస్ లీక్ లో విధ్వంసం జోర్డాన్ లో జరిగింది. అకాబా పోర్ట్ లో జరిగిన ఈ సంఘటన కూడా అమావాస్య ఫలితమే.

సౌతాఫ్రికా నైట్ క్లబ్ లో 21 మంది టీనేజర్ల మృతి

టీనేజర్లందరూ కలసి తిని త్రాగి డాన్సులేసి చనిపోయారు. ఈ మిస్టరీ ఇంతవరకూ తేలలేదు.

ఉదయపూర్ లో ఇస్లామిక్ గూండాల దాడి - టైలర్ దారుణ హత్య

నూపుర్ శర్మను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ వ్రాశాడని, కత్తితో పొడిచి, గొంతుకోసి కన్నయా లాల్ అనే టైలర్ని ఉదయపూర్ (రాజస్థాన్) లో చంపేశారు ఇస్లామిక్ రాక్షసులు. పైగా దీనిని వీడియో తీసి, ఇస్లాంను కించపరిచినందుకు పగ తీర్చుకున్నామని ప్రకటించుకున్నారు.

ఇవన్నీ ఈ అమావాస్య పరిధిలోనే జరిగాయి.

read more " ఈ అమావాస్య గిఫ్ట్ - వరుస దుర్ఘటనలు "

28, జూన్ 2022, మంగళవారం

మా ఆశ్రమం మొదలైంది - 5 (జారుడు మెట్లు)

ఆదివారం నాడు జిల్లెళ్ళమూడి వెళ్ళినపుడు, అందరం హైమాలయంలో దణ్ణం పెట్టుకునే సమయంలో ఒకామె వచ్చి 'నాపేరు ఫలానా. అక్కయ్య చెప్పింది మీరొస్తున్నారని' అంటూ పరిచయం చేసుకుంది.  ఆమెకు ఏభై పైనే ఉండవచ్చు. చూడగానే మంచి అభిప్రాయం కలిగించే సంస్కారవంతమైన 'ఆరా' ఆమెలో ఉంది.

'అలాగా' అన్నాను. తర్వాత తెలిసినదేమంటే, ఆమె చిన్నపిల్లగా ఉన్నపుడు అమ్మగారికి చాలా ఏళ్ళు సేవ చేసిందని. 'పుణ్యాత్మురాలు' అనుకున్నా.

'ర' మాకు తెలుసు' అందామె.

'ఎవరామె?' అన్నాను, 

'గతంలో మీ దగ్గరకు వచ్చింది. మీరు తన గురించి వ్రాశారు కూడా. ఆమె మా బంధువే' అన్నది.

మళ్ళీ 'అలాగా' అన్నాను నిరాసక్తంగా.

మాట్లాడుకుంటూ అక్కయ్య గదికి బయల్దేరాం. అక్కడ మళ్ళీ ఇదే టాపిక్ మొదలైంది.

'తను చాలామంది గురువుల దగ్గరకు తిరిగింది' అందామె.

'ఆ మధ్య మాట్లాడినప్పుడు, తనకు జ్ఞానం లభించిందని, ఇక తెలుసుకోవలసింది చెయ్యవలసింది ఏమీ లేదన్నట్లుగా మాట్లాడింది. మీరంతా తప్పుదారిలో ఉన్నారంది. ఆ తరువాత ఏమైందో నాకు తెలీదు' అన్నాను.

'జ్ఞాని ఎప్పుడూ 'నేను జ్ఞానిని' అని చెప్పుకోడు కదా?' అన్నదామె

'అవును. ఇతరులను విమర్శించడు కూడా. అయితే, నేటి జ్ఞానులకు పుస్తకజ్ఞానమూ, యూ ట్యూబు జ్ఞానమూ తప్ప, అనుభవజ్ఞానం సున్నా కదా. అందుకే అలా ఉంటారు' అన్నాను నేను నవ్వుతూ.

'మా గురువుగారు 'విసా' గారి దగ్గర కూడా కొన్నాళ్ళు ఉంది. ఆయన చికాగో వెళ్ళినపుడు బ్రహ్మరధం పట్టింది. ఆ తర్వాత కొంతకాలానికి 'మీదంతా తప్పు' అంటూ ఇంకొకరి దగ్గరకు వెళ్ళింది. అక్కడా ఇలాగే చేసి ఇంకొక గురువు దగ్గరకు వెళ్ళింది' అందామె.

'జిల్లెళ్ళమూడిలో కూడా ఒక ఇల్లు తీసుకుంటానని మొదట్లో అనేది. అందులో తనుంటానంది. తరువాత నన్నుండమంది. చివరకి ఇల్లు తీసుకోలేదు' అంది అక్కయ్య.

'ఆ తర్వాత ఇప్పుడెవరో న్యూయార్క్ లో ఉండే ఒకామె ఫిలాసఫీ బాగా నచ్చింది తనకు. ప్రస్తుతం అందులోనే ఉన్నట్టుంది'  అందామె.

'ఆ అమ్మాయికి పిచ్చెక్కడానికి సిద్ధంగా ఉంది. వదిలెయ్యండి' అన్నాను.

'ఎందుకలా తయారౌతారు. అహమే కదా కారణం?' అడిగింది వర్ధని గారు.

'అవును. సైకలాజికల్ ఇస్యూస్ ఉంటాయి. చైల్డ్ హుడ్ ట్రామా ఉంటుంది. ఇంఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అహం ఉంటుంది. ఇవన్నీ కలసి ఇలా తయారౌతారు. తనేకాదు. నేటి సోకాల్డ్ ఆధ్యాత్మికలోకంలో లక్షలాదిమంది అలా అయిపోతున్నారు. అదంతే. దయచేసి ఆ అమ్మాయి టాపిక్ ఇక వదిలెయ్యండి' అన్నా నేను.

ఆధ్యాత్మికమార్గమంతా ఎన్నో జారుడు మెట్లతో నిండి ఉంటుంది.

'తెలుసు' అనుకునే ప్రతివాడికే ఇక్కడేమీ తెలీదు. 'తెలీదు' అనుకునే ప్రతివాడికీ ఎంతోకొంత తెలీకుండానూ పోదు. తెలిసీ తెలీకుండా ఉండటం తప్ప చాలామందికి ఇక్కడ చేసేది కూడా లేదు. అయితే,ఈ ముగ్గురికీ ఎవడి 'అహం' వాడికి ఉంటుంది. అదే వారికి అడ్డుపడుతుంది. అగచాట్ల పాలు చేస్తుంది.

నేటి సోకాల్డ్ ఆధ్యాత్మికలోకంలో పుస్తకపరిజ్ఞానం చాలా ఎక్కువగానూ, సాధనాజ్ఞానం చాలా తక్కువగానూ ఉన్నాయి. అనుభవజ్ఞానమైతే దాదాపుగా శూన్యం. అందరి పరిస్థితీ ఇంతే.

అంతా తెలుసనీ, నేర్పిస్తామనీ అనుకునేవారికి నిజానికి ఏమీ తెలీదు. అంతా వ్యాపారమే. అంతా డబ్బుమయమే. అంతా అహం ఆడించే నాటకమే.

ఈ కలియుగంలో ప్రతివాడూ గురువే. ప్రతివాడూ సాధకుడే. ప్రతివాడూ జ్ఞానే. అదే నేటి ఆధ్యాత్మికలోకపు మాయ ! ఈ మాయలో 'ర' లాంటివాళ్లు అమాయకపావులు. కానీ వాళ్ళా సంగతిని ఒప్పుకోలేరు. అలా ఒప్పుకోడానికి వాళ్ళ అహం అడ్డొస్తుంది. ఆ మాయలోనే వాళ్ళ జీవితం గడుస్తుంది. ఇలాంటివాళ్ళని చూచి జాలిపడటం తప్ప మనమేమీ చెయ్యలేం.

చాలా జీవితాలంతే ! జారుడు మెట్లమీద జారుతూ, 'మేము జారడం లేదు' అనుకోవడమూ, ఎదుటివాళ్ళని 'మీరు జారిపోతున్నారు' అనడమే ఆధ్యాత్మిక లోకంలో రివాజు. దానికి కారణం రెండుప్రక్కలా ఉంటుంది. గురువులూ అలాగే ఉన్నారు. శిష్యులూ అలాగే ఉన్నారు. గురువులేమో శిష్యులను పిచ్చోళ్ళని చేస్తున్నారు. శిష్యులేమో తాము గురువులమెప్పుడౌతాము? ఇంకొంతమందిని ఎలా పిచ్చోళ్ళని చేద్దాము? అని వేచి చూస్తూ అసహనంగా ఉన్నారు.

తనే రైటని, ఎదుటివాళ్ళు రాంగని లోకంలో అందరూ అనుకుంటున్నారు. ఆధ్యాత్మికంలో కూడా దీనికి మినహాయింపు లేదు. ఇక్కడకూడా ప్రతివాడూ 'నా పద్ధతే కరెక్ట్. నేనే రైట్' అంటాడు. ఇంతకీ ఎవరు రైటు? ఎంతవరకు రైటు? ఎవరు రాంగు? ఎంతవరకు రాంగు" రైటుకీ రాంగుకీ నిర్వచనాలేంటసలు?

 ఏంటీ గోలంతా??? 

(ఇంకా ఉంది)
read more " మా ఆశ్రమం మొదలైంది - 5 (జారుడు మెట్లు) "

మా ఆశ్రమం మొదలైంది - 4 (ముందు మానవత్వం - తరువాతే దైవత్వం)

ఆశ్రమం ప్రారంభ ఈవెంట్స్ ఫోటోలు చూశారు కదా ! అందుకే అదంతా మళ్ళీ వివరించను. ఎందుకంటే, నూరు మాటలకంటే ఒక ఫోటో ఎక్కువ చెబుతుంది కాబట్టి ! కాకపోతే కొన్ని విషయాలు చెబుతాను. చెప్పకపోతే ఇవి అర్ధం కావు కాబట్టి.

నలభై ఏళ్ళనుంచీ నేనెప్పుడూ చెప్పే మాట ఒకటుంది. అదేంటో తెలుసా?

'మానవత్వమే లేనివాడికి దైవత్వం ఎలా వస్తుంది?' అనేదే ఆ మాట.

ఆధ్యాత్మికమార్గంలో మొట్టమొదట ఉండవలసిన లక్షణం - మానవత్వం. మనిషిని మనిషిగా చూచి, మానవత్వంతో స్పందించలేనివాడికి దైవత్వం ఎన్ని జన్మలెత్తినా రాదని నేనంటాను. ఇది నామాట మాత్రమే కాదు. మహనీయులందరి మాటా ఇదే.

మా ఆశ్రమం పనిని ఒక దీక్షగా స్వీకరించి నలభై రోజులనుంచీ ఆశ్రమం దగ్గర్లోని దొడ్డవరం గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని సతీసమేతంగా ఉంటూ, ఏసీ లేకుండా, కరెంట్ మాటమాటకీ పోతుంటే, దోమలతో కుట్టించుకుంటూ, నానాబాధలూ పడుతూ కూడా, అవేమీ పట్టించుకోకుండా 'వన్ మ్యాన్ ఆర్మీ'గా పనిచేసి, ఆశ్రమానికి ఒక రూపురేఖలు తెచ్చిన ఘనుడు 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ (ఇండియా)'సెక్రటరీ శ్రీరామమూర్తి. తననూ, తన శ్రీమతినీ ఈ సందర్భంగా సత్కరించుకున్నాం. అది మా ప్రేమ మాత్రమే కాదు మా బాధ్యత కూడా.

అదే సమయంలో, మూర్తికి చేదోడు వాదోడుగా ఉంటూ, పనులలో ఎంతో సహాయం చేసిన వారిని కూడా ఈ సందర్భంలో సత్కరించాం. మనకు సహాయం చేసిన వారిని మనం ఎన్నటికీ మరచిపోకూడదు.

వాళ్ళు పనివారే కావచ్చు. డబ్బులకు పని చేసి ఉండవచ్చు. కానీ, ఆ పరిధిని దాటి ముందుకొచ్చి, మానవత్వంతో మాటసాయంతో, చెరువు త్రవ్వకంలోగాని, ఫెన్సింగ్ వెయ్యడంలోగాని, గేటు పెట్టడంలో గాని, పొలం లెవెలింగ్ చెయ్యడంలోగాని, ఇతర ఎన్నో పనులలో, మూర్తికి ఎంతో చేదోడువాదోడుగా ఉన్న హరిబాబు, రామారావు అనబడే స్థానికులను కూడా యధాశక్తిగా సత్కరించుకున్నాం. వారు మొహమాటపడ్డారు. కానీ వారిని సత్కరించుకోకపోతే అది మా ఆత్మను బాధపెడుతుంది.

అదేవిధంగా, దొడ్డవరం స్థానికుడైన వెంకటసుబ్బయ్యను కూడా కృతజ్ఞతాపూర్వకంగా సత్కరించుకున్నాం. మారుమూల పల్లెలో కమ్మవారి కుటుంబంలో పుట్టి, చదువుకుని ఒక సాఫ్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ కూడా, మన సనాతనధర్మం మీద ప్రేమతో, సంస్కృతంలో పీ.హెచ్.డీ చేస్తూ, యోగశాస్త్రానికీ, వేదంలోని అతిరుద్రానికీ గల సంబంధం పైన రీసెర్చి చేస్తున్న ఉత్తముడీయన. దొడ్డవరం గ్రామంలో మూర్తికి ఈయన ఎంతో సాయం చేశారు.  నా బ్లాగును చదివి మా సంస్థపట్ల ఆకర్షితుడైన ఈయన, వారి గ్రామం ప్రక్కనే మా ఆశ్రమం వస్తున్నదని తెలుసుకుని, వెదుక్కుంటూ వచ్చి మూర్తిని పరిచయం చేసుకుని చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అందుకని, ఈయనను కూడా సత్కరించుకున్నాం. ఎంతోమంది నేటి బ్రాహ్మణులలో లేని ఉత్తమసంస్కారం ఈయనలో ఉన్నది.

అంతేనా?

నేషనల్ హైవే మీద ఉన్న పంతులుగారి హోటల్ నుండి మాకు టిఫిన్లు, భోజనాలు తెచ్చి పెట్టే ఆటోడ్రైవర్ పేరు సుభాని. ట్రెడిషనల్ ముస్లిం వేషంలోనే ఉన్నాడు. ఆటోలో టిఫిన్లు తెచ్చి, దించి వెళ్లిపోబోయాడు. ఎందుకంటే మేం తినడానికి ఇంకా ఆలస్యం ఉంది కాబట్టి. పోబోతున్న అతన్ని ఆపి, 'ముందుగా ఈయనకు టీ ఇవ్వండి' అని ఇప్పించాను. టిఫిన్ తినమంటే, 'ఇప్పుడే తినను, అర్జన్టుగా పని మీద వెళ్ళాలి' అన్నాడు. టిఫిన్ ప్యాక్ చేసి ఇచ్చి, దారిలో తినమని అతనికి చెప్పాము. మొదట్లో ఇదేదో హిందూసంస్థ అనుకుంటూ కొంచం అదొకవిధంగా చూస్తున్న అతను, ఈ స్నేహపూర్వకచర్యతో మెత్తబడి, మాతో కలిసిపోయాడు. 'ముందుముందు మన ప్రయాణం ఎంతో దూరం ఉంది' అని అతనితో అన్నాను.

చాలాసార్లు ఇదే జరుగుతూ ఉంటుంది. ఎన్నో ఫంక్షన్స్ లో, చిన్నాపెద్దా ఎన్నో సహాయాలు చేసినవాళ్ళుంటారు. వాళ్ళు డబ్బులకే పనిచేసి ఉండవచ్చు. కానీ వారిని మనం మరచిపోకూడదు. తిండిదగ్గర అసలు మరచిపోకూడదు. 'వాళ్ళూ మనలాంటి మనుషులే, వాళ్లకూ ఆకలి ఉంటుంది' అన్న స్పృహ కార్యక్రమనిర్వాహకులతో ఉండాలి. గొప్పగొప్ప నీతులు మాట్లాడుకునే మీటింగులలో కూడా ఇలాంటి చిన్నచిన్న విషయాలను మర్చిపోతూ ఉంటారు. అక్కడే ఫెయిలౌతారు. ఈ మానవత్వకోణం లేనివారికి ఆధ్యాత్మికమనేది ఎన్ని జన్మలెత్తినా అందదని నేనంటాను.

ఆధ్యాత్మికమనేది నీ మాటలలో మాత్రమే కాదు. నిత్యజీవితంలో  నువ్వు చేసే చిన్నచిన్న పనులలో కూడా ప్రతిఫలించాలనేదే నేను బోధించే సాధనామార్గంలో ముఖ్యమైన బోధన.

మానవత్వమే లేనివారికి దైవత్వం ఎలా అందుతుంది మరి?

(ఇంకా ఉంది)
read more " మా ఆశ్రమం మొదలైంది - 4 (ముందు మానవత్వం - తరువాతే దైవత్వం) "

మా ఆశ్రమం మొదలైంది - 3 (First day events)

ఒంగోలు స్టేషన్ కు అందరం చేరుకున్నాం. మరికొందరు ఇతర రూట్లలో ఆశ్రమానికి సరాసరి వచ్చేశారు.





ముందే సిద్ధంగా ఉన్న కార్లలో ఆశ్రమానికి ప్రయాణం



ఆశ్రమద్వారం దగ్గర పూజ - ప్రవేశం








శ్రీ రామకృష్ణుల వారికి పుష్పాంజలి













దిక్పాలక నైవేద్య సమర్పణ






పంచవటి యోగాశ్రమము బోర్డు ఓపెనింగ్






ఉపాహారం సేవనం




సన్మానాలు 











మనసులోని మాటల కలబోత






























చెట్టుక్రింద సమావేశం

read more " మా ఆశ్రమం మొదలైంది - 3 (First day events) "