అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః
జ్యోతిషం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జ్యోతిషం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, మే 2025, శుక్రవారం

గురుగోచారం - మే 2025

నిన్న, గురుగ్రహం వృషభం నుండి మిధునం లోకి మారింది. తెలిసినవారికి వారి జీవితాలలో అనేక మార్పులు కనిపిస్తాయి. తెలీనివారికి ఏ బాధా లేదు.

గతంలో లాగా, రాశిఫలాలు వ్రాయదలుచుకోలేదు. కానీ ఈ గోచారాన్ని నిర్లక్ష్యం చేయలేము కూడా. అందుకే ఈ పోస్టు. దేశఫలాలు చూద్దాం.

మిధునంలో జీవకారకుని సంచారం కదా ! అమెరికాకు నూతనోత్సాహం వచ్చింది. అందుకేనేమో, 'యుద్ధాన్ని ఆపింది నేనే' అంటోంది. అంతేకాదు. ఇప్పటివరకూ టెర్రరిస్టులుగా తనే ముద్రవేసిన వాళ్ల దగ్గరకే వచ్చి మరీ గ్రూప్ ఫోటోలు దిగుతోంది. ఇప్పటిదాకా గ్లోబల్ టెర్రరిస్టులైనవాళ్లు ఉన్నట్టుండి రాత్రికి రాత్రే చాలా మంచివాళ్లై పోయారు. ఇదేం వింతో మరి?

అంతేకాదు. 'ఇండియాలో యాపిల్ ఫోన్లు తయారు చేయొద్దు' అని యాపిల్ సంస్థకు అమెరికా చెప్పింది. ఆఫ్కోర్స్ ! టిం కుక్ ఈ మాటను పట్టించుకోలేదనుకోండి. అది వేరే సంగతి ! ట్రంప్ మనల్నీ, రోగ్ దేశం పాకిస్తాన్ని ఒకే గాటన కట్టి మాట్లాడుతున్నాడు.

ట్రంప్ పక్కా వ్యాపారవేత్త. మనదేశం నుండి వేలాదికోట్ల డిఫెన్స్ డీల్స్ ఏవైనా అమెరికాకు దొరికితే హఠాత్తుగా ఇండియా ఎంతో మంచిదైపోతుంది. ప్రస్తుతం అది లేదుకదా ! అందుకని ఇప్పుడు మనం కనిపించం మరి. సహజమే !

మేషం నుండి మూడోభావంలో గురుసంచారం కదా ! పాకిస్తాన్ కు ధైర్యం తగ్గిపోతుంది. అయితే, త్వరలో రాహువు కుంభంలో లాభస్థానంలోకి వస్తాడు. అప్పటినుంచీ మళ్ళీ కుట్రలు ఊపందుకుంటాయి.  IMF (Islamic Mujahideen Fund) డబ్బులొస్తున్నాయి కదా ! వాటిని టెర్రరిస్టులకు పంచి, మళ్ళీ మన దేశంపైకి  వాళ్ళను ఉసిగొల్పుతుంది. పాకిస్తాన్ తో గట్టిగా వ్యవహరించడం ఒక్కటే దీనికి మార్గం. పొరపాటున కూడా పాకిస్తాన్ ను, బాంగ్లాదేశ్ ను నమ్మకూడదు. నమ్మితేమాత్రం వెన్నుపోటే. విశ్వాసం అనేది ఆ రక్తంలో ఉండదు. 

మకరం నుండి శత్రుభావంలో గురుసంచారం గనుక, మనకు శత్రుబాధ ఉన్నప్పటికీ అది బాగా అదుపులో ఉంటుంది. మోదీగారి సమర్ధవంతమైన నాయకత్వమే దీనికి కారణం. మోడీవంటి కళంకం లేని దేశభక్తుడు మనకు PM గా ఉండటం మన అదృష్టం అన్నది ఎంతమంది గ్రహిస్తారో మరి !

బయట చూద్దామంటే టర్కీ, చైనా, పిల్లదేశం అజర్ బైజాన్ లు మాత్రమే మనకు శత్రువులు. కానీ దేశజనాభాలో దాదాపు 40 శాతం మన శత్రువులే. బయటివారికంటే లోపలివాళ్లే చాలా ప్రమాదం. మన దేశంలో ఉంటూ 'జై పాకిస్తాన్' అన్నాడంటే వాడిని వెంటనే మోసుకెళ్లి పాకిస్తాన్ బార్డర్లో పారెయ్యాలంతే. పోలీసులు, కోర్టులు ఏవీ ఈ విషయంలో కల్పించుకోకూడదు.  లేదంటే ప్రస్తుత ఇజ్రాయెల్ పరిస్థితి ముందుముందు మనకు కూడా వస్తుంది.

గుంటనక్క టర్కీని ఆర్ధికరంగంలో బహిష్కరించడం చాలా మంచిపని. వీలైతే చైనాను కూడా అదే చెయాలి. ఆర్ధికరంగంలో దెబ్బ కొడితేనే ఎవడైనా మాట వినేది. మంచిమాటలు ఇలాంటివాళ్ల దగ్గర పనిచేయవు.

లేకపోతే, అతిమంచితనం చేతగానితనం అవుతుంది. విశ్వాసం లేని కుక్కలకు మంచితనం ఎందుకు చూపించాలి? దేశంకంటే ఏదీ ఎక్కువ కాదు కదా !

read more " గురుగోచారం - మే 2025 "

11, ఏప్రిల్ 2025, శుక్రవారం

చెప్పేది చెయ్యకు

మెదడుకు శస్త్రచికిత్స చేయించుకున్న గురువుగారు

ఆరోగ్యసూత్రాలు చెబుతున్నారు

అణువులు గంతులేస్తున్నారు


యోగాను భక్తులకు బోధించే ఇంకో గురువుగారు

తనేమో జిమ్ము చేస్తున్నారు

పరమాణువులు పల్టీలు కొడుతున్నారు


చెప్పేది చెయ్యమని శాస్త్రంచెబుతోంది

చెప్పేది చెయ్యక్కర్లేదని  వీరంటున్నారు

కలియుగంలో ఇలాగే ఉంటుందని నేనంటున్నాను

అణువులూ పరమాణువులూ వర్ధిల్లండి !

read more " చెప్పేది చెయ్యకు "

24, ఆగస్టు 2024, శనివారం

మా 67 వ పుస్తకం 'భారతీయ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రము' విడుదల

మా 67 వ పుస్తకంగా 'భారతీయ జ్యోతిష్య సంఖ్యాశాస్త్రము' నేడు విడుదల అవుతున్నది. ఇది నా జ్యోతిష్యశాస్త్ర పరిశోధనలో వెలుగుచూచిన న్యూమరాలజీ విధానం.

'సంఖ్యాజ్యోతిష్యం' అంటే బాగుంటుంది కదా? అని కొందరు సందేహం వెలిబుచ్చారు. అనడానికి, వినడానికి బాగానే ఉంటుంది. కానీ, జ్యోతిష్యశాస్త్రం లేకుండా సంఖ్యాశాస్త్రం లేదు. గ్రహాలతో ముడిపెట్టకుండా ఉత్త అంకెలు మిమ్మల్ని ఎంతోదూరం తీసుకుపోలేవు. జ్యోతిష్యశాస్త్రం ముందు, సంఖ్యాశాస్త్రం తరువాత.  అందుకే 'జ్యోతిష్య సంఖ్యాశాస్త్రము' అని పేరుపెట్టాను. 

నా 61 వ పుట్టినరోజు సందర్భంగా జూలై నెలాఖరులో మా ఆశ్రమంలో జరిగిన సాధనాసమ్మేళనంలో ఈ విధానాన్ని శిష్యులకు వివరించాను. ఆ తరువాత ఈ విధానాన్ని గ్రంధస్థం చేయాలన్న సంకల్పంతో, కేవలం రెండువారాలలో ఈ పుస్తకాన్ని వ్రాసి విడుదల చేస్తున్నాను. ఇందులో నాదైన న్యూమరాలజీ విధానం వివరించబడింది. దీనిని 'భారతీయ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర పధ్ధతి' లేదా క్లుప్తంగా 'BJS పద్ధతి' అని పిలుచుకోవచ్చు.

వెస్టర్న్ న్యూమరాలజీ మీద మార్కెట్లో వేలాది పుస్తకాలున్నాయి. అవన్నీ తప్పుల తడికలేనని నేనంటాను. నేనిలా అనడానికి తర్కబద్ధమైన కారణాలున్నాయి.

అంకెలను ఏ బీ సీ డీ లతో పోల్చి మీ నేమ్ నంబర్ రాబట్టడం, లేదా మీ జననతేదీతో పోల్చి మీ డెస్టినీ నంబర్ రాబట్టడాలు సరియైన విధానాలు కావు. కారణం? ఇవన్నీ నిన్నగాక మొన్న మనం కృత్రిమంగా ఏర్పరచుకున్న గ్రెగోరియన్ కాలెండర్ ను అనుసరిస్తూ ఉంటాయి.

లౌకికమైన లావాదేవీలకు తప్ప మీ 'డేట్ ఆఫ్ బర్త్'  కు ప్రకృతిపరంగా ఎటువంటి విలువా లేదు. అదే విధంగా, ప్రకృతికీ గ్రెగోరియన్ కాలెండర్ కూ ఎటువంటి సంబంధమూ లేదు. కాబట్టి దాని ఆధారంగా లెక్కించబడే వెస్టర్న్ న్యూమరాలజీకి తర్కబద్ధత లేదు. అది సత్యాన్ని ప్రతిబింబించదు. దీనికి పూర్తిగా విభిన్నమైనది  మన భారతీయ సంఖ్యాశాస్త్రము. ఇది ప్రకృతిపైన, నవగ్రహాలపైన ఆధారపడినది. కనుక సత్యమైన ఫలితాలనిస్తుంది.

నా పరిశోధనలో వెలుగుచూచిన ఈ సులభమైన విధానాన్ని 52 మంది ప్రముఖుల జాతకాల సహాయంతో తేలికగా సోదాహరణంగా ఈ పుస్తకంలో వివరించాను.

రామకృష్ణ పరమహంస, వివేకానందస్వామి, సిస్టర్ నివేదిత, పరమహంస యోగానంద, రమణ మహర్షి, జిల్లెళ్లమూడి అమ్మ, మెహర్ బాబా, అరవిందయోగి, ఓషో, జిడ్డు కృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తి, ఆనందమయి మా వంటి మతప్రముఖుల జాతకాలతో బాటు, సుభాష్ చంద్ర బోస్, మోహన్ దాస్ గాంధీ, నాధూరాం గాడ్సే, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ పటేల్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు, నరేంద్రమోదీ, యోగి ఆదిత్యనాథ్, బెంజమిన్ నెతన్యాహు, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు, విక్రమ్ సారాభాయ్, హరగోబింద్ ఖోరానా, సత్యేన్ద్రనాథ్ బోస్, యల్లాప్రగడ సుబ్బారావు, శ్రీనివాస రామానుజం, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, బ్రునీ సుల్తాన్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, వెంపటి చినసత్యం, శ్రీపాద పినాకపాణి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ రవిశంకర్, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, లతా మంగేష్కర్, కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, తిరుమలై కృష్ణమాచార్య, బీకేఎస్ అయ్యంగార్, కృష్ణ పట్టాభి జాయిస్, కోడి రామ్మూర్తినాయుడు, దారాసింగ్, బ్రూస్ లీ, మాస్ ఒయామా, మైక్ టైసన్ మొదలైన సెలబ్రిటీల జాతకాలను ఈ సంఖ్యాశాస్త్ర పరంగా విశ్లేషించి చూపించాను.

ఈ విధానాన్ని అనుసరిస్తే, మీ జాతకాన్ని మీరే తేలికగా అర్ధం చేసుకోగలుగుతారు.

ఈ పుస్తకం వ్రాయడంలో నాకు సహాయపడిన నా శ్రీమతి సరళాదేవి, శిష్యులు అఖిల, లలిత, ప్రవీణ్, చావలి శ్రీనివాస్, మూర్తి, సంధ్యలకు నా ఆశీస్సులు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మా ఇతర పుస్తకాలలాగే ఈ పుస్తకం కూడా ఇక్కడ లభిస్తుంది.

చదివి చూడండి మీకే అర్ధమౌతుంది.

read more " మా 67 వ పుస్తకం 'భారతీయ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రము' విడుదల "

18, ఆగస్టు 2024, ఆదివారం

ప్రశ్నశాస్త్రం - కలకత్తా డాక్టర్ హత్యకేసులో ఏం జరిగింది?

ఈరోజు మధ్యాహ్నం 12.56 నిముషాలకు వేసిన ప్రశ్నచక్రం ఇది. 

కలకత్తా డాక్టర్ మరణం వెనుక అసలు ఏముంది? అన్నది తెలుసుకోవడమే ఈ ప్రశ్న ఉద్దేశ్యం.

9 వ తేదీన ఈ సంఘటన జరిగింది. కానీ ప్రశ్న చూడాలని నాకు అనిపించలేదు. ఈరోజు మధ్యాహ్నంపూట ఆదేశం వచ్చింది. అందుకని ప్రశ్న జాతకం చూడటం జరిగింది.

రహస్యాలకు నిలయమైన వృశ్చికం లగ్నమౌతూ దీనివెనుక చాలా రహస్యాలు దాగున్నాయని, ఇది సింపుల్ కేసు కాదని చెబుతోంది. 

చంద్రుడు 3 లో ఉంటూ స్నేహితులు, సహచరుల పాత్ర ఉందని చెబుతున్నాడు.

శని 4 లో వక్రించి ఉంటూ, 3 లోకి వచ్చి చంద్రుని కలుస్తూ తన క్లాసుమేట్లు, ఇంటిదొంగలు దీనివెనుక ఉన్నారని చెబుతున్నాడు.

లగ్నాధిపతి కుజుడు 7 లో గురువుతో కలసి శుక్రస్థానమైన శత్రురాశిలో ఉంటూ, ప్రొఫెసర్లు మొదలైన గురుస్థానంలో ఉన్నవాళ్ల పాత్ర కూడా ఉందని, ఈ అమ్మాయి వారి వలలో పడిందని చెబుతున్నాడు.

గురుకుజులతో యురేనస్ కూడా అక్కడే ఉంటూ సంఘవిద్రోహశక్తులు దీని వెనుక ఉన్నారని ఈ అమ్మాయిని చంపింది వారేనని, గురువులకు వారికీ  స్నేహం ఉందని, వారందరూ ఒక గ్రూపని చెబుతున్నాడు.  

పంచమాధిపతి గురువు 7 లో కుజ యురేనస్ లతో కలసి ఉండటం, ఈ పని చేసినది తెలియని మనుషులు కాదని, ఈ అమ్మాయికి వారికీ బాగా పరిచయం ఉందని స్పష్టంగా చెబుతోంది.

రాహువుతో నెప్ట్యూన్ కలసి 5 లో ఉంటూ, డ్రగ్ మాఫియాను సూచిస్తున్నాడు. ఆ ముఠా  సభ్యులతో ఈ అమ్మాయికి స్నేహంగాని, కనీసం గట్టి పరిచయం గాని ఉందని. వారు ఈ అమ్మాయికి బాగా పరిచయస్తులే అని సూచిస్తున్నాడు. రాహువు గురురాశిలో ఉండటం ముస్లిములను సూచిస్తుంది. కనుక వారిలో వీరు కూడా ఉండవచ్చు.

10 లో రవి బుధ శుక్రులున్నారు.  వీరిలో రవి బలంగా ఉంటూ నాయకుల అధికారుల హస్తాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు.

రవితో ఉన్న బుధుడు వక్రించి, ఆ నాయకుల, అధికారుల బుద్ధి వక్రించిందని చూపిస్తున్నాడు.

లగ్నము, శని, గురుకుజులు, రవిబుధశుక్రులు ఒకరికొకరు కేంద్రస్థానాలలో ఉంటూ, వీరిమధ్యన జరిగిన తీవ్రమైన ఘర్షణను సూచిస్తున్నారు.

గురుశుక్ర శని కుజులు డిగ్రీ దృష్టులలో చాలా దగ్గరగా ఉన్నారు. వీరిలో శుక్ర శనులు నీచమైన సెక్స్ నేరాలను సూచిస్తారు. గురుశుక్రులు ఈ నేరంలో గురువుల పాత్రను సూచిస్తారు. శని కుజులు హింసాత్మక సంఘటనకి సూచకులు. గురుశనులు దృఢకర్మను సూచిస్తారు. గురుకుజులు అధికార దుర్వినియోగాన్ని సూచిస్తున్నారు.

నవాంశలో శని 6 లో నీచలో ఉంటూ నీచులైన స్నేహితులను, తక్కువస్థాయి పనివారిని శత్రువర్గంగా సూచిస్తున్నాడు.

సూర్యుడు 6 లో ఉఛ్చస్థితిలో ఉంటూ అధికారులతో ఈ అమ్మాయికి శత్రుత్వం వచ్చిందని స్పష్టంగా చూపిస్తున్నాడు.

నవాంశలో గురువు ఉఛ్చస్థితిలో ఉన్నందున ఈ కేసు ఇంత సంచలనాన్ని సృష్టించి, దేశవ్యాప్త ఉద్యమాన్నిరేకెత్తించి, సుప్రీంకోర్టు సూమోటోగా తీసుకునేవరకూ తెచ్చింది. లేకపోతే, గతంలో జరిగిన ఎన్నో వందల రేప్ /మర్డర్ కేసులలాగే ఇది కూడా వెలుగులోకి రాకుండా ఉండిపోయేది.

ఈ కేసులో నేరస్థులకు శిక్ష పడుతుందా? అన్నది అసలు ప్రశ్న.

లగ్నాధిపతి కుజుడు 7 లో శత్రుస్థానంలో ఉండటం, దశమాధిపతి రవి దశమస్థానంలో బలంగా ఉండటం, ఇద్దరికీ కేంద్రదృష్టి ఉండటాలను బట్టి, లాభాధిపతి బుధుడు 9 లోకి వస్తూ, కుజునితో 3/11 దృష్టిలోకి రావడాన్ని బట్టి, కొంత హడావుడి జరుగుతుంది గాని, పూర్తి న్యాయం మాత్రం జరగదని, అసలైన నేరస్థులు తప్పించుకుంటారని ప్రశ్నశాస్త్రం చెబుతోంది.

ప్రశ్న సమయంలో చంద్ర రాహు రాహు గురు బుధదశ నడిచింది. రాహు-గురు -వక్రబుధులు సంఘవిద్రోహ మాఫియాను, అధికారులు మాఫియాతో కుమ్మక్కు అవడాన్ని సూచిస్తున్నారు.  లగ్నము, చంద్రుడు, రాహువు, గురువు, బుధుడు ఒకరికొకరు తృతీయాలలో ఉన్నారు. అంటే, ఇదంతా ఒక పెద్ద నెట్ వర్క్ అని స్పష్టంగా కనిపిస్తున్నది.

ఇది మామూలు రేప్ కేసు కాదు. దీని వెనుక చాలా పెద్ద నెట్ వర్క్, డ్రగ్ మాఫియా, అధికారుల పాత్ర అన్నీ ఉన్నాయి. దీనిని ఛేదించాలంటే నాయకులకు, అధికారులకు  చాలా చిత్తశుద్ధి, నిజాయితీలు ఉండాలి. ప్రస్తుతకాలంలో అవి ఎంతమందిలో ఉన్నాయి?

అదీగాక దీనివెనుక ఉన్న మాఫియా ముఠాను కదిలించడం అంత సులభం కాదు. వారికి నాయకుల అధికారుల అండదండలున్నాయి గనుక అసలు నేరస్థులు దొరకరని చెప్పవచ్చు.

పైగా, రోజులు గడిచేకొద్దీ ఎంత పెద్ద న్యూసైనా సరే పాతబడిపోతుంది. పబ్లిక్ మర్చిపోతారు. కనుక ఈ కేసులో న్యాయం జరుగుతుందా లేదా అనేది ఎవరికైనా తేలికగా అర్థమౌతుంది.  

ప్రసన్నలక్ష్మి, మీరాజాస్మిన్, ప్రత్యూష, సుశాంత్ సింగ్ ఇలా గతంలో ఎన్ని జరగలేదు ! వారిలో ఎందరికి న్యాయం జరిగింది? ఇప్పుడు  మాత్రం ఎలా జరుగుతుంది? పాత రికార్డును బట్టే కదా ప్రస్తుత ఇమేజి ఏర్పడేది !

వ్యవస్థలు కుప్పకూలినపుడు ఎవరి రక్షణబాధ్యత వారిదే అవుతుంది. అందుకే రైల్వే ఎప్పుడో చెప్పింది, ' మీ లగేజికి మీరే బాధ్యులు ' అని.
read more " ప్రశ్నశాస్త్రం - కలకత్తా డాక్టర్ హత్యకేసులో ఏం జరిగింది? "

10, ఆగస్టు 2024, శనివారం

బాంగ్లాదేశ్ సంక్షోభం - యురేనస్ సైకిల్స్

బాంగ్లాదేశ్ సంక్షోభంలో కూరుకుపోయింది.

దీనిని వాళ్ళు 'రెండవ స్వతంత్రం' గా వర్ణించుకోవచ్చు గాక. కానీ విధ్వంసం దిశగా వాళ్ళు వెళుతున్నారనడానికి గత వారంరోజులుగా అక్కడ హిందువులపైన జరుగుతున్న మారణకాండలే సాక్ష్యాలు.

దీనివెనుక అమెరికా, పాకిస్తాన్, చైనాల కుట్ర అనుమానం లేకుండా ఉంది. ఇస్లామిక్ తీవ్రవాదుల కుట్ర ఉంది.

దీనివల్ల మన దేశానికి కూడా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అటు బర్మాలో కొన్ని భాగాలు, ఇటు ఇండియాలో సెవెన్ సిస్టర్స్, అస్సాం, వేస్ట్ బెంగాల్, బీహార్ వరకూ ఇస్లామిక్ రాజ్యమంటూ క్రొత్త నినాదం ముందుకొస్తుంది. దానికి అల్ ఖైదా, ఇరాన్ లు ఆజ్యం పోస్తాయి. మనదేశంలో ఉన్న ఇస్లామిక్ స్లీపింగ్ సెల్స్ లోపలనుంచి సహకరిస్తాయి. ఇంటా బయటా సమస్యలు  చుట్టుముడతాయి. వెరసి ఇండియా పెను ప్రమాదంలో పడబోతోంది.

ఇప్పటివరకూ జమ్మూకాశ్మీర్లో  మాత్రమే తీవ్రవాదాన్ని ఎదుర్కొంటున్న మన ప్రభుత్వం ఇక తూర్పునుండి కూడా చొరబాటులను, అల్లర్లను, తీవ్రవాదాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అస్సామ్, వేస్ట్ బెంగాల్ లు ప్రధానంగా టార్గెట్ అవుతాయి.

ఈ విషయంలో గ్రహాలేమంటున్నాయి?

ఇదంతా యురేనస్ గ్రహం యొక్క ప్రభావం. జూన్ నెలలో యురేనస్ గ్రహం, భారతదేశాన్ని సూచించే వృషభరాశిలోకి అడుగుపెట్టింది. ఒక్క నెలలోనే మన దొడ్డివాకిలి లాంటి బాంగ్లాదేశ్ లోని ప్రజాప్రభుత్వం కూలిపోయింది.

84 ఏళ్ల కొకసారి యురేనస్ గ్రహం రాశిచక్రాన్ని ఒక చుట్టు చుట్టి వస్తుంది. అంటే, ఒక్కొక్క రాశిలో అది 7 ఏళ్ళు ఉంటుంది. గతంలో 1940-48 మధ్యలో యురేనస్ వృషభరాశిలో సంచరించింది. మళ్ళీ ఇప్పుడు అదే స్థితిలోకి వచ్చింది.

ఏయే విషయాలు యురేనస్ అదుపులో ఉన్నాయి?

తిరుగుబాట్లు, విప్లవాలు, పెద్ద ఎత్తున అల్లర్లు, ప్రభుత్వాలు కూలిపోవడాలు, దేశాలమధ్యన యుద్ధాలను ఈ గ్రహం కంట్రోల్  చేస్తుంది.  ఇది చరిత్ర చెబుతున్న నిజం ! 

కనుక అప్పటి పరిస్థితులే అటూ ఇటూగా మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఎదురౌతాయి.

1940-48 మధ్యలో ఏం జరిగింది?
-----------------------------------------------
1939-45 మధ్యలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది.
 
అప్పుడే భారత స్వతంత్రపోరాటం కూడా జరిగింది. 1947 లో మనకు స్వతంత్రం వచ్చింది.

రెండో ప్రపంచయుద్ధంలో ఏడున్నర కోట్ల మంది ప్రపంచప్రజలు + సైనికులు చనిపోయారు. 

భారత విభజన సమయంలో జరిగిన సరిహద్దు అల్లర్లలో 5 నుండి 10 లక్షల మంది చనిపోయారు.

2024-2030 మధ్యలో మళ్ళీ అవే పరిస్థితులు రాబోతున్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం, చైనా - తైవాన్ సంక్షోభం, బాంగ్లాదేశ్ లో తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వ ఏర్పాటు ఇవన్నీ ముదిరి ముదిరి మూడవ ప్రపంచయుద్ధంగా మారబోతున్నాయి. 

రోహిణీ శకట భేదనం
-----------------------------
రోహిణీ నక్షత్రంలో యురేనస్ 1943-45 మధ్యలో సంచరించాడు. అప్పుడే రెండవ ప్రపంచయుద్ధం ముదిరి పాకాన పడింది. జపాన్ పైన అణుబాంబు ప్రయోగం జరిగింది కూడా అప్పుడే.

మళ్ళీ ఇప్పుడు 2026-28 మధ్యలో యురేనస్ రోహిణీ నక్షత్రంలో సంచరించబోతున్నాడు. 84 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులను ప్రపంచం మళ్ళీ చూడబోతోంది.

మేషరాశిలో శని స్థితి
-----------------------------
మేషరాశి శనికి నీచస్థితి. ప్రస్తుతం శనీశ్వరుడు 2027-30 మధ్యలో మేషరాశిలో సంచరించబోతున్నాడు.  ఈ సమయంలో ప్రపంచదేశాల ప్రజలకు, ముఖ్యంగా భారత ఉపఖండపు ప్రజలకు నానాకష్టాలు తప్పవు.

యురేనస్ సంచారం + శని మేషరాశి సంచారం రెండూ కలిసి, 2026 నుండి 2029 వరకూ నాలుగేళ్లు ప్రపంచదేశాలకు చుక్కలు కనిపించబోతున్నాయి.

ఇదే సమయంలో భారతదేశం కూడా కనీవినీ ఎరుగని గడ్డు పరిస్థితులను, సంక్షోభాన్ని ఎదుర్కొనబోతోంది.

కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు, ప్రజలు, ముఖ్యంగా హిందువులు ఐకమత్యంగా ఉంటూ దేశభద్రతకు, దేశప్రయోజనాలకు పెద్దపీట వెయ్యకపోతే మాత్రం, ఆ తరువాత ఏ పీటా వేసుకోవడానికి ఎవరూ మిగలరు.

ఈ హెచ్చరికను ఆషామాషీగా తీసుకోకండి.

బ్రహ్మంగారు వ్రాసిన కాలజ్ఞానం ఇదే కావచ్చు, కలియుగాంతం ఇదే కావచ్చు. ఇప్పటినుండి ఏడేళ్లలో మన కళ్ళముందే మనం వాటన్నింటినీ చూడబోతున్నాం. తస్మాత్ జాగ్రత !

ఈ సబ్జెక్ట్ పైన చేసిన వీడియోను ఇక్కడ చూడండి.

జైహింద్ !  
read more " బాంగ్లాదేశ్ సంక్షోభం - యురేనస్ సైకిల్స్ "

29, డిసెంబర్ 2023, శుక్రవారం

జ్యోతిష్య రిట్రీట్ ఎప్పుడు?

'జ్యోతిష్య రిట్రీట్ ఎప్పుడు? మేము కూడా అటెండ్ అవుదామని అనుకుంటున్నాము' అని అడుగుతూ అనేకమంది మెయిల్స్ ద్వారా, ఇతరత్రా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. వారందరికోసం ఈ పోస్ట్.

మిగతా అనేకమంది లాగా జ్యోతిష్య శాస్త్రాన్ని ఒక డబ్బు సంపాదించే మార్గంగా చూడటం మా విధానం కాదు. కనుక, కోర్సులంటూ పెట్టి, కమర్షియల్ అస్ట్రాలజీని మేము నేర్పించము. సమాజంలో ఇప్పుడున్న దొంగలు చాలు. క్రొత్తవాళ్ళని తయారు చేయవలసిన పని మాకు లేదు.

'మరి మీ జ్యోతిష్య విధానాన్ని ఎవరికి నేర్పిస్తారు?' అనే సందేహం చాలామందికి కలుగుతుంది.

పంచవటి సాధనామార్గాన్ని అనువరించేవారికి మాత్రమే మా జ్యోతిష్యవిధానాన్ని నేర్పించడం జరుగుతుంది. మా స్పిరిట్యువల్ రిట్రీట్లలో భాగంగా యోగశాస్త్రం, తంత్రశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, ఇంకా కొన్ని మార్మికవిద్యలను నేర్పడం జరుగుతుంది.  పంచవటి సాధనామార్గంలో ఇవన్నీ అంతర్భాగాలు. ఆధ్యాత్మికమార్గంలో నన్ను అనుసరించాలనుకునే నా శిష్యులకు మాత్రమే ఇవి నేర్పబడతాయి గాని, సరదాకో, డబ్బు సంపాదించడానికో జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలని ఆశించేవారికి నేర్పబడవు. ఈ విద్యలను మేము చూచే కోణం వేరు. ఇది లోకపు తీరుకు పూర్తి భిన్నంగా ఉంటుంది.

మా జ్యోతిష్యవిధానం మీకు, మీ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అది కూడా పూర్తిగా ఆధ్యాత్మికకోణంలో మాత్రమే ఉపయోగిస్తుంది. మూడో మనిషికి మీరు చెప్పకూడదు. చెప్పలేరు. డబ్బుల కోసం అసలే చెప్పకూడదు. డబ్బు కోసం ఈ విద్యను వాడకూడదు.

ఒక్కమాటలో చెప్పాలంటే మాది స్పిరిట్యువల్ అస్ట్రాలజీ. స్పిరిట్యువల్ మార్గంలో నడిచే సాధకులకు మాత్రమే ఇది ఉద్దేశించబడింది. 24 గంటలూ డబ్బు తప్ప ఇంకో ధ్యాసలేని స్వార్ధపరులు, ఆశపోతులైన లౌకికులకోసం ఉద్దేశించినది కాదు.

బయటవాళ్ళకు మా రిట్రీట్స్ లోకి అనుమతి ఉండదు. రిట్రీట్స్ లో కాకుండా మాదైన జ్యోతిష్యవిధానాన్ని నేర్చుకోవడం వేరేవిధంగా వీలుకాదు. కనుక, దానిని నిజంగా నేర్చుకోవాలనుకుంటే, నా శిష్యులుగా  మారి, మా సాధనావిధానంలో నడవడం ఒక్కటే దారి.

దానిలో నడుస్తామంటే సరే. కాదంటే మాత్రం, మా జ్యోతిష్య విధానం మీకోసం కాదని గ్రహించండి.

ఆధ్యాత్మిక సాధనామార్గంలో జ్యోతిష్య శాస్త్రం విడదీయరాని భాగం. లౌకిక బాధలను పోగొట్టడానికి దానిని తప్పకుండా వాడవచ్చు. కానీ పునాది మాత్రం ఆధ్యాత్మికమై ఉండాలి. ఇది మా విధానం.

మా సాధనామార్గంలో నడుస్తామంటే రండి. జ్యోతిష్యశాస్త్రాన్ని నాదైన వేగవిధానంలో నేర్చుకోండి. సాధన వద్దంటే, మా జ్యోతిష్యం మీకు పనికి రాదు.

మమ్మల్ని సంప్రదిస్తున్న అనేకమందికి సరియైన స్పష్టతను ఇవ్వడం కోసమే ఈ పోస్ట్ ను వ్రాస్తున్నాను.

గ్రహించండి.

read more " జ్యోతిష్య రిట్రీట్ ఎప్పుడు? "

24, జనవరి 2023, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 88 (ఈ ఏడాది గందరగోళమే)

16 వ తేదీన శనీశ్వరుడు రాశి మారిన దగ్గరనుండి, ప్రస్తుతం ఖగోళంలో ఒక చెడుయోగం నడుస్తున్నది. ఇది ఏప్రియల్ వరకూ ఉంటుంది. ఆ తరువాత కొద్దిగా మారినప్పటికీ, నవంబర్ వరకూ ఇంకో రూపాన్ని ధరిస్తుంది. మొత్తంమీద ఈ ఏడాదంతా పరిస్థితులు ఏమీ బాగుండవు. 

నేను చెబుతున్నదానికి సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి గమనించండి.

అమెరికాలో వరుసగా మాస్ షూటింగ్స్ జరుగుతున్నాయి. లాస్ ఏంజెల్స్ దగ్గర మాంటెరీ పార్క్ షూటింగ్ లో 11 మంది చనిపోయారు. ఇది చైనీస్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జరిగింది. చైనావాళ్ళంటే అమెరికాలో పెరుగుతున్న ద్వేషానికి ఇదొక మచ్చుతునక.

నిన్న మధ్యాన్నం  సాన్ ప్రాన్సిస్కో దగ్గరలోని హాఫ్ మూన్ బే లో మరొక మాస్ షూటింగ్ జరిగింది.  అందులో 7 మంది కాల్చబడ్డారు.

అయోవాలో జరిగిన ఇంకొక కాల్పుల సంఘటనలో ఇద్దరు కాల్చబడ్డారు. ఈ రకంగా అమెరికా అంతా  మాస్ షూటింగ్స్ జరుగుతున్నాయి. గత 20 రోజులల్లో ముప్పైకి పైగా ఇటువంటి సంఘటనలు అమెరికాలో జరిగాయి. పెరుగుతున్న గన్ కల్చర్ కు ఇది స్పష్టమైన ఉదాహరణ.

నాలుగొందల ఏళ్ల క్రితం అమెరికాను ఆక్రమించినపుడు గన్స్ ఉపయోగించి రెడ్ ఇండియన్స్ ను దారుణంగా చంపేసి అమెరికాను ఆక్రమించారు యూరోపియన్స్. నేడు అవే గన్స్ తో అమెరికా నాశనమయ్యేట్టు కన్పిస్తోంది. Karma strikes back అంటే ఇదేనేమో మరి.

కానీ, గన్స్ ను నిషేధించడం మాత్రం  అమెరికాలో ఎన్నటికీ చెయ్యరు. కారణం? గన్ కంపెనీలకు సెనేట్ లో చాలా గట్టి లాబీ ఉంది.  అసలా కంపెనీలన్నీ రాజకీయనాయకుల బినామీ కంపెనీలే అని కూడా పుకారుంది. కనుక వాటిని బ్యాన్ చెయ్యరు. గన్ కల్చర్ నడుస్తూనే ఉంటుంది. కనుక, అమెరికాలో మారణహోమం జరుగుతూనే ఉంటుంది.

వచ్చే ఎన్నికలలో మోడీగారిని దింపేసి ఇండియాను మళ్ళీ సర్వనాశనపు అంచులలోకి నెట్టాలని ఇస్లామిక్ దేశాలు, కొన్ని యూరోపియన్ దేశాలు కంకణం కట్టుకున్నట్లుగా కన్పిస్తోంది. అందుకే మోదీగారికి వ్యతిరేకంగా, పూర్తిగా వక్రీకరించిన డాక్యుమెంటరీని ఒకటి BBC చేత తయారు చేయించి లోకం మీదకు  వదిలారు. దానిని ఇండియాలోని అభివృద్ధి వ్యతిరేక యూనివర్సిటీలలో ప్రదర్శిస్తున్నారు ముస్లిం స్టూడెంట్స్. ఏదో విధంగా మోడీగారిపైన బురద చల్లాలన్నదే వాళ్ళ కుట్ర. దానికి కాంగ్రెస్ వత్తాసు. ఈ దేశద్రోహుల ఆటలు ఇంకెన్నాళ్లో అర్ధం అవడం లేదు.

స్వీడన్ లో కురాన్ ను తగలబెట్టారు. దానిమీద గందరగోళాలు జరుగుతున్నాయి. గొడవలు చెయ్యడం కాదు. అసలు ఖురాన్ అంటే  ప్రతివారిలోనూ ఎందుకంత వ్యతిరేకత వస్తోందో ఆలోచించాలి. అందులో ఉన్న కంటెంట్ అలాంటిది మరి ! ఏవో కొన్ని అభ్యంతరకమైన శ్లోకాలున్నాయని, మనుస్మృతిని  రోడ్డుమీద తగులబెట్టాడు అంబెడ్కర్. ఇంతా చేస్తే ఆయన దానిని పూర్తిగా చదవనే లేదు. పూర్తిగా చదవకుండానే అంతటి గొప్ప పనిని చేసేశాడు. మరి బైబిల్లో, కురాన్ లో ఏముందో తెలిస్తే, ఒకవేళ ఇప్పటికీ ఆయన బ్రతికుంటే, ఆయనలో నిజాయితీ ఏమైనా మిగిలుంటే, ఆ రెండు పుస్తకాలనూ ఏం చేసేవాడో?

అమెరికాలో వేలాదిమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, అమెజాన్ సంస్థలు వేలాదిమందిని లే ఆఫ్ చేశాయి. వాళ్లలో చాలామంది ఇప్పుడు ఇండియాకు వెళ్ళవలసి వస్తుంది. ప్రస్తుతం వీళ్ళందరూ కుటుంబపరంగా రకరకాలైన విచిత్రపరిస్థితులలో ఉన్నారు. అందరి పరిస్థితీ ఇప్పుడు ఒక్కసారిగా గందరగోళంలో పడింది.

శనీశ్వరుడు కుంభరాశిలో అడుగుపెట్టిన వెంటనే ఈ మార్పులన్నీ చోటుచేసుకుంటున్నాయి గమనించండి. ముఖ్యంగా మూడు రంగాలలో ఈ మార్పులు గోచరిస్తాయి. 1. మతకలహాలు. 2. ఉద్యోగుల పరిస్థితి 3. నేరాలు ఘోరాలు.

ఈ పరిస్థితి 2023 మొత్తం ఉంటుంది. ఇంకా ఘోరమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఎదురౌతాయి. చూస్తూ ఉండండి.

read more " మూడవ అమెరికా యాత్ర - 88 (ఈ ఏడాది గందరగోళమే) "

21, జనవరి 2023, శనివారం

మూడవ అమెరికా యాత్ర - 86 (శనీశ్వరుని కుంభరాశి ప్రవేశం - వాయుయాన ప్రమాదాలు)

శనీశ్వరుడు కుంభరాశిలోకి తిరిగి ప్రవేశించడంతోనే వాయుయానప్రమాదాలు మొదలయ్యాయి. అంతేగాక మరికొన్ని విశేషాలు కూడా జరిగాయి. వాటిమీద చేసిన యూట్యూబ్  వీడియోను ఇక్కడ చూడండి.

read more " మూడవ అమెరికా యాత్ర - 86 (శనీశ్వరుని కుంభరాశి ప్రవేశం - వాయుయాన ప్రమాదాలు) "

15, జనవరి 2023, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 84 (శని భగవానుని కుంభరాశి ప్రవేశం - ఫలితాలు )

వక్రత్వం వల్ల గత అయిదు నెలలుగా మకరరాశిలో సంచరిస్తున్న  శనిభగవానుడు మళ్ళీ కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంఘటన రెండు రోజులలో జరుగబోతోంది.

అమెరికాలో అయితే, ఈస్టర్న్ టైం ప్రకారం జనవరి 16 రాత్రి (తెల్లవారితే 17), రెండున్నర గంటల ప్రాంతంలో జరుగుతుంది. ఇండియాలో అయితే, జనవరి 17 మధ్యాన్నం ఒంటిగంట ప్రాంతంలో జరుగుతుంది.

దీని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

మేషరాశి

ఉద్యోగపరంగా ఎదురౌతున్న చిక్కులు తొలగిపోతాయి. అన్నింటా లాభం కనిపిస్తుంది.

వృషభరాశి

ఉద్యోగంలో పనివత్తిడి ఎక్కువౌతుంది. కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్లుగా ఉంటుంది.

మిథునరాశి

దూరప్రాంతాలకు ప్రయాణిస్తారు. గురుసమానులు, పెద్దలకు కష్టకాలం.

కర్కాటకరాశి

నష్టాలు, చికాకులు, ఆరోగ్యసమస్యలు ఎక్కువౌతాయి.

సింహరాశి

సమాజంతో, పార్ట్ నర్స్ తో వ్యవహారాలు ఎక్కువౌతాయి. జీవితభాగస్వామికి కష్టకాలం మొదలౌతుంది.

కన్యారాశి

మానసిక చికాకులు తగ్గి మంచికాలం మొదలౌతుంది.

తులారాశి

ఇంటిలో చికాకులు మాయమౌతాయి. అయితే, సంతానచింత ఉంటుంది.

వృశ్చికరాశి

ధైర్యం సన్నగిల్లుతుంది. గృహసౌఖ్యం లోపిస్తుంది.

ధనూరాశి

కష్టాలు మాయమౌతాయి. ధైర్యం పెరుగుతుంది.

మకర రాశి

ఆరోగ్య సమస్యలు పోతాయి. కుటుంబచికాకులు, డబ్బు ఇబ్బందులు కలుగుతాయి.

కుంభరాశి

ఖర్చులు తగ్గుతాయి. బద్ధకం పెరుగుతుంది. ఆరోగ్యం కుంటుపడుతుంది.

మీనరాశి

ఖర్చులు, ఆరోగ్యసమస్యలు పెరుగుతాయి.

ఈ ఫలితాలు కనిపించడం సూచనాప్రాయంగా మొదలైపోయి ఉంటుంది. గమనించుకోండి.

read more " మూడవ అమెరికా యాత్ర - 84 (శని భగవానుని కుంభరాశి ప్రవేశం - ఫలితాలు ) "

1, నవంబర్ 2022, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 50 ( మోర్బి వేలాడే బ్రిడ్జి కూలుడు - జ్యోతిష్య విశ్లేషణ)

గుజరాత్ లోని మోర్బి టౌన్ లో వ్రేలాడే బ్రిడ్జి కూలిపోయింది. దానిమీదున్న 400 మందీ క్రిందనున్న నదిలో పడిపోయారు అందులో 140 మంది మోక్షాన్ని పొందారు. కారణమేమంటే, ఒక ఇరవై మంది కుర్రకారు, ఆ బ్రిడ్జిని ఉయ్యాలలాగా ఊపారు. దాని కేబుల్స్ తెగిపోయాయి. అందరూ 30 అడుగుల క్రిందనున్న నీళ్లలో పడిపోయారు. ఈ సంఘటన సెప్టెంబర్ 30 న సాయంత్రం 6.40 కి జరిగింది.

గుజరాత్ లో నా స్నేహితుడొకడున్నాడు. వాడిపేరు భరత్ పరేఖ్. నేనూ వాడూ ఒకేసారి రైల్వేలో సెలక్ట్ అయ్యి, సర్వీసు వెలగబెట్టి, ముందు నేను రిటైరయ్యాను, పోయిన్నెలలో వాడు రిటైరయ్యాడు. వాడి ఊరు మోర్బి దగ్గరలోనే ఉంటుంది. సైట్ సీయింగ్ కని వెళ్లి పొరపాటున ఆ  బ్రిడ్జి ఎక్కాడేమోనని వాడికి ఫోన్ చేశాను.

'ఏరా? ఆ బ్రిడ్జిమీద నువ్వు లేవు కదా?' అన్నాను.

30 ఏళ్ళు ఆంధ్రాలో ఉండటంతో వాడు తెలుగు బాగానే మాట్లాడతాడు.

'లేను. ఉంటే నీతో ఎలా మాట్లాడతానిప్పుడు?' అని జోకేశాడు.

'సర్లే. ఏం జరిగిందసలు?' అన్నా.

'ఏముంది? పండగ సెలవలు. ఎక్కడ చూసినా జనసముద్రం. హోటళ్లు, మాల్స్, సినిమా హాల్స్, బజార్లు ఎక్కడ చూసినా విపరీతమైన జనం. అందరూ రోడ్లమీదే ఉన్నారు. చాలా చిరాకుగా ఉంది. అదే విధంగా ఆ బ్రిడ్జిమీద కూడా ఎక్కారు. దానిమీద 20 మందిని కంటే ఎక్కించకూడదు. అది ఎప్పుడో బ్రిటిష్ వాడు కట్టిన బ్రిడ్జి.  దానిమీద 400 మంది ఎక్కారు. పైగా ఉయ్యాల ఊగుతున్నారు. కేబుల్స్ ఎలా తట్టుకుంటాయి? తెగింది. పడ్డారు. పోయారు' అన్నాడు.

'మెయింటెనెన్స్ ఏజన్సీ మాతో చెప్పకుండా, మా పర్మిషన్ తీసుకోకుండా, బ్రిడ్జిని రీ ఓపెన్ చేసింది. 20 మందికి ఇవ్వాల్సినచోట 400 మందికి టిక్కెట్లిచ్చి ఎక్కించింది. ఇదే ప్రమాదానికి కారణం' అని గుజరాత్ ప్రభుత్వం అంటోంది.

నిజమే కావచ్చు.

కానీ అసలు విషయం అది కాదు. ఇండియాకి పట్టిన అసలైన దరిద్రం - అతి జనాభా. దానికి తోడు 'లా' ని ఎవడూ పాటించకపోవడం. ఈ విషయాన్ని గతంలో వందలాది సార్లు వ్రాశాను. మళ్ళీ ఇప్పుడు రుజువైంది. ముందుముందు కూడా రుజువౌతూనే ఉంటుంది. జనాభా తగ్గుతూనే ఉంటుంది. పెరుగుట విరుగుట కొరకే అన్నది ప్రకృతి సూత్రం ! పిచ్చిగా పెరిగిపోతే ఉన్నట్టుండి విరిగిపోక తప్పదు. దేనికైనా సరే ఈ సూత్రం వర్తిస్తుంది.

జ్యోతిష్యపరంగా ఇది చాలా విచిత్రమైన సంఘటన. ఎలాగో వివరిస్తా వినండి.

భారతదేశానికి సూచిక అయిన మకరరాశి నుండి దశమంలో నాలుగు గ్రహాలున్నాయి. ఇవి జనసమ్మర్దాన్ని, చాలామంది మనుషులు ఒకచోట గుమికూడటాన్ని సూచిస్తున్నాయి. 

తులారాశి త్రాసును సూచిస్తుంది. గాలికి త్రాసు ఉయ్యాలలాగా ఊగుతుంది. వేలాడే బ్రిడ్జి కూడా ఒక త్రాసు లాంటిదే.  ఊపితే అదీ ఊగుతుంది. బరువెక్కువైతే తెగుతుంది. తులారాశి వాయుతత్వ రాశి, అందుకే,  గాలిలో వేలాడే బ్రిడ్జి ప్రమాదం జరిగింది.

శని దశమదృష్టి తులమీదుంది. కుజుని పంచమదృష్టి తులమీదుంది. ఇది యాక్సిడెంట్ యోగమని నా పుస్తకాలలో కూడా వ్రాశాను. కనుక, ఘోరప్రమాదం జరిగింది.

తులారాశి పశ్చిమదిక్కును సూచిస్తుంది. అందుకే, ఇండియాలో పడమరదిక్కున ఉన్న గుజరాత్ లో ఈ  ప్రమాదం జరిగింది.

తులలో నాలుగు గ్రహాలున్నాయి. వీరు రవి, బుధ, శుక్ర, కేతువులు. వీరిలో, రవి నీచస్థితిలో ఉన్నాడు,  బుధ శుక్రులు అస్తంగతులయ్యారు. కేతువు వీళ్లందరినీ మింగేశాడు. నీచరవి, లాభం కోసం 400 మందిని బ్రిడ్జి ఎక్కించిన నీచపు అధికారులకు సూచకుడు. బుధుడు చిన్నపిల్లలకు, శుక్రుడు ఆడవాళ్లకు సూచకులు. వీళ్ళే ఈ ప్రమాదంలో ఎక్కువగా చనిపోయినవాళ్లు.  మరి ఇలాంటి గ్రహస్థితిలో, ఇలాంటి ఘోర ప్రమాదం జరగక ఇంకేం జరుగుతుంది?

మిధునంలో కుజుడు, ఆకతాయి కుర్రవాళ్ళకు సూచకుడు. ఆయన దృష్టి ఈ నాలుగు గ్రహాలమీదుంది. కుర్రవాళ్ళ గుంపు ఆకతాయితనంగా బ్రిడ్జిని ఊపడమే, అది కూలడానికి కారణమైంది.

చూశారా ప్రమాదాలకు గ్రహస్థితులు ఎలా ఖచ్చితమైన కారణాలౌతాయో?

ఇప్పుడొక సందేహం మీకు రావచ్చు. అదేంటంటే, 'ముందే చెప్పి ఈ ప్రమాదాన్ని తప్పించవచ్చు కదా?' అని.

'ఎందుకు తప్పించాలి?' అని నేనంటాను.

అది సాధ్యం కాదని కూడా కొన్ని వందలసార్లు ఇప్పటికే చెప్పాను. గ్లోబల్ కర్మను తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. వాళ్ళు చేసుకున్న ఖర్మను బట్టి జనం ఆ విధంగా చస్తారు. దానిని తప్పించడానికి జ్యోతిష్కుడెవరు? అసలు ఎందుకు ప్రయత్నించాలి? ఇతరుల కర్మలో మనమెందుకు జోక్యం చేసుకోవాలి? ఎవడెలా పోతే మనకెందుకు? చూస్తూ ఉండాలంతే.

ఆ క్షణంలో ఎవరైనా అక్కడ నిలబడి, 'ఒద్దురా బాబు. ఎక్కద్దు. ప్రమాదం' అని మొత్తుకున్నా ఎవడూ వినడు. వాడినొక పిచ్చివాడుగా చూసి హేళన చేస్తారు. ఇది నేటి లోకరీతి. పోనీ, వాళ్లంతా విని, ఆ బ్రిడ్జి ఎక్కకుండా ఉంటే, అప్పటికా ప్రమాదం తప్పవచ్చు, కానీ ఇంకొకచోట మళ్ళీ ఇలాంటి పరిస్థితిలోనే ఇరుక్కుని, వాళ్ళందరూ చస్తారు. లేదా, రకరకాల ఇతర కారణాలతో చస్తారు. కనుక సామూహిక కర్మను తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు, ఒక్క దైవశక్తి తోడుగా ఉంటే తప్ప ఆ పనిని ఎవ్వరూ చెయ్యలేరు. చెయ్యకూడదు కూడా. ఈ లోపల, పనీపాటా లేకుండా అలా చెప్పి ఆ ప్రమాదాలను తప్పించిన జ్యోతిష్కుడికి వేటు పడుతుంది. వాడు ఏదో ఒక యాక్సిడెంట్లో పోతాడు. ఎందుకా ఖర్మ?

జ్యోతిష్యశాస్త్రం అంటే ఆషామాషీ పిల్లలాట కాదు. ఇది కర్మతో చెలగాటం. ఇది తమాషా వ్యవహారం కానేకాదు. దైవశాస్త్రం. వ్యక్తిగతంగా మాత్రమే ఎవరి కర్మనైనా తప్పించడానికి వీలౌతుంది. అదికూడా, ఆ వ్యక్తి పధ్ధతి తప్పకుండా, నిజాయితీగా, సరిగ్గా ఉంటే మాత్రమే, ఆ విధంగా కర్మను తప్పించడం సాధ్యమౌతుంది. మంది కర్మను తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు పిచ్చిపిచ్చి పనులు చేసుకుని, కర్మను పోగేసుకుని, 'తప్పించండి' అంటే, ఎందుకు తప్పించాలి? చెప్పినా ఆ గుంపులో ఎవడు వింటాడు? 'పోగాలము వచ్చినవాడు కనడు వినడు' అని ఊరకనే అనలేదు మరి !

డబ్బుకోసం ఆశపడి జ్యోతిష్య రెమెడీలు ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు. అలా చెప్పేవారి కుటుంబాలు నాశనమౌతాయి. అందుకే, కమర్షియల్ జ్యోతిష్కుల కుటుంబాలు ఎప్పుడూ పైకిరావు. జ్యోతిష్యశాస్త్రానికి ఈ శాపం ఉన్నది. ఇది తెలియక ప్రతివాళ్ళూ జ్యోతిష్యంతో ఆటలాడి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. కొంతమంది గాయత్రీజపం చేసి ఆ దోషం పోగొట్టుకుంటామని అంటారు గాని, అది సాధ్యం కాదు. తూతూ మంత్రంగా చేసే గాయత్రీజపం, రెమెడీలు చెప్పిన దోషాన్ని, చేయించిన దోషాన్ని, ఏమాత్రమూ పోగొట్టలేదు.

అదలా ఉంచితే, ఈ ప్రమాదం గురించి ఇక్కడ అమెరికాలో రకరకాలుగా హేళనగా మాట్లాడుతున్నారు. ఇది మామూలే.  ఇండియా అంటేనే ఇక్కడ చాలా చిన్నచూపు. ఇండియాలో వ్యవస్థలు ఉండవని, లా అండ్ ఆర్డర్ ఉండదని, జనాభా అంతా పనికిరాని గుంపని, కట్టుబడిలోగాని, మెయింటెనెన్స్ లో గాని సరైన ప్రమాణాలు ఉండవని, అంతా లంచాల మయమని, అన్నీ మాఫీ అవుతాయని,  ఇక్కడ అనుకుంటూ ఉంటారు. కనుక ఎవరూ 'అయ్యోపాపం' అనడం లేదు. 'ఇండియాలాంటి దేశంలో అలా కాక ఇంకెలా జరుగుతుందిలే?' అంటున్నారు. 'ఇండియా, స్పేస్ లోకి రాకెట్లను పంపిస్తోంది. భూమ్మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మాత్రం కాపాడుకోలేకపోతోంది' అంటూ ఎగతాళిగా మాట్లాడుతున్నారు.

వాళ్లనుకునేదానిలో కూడా నిజాలున్నాయి కదా? మనమేం అనగలం?

read more " మూడవ అమెరికా యాత్ర - 50 ( మోర్బి వేలాడే బ్రిడ్జి కూలుడు - జ్యోతిష్య విశ్లేషణ) "

10, సెప్టెంబర్ 2022, శనివారం

మూడవ అమెరికా యాత్ర - 16 ( ఎంకి పెళ్లి - సుబ్బి చావు)

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' అనేది సామెత. ఏం ఎంకి పెళ్లిచేసుకోకపోతే సుబ్బి చావదా? ఇక్కడే శిలాశాసనంగా ఉండిపోతుందా? అని వితండవాదం చేస్తే ఎవరూ ఏమీ చెప్పలేరు గాని, రెండు సంఘటనలు ఒకదానివెంట మరొకటి జరిగితే ఈ విధంగా అంటారు మరి.

ఇంగ్లీషువాళ్ళు మన సామెతలను నమ్ముతారో లేదో నాకు తెలీదు. మనం నమ్మకపోతే సూర్యుడు ఉదయించకుండా ఉంటాడా? ఉండడు కదా? ఇదీ అంతే.

లీజ్ ట్రాష్ బ్రిటిష్ ప్రధానమంత్రి అయింది. ఆమెకు అధికారపత్రాన్ని చేతికి ఇచ్చిన రెండో రోజే రెండో ఎలిజబెత్ రాణి హరీమంది. ఇది చూస్తే నాకు పై సామెత గుర్తొచ్చింది.

రెండో ఎలిజబెత్ రాణి 21  ఏప్రియల్ 1926 న లండన్లో పుట్టింది. సూర్యుడు ఉచ్ఛస్థితి. రాహుకేతువులు ఉచ్ఛస్థితిలో ఉన్నారు, శని ఉచ్ఛస్థితిలోకి వస్తాడు. కుజుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. గురుబుధులు నీచస్థితిలో ఉన్నప్పటికీ నీచభంగ రాజయోగం పట్టింది. ఆశ్లేషా నక్షత్రం 4 పాదం, కర్కాటక రాశి అయింది. మహారాజయోగాలు ఎలా ఉంటాయో ఈ జాతకాన్ని చూస్తే అర్ధమౌతుంది. అందుకే ప్రపంచంలో అనేక దేశాలకు మహారాణిగా 70 ఏళ్లపాటు ఒక వెలుగు వెలిగింది.  

గోచార గ్రహాల స్థితి

గురువు నవమం నుంచి అష్టమంలోకి వస్తున్నాడు. ప్రాణగండం. శని సప్తమం నుంచి షష్ఠంలోకి వస్తున్నాడు. ఇదీ మంచి సూచన కాదు. రాహుకేతువులతో అర్గళం పట్టింది. ఆయుష్షు అయిపోయింది. అయితేనేం పూర్ణాయుష్కురాలై 96 ఏళ్ళు బ్రతికింది. కానీ చివరకు తెలుగు సామెతను నిజం చేస్తూ వెళ్ళిపోయింది. పోతూ పోతూ కనీసం మన కోహినూర్ వజ్రాన్నైనా మనకివ్వకుండా వెళ్ళిపోయింది.

సర్లే ఏం చెయ్యగలం ఎవరి ఖర్మ వారిది. చావులో రాజనీ పేదనీ తేడా ఏముంటుంది? ఈ జన్మలో రాజు మరుజన్మలో బంటు, ఈ జన్మలో బంటు మరుజన్మలో రాజు. సృష్టి ఎంత విచిత్రమైనదో?

రామాయణకాలంలో సీతాదేవికి సేవ చేసిన రాక్షసవనిత త్రిజట, ఆ పుణ్యబలం చేత, ఈ జన్మలో విక్టోరియా మహారాణిగా పుట్టిందని  ఇండియాకు రాణి అయిందని ఉపాసని మహరాజ్ అనేవారు. మెహర్ బాబా కూడా అదేమాటను అన్నారు.

ముందటి జన్మలలో లెక్కలేనన్ని మంచిపనులు చేసినవాళ్లకు మరుసటి జన్మలో ఇలాంటి మహరాజయోగాలు కలుగుతాయి. కానీ ఆ పుణ్యబలం ఖర్చైపోయాక మళ్లీ మామూలు జన్మలే వస్తాయి.

ఎలిజబెత్ రాణి మరుజన్మలో ఎక్కడ పుట్టబోతోందో తెలుసుకోవాలని ఉందా? కుదరదు గాక కుదరదు.

కొన్ని అలా లాకర్లలో ఉండిపోవలసిందే, కోహినూర్ వజ్రం లాగా.

read more " మూడవ అమెరికా యాత్ర - 16 ( ఎంకి పెళ్లి - సుబ్బి చావు) "

7, సెప్టెంబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 15 (Liz Truss Vs Rishi Sunak Astrology)

యూకే నూతన ప్రధానిగా ఈరోజు లిజ్ ట్రస్ ఎన్నికైంది. రిషి శునక్ ఓడిపోయాడు. వీళ్ళ జాతకాలు పైపైన పరిశీలిద్దాం.

రిషి శునక్ భారతీయసంతతికి చెందినవాడు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు. ఇతను మే 12,1980 న సౌతాంఫ్టన్ లో పుట్టాడు. రేవతి నక్షత్రం 4 వ పాదం. మీనరాశి అయింది. 

ప్రస్తుతం గోచార గురువు మీనంలో జననకాల చంద్రుని మీద ఉన్నాడు. అయితే వక్రించి ఉంటూ కుంభంలోకి పోతున్నాడు. ఇది నష్టాన్నిస్తుంది. మొదట్లో అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ చివరకు పరాజయం వరిస్తుంది. వెరీ సింపుల్.

గోచార శని, లాభస్థానంలో ఉంటూ వక్రించి దానికి వ్యయస్థానమైన దశమంలోకి పోతున్నాడు. ఇది మంచి సూచన కాదు. మొదట్లో లాభం కనిపిస్తుంది. కానీ చివరకు వృత్తిపరంగా నష్టం ఎదురౌతుంది. కనుక ఓటమిని చవిచూచాడు.


లిజ్ ట్రస్ జూలై 26,1975 న ఆక్స్ ఫర్డ్  లో పుట్టింది. శతభిషా నక్షత్రం 3 వ పాదం కుంభరాశి అయింది.

గోచార గురువు, ధనస్థానంలో నుంచి లగ్నంలోకి వస్తున్నాడు. ఇది విజయసూచన.

గోచారశని, ద్వాదశంలోనుండి లాభస్థానానికి పోతున్నాడు. అంటే, మొదట్లో వెనుకబడినట్లు కనిపించినా, చివరకు లాభాన్ని పొందుతుందని సూచన.

పరుగుపందెం మొదలైనప్పుడు అదే జరిగింది. మొదట్లో శునక్ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. రాన్రాను పరిస్థితి మారిపోతూ వచ్చింది. శునక్ వెనుకబడ్డాడు.  ట్రస్ ముందుకొచ్చింది. గెలిచింది.

ఏ సంఘటననైనా నిర్ణయించే గ్రహాలలో రాహుకేతువులు కూడా ప్రధానపాత్రలలో ఉంటాయి. ఇవి ఈ జాతకాలలో ఎక్కడున్నాయో చూద్దాం.

ప్రస్తుతం వీరు మేష - తులా రాశులలో ఉన్నారు. రిషి జాతకంలో, మీనరాశి నుండి వీరు 2-8 ఇరుసులో ఉంటారు. ఇది మంచిది కాదు. అదే లీజ్ జాతకంలో నైతే, 3-9 ఇరుసులో ఉంటారు. విజయానికి ఇది మంచి యోగం. కనుక లీజ్ గెలిచింది.

చూడటానికి చాలా సింపుల్ గా కనిపించిన ఈ ఎన్నిక వెనుక, కనిపించని రాజకీయాలు, లాబీయింగులు, రేసిజం కోణాలు, ఇంకా ఎన్నో ఉంటాయి. శునక్ ను చెడుగా చిత్రీకరించి అతని విజయావకాశాలను నీరు గార్చడంలో మీడియా కూడా ప్రధానపాత్ర పోషించింది. దానివెనుక ఎవరున్నారో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అవన్నీ వివరించడం నా అభిమతం కూడా కాదు.

అయినా, భారతీయసంతతికి చెందినవాడు బ్రిటిష్ ప్రధానమంత్రి అంత సులభంగా ఎలా అవుతాడు? తెల్లదేశాలు, ముస్లిందేశాలు ఎలా ఒప్పుకుంటాయి? ఇండియా ఎదుగుతుంటే యూరప్, మిడిల్ ఈస్ట్, అమెరికా, చైనా, ఇంకా ఏ ఇతరదేశమూ ఒప్పుకోదు. ఇది చాలా చిన్న విషయం, దీనిని అర్ధం చేసుకోడానికి జ్యోతిష్యం ఎందుకు? ఇంటర్నేషనల్ ఎఫైర్స్ తెలిస్తే చాలు. కాకపోతే, సరదాగా  జ్యోతిష్య కోణాలను  చూస్తున్నామంతే.

తెరవెనుక ఎన్ని కుంభకోణాలు జరిగినా, చివరకొచ్చే గెలుపు ఓటములు మాత్రం జాతకచక్రంలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. అదొక్కటే నేను చెప్పదలుచుకున్నది !

దీనిపైన చేసిన వీడియోను ఇక్కడ చూడండి మరి !
read more " మూడవ అమెరికా యాత్ర - 15 (Liz Truss Vs Rishi Sunak Astrology) "

29, జూన్ 2022, బుధవారం

ఈ అమావాస్య గిఫ్ట్ - వరుస దుర్ఘటనలు

ఈ అమావాస్య చాలా బహుమతులనిచ్చింది. వరుసగా చూద్దాం.

ముంబై కుర్లాలో కూలిన భవనం

27 వ తేదీన రాత్రి 11. 52 కి కుర్లాలో ఒక బిల్డింగ్ కూలిపోయింది. ప్రస్తుతానికి 19 మంది శవాలు దొరికాయి. 

టెక్సాస్ లో బార్డర్ స్మగ్లింగ్ లో 46 మంది మృతి

టెక్సాస్ బార్డర్ దాటి అమెరికాలోకి వస్తున్న ఒక ట్రక్కులో 46 శవాలు దొరికాయి. దొంగచాటుగా భూతలస్వర్గంలోకి ప్రవేశించే క్రమంలో వీళ్ళు అసువులు బాశారు.

ఉక్రెయిన్ షాపింగ్ మాల్ ను కొట్టిన మిసైల్. 10 మంది మృతి

రష్యా  వేసిన మిసైల్ ఒకటి ఉక్రెయిన్ లోని బిజీ షాపింగ్ మాల్ ని కొట్టింది. 18 మంది చనిపోయారు.  ఎంతో మంది గాయపడ్డారు.

జోర్దాన్ రేవులో క్లోరిన్ గ్యాస్ లీక్ - 12 మంది మృతి, 250 మంది అస్వస్థత

క్లోరిన్ గ్యాస్ లీక్ లో విధ్వంసం జోర్డాన్ లో జరిగింది. అకాబా పోర్ట్ లో జరిగిన ఈ సంఘటన కూడా అమావాస్య ఫలితమే.

సౌతాఫ్రికా నైట్ క్లబ్ లో 21 మంది టీనేజర్ల మృతి

టీనేజర్లందరూ కలసి తిని త్రాగి డాన్సులేసి చనిపోయారు. ఈ మిస్టరీ ఇంతవరకూ తేలలేదు.

ఉదయపూర్ లో ఇస్లామిక్ గూండాల దాడి - టైలర్ దారుణ హత్య

నూపుర్ శర్మను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ వ్రాశాడని, కత్తితో పొడిచి, గొంతుకోసి కన్నయా లాల్ అనే టైలర్ని ఉదయపూర్ (రాజస్థాన్) లో చంపేశారు ఇస్లామిక్ రాక్షసులు. పైగా దీనిని వీడియో తీసి, ఇస్లాంను కించపరిచినందుకు పగ తీర్చుకున్నామని ప్రకటించుకున్నారు.

ఇవన్నీ ఈ అమావాస్య పరిధిలోనే జరిగాయి.

read more " ఈ అమావాస్య గిఫ్ట్ - వరుస దుర్ఘటనలు "

24, జూన్ 2022, శుక్రవారం

ఆఫ్ఘనిస్తాన్ భూకంపం - అల్లాను వేడుకోండి ఇండియానెందుకు?

22 వ తేదీ రాత్రి 1.30 ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ ను భయంకరమైన భూకంపం కుదిపేసింది. ఇలాంటి భూకంపం గత 20 ఏళ్లలో రాలేదు. వెయ్యిమంది పైగా మనుషులు చనిపోయారు. తెల్లవారిన దగ్గరనుంచీ ఆఫ్ఘనిస్తాన్ అందరినీ అడుక్కుంటోంది.

కుంభరాశి నుండి మిధునరాశి వరకూ గుమిగూడి ఉన్న గ్రహాల ప్రభావం వల్ల అనేక అనర్ధాలు జరుగబోతున్నాయని పదిహేను రోజుల క్రితమే వ్రాశాను. శనీశ్వరుని వక్రత్వం వీటికి తోడౌతున్నది. ఎవరి ఖర్మను వారు అనుభవిస్తున్నారు. ఇది దేశాలపరంగానూ జరుగుతున్నది, మనుషుల పరంగానూ జరుగుతున్నది.

గత పదిహేనురోజులలో ఎన్నో కుటుంబాలలో ఎన్నో మార్పులొచ్చాయి. కొందరికి పట్టుకున్న దరిద్రాలు వదిలాయి. మరికొందరికి దరిద్రం మొదలైంది. ఇదంతా ఈ గ్రహస్థితులు ప్రభావమే. సరిగ్గా గమనించండి.

ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ రాజ్యం. దైవశాసనమైన షరియా అక్కడ కఠినంగా అమల్లో ఉంది. ఆడవాళ్లకు ప్రాధమిక హక్కులు లేవు. చదువు లేదు. ఉద్యోగాలు లేవు. నల్లమందు పండించి అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాకు సరఫరా చేయడం తప్ప అక్కడ పెద్ద పరిశ్రమలేవీ లేవు. అంత గొప్ప దైవన్యాయం అమలులో ఉన్న అల్లా పరిపాలిత ప్రాంతంలో ఈ భూకంపమేంటో మరి? పోనీ వచ్చింది. అల్లానే సహాయం అడగండి. అన్ని దేశాలనూ అడుక్కోవడమెందుకు? పరమశత్రువైన ఇండియాను దేహీ అనడమెందుకు? ఇప్పుడు గుర్తురాలేదా ఇండియా కాఫిర్ల దేశమని? కాఫిర్లు పంపించే గోధుమలు, డబ్బులు ఎలా పనికొస్తాయి?

లేదా అవసరార్ధం మీ దైవన్యాయం మార్చుకుంటారా ప్రస్తుతానికి?

బమియాన్ బుద్ధుని విగ్రహాలను షూటింగ్ రేంజ్ గా మార్చుకుని మిషన్ గన్లతో తూట్లు పొడిచినప్పుడు గుర్తురాలేదా ఎంత తప్పు చేస్తున్నారో మీరు? ప్రతిదానికీ ఇండియాను విమర్శించినప్పుడు, పాకిస్తాన్ కు వంత పాడినప్పుడు గుర్తురాలేదా తప్పు చేస్తున్నామని? నిన్నటికి నిన్న, నూపుర్ శర్మ కేసులో ఇస్లామిక్ గూండాలకు వంతపాడినప్పుడు గుర్తురాలేదా తప్పు చేస్తున్నామని? ఇప్పుడెందుకు అందర్నీ అడుక్కోవడం?

మోకాటి తండా వేసుకుని అల్లాను ప్రార్ధించండి. ఆకాశం నుండి బంగారు నాణాల వర్షం కురిపిస్తాడు. మీ గండం గట్టెక్కుతుంది.

అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటే ఇదికాదా? సిగ్గులేని దేశాలు సిగ్గులేని బ్రతుకులు !

ఫారిన్ పాలసీ నియమాల ప్రకారం మానవత్వంతో ఇండియా ముందుకొచ్చి సాయం చేస్తున్నది. పక్కనే ఉన్న పాకిస్తాన్ ఎందుకు సాయం చెయ్యడం లేదు? ఎందుకంటే అదికూడా బెగ్గర్ కంట్రీనే కాబట్టి. ఎంతసేపూ ఇస్లామిక్ టెర్రరిజాన్ని పోషించడమూ, ఇండియామీద కన్నెయ్యడమూ తప్ప ఈ రెండు దేశాలూ చేస్తున్నదేముంది?

ఈనాడు ఇండియా సాయం చేసినంతమాత్రాన రేపు ఆఫ్ఘనిస్తాన్ మన మాట వింటుందని ఆశించడం పెద్ద పొరపాటౌతుంది. మామూలప్పుడు ఎలా ఉన్నా, ఇస్లాం అనేటప్పటికీ అందరూ ఒకటైపోతారు. మనకు వెన్నుపోటు పొడుస్తారు. ఇది చరిత్రలో ఎన్నోసార్లు రుజువైన సత్యం.

మానవత్వంతో సహాయం చేస్తే చేశారు. మంచిదే. కానీ ముస్లిం దేశాలను నమ్మడం ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది.

తస్మాత్ జాగ్రత్త !

read more " ఆఫ్ఘనిస్తాన్ భూకంపం - అల్లాను వేడుకోండి ఇండియానెందుకు? "

2, జూన్ 2022, గురువారం

తుల్సా ఓక్లహామా ఆస్పత్రి షూటింగ్ - జ్యోతిష్య విశ్లేషణ

జూన్ 1, 2022 బుధవారం సాయంత్రం ఐదుగంటల సమయం. అమెరికాలో మళ్ళీ కాల్పులు జరిగాయి. ఈసారి ఓక్లహామాలోని తుల్సా అనే చోట ఒక ఆస్పత్రిలోకి వచ్చిన ఒక నల్లజాతీయుడు నలుగురిని  కాల్చి చంపేసి, చివరలో తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఆ సమయానికి గ్రహస్థితి ఇలా ఉంది.

గమనించండి ! ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దుర్ఘటనలు జరగడం లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ ట్రెండ్ మారింది. ప్రతిచోటా హత్యలు, దాడులు, దుర్ఘటనలు మొదలయ్యాయి.  కారణం? ఇంతకు ముందు టెక్సాస్ షూటింగ్ పోస్ట్ లో నేను సూచించిన ప్రస్తుత గ్రహస్థితే కారణం. 

ఈ చక్రంలో తులాలగ్నం అప్పుడే మొదలైంది. కన్యారాశి ప్రభావమే ఇంకా ఉంది. దశమం అమెరికా అయింది.  తులనుంచి గృహంలో ప్లూటో (మరణం) ఉన్నది. హింసాత్మక సంఘటనలకు కారకుడైన కుజుడు గురువుతో కలసి శపితయోగ అర్గళంలో ఉన్నాడు. వీరిద్దరూ మీనరాశిలో ఉంటూ ఆస్పత్రులను సూచిస్తున్నారు. అమావాస్య వెళ్లిన మూడో రోజు. ఇంకేం కావాలి?

ఈ ఒక్క సంఘటనకే కాదు. కాశ్మీర్లో రజనీ అనే కాశ్మీర్ పండిట్ టీచర్ని ముస్లిం రాక్షసులు కాల్చి చంపేసినా, రాజస్థాన్ బ్యాంక్ ఉద్యోగిని కూడా అదే కాశ్మీర్లో కాల్చేసినా, ప్రేమకు ఒప్పుకోలేదని తమిళనాడులో రోడ్డుమీద అమ్మాయిని పొడిచి చంపేసినా, సింగర్ KK హార్ట్ ఎటాక్ తో  53 ఏళ్లకే చనిపోయినా, అక్రమసంబంధం అనుమానంతో భర్త లవర్ ని, అతని భార్య గ్యాంగ్ రేప్ చేయించి దానిని వీడియో తీయించినా, మంకీ పాక్స్, నైల్ ఫీవర్ లు మానవజాతిని బెదిరిస్తున్నా - ఇలా వ్రాస్తూ పోతే వందలాది రోజువారీ సంఘటనలకు ప్రస్తుతం ఉన్న ఈ గ్రహస్ధితే ప్రేరకం.

మళ్ళీ ఏదో సీజన్ మొదలైనట్టు అనిపించడం లేదూ?

read more " తుల్సా ఓక్లహామా ఆస్పత్రి షూటింగ్ - జ్యోతిష్య విశ్లేషణ "

30, మే 2022, సోమవారం

ఈ అమావాస్య గిఫ్ట్ - నేపాల్ విమాన ప్రమాదం - జ్యోతిష్య విశ్లేషణ

ఈరోజు అమావాస్య. నిన్న ఆదివారం ఉదయం 9 55 ప్రాంతంలో నేపాల్ లో 'తారా ఎయిర్ వేస్' అనే ప్రయివేట్ ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన విమానం కూలిపోయింది. పోఖారా అనే టూరిస్ట్ సిటీ నుండి ఇంకొక టూరిస్ట్ ప్రాంతమైన జోమ్సంకు బయలుదేరిన ఈ విమానం 12 నిముషాలలోనే కొండలలోని కోవాంగ్ అనే పల్లెటూరి దగ్గరగా కూలిపోయింది. సాధారణంగా ఈ ప్రయాణం 20 నిముషాలే పడుతుంది. 9.55  AM కి బయలుదేరిన ఈ విమానం 12 నిముషాల తర్వాత 10.07 కి కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయింది. అప్పటినుంచీ విమానం అడ్రస్ లేదు. కొండలు, మంచుల వల్ల విమానం కూలిపోయిన ప్రదేశానికి అధికారులు వెంటనే చేరలేకపోయారు. ప్రస్తుతం చేరుకున్నారు. అందులో ఉన్న 22 మంది ప్రయాణీకుల శరీరాలు గుర్తుపట్టలేనివిధంగా ముక్కలైపోయాయి. 

జ్యోతిష్య పరంగా చూద్దాం.

ప్రస్తుతం కుంభరాశి నుండి వృషభరాశి వరకూ గ్రహాలన్నీ గుమిగూడి ఉన్నాయి. ఏదో దుర్ఘటన జరిగినప్పుడు జనం గుంపులుగా గుమిగూడి చూచినట్టు ఈ దృశ్యం ఉన్నది. గత వారం నుంచీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని దుర్ఘటనలకూ ప్రస్తుతం ఖగోళంలో ఉన్న ఈ గ్రహస్థితే కారణం.

కుజుడు, గురువు దాదాపుగా ఒకే డిగ్రీమీద ఉంటూ, శపితయోగంలో బందీలై ఉన్నారు.  వారిమీద శని, ప్లూటో, శుక్ర, బుధుల ప్రభావాలున్నాయి. అందుకనే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దుర్ఘటనలు గత వారం నుంచీ జరుగుతున్నాయి. అవన్నీ వివరించడం నా ఉద్దేశ్యం కాదు.

మేషరాశి కొండకోనలను సూచిస్తుంది, అదేవిధంగా నేపాల్ దేశాన్ని కూడా సూచిస్తుంది. ప్రస్తుతం మేషరాశి తీవ్రమైన అర్గలదోషంతో ఉన్నది. అందులోనే, చంద్రుడు రాహుగ్రస్తుడై, విమానాలకు సూచకుడైన శుక్రునితో కలసి అర్గళంలో ఉన్నాడు. మరణానికి కారకుడైన యముడు (ప్లూటో) యొక్క కేంద్రదృష్టి వీరిపైన ఉన్నది. నవాంశచక్రంలో, నీచరాహువుతో కూడి ఉన్న చంద్రుడిని వక్రబుధుడు కలుస్తున్నాడు. అంటే, యాంత్రికప్రమాదం సూచింపబడుతున్నది. లెక్క సరిపోయిందనుకుంటాను.

ఈ విమానంలో 22 మంది ప్రయాణీకులున్నారు. రూట్ నంబర్ 4 అవుతున్నది. 2, 4 అనే అంకెలు రాహుకేతువులకు సూచికలు. వీళ్ళు నవాంశలో నీచస్తితులలో ఉన్నారు. 4 అంకెను సూచించే కేతువు ఒంటరివాడుగా తులలో దూరంగా ఉన్నాడు. అందుకే, ఎక్కడో కొండల్లో విమానం కూలిపోయింది. ప్లూటో (మరణం) యొక్క కేంద్రదృష్టి ఈయనమీద కూడా ఉన్నది. 24 గంటలు గడిచిన తర్వాత కూడా శవాలు కొండలలో దిక్కులేకుండా పడి ఉన్నాయి. ఇలాంటి చావులకు కేతువే కారకుడు. ఈ గ్రహయోగాలన్నీ కలసి ఈ భయంకర విమానప్రమాదానికి కారణమైనాయి.

సూక్ష్మవిషయాలను స్పష్టంగా చూపించే షష్ట్యంశ (D-60) చక్రాన్ని గమనిద్దాం.

9.55 కి ఆ ప్రాంతపు షష్ట్యంశ చక్రం ఇలా ఉంది. లగ్నాధిపతి గురువు బాధకుడు బుధునితో కలసి అస్తమయయోగంలో ఉన్నాడు. అంటే, చావు మూడబోతున్నదని అర్ధం. విమానానికి కారకుడైన శుక్రుడు నీచకేతువుతో కలసి, విమానం ధ్వంసం అవుతుందని సూచిస్తున్నాడు. కర్మ కారకుడైన శని, నేపాల్ ను సూచించే మారకరాశి మేషంలో నీచస్థితిలో ఉన్నాడు. ఈ విమానం చాలా చెడుఘడియలలో బయలుదేరింది. 

షష్ట్యంశచక్రంలోని లగ్నం ప్రతి రెండు నిముషాలకు మారిపోతూ ఉంటుంది. 9.57AM కి ఇది మేషలగ్నమైంది. అంటే, నీచశని మీదకు వచ్చింది. ప్రమాదం వేగంగా దగ్గరవడం మొదలుపెట్టింది.

9.59AM కి నీచకేతు, శుక్రుల (విమానవిధ్వంసయోగం) తో కూడిన వృషభలగ్నమైంది. విమానంలో యాంత్రికలోపాలు తలెత్తి ఉంటాయి.

10.07AM కి సింహలగ్నమైంది. అక్కడే వక్రప్లూటో (మరణం) ఉన్నాడు. ప్లూటో, గురుబుధులనూ, సూర్యకుజులనూ ఆచ్ఛాదిస్తున్నాడు. వక్రబుధ, వక్రప్లూటోల వల్ల పైలట్ బుద్ధి వక్రిస్తుంది. అంటే, జడ్జ్ మెంట్ లోపిస్తుంది. జీవకారకుడైన గురువును మరణకారకుడైన ప్లూటో ఆచ్ఛాదించడం వల్ల మరణం వరిస్తుంది. సూర్య కుజులపై ప్లూటో ఆచ్చాదన భయంకరమైన యాక్సిడెంట్ ను ఇస్తుంది. ఖచ్చితంగా ఇవే యోగాలు, షష్ట్యంశ (D-60) చక్రంలో ఉండటాన్ని చూడవచ్చు.

ఈ పాయింట్స్ అన్నిటినీ అన్వయం చేసుకోండి. నేనక్కర్లేదు, మీరే చెప్పగలుగుతారు ఏం జరిగి ఉంటుందో?

ప్రస్తుతం అమెరికానుండి, మిడిల్ ఈస్ట్ నుండి, యూరోప్ నుండి, ఇండియానుండి, శ్రీలంక వరకూ ప్రతిచోటా జరుగుతున్న దుర్ఘటనలన్నిటికీ ఈ చార్ట్ లో కనిపిస్తున్న గ్రహయోగాలే కారణం. ఇవి ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క విధంగా ప్రభావాన్ని చూపిస్తాయి.

మొత్తం మీద ఈ అమావాస్య, ప్రపంచానికి ఈ బహుమతిని ఇచ్చింది !

read more " ఈ అమావాస్య గిఫ్ట్ - నేపాల్ విమాన ప్రమాదం - జ్యోతిష్య విశ్లేషణ "

25, మే 2022, బుధవారం

టెక్సాస్ స్కూల్ షూటింగ్ - జ్యోతిష్య విశ్లేషణ

నిన్న అంటే, 24 మే 2022 న ఉదయం 11.32 ప్రాంతంలో టెక్సాస్ లో షూటింగ్ జరిగింది. షూటింగ్ అంటే సీన్మా షూటింగ్ అనుకునేరు. అదికాదు. గన్ షూటింగ్. ఒక 18 ఏళ్ల అబ్బాయి తుపాకీతో కాల్పులు జరిపి 22 మందిని  చంపేశాడు. వాళ్లలో 19 మంది చిన్నచిన్నపిల్లలు. ఇద్దరు పెద్దవాళ్లున్నారు. ఒక పోలీసు కూడా ఉన్నాడు. చివరికి అతన్ని కూడా  పోలీసులు కాల్చేశారు.

అమెరికా అంతా గగ్గోలెత్తింది. గన్ కల్చర్ కు ముగింపు  పలకాలని జో బైడెన్ తో సహా అందరూ  తీర్మానించారు. చర్చిలలో ప్రార్ధనలు చేశారు. కొవ్వొత్తులు వెలిగించారు. కానీ ఏమీ చెయ్యరు. ఏమంటే, గన్ లాబీ చాలా గట్టిది. అది వాళ్ళ వ్యాపారం మరి !

హంతకుడికి ఈ మధ్యనే పట్టుమని పదిహేడు నిండాయి. వెంటనే రెండు గన్స్  కొనుక్కున్నాడు. కార్టూన్ కేరక్టర్ లాగా వేషం వేసుకున్నాడు. యుద్దానికి వెళ్ళేవాడిలాగా తయారయ్యాడు. తుపాకీ ని టెస్ట్ చెయ్యాలికదా? ముందు ఇంట్లో ఉన్న మామ్మను సరదాగా డిష్యుం అంటూ కాల్చి పారేశాడు.  గన్ పనిచేస్తోందని నిశ్చయించుకున్నాక, నింపాదిగా దగ్గర్లో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ కొచ్చి 19 మంది పిల్లల్ని  కాల్చి పారేశాడు. అడ్డొచ్చిన పోలీసుని కాల్చేశాడు. ఒక టీచర్ని కాల్చేశాడు. ఎదురుకాల్పులలో చనిపోయాడు.

గ్రహాలేమంటున్నాయో చూద్దాం.

షూటింగ్ జరిగిన యువాల్డీ అనే ఊళ్ళో ఆ సమయానికి  కర్కాటకలగ్నం 15 డిగ్రీ ఉదయిస్తోంది. అసలు ఇలాంటి సంఘటనలకు కుజరాహువులు కారకులౌతారు. ఈ చక్రంలో కుజుడు చంద్రగురువులతో కలసి ఉంటూ మతపరమైన రాక్షసత్వాన్ని సూచిస్తున్నాడు. పైగా, రాహుశనుల మధ్యన అర్గలబందీ అయ్యాడు. ఇది చాలా భయంకరమైన క్రూరయోగం. ఈ కుజుని చతుర్ధదృష్టి అమెరికాను సూచించే మిధునరాశి  మీదుంది. చిన్నపిల్లలకు సూచకుడైన బుధుడు వక్రిగా మారి, అస్తంగతుడై, ప్లుటోతో ఖచ్చితమైన దృష్టితో చూడబడుతున్నాడు. పైగా, కుజుడు సూచించే దక్షిణపు గేట్ లోనుంచి హంతకుడు స్కూల్లోకి అడుగుపెట్టాడు.

ఇంకేం కావాలి? 20 ఏళ్లలో జరగని ఘోరం జరిగింది. పాపం ఈ స్కూల్లో చదువుకునే పిల్లల్లో  చాలామంది పేదవాళ్ళైన హిస్పానిక్ పిల్లలే.

అమెరికాలో ఉన్న రేసిజానికి, మానసికరోగాలకు, చిన్నవయసులోనే పిల్లలలో పుట్టే పెడబుద్ధులకు ఈ సంఘటన అద్దం పడుతోంది. టెక్సాస్ రాష్ట్రంలో గన్స్ విరివిగా చాకోలెట్ల మాదిరి అమ్ముతారు. ఓరిగాన్ లో పెట్టిన ఓషో ఆశ్రమానికి కావలసిన తుపాకులను కూడా, షీలా మనుషులు టెక్సాస్ నుండే కొనుక్కున్నారు. పైగా శాంతిని ప్రబోధించే క్రైస్తవమతం కూడా అక్కడ చాలా ఎక్కువ. మరి పిల్లలకి ఇదేనా నేర్పించేది? ప్రతీ ఆదివారం చర్చిలలో ఊరకే మాయదారి శాంతివచనాలు పలకడమేనా? లేక ఇప్పుడైనా నిజాయితీగా ఈ గన్ కల్చర్ కు ముగింపు పలుకుతారా? ఏమో చూద్దాం !

read more " టెక్సాస్ స్కూల్ షూటింగ్ - జ్యోతిష్య విశ్లేషణ "

4, మే 2022, బుధవారం

Elon Musk Astro Chart - Terrific Dhana Yogas

'ఎంతసేపూ యాక్సిడెంట్లు, చావులు, యుద్ధాలు, ప్రకృతి దుర్ఘటనలు ఇలాంటివి విశ్లేషణ చేయడమేనా? కాస్త మంచిమాటలు కూడా అప్పుడప్పుడు వ్రాయవచ్చు కదా?' అంటూ నిన్నరాత్రి కర్ణపిశాచి కల్లోకొచ్చి మరీ అడిగింది.

'సరే ఏం రాయమంటావో కోరుకో' అన్నాను.

'ఎలాన్ మస్క్ జాతకం రాయి. అంత డబ్బు ఎలా వస్తుందో తెలుసుకోవాలనుంది' అంటూ ముచ్చటపడింది.

'దానికి జాతకం ఎందుకు? గతజన్మలలో ఎన్నో దానధర్మాలు లెక్కలేనన్ని చేసుంటే అలాంటి జన్మ వస్తుంది' అన్నాను.

'కాదు చూడవా ప్లీజ్' అంటూ తెగ బ్రతిమిలాడింది.

'సరే పో' అని దానిని కలలోనుంచి పంపించేశా.

ఈ పోస్ట్ అలా మొదలైందన్నమాట !

ఎంతోమంది సెలబ్రిటీస్ జాతకాల లాగా ఇతనికి కూడా జనన సమయం ఎవరికీ తెలియదు.  జననప్రదేశం మాత్రం ప్రిటోరియా సౌతాఫ్రికా. పుట్టింది 28 జూన్ 1971. కర్ణపిశాచినడిగితే సాయంత్రం 6. 50 అని చెప్పింది. ఆ సమయానికి వేసిన జాతకచక్రం ఇది.   

సరే మకరలగ్న జాతకమైంది. ఇక ధనయోగాలు చూద్దాం.

భయంకర ధనయోగాలు

లాభాధిపతి అయిన కుజుడు ఉచ్ఛస్థితిలో లగ్నంలో ఉండటం భయంకర ధనయోగం.    కుజుడు చతుర్ధాతిపతి కూడా. అంటే, మనస్సును సూచిస్తాడు. కనుక ఇతను ఒక ప్లాన్ వేశాడంటే అది కనకవర్షాన్ని కురిపించాల్సిందే. ఈ జాతకంలో ఇదొక సక్సెస్ యోగం.

రాహువు లగ్నంలో ఉండటం వల్ల దూరాలోచన దురాలోచన రెండూ ఉంటాయి. శనిని సూచిస్తున్నందువలన చాపకింద నీరులాంటి భయంకరమైన ప్లానింగ్ ఉంటుంది. పైగా పట్టుదలకు మారుపేరైన మకరలగ్నం. మహామొండివాడైన కుజుని ఉచ్ఛస్థితి. ఇంతకంటే 'సక్సెస్ మంత్ర' ఇంకేముంటుంది?

లాభస్తానంలోని గురువువల్ల అమితమైన పుణ్యబలం కనిపిస్తున్నది. అందుకే ఏది పట్టుకున్నా బంగారమౌతుంది. గురువు వక్రతవల్ల ద్వాదశాధిపత్యం మంచిదౌతుంది. పరాయిదేశంలో లాభాలపంటను పండిస్తుంది. ఇదే కారణం చేత, గురువు దశమమైన తులలోకి పోతాడు. దశమంలో గురువు వల్ల పట్టిందల్లా బంగారమౌతుంది.

సుఖవిలాస యోగం

బుద్ధిస్థానమై, భౌతికసుఖాలకు ఆలవాలమైన వృషభంలో కలిగిన శనిశుక్రుల యోగం భయంకరమైన విలాస, సుఖయోగం. ఇతను తలపెట్టే ప్రతి ప్రాజెక్టునూ సక్సెస్ చేసే గ్రహానుగ్రహం ఇదే.

బుధాదిత్యయోగం

ద్వితీయ వృత్తిస్థానమై,  అమెరికాను సూచిస్తున్న మిధునంలో ఉన్న బుధాదిత్యయోగం వల్ల, మంచి తెలివితేటలూ, సౌతాఫ్రికాలో పుట్టినప్పటికీ అమెరికాలో స్థిరపడి భయంకరమైన సక్సెస్ ను సాధించడం జరిగింది. చిన్నవయసులోనే కంప్యూటర్ ప్రొగ్రామింగ్ లో విపరీతమైన తెలివి ఇందుకే కలిగింది.

రోగ యోగం

అయితే, ఇది రోగస్థానం కూడా కావడం వల్ల ఇతనికి  యాస్పర్జర్ సిండ్రోమ్ అనే రోగం దాపురించింది. ఇది ఒకరకమైన ఆటిజమే. ఈరోగం ఉన్నవాళ్లు చేసిందే చేస్తూ, పర్ఫెక్షనిస్ట్ లుగా,  ఒక విధమైన మొండి మనుషులుగా ఉంటారు. జాతకంలో ఇతర అదృష్టయోగాలు కలిస్తే, ఈ పోకడ భయంకరమైన అదృష్టాన్నిస్తుంది. లేకపోతే దురదృష్టాలతో జీవితాంతం బాధపడే మెంటల్ పేషంట్ ని చేస్తుంది. జాతకంలో ఇలాంటి సూక్ష్మమైన తేడాలుంటాయి. 

సాధారణంగా, ఉండవలసిన దానికంటే తెలివితేటలు ఎక్కువైతే, కొంచెం పిచ్చిదోరణి తప్పకుండా ఉంటుంది. లేదా నరాల సంబంధిత జబ్బు ఉంటుంది. అయిన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ లు దీనికి ఉదాహరణలు.

ఇతని ముఖంలో కొంచం ఆటిజం కవళికలున్నట్లు గమనించవచ్చు.

మొండి అధికారి

లగ్నసప్తమాలైన మకర కర్కాటకాలలో ఉన్న రాహుకేతువులవల్ల, తనమాట ఎదుటివారు వినడమేగాని, ఎదుటివారిమాటను తను ఎట్టిపరిస్థితిలోనూ వినని భయంకరమైన ఎడ్మినిస్ట్రేటర్ కనిపిస్తున్నాడు. అంటే మొండి సీతయ్యన్నమాట.

ఎదురులేని యోగం

సప్తమాధిపతి అయిన చంద్రుడు అష్టమంలో పడటంవల్ల ప్రత్యర్థుల మాట చెల్లకపోవడం, ఇతనికి ఎదురు ఎవరూ నిలవలేకపోవడం, అయితే అదే సమయంలో వివాహజీవితం చెడిపోవడం కనిపిస్తున్నాయి.

గోచారం

ప్రస్తుతం ఇతనికి సప్తమశని మొదలైంది. అందుకే ట్విట్టర్ ఉద్యోగులతో మనస్పర్థలు మొదలయ్యాయి. ప్రస్తుతం అంతా బాగానే ఉన్నప్పటికీ, ఇంకొక రెండున్నరేళ్ల తర్వాత రాబోతున్న అష్టమశని సమయంలో మాత్రం తీవ్రమైన ఒడుదుడుకులు తప్పవని అనిపిస్తున్నది.

ఏ మనిషికైనా జీవితమంతా మొదటినుంచీ చివరిదాకా ఒకేలాగా ఉండదుకదా మరి !

read more " Elon Musk Astro Chart - Terrific Dhana Yogas "

1, మే 2022, ఆదివారం

కాబూల్ బాంబు ప్రేలుడు - గ్రహాల పాత్ర

మొన్న శుక్రవారం నాడు ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లో ఒక బాంబు ప్రేలుడు జరిగింది. ఇది మధ్యాన్నం 2 గంటలకు ఒక మసీదులో జరిగింది. ఈ దాడిలో 50 మంది పైగా చనిపోయారు. ఇంకో 60 మంది పైగా తీవ్రగాయాల పాలయ్యారు. రంజాన్ మాసపు చివరి శుక్రవారం నాడు ప్రశాంతంగా ప్రార్ధనలు చేసుకుంటున్న ముస్లిములలో, కొందరు ఆత్మాహుతి తీవ్రవాద ముస్లిములు చేరి, తమనుతాము పేల్చేసుకుని, వాళ్ళు ముక్కలై పోవడమే గాక, ఇంతమంది సోదర ముస్లిములని చంపేశారు. ఇస్లామంటే శాంతేనని, శాంతి తప్ప మరేమీ కాదని, మతిలేని ఈ రక్తపాతం ద్వారా ప్రపంచానికి మళ్ళీ రుజువైంది. ఆఫ్ కోర్స్ ప్రతి శుక్రవారమూ ఇది రుజువౌతూనే ఉందనుకోండి. మళ్ళీ ఇంకొకసారి కూడా రుజువైంది. జనానికి షార్ట్ మెమరీ కదా. మర్చిపోతారని అలా గుర్తు చేస్తూ ఉంటారు వాళ్ళు అంతే !

ఇప్పటికీ మీకు నమ్మకం కలగలేదా? ఇస్లామంటే శాంతే. శాంతితప్ప మరేమీ కాదు. నమ్మండి. నమ్మకపోతే ప్రవక్తగారికి కోపమొస్తుంది. ఇంతా చేస్తే, ఇది షియాలు సున్నీల మధ్యన జరిగే పరస్పర చంపుకోవడం అనుకునేరు ఛా ! వాళ్ళంత రాతియుగంలో లేరు. చాలా ఎదిగారు. ఇప్పుడు సున్నీలు సున్నీలు చంపుకుంటున్నారు.

ఒవైసీగారు అదేరోజున హైదరాబాదులో మాట్లాడుతూ, ఇండియాలో ముస్లిములకు రక్షణ లేదని ఏడ్చేశారు. పాపం ! ఇక్కడ ఈయన ఏడుస్తున్న సమయంలోనే కాబూల్లో ఈ సంఘటన జరిగింది. ఎక్కడ ఎవరికి రక్షణ లేదో ఏంటో మరి !

అయినా మన పిచ్చిగాని, శుక్రవారం నాడు ప్రార్ధనలు అయిపోయాక చంపడానికి ఎవరో ఒకరు వాళ్లకు కావాలి కదా. ప్రశాంతంగా ప్రార్ధనలు చేసుకున్నాక మనసంతా పిచ్చిపిచ్చిగా ఉంటుంది కదా? అర్జంటుగా ఎవర్నో ఒకర్ని చంపాలి. చేతులు మహా దురదగా ఉంటాయి. ఎవరూ  బయటవాళ్ళు దొరక్కపోతే వాళ్ళు మాత్రం ఏమ్ చేస్తారు పాపం? అందుకని వాళ్లలో వాళ్లే సరదాగా చంపుకుంటున్నారు. అలా చేసుకోమని ప్రవక్తగారి ఆజ్ఞ. వాళ్ళ తప్పేమీ లేదు.

మొన్నీమధ్యన మన ఇండియాలోనే ఒక అరబిక్ కాలేజీలో చదువుకుంటున్న ఒక ముస్లిం అబ్బాయిని, అక్కడి అరబ్బీ లెక్చరర్ గారు చక్కగా రేప్ చేశారు. ఇది పేపర్లలో కూడా వచ్చింది. మీరు సరిగ్గానే విన్నారు. అబ్బాయినే. మరి అమ్మాయిలెవరూ దొరక్కపోతే ఆ ముల్లాగారు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? దాదాపుగా అలాంటిదే ఈ కాబూల్ పేలుడు కూడా !

ఇంతా చేస్తే, ధిక్ర్ అనే ఒక తంతుని సున్నీలలో ఒక వర్గం పాటిస్తుంది. ఇంకో చాదస్తపు వర్గం దీనిని ససేమిరా ఒప్పుకోదు. ముస్లిములలో సహనం చాలా ఎక్కువ కదా ! వాళ్ళలాగా లేకపోతే, వాళ్ళ తంతునే చెయ్యకపోతే, వాడు సైతాన్ భక్తుడి కిందే లెక్క. వాడికి మరణమే శిక్ష. దానిని అమలు చేసే అధికారాన్ని ప్రవక్తగారు బ్లాంక్ చెక్కు లాగా ఎప్పుడో వారికి ఇచ్చేశారు. అందుకని అలా చంపేస్తారన్న మాట !

నాన్ ముస్లిమ్స్ ఎలాగూ వాళ్ళ దృష్టిలో సైతాన్ భక్తులే. ముస్లిమ్స్ లో కూడా, వేరే వర్గం వాళ్ళు సైతాన్ భక్తులే. వాళ్ళూ వీళ్ళని అలాగే అనుకుంటారు. వెరసి ఎవరు సైతాను భక్తులో, ఎవరు కాదో, బాంబులు సమాధానం చెబుతాయి. పాతకాలంలో అయితే కత్తులు చెప్పేవి. ఇప్పుడు మోడ్రన్ యుగం కదా టెక్నాలజీ పెరగలా? అందుకని బాంబులు.  అదన్నమాట శాంతిమతం అంటే !

ఇప్పుడు జ్యోతిష్యపు కోణాన్ని చూద్దాం. 
  • శని కుజులు కలసి కుంభంలో ఉన్నారు. ఇది దుర్ఘటనా యోగం.
  • అమావాస్య పరిధి. 
  • ఒక్కరోజులో సూర్యగ్రహణం. 
  • చంపుకోడానికి చక్కని ముహూర్తమైన శుక్రవారం
  • ఉచ్ఛశుక్రుడూ, యముడూ దగ్గరి దృష్టిలో ఉన్నారు.
  • ఆఫ్ఘనిస్తాన్ ను సూచించే ధనూరాశి మొదటి డిగ్రీలకు, గురు, శుక్ర, చంద్రులకు అర్గళం పట్టిన మీనరాశి చతుర్ధం అయింది. అంటే, గృహం. అంటే ఇంట్లో విధ్వంసం. సరిపోయిందా మరి?
  • చంద్ర రాహువులు దగ్గరి 2/12 దృష్టిలో ఉన్నారు. ఇది ఖచ్చితంగా రాహువు పనే. 
ఇప్పుడు ఇంకో విషయం చెబుతా  వినండి.

దేవతల వరుసలోకి దేవతావేషం వేసుకున్న రాహువు జొరబడి అమృతం త్రాగాడు. ఇక్కడ ముస్లిముల వరుసలోకి సూయిసైడ్ బాంబర్లయిన ముస్లిములే మారువేషంలో జొరబడి వాళ్ళని చంపేశారు. లెక్క సరిపోయిందా మరి !

అయితే రాహువు మంచిపనే చేశాడు. వాళ్లలో వాళ్ళు చంపుకోకపోతే రాక్షసులు లోకం మీద పడతారు. కనుక రాహువు చేసినది మంచిదే. ముసలం పుట్టించి వాళ్లలో వాళ్ళే కొట్టుకుని చచ్చేటట్టు చేస్తున్నాడు. రాక్షసుల బారినుండి లోకాన్ని ఈవిధంగా కాపాడుతున్నాడు. గ్రహప్రభావం ఇలాగే ఉంటుంది మరి !

గ్రహాలను నమ్మనివారు కూడా గ్రహప్రభావానికి లోనయ్యే బ్రతుకుతారని చెప్పడానికి ఇదే ఒక మంచి ఉదాహరణ !

read more " కాబూల్ బాంబు ప్రేలుడు - గ్రహాల పాత్ర "

19, ఏప్రిల్ 2022, మంగళవారం

వరుణుని (నెప్ట్యూన్) మీనప్రవేశం - ఫలితాలు

నా జ్యోతిష్యవిధానంలో, శనికక్ష్యకు బయటగా ఉన్న యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో గ్రహాలను కూడా నేను లెక్కిస్తాను. ఇప్పుడు శాస్త్రవేత్తలు ప్లూటోను గ్రహంగా లెక్కించడం లేదు. కానీ చాలా రుజువులు కనిపించిన మీదట, ఇప్పటికీ ప్లుటోను కూడా గ్రహంగానే నేను లెక్కిస్తాను.

ఇకపోతే, నెప్ట్యూన్ ను వరుణుడు అని మనం పిలుస్తాం. ఈ గ్రహం ఒక్కొక్క రాశిలో 14 ఏళ్లపాటు ఉంటుంది. గతంలో, 25 ఏప్రియల్ 2008 న మకరాన్ని వదలిపెట్టి కుంభంలోకి ప్రవేశించింది. అప్పటినుంచీ నిన్నటివరకూ కుంభంలో ఉన్నది. నిన్న, కుంభాన్ని వదలి మీనంలోకి ప్రవేశించింది. మరొక్క 14 ఏళ్లపాటు అంటే, 2036 వరకూ మీనంలో సంచరిస్తుంది.

ఈ గోచారఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం.

------------------------------------------------------------------------

మేషం

చాలాకాలం నుంచీ ఉంటున్న ప్రదేశాన్ని విడచిపెడతారు. లాభం తగ్గుతుంది. ఖర్చు ఎక్కువౌతుంది.

వృషభం

లాభాలతో కూడిన జీవితం మొదలౌతుంది. ఇది 2036 వరకూ నడుస్తుంది. ఊహించినదానికంటే ఎక్కువ కూడబెడతారు.

మిధునం

వీరి వృత్తి ఉద్యోగాలు మందగిస్తాయి. అయితే, లిక్కర్ వ్యాపారం మాత్రం బాగుంటుంది. వైద్యులకు బాగుంటుంది.

కర్కాటకం

దూరదేశాలకు వెళతారు. భక్తిమార్గంలో మునుగుతారు. ఆధ్యాత్మికచింతన, ముఖ్యంగా తంత్రసాధన రాణిస్తుంది.

సింహం

పిత్రార్జితం కలసి వస్తుంది. విపరీతమైన లాభాలుగాని, విపరీతమైన నష్టాలు గాని ఉంటాయి. త్రాగి వాహనాలు నడిపితే యాక్సిడెంట్లో పోతారు.

కన్య

వివాహజీవితం, సమాజసంబంధాల పైన ఫోకస్ ఉంటుంది. ఘర్షణ తప్పదు. మాఫియాలతో, దొంగలముఠాలతో సంబంధాలు ఏర్పడతాయి.

తుల

శత్రుబాధ, రోగబాధ పెరుగుతాయి. జలప్రమాదం జరుగుతుంది. త్రాగుడుకు బానిసలై లివర్, కిడ్నీ జబ్బులు తెచ్చుకుంటారు.

వృశ్చికం

ఆధ్యాత్మికచింతన పెరుగుతుంది. పిల్లలు వ్యసనాలకు బానిసలై పాడైపోతారు.

ధనుస్సు

తల్లికి గండం. జాతకులకు మానసిక వ్యాధి లేదా గుండెజబ్బు తలెత్తవచ్చు.

మకరం

అతివాగుడు, మాటదూకుడు ఎక్కువౌతాయి. జలగండం ఉంది.

కుంభం

కుటుంబం పెరుగుతుంది. మాట చెల్లుబాటు అవుతుంది.

మీనం

త్రాగుడుకు వ్యసనాలకు బానిసలౌతారు. లేదా అసలైన ఆధ్యాత్మికమార్గంలో ఉంటే రాణిస్తారు.

ఈ ఫలితాలు చాలా విశాలమైన పరిధిలో ఉంటూ 14 ఏళ్లపాటు నడుస్తాయి. వీటిలోపల మిగతా గ్రహాల ప్రభావం నడుస్తుంది. ఈ మొత్తం సమీకరణాన్ని అర్ధం చేసుకుంటే, మన జీవితమేంటో, ఎలా నడుస్తుందో అర్ధమౌతుంది.
read more " వరుణుని (నెప్ట్యూన్) మీనప్రవేశం - ఫలితాలు "