“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, జనవరి 2020, మంగళవారం

ప్రయత్నం

పక్క జీవిని తింటూ
తను హాయిగా బ్రతకాలని
ప్రతి జీవీ ప్రయత్నం

నక్కజిత్తులు వేస్తూ
నాటకాలాడటం
సగటుజీవి ప్రయత్నం

పోతానని తెలిసినా
పోకుండా ఉండాలని
ప్రతి ప్రాణీ ప్రయత్నం

మోతబరువు మోస్తున్నా
మోజు తీరకపోవడం
సంసారి ప్రయత్నం

వద్దనుకునేదానిలోనే
వయసంతా బ్రతకడం
సన్యాసి ప్రయత్నం

తప్పని తెలిసినా
తప్పించుకోలేక తారట్లాడటం
మనిషి ప్రయత్నం

ఎప్పటినుంచో కోరుకున్నది
ఎదురుగా ఉన్నా అందుకోలేని
అసమర్ధుని ప్రయత్నం

చెయ్యలేనని తెలిసినా
చేద్దామనుకోవడం
ఆశాజీవి ప్రయత్నం

అరగదని తెలిసినా
ఆబగా తినబోవడం
అతితెలివి ప్రయత్నం

తను చెయ్యలేనిది
ఇతరులకు చెప్పబోవడం
బోధకుని ప్రయత్నం

సాధ్యం కాదని తెలిసినా
సాధించాలని చూడటం
సాధకుని ప్రయత్నం

లేవలేరని తెలిసినా
నిద్ర లేపబోవడం
గురువు ప్రయత్నం

నిండైన మనిషికోసం
నిత్యం చేస్తున్న
ప్రకృతి ప్రయత్నం

గుండెల్లో తనకు
గుడికట్టేవాడి కోసం
దైవం ప్రయత్నం
read more " ప్రయత్నం "

26, జనవరి 2020, ఆదివారం

Corona Virus - రాహుకేతువుల సంబంధం

రాహుకేతువులకు అన్ని వైరస్ ల మీదా, అన్ని అసాధ్యరోగాల మీదా అదుపు ఉందని ఇంతకు మునుపు చాలాసార్లు వ్రాశాను. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కూ రాహుకేతువులకూ ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు వినండి.

ఈ వైరస్ ముఖ్యంగా ఒంటెల నుంచి, పాముల నుంచి, గబ్బిలాలనుంచి మనుషులకు పాకుతుంది. ఆ తరువాత గాలిద్వారా తుమ్ములద్వారా మనుషులలో శరవేగంతో వ్యాపిస్తుంది. ఒంటె, పాము, గబ్బిలం మూడూ రాహుకారకత్వాల లోనివే. ఒంటె అనేది అరేబియా జంతువు. ముస్లిం దేశాలన్నీ రాహువు ఆధీనంలోనే ఉంటాయి. అలాగే వారు ఎక్కువగా వాడే ఒంటె కూడా రాహువు అధీనంలో ఉన్న జంతువే.

ఇక, గబ్బిలం చూస్తె రాత్రిళ్ళు మాత్రమే సంచరిస్తూ పాడుపడిన ఇళ్ళలోనూ చెట్లకొమ్మలలోనూ నివసించే పక్షి లాంటి క్షీరదం. చీకటి, పాడుబడిన ఇళ్ళు, ఎవరూ తిరగని అడవులు - ఇవన్నీ రాహువు అధీనంలో ఉండేవే. రాహుకేతువులు రాశిచక్రంలో వ్యతిరేకదిశలో సంచరిస్తాయి. అంటే తల్లక్రిందులుగా ప్రయాణం చేస్తాయి. గబ్బిలం కూడా తల్లక్రిందులుగానే వేలాడుతూ ఉంటుంది. రాహుకేతువులు దయ్యాలకూ, భూతాలకూ, పిశాచాలకూ కారకులు. గబ్బిలం కూడా సైతాన్ వాహనం అని. డ్రాక్యులాకు మెసెంజర్ అనీ పాశ్చాత్య దేశాలలో భావిస్తారు. కనుక గబ్బిలం రాహువు అధీనంలోనిదే. ఇకపోతే పాముల గురించి చెప్పనే అక్కర్లేదు. రాహుకేతువులంటేనే సర్పం గుర్తుకు వస్తుంది. జాతకంలో సర్పదోషం అనేది రాహువు వల్లనే కలుగుతుంది. కనుక ఈ మూడూ రాహువును సూచించేవే. ఈ మూడింటి వల్లనే ఇప్పుడు కరోనా వైరస్ మనుషులను ఎటాక్ చేస్తోంది. కనుక ఇది రాహుకేతు ప్రభావమే.

చైనావాళ్ళు పాములను తింటారు గనుక, వాటినుంచి వారికి ఈ వైరస్ పాకి, వారిద్వారా మిగతా దేశాలకు పాకుతోంది. అంటే, రాహుకేతువులకు చైనావాళ్ళు క్యారియర్స్ గా పనిచేస్తున్నారన్నమాట. వాళ్ళ ముఖాలు, కళ్ళు కూడా పాముల లాగే ఉంటాయి గనుక వారికీ వాటికీ బాగా సరిపోయింది !!

ఇంకొక ఆసక్తికరమైన విషయం వినండి !

ఈ వైరస్ కు ఏ వైద్యవిదానంలోనూ మందులు లేవు - ఒక్క హోమియోపతిలో తప్ప ! ఇంతా చేస్తే, చాలా దేశాలలో హోమియోపతిని అసలు ఒక వైద్యంగానే గుర్తించరు. అమెరికాలో అయితే, ఇదొక కల్ట్ మెడిసిన్ అంటారు. అంటే నాటువైద్యం అన్నమాట! ఈ విధానం పుట్టిన జర్మనీలో కూడా ఇప్పుడు హోమియోపతికి విలువ తగ్గిపోయింది. దీనికి కారణం అంతర్జాతీయ ఫార్మా కంపెనీల లాబీయింగ్ మాయాజాలం ! సత్యమైన హోమియోపతి వైద్యవిధానం గనుక ప్రాచుర్యంలోకి వస్తే, ఫార్మా కంపెనీల మాయలు, నాటకాలు సాగవు. కనుక అదొక వైద్యమే కాదని వాళ్ళు శాయశక్తులా ప్రచారం చేస్తూ ఉంటారు. పిచ్చిజనం నమ్ముతూ ఉంటారు.

జపనీస్ ఎన్కెఫలైటిస్ వచ్చినపుడు హోమియో మందులే జనాన్ని రక్షించాయి. ఆ తర్వాత జికా వైరస్ వచ్చినపుడూ, డెంగూ ఫీవర్ వచ్చినపుడూ, చికన్ గున్యా వచ్చినపుడూ, ఇంకా ఇలాంటి ఎన్నో అంతుచిక్కని రోగాలు వచ్చినపుడూ జనాన్ని కాపాడినవి హోమియో మందులే.  అన్ని వైద్యవిధానాలూ అప్పుడు చేతులెత్తేశాయి. కానీ, అవసరం తీరాక, హోమియోపతి అసలు వైద్యమే కాదంటాయి. ఎంత నీచులో మనుషులు? కనీస కృతజ్ఞత కూడా వీళ్ళకు ఉండదు మరి?

ఇప్పుడు ఈ కరోనా వైరస్ కు కూడా హోమియోపతిలో మాత్రమే మంచి ఔషధాలున్నాయి. హోమియోపతి వైద్యానికి కూడా రాహువే అధిపతి మరి ! ఎవరి జాతకంలో నైతే, రాహుకేతువులు ఉచ్చస్థితిలోనో. లేదా నీచస్థితిలోనో ఉంటాయో వారే మంచి మంచి హోమియో డాక్టర్లు అవుతారు ! ఇది నా రీసెర్చిలో నిగ్గుతేలిన సత్యం !!

కరోనా వైరస్ బయటపడటానికి సరిగ్గా మూడ్రోజుల ముందు - కేతుగ్రస్త సూర్యగ్రహణం వచ్చిందని గుర్తుంటే - నేను చెబుతున్న ఈ లింక్ చక్కగా అర్ధమౌతుంది మీకు.

రాహుకేతువుల వల్ల వచ్చిన కరోనా వైరస్ నుండి రక్షించడం మళ్ళీ అదే రాహువు అధీనంలో ఉన్న హోమియోపతి వల్ల మాత్రమే అవుతోంది ! ఈ రుజువులు చాలా? ఇంకా కావాలా? మనుషుల ఖర్మను అనుభవింపచెయ్యడంలో రాహుకేతువుల పాత్రను - ఇంకా చెప్పాలంటే గ్రహాల పాత్రను నిరూపించడానికి?
read more " Corona Virus - రాహుకేతువుల సంబంధం "

24, జనవరి 2020, శుక్రవారం

Corona Virus - షష్ఠగ్రహకూటమి ఫలితమా??

Corona Virus
Corona of the Sun

డిసెంబర్ 25,26,27 తేదీలలో ధనూరాశిలో షష్ఠగ్రహ కూటమి జరిగింది. సరిగ్గా మూడురోజుల తర్వాత డిసెంబర్ 31 న చైనాలో ఒక క్రొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది.  దానిపేరు కరోనా వైరస్. ఇప్పుడు ప్రపంచం అంతా దీని పేరువిని గడగడా వణికిపోతున్నది. ఆసియా దేశాలలో ఇది శరవేగంతో వ్యాపిస్తున్నది. జలుబుతో మొదలై, న్యుమోనియా వరకూ వెళ్లి, కిడ్నీ ఫెయిల్యూర్ తో చావును కొనితెచ్చే ఈ వైరస్ పేరు వింటే నేడు దేశదేశాలు భయంతో వణుకుతున్నాయి. చైనానుంచీ, ఆసియాలో ఇతర దేశాలనుంచీ విమానాలలో వస్తున్న ప్రయాణీకులను ఇతర దేశాలలో ఆపేస్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా జరగబోయే 3 కోట్లమంది ప్రయాణాలను చైనాలో ఇప్పటికే కేన్సిల్ చేశారు. అమెరికాలోని టెక్సాస్, వాషింగ్టన్, చికాగోలలో ఇప్పటికే కొన్ని కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ పేరు చెబితే అమెరికా భయంతో గడగడా వణికిపోతున్నది.

ఈ వైరస్ ముఖ్యంగా SARS and MERS అనే రోగాలను కొనితెస్తుంది. వీటిలో SARS అంటే Severe acute respiratory syndrome. MERS అంటే Middle East respiratory syndrome. సాధారణ జలుబులా మొదలైన ఈ రోగం, అతి త్వరగా లంగ్ ఇన్ఫెక్షన్ గా మారుతుంది. ఏ మందులకూ లొంగదు. ప్రస్తుతానికి దీనికి మందులు లేవు. ఒకరినుంచి ఒకరికి త్వరగా వ్యాపిస్తుంది. ఇది చైనా నుంచి దాదాపు నలభై దేశాలకు వ్యాపించింది. వందలాదిమంది చావులకు కారణం అయింది. ఇప్పుడు మళ్ళీ దేశదేశాలకు వ్యాపించబోతున్నది.

1960 నించే ఈ వైరస్ మనకు తెలుసు. దీని మూలాలు 8000 ఏళ్ళ క్రితమే భూమ్మీద ఉన్నాయట. కానీ ఇప్పుడు కనిపెట్టబడిన వైరస్ వీటిలో ఒక క్రొత్త రకం. ఇదే ఇప్పుడు దేశదేశాలను భయపెడుతోంది. అసలు విషయం ఏమంటే, ఇదంతా షష్ఠగ్రహకూటమి జరిగిన మూడురోజుల్లో మొదలు కావడం !!

షష్ఠగ్రహకూటమి సమయంలోనే సూర్యగ్రహణం కూడా వచ్చింది. సూర్యగ్రహణానికీ ఈ వైరస్ కీ ఉన్న లింక్ చెబితే మీరు ఆశ్చర్యంతో తల్లక్రిందులౌతారు. సూర్యగ్రహణ సమయంలో సూర్యుడు మొత్తం నల్లగా అయినప్పుడు సూర్యబింబం చుట్టూ ఒక వెలుగుతొ కూడిన రింగ్ లాగా వస్తుంది. దానిని 'కరోనా' అంటారు. సరిగా ఈ వైరస్ స్వరూపం కూడా అలాగే ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరును 1960 ప్రాంతాలలోనే పెట్టారు. కానీ విచిత్రం అదికాదు. సరిగ్గా సూర్యగ్రహణం + షష్ఠగ్రహ కూటమి జరిగిన వెంటనే ఈ వైరస్ లో ఒక కొత్త స్ట్రెయిన్ ప్రత్యక్షమై, అది శరవేగంతో వ్యాపిస్తూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అదీ అసలైన వింత !!

సూర్యుని కరోనా కూ ఈ వైరస్ కూ పేరులోనే కాదు. రూపంలో కూడా దగ్గర పోలికలున్నాయి. మరిప్పుడు ఒప్పుకుంటారా, ఖగోళంలో గ్రహసంచారానికీ, భూమ్మీద జరిగే సంఘటనలకూ అవినాభావ సంబంధం ఉందని? పదేళ్ళ నుంచీ కొన్ని వందల రుజువులు చూపించా. ఇంకెన్ని రుజువులు కావాలో చెప్పండి మరి?
read more " Corona Virus - షష్ఠగ్రహకూటమి ఫలితమా?? "

23, జనవరి 2020, గురువారం

2020 శనీశ్వరుని మకరరాశి ప్రవేశం - ఫలితాలు

రేపు 24-1-2020 న ఉదయం 8-30 కి శనీశ్వరుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడ రెండున్నరేళ్ళు ఉంటాడు. ఈ రెండున్నరేళ్ళలో పన్నెండు రాశులు/ లగ్నాల వారికి ఏయే ఫలితాలు జరుగుతాయో స్థూలంగా చదవండి.

మేషరాశి
వీరికి ఈ రెండేళ్ళూ అంతా ఉద్యోగం చుట్టూ తిరుగుతుంది. ఉద్యోగంలో ఎత్తు పల్లాలను చూస్తారు. ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. కానీ చివరకు అంతా మంచే జరుగుతుంది. భయపడటం అనవసరం. డబ్బు బాగా ఖర్చౌతుంది. భార్యకు/భర్తకు అనారోగ్యం కలుగుతుంది.

వృషభరాశి
దూరదేశ ప్రయాణం ఉంటుంది. తండ్రికి ఆరోగ్యం దెబ్బతింటుంది. కానీ ధనపరంగా మంచి జరుగుతుంది. ఆధ్యాత్మికధోరణి ఎక్కువౌతుంది. పుణ్యక్షేత్రాలు తిరుగుతారు. మానసికంగా ధైర్యం కలుగుతుంది. శత్రుత్వాలు సమసిపోతాయి. బంధువులు దగ్గరౌతారు.

మిధునరాశి
తండ్రికి గురువులకు గండం. డబ్బుపరంగా ఎత్తుపల్లాలను ఒడుదుడుకులను చూస్తారు. వృత్తిపరంగా సెటిల్ అవ్వబోయే ముందు ఉండే టీతింగ్ ప్రాబ్లంస్ ఎదురౌతాయి. మాటలో ధైర్యం, నిలకడ పెరుగుతాయి.

కర్కాటకరాశి
భార్యకు/భర్తకు ఆరోగ్యం చెడుతుంది. కొంతమంది వీరిని కోల్పోతారు కూడా. ఉద్యోగ, వ్యాపారాలలో తీవ్రమైన ప్రతికూలమార్పులు ఉంటాయి. ఆశాభంగాలు తప్పవు. ఆరోగ్యం తేడా వస్తుంది. తండ్రికి, తల్లికి గండం.

సింహరాశి
అందరితో శత్రుత్వం పెరుగుతుంది. అన్నీ ఎదురొస్తాయి. గొడవలు జరుగుతాయి. అప్పులు చేస్తారు. ఆరోగ్యం చెడుతుంది. డబ్బు బాగా ఖర్చౌతుంది. ధైర్యం సన్నగిల్లుతుంది.

కన్యారాశి
సంతానంతో విరోధం కలుగుతుంది. షేర్ మార్కెట్లో ఒడుదుడుకులు చూస్తారు. ప్రేమ వ్యవహారాలు దెబ్బతింటాయి. బిజినెస్ కుంటుపడుతుంది. డబ్బు వస్తుంది. జీవితభాగస్వామికి గండం. మాట చెలామణీ కాదు.

తులారాశి 
చదువులో రాణిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వాహనయోగం ఉంటుంది. శత్రువులు కంట్రోల్లో ఉంటారు. అన్నివిధాలుగా మంచి జరుగుతుంది.

వృశ్చికరాశి
ధైర్యం సన్నగిల్లుతుంది. చింత, ఆందోళన పీడించడం మొదలుపెడతాయి. మాటధాటి తగ్గుతుంది. తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు చెడు జరుగుతుంది. ఆధ్యాత్మికచింతన, వైరాగ్యం, విరక్తి, ఇక ఈ జీవితం ఇంతేలే అన్న నిర్లిప్త ధోరణీ పెరుగుతాయి. గతంలో దూరమైన గురువులు, ఆధ్యాత్మిక స్నేహితులు దగ్గరౌతారు. యాత్రలు చేస్తారు. డబ్బు ఖర్చౌతుంది.

ధనూరాశి
ఇంట్లో పరిస్థితులు తారుమారౌతాయి. కంటిచూపు సన్నగిల్లుతుంది. మాట చెల్లుబాటు కాదు. డబ్బుకు బాగా ఇబ్బంది పడతారు. నష్టపోతారు. తల్లికి గండం. చదువు కుంటుపడుతుంది. లాభం బదులు నష్టం ఎదురౌతుంది.

మకరరాశి
మంచి పరిణామాలు ఎదురౌతాయి. నిదానంగా పరిస్థితులు బాగవడం చూస్తారు. ధైర్యం పెరుగుతుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. విదేశాలపై దృష్టి పెడతారు. వ్యాపారాలు లాభిస్తాయి. దగ్గర ప్రయాణాలు చేస్తారు. వృత్తిలో ప్రొమోషన్ వస్తుంది.

కుంభరాశి
స్వల్ప అనారోగ్యాలు పీడిస్తాయి. ఆస్పత్రిని సందర్శిస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. మంచి పనులకు పెద్ద ఖర్చులు పెడతారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. మాటలో నిదానం నిలకడలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువౌతుంది.

మీనరాశి
అనారోగ్యాలు ఎదురౌతాయి. కొత్తమిత్రులు ఏర్పడతారు. పనివాళ్లకు, ఇరుగుపొరుగులకు సాయం చేస్తారు. డబ్బులు బాగా ఖర్చౌతాయి. కానీ, సమయానికి సహాయం అందుతుంది.

మీకు జరుగుతున్న దశ - అంతర్దశలతో ఈ వివరాలు పోల్చి చూసుకుంటే ఆయా సంఘటనలలో ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఈ రెండున్నరేళ్ళలో ముఖ్యమైన గోచార మార్పులు జరిగినప్పుడు మళ్ళీ గుర్తు చేస్తాను.
read more " 2020 శనీశ్వరుని మకరరాశి ప్రవేశం - ఫలితాలు "

15, జనవరి 2020, బుధవారం

మా క్రొత్తపుస్తకం 'మహా స్మృతిప్రస్థాన సూత్రము' ఈరోజు విడుదలైంది




'పంచవటిలో మేము నడిచే సాధనామార్గానికి బుద్ధభగవానుని మార్గం చాలావరకూ దగ్గరగా ఉంటుంది. నా చిన్నతనం నుంచీ  బుద్ధభగవానుని నేనారాధిస్తున్నాను. నిజమైన ఆధ్యాత్మికతకు మూలసాధనలు ఆయన బోధనలలో దాగి ఉన్నవని నా అంతరిక ప్రయాణంలో నాకర్ధమైంది. 'అనాత్మవాదంతప్ప శంకరాద్వైతానికీ బౌద్దానికీ ఏమీ భేదం లేదనీ నాకు తెలుసు. అలాగేపతంజలి మహర్షి వ్రాసిన 'యోగసూత్రాలుకూడా చాలావరకూ బుద్ధుని బోధనలకు కాపీనే అన్న విషయంరెంటినీ క్షుణ్ణంగా చదివిన తర్వాత నాకర్ధమైంది. చాలా ఉపనిషత్తులు కూడా బుద్ధుని బోధనలను కాపీ కొట్టాయి. చివరకు పరాయిమతం వాడైన జీసస్ క్రీస్తు కూడా అనేక బుద్ధుని బోధనలను స్వీకరించి అనుసరించాడు. పతంజలిమహర్షి కంటే, క్రీస్తు కంటే బుద్ధుడు కనీసం 500 ఏళ్ళు ప్రాచీనుడు. శంకరులకంటే ఇంకా ప్రాచీనుడు. ఈ విధంగా బుద్ధుని బోధనలను ఎవరిష్టం వచ్చినట్లు వారు వాడుకుని చివరకు ఆయన్ను దేశం నుంచి బయటకు నెట్టేశారు.

ఎన్నో దేశాలు ఆయన్ను అమితంగా గౌరవిస్తూ పూజిస్తూ ఉంటే, మనం మాత్రం ఆయన్ను కనీసం తలుచుకోవడం లేదు. ఇదీ బుద్ధునికి మనం ఇస్తున్న గౌరవం ! దశావతారాలలో బుద్ధుడు కూడా ఒకడని మనం నిజంగా నమ్ముతుంటే, మిగతా అవతారాలకున్నట్లుగా ఆయనకు దేవాలయాలు ఎందుకు లేవు? ఆయన్ని మనం ఎందుకు పూజించడం లేదు? దశావతారాలలో కూడా రాముడిని కృష్ణుడిని మాత్రమే మనం పూజిస్తాం. మిగతావారికి అంత పాపులారిటీ ఎందుకు లేదు? హిందూమతంలో ఏమిటీ హిపోక్రసీ?

అందుకనేసాంప్రదాయ హిందువులకు మా విధానం నచ్చినా నచ్చకపోయినామా 'పంచవటి పబ్లికేషన్స్నుండి ఆయన బోధనలను వరుసగా ప్రచురిస్తూ వస్తున్నాము. ఎందుకంటే, 'నీకు మనుషులు ముఖ్యమామతాలు ముఖ్యమాలేక సత్యం ముఖ్యమా?' అంటేనా ఓటు సత్యానికే పడుతుంది కాబట్టి.

ఈ క్రమంలో భాగంగాసూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్న ఈ సంక్రాంతిపండుగ రోజున బుద్ధభగవానుని మూలబోధనలలో అతి ముఖ్యమైనదైన 'మహాస్మృతిప్రస్థాన సూత్రమును ఈరోజు 'ఈ - బుక్గా విడుదల చేస్తున్నాము. అతిత్వరలో దీని ప్రింట్ పుస్తకం కూడా విడుదలౌతుంది. దానితోబాటే ఇంగ్లీష్ 'ఈ- బుక్' మరియు ప్రింట్ పుస్తకాలు విడుదలవుతాయి.

బుద్ధుని ధ్యానమార్గమైన 'విపశ్యాన ధ్యానమునకు ఇది ఒక గైడ్ బుక్ వంటిది. ఈ పుస్తకాన్ని శ్రద్ధగా చదివి అర్ధం చేసుకుంటేబుద్ధుని ధ్యానమార్గం చక్కగా అర్ధమౌతుంది. ఆయన చేసిన సాధన ఏమిటోఆయన నడచిన దారి ఏమిటోదానిలో మనం కూడా ఎలా నడవవచ్చో స్పష్టంగా అర్ధమౌతుంది.

మా ఇతర ప్రచురణల వలెనేఈ పుస్తకం కూడా మీ ఆదరణను పొందుతుందనిమీకు ఆధ్యాత్మికంగా గొప్ప మార్గదర్శి అవుతుందన్న విశ్వాసం మాకుంది.
read more " మా క్రొత్తపుస్తకం 'మహా స్మృతిప్రస్థాన సూత్రము' ఈరోజు విడుదలైంది "

13, జనవరి 2020, సోమవారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (నామ నక్షత్రాల గోల)

పురోహిత జ్యోతిష్కులు జ్యోతిష్యశాస్త్రానికి చేసిన మరొక పెద్ద కీడు - 'నామనక్షత్రాలు' అంటూ ఒక స్కీమ్ తయారు చెయ్యడం. దీనిని కొంతమంది అజ్ఞానులు చాలా గుడ్డిగా పాటిస్తున్నారు. ఇది కూడా తప్పే. ఎందుకంటే, జ్యోతిషశాస్త్రంలో ప్రతిదానికీ ఒక లాజిక్ ఉంటుంది. కానీ దీనికి మాత్రం ఏ లాజిక్కూ లేదు.

జ్యోతిష్యశాస్త్రంలో లేని అనేక విషయాలు పంచాంగాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ 'పురోహిత జ్యోతిష్కుల' సృష్టే. వీటిని పాటించవలసిన పని ఏ మాత్రమూ లేదు. అసలు ఇలాంటి కట్టుకథలు సృష్టించబడడం వల్లనే ఎంతో గొప్పదైన జ్యోతిష్యశాస్త్రం ప్రజలలో తన విలువను కోల్పోయింది. నోరున్న ప్రతివాడూ ఎగతాళి చేసేలా తయారైంది నేడు దాని పరిస్థితి.

మీరు ఏ పంచాంగం చూసినా మీకిది కనిపిస్తుంది.

చూ-చే-చో-ల - అశ్వని
లీ-లూ-లే-లో - భరణి ..... ఇత్యాది

అంటే, అశ్వని మొదటి పాదంలో పుట్టినవారికి 'చూ' అనే శబ్దంతో మొదలయ్యే పేరు పెట్టాలని ఇది చెబుతుంది. ఈ అక్షరంతో పేరు పెట్టాలంటే 'చూడామణి' అనే పేరు తప్ప, లేదా, 'చుంచుమొహం', 'చుప్పనాతి' మొదలైన పేర్లు తప్ప ఇంకే పేర్లూ దొరకవు. ఇదే విధంగా మిగతా నక్షత్రాలకు కూడా ఉంటుంది. కానీ దీనికి ప్రమాణం మాత్రం ఎక్కడా మనకు దొరకదు. దీని వెనుక ఉన్న లాజిక్కూ దొరకదు.

దీనికి విరుద్ధంగా - ఒక జాతకంలో సప్తమంలో శని ఉంటే, ఆ జాతకునికి ఏమి జరుగుతుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. లేదా అక్కడ కుజుడు ఉంటే, ఏమి జరుగుతుందో కూడా మనకు తెలుసు. వీటి వెనుక లాజిక్స్ ఉంటాయి. కానీ నామనక్షత్ర స్కీమ్ వెనుక ఉన్న లాజిక్ మాత్రం శూన్యం. తంత్రశాస్త్రంలోనూ, మంత్రశాస్త్రంలోనూ, నాడీశాస్త్రంలోనూ ఈ లాజిక్స్ ఉన్నాయని కొందరు భావిస్తారు. ఇవి మూడూ నాకు బాగానే తెలుసు. ఈ విషయం వరకూ, వాటిల్లో కూడా స్థిరమైన లాజిక్స్ ఎక్కడా నాకు కనపడలేదు.

లగ్నాధిపతికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, నక్షత్రాలకు ప్రాముఖ్యతనివ్వడం వల్లనే ఈ గొడవంతా మొదలైంది. ఈ గోల మొదలు పెట్టినవారు, జ్యోతిష్యశాస్త్రంలో లోతైన అవగాహన లేని పురోహిత జ్యోతిష్కులే.

పోనీ, నక్షత్రాలే ముఖ్యం అనుకుంటే, అభిజిత్ నక్షత్రం ఏమైంది? దానినెందుకు తీసేశారు? దాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే, అప్పుడు దానికేమేమి అక్షరాలూ పంచుతారు? ఎలా పంచుతారు? అసలు నక్షత్ర వైబ్రేషన్స్ ను ఎవరు లెక్కించారు? ఎలా లెక్కించారు? వీటికి జవాబులు లేవు.

అసలీ గోలంతా లేకుండా, దీనికంటే శాస్త్రీయమైన విధానం మరొకటి ఉంది.

లగ్నాధిపతిని బట్టి, లేదా లగ్నాన్ని బాగా ప్రభావితం చేస్తున్న గ్రహాన్ని బట్టి శిశువుకు పేరును పెట్టడం అనేది చాలా తార్కికమైన భావన. ఇది నామనక్షత్రం కంటే మంచిది. చాలా మంచి ఫలితాలనిస్తుంది కూడా.

పేరును బట్టి జాతకం చెప్పడం శుద్ధ తప్పువిధానం. అయితే దీనిలో ఒక సౌలభ్యం ఉంది. పాతకాలంలో, నామనక్షత్రాన్ని బట్టి పేరు పెట్టేవారు కనుక, ఒకరి పేరు తెలిస్తే, ఆ పేరులోనే మొదటి అక్షరాన్ని బట్టి అతని జన్మనక్షత్ర పాదం తెలుస్తుంది. అది తెలిసినప్పుడు ఆ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో తెలుస్తుంది. దాన్ని బట్టి, గోచార గ్రహాలను గమనించి స్థూలంగా ఫలితాలు చెప్పవచ్చు. ఇంతవరకూ ఈ విధానం పనికొస్తుంది. కానీ, అసలు మొదట్లో, ఈ నామనక్షత్ర స్కీమ్ ఎలా తయారైంది? దీని వెనుక ఉన్న లాజిక్స్ ఏమిటి? అన్న ప్రశ్నలకు స్పష్టములైన జవాబులు లేవు. దొరకవు.

ముస్లిం దండయాత్రలలో అగ్నికి ఆహుతైన వేలాది విలువైన గ్రంధాలలో ఈ సమాచారం ఉందని కొందరు వాదిస్తారు. అది నిజమే కావచ్చు. కానీ, కొన్ని తంత్రగ్రంధాలలో ఉన్న ప్రాధమిక సమాచారం తప్ప, ఈ సబ్జెక్టు మీద లోతైన వివరాలు ప్రస్తుతం మనకు దొరకడం లేదు.

లగ్నాధిపతి అయిన గ్రహం ఆ జాతకుడికి సూచిక. ఆ గ్రహానికి సంబంధించిన పేరు జాతకుడికి పెట్టడం తార్కికం అవుతుంది. క, చ, ట, త, ప సూత్రం ప్రకారం హల్లుల గ్రూపులకు గ్రహాల ఆధిపత్యం మనకు తెలుసు.

అచ్ఛులు - సూర్యుడు
క గ్రూప్ (క, ఖ, గ, ఘ, జ్ఞ) - కుజుడు
చ గ్రూప్ (చ, ఛ, జ, ఝ,న్య ) - శుక్రుడు
త గ్రూప్ (త, థ, ద, ధ, న ) - గురువు
ట గ్రూప్ (ట, ఠ, డ, ఢ, ణ ) - బుధుడు
ప గ్రూప్ (ప, ఫ, బ, భ, మ) - శని
య గ్రూప్ (య, ర, ల, వ, శ, ష, స, హ) - చంద్రుడు

సూర్యుడూ చంద్రుడూ బింబగ్రహాలు. అంటే, మండలాకారంలో (Circle) ఉండే గ్రహాలు. మిగతా ఐదూ తారాగ్రహాలు. అంటే చుక్కల్లాగా (Dot) ఉండే గ్రహాలు. మండలంలో బిందువు (Dot in Circle) అనేది శ్రీచక్రానికి, static and dynamic energies of the universe కి సూచిక.

దీనిలో ఉన్న యోగరహస్యాలను కొద్దిగా ఇక్కడ స్పృశిస్తాను. నా ఇన్నర్ సర్కిల్ శిష్యులకు ఇవన్నీ సుపరిచితాలే.

'అ' అనేటప్పుడు ఊపిరి లోనికి పీలుస్తాము. అంటే ఉచ్ఛ్వాసం. 'హ' అనేటప్పుడు ఊపిరి వదులుతాము. అంటే, నిశ్వాసం. అక్షరాలన్నీ 'అ' నుంచి 'హ' మధ్యలోనే ఉన్నాయి. అందుకే 'అహమ్ (నేను)' అనేది దైవానికి గల అసలైన పేరు. ఈ దైవం అహమ్ అహమ్ అంటూ నిత్యం మనలో ఊపిరిగా సంచరిస్తూ ఉన్నది. ఇదే మనలో నిత్యం సాగే అజపాజపం. అందుకే అది మనలోనుంచి పోతే, దైవం మనల్ని వదిలేస్తే, మనం చనిపోతాము.

అలాగే కుజాది అయిదు గ్రహాలూ సూర్యచంద్రుల మధ్యలోనే ఉన్నాయి. వాటి అక్షరాలు కూడా అలాగే ఉన్నాయి. రాహుకేతువులు ఛాయాగ్రహాలు గనుక వాటికి అక్షరాలు లేవు. అవి ఏ రాశిలో ఉంటె, ఆ అక్షరం ఆ శబ్దం వాటిదై పోతుంది.

కుజ, శుక్ర, గురు, బుధ, శనిగ్రహాల అధీనంలో ఉన్న 5x5= 25 శబ్దాలు + చంద్రుని అధీనంలో ఉన్న 8 శబ్దాలు మొత్తం 33. ఈ 33 అక్షరాలే వేదకాలంలో పూజింపబడిన ముప్పై ముగ్గురు దేవతలు. ఇవి సృష్టిని నడిపించే వైబ్రేషన్స్ లేదా ధ్వనిశక్తులు. వీటిల్లో అ నుంచి అ: వరకూ ఉన్న అచ్చులు అంతర్లీనంగా ఉంటూ వాటిని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అంటే, ప్రకృతి శక్తులకు సూర్యశక్తి ఆధారం అయినట్లుగానే, హల్లులకు అచ్ఛులే ఆధారంగా ఉంటాయి. ఉదాహరణకు, క్ అనేదానికి అ అనే శబ్దం కలిస్తేనే క అనే శబ్దం వస్తుంది.  అంటే, క్ అనే మూలశబ్దానికి అ అనే శబ్దం ఆధారంగా ఉన్నది.

సందర్భం వచ్చింది గనుక, వేదకాలపు ప్రాచీన దేవతలు ఎవరో ఒకసారి చెప్తాను.

అష్టవసువులు      -       8 మంది
ఏకాదశ రుద్రులు -     11 మంది
ద్వాదశ ఆదిత్యులు - 12 మంది
అశ్వనీ దేవతలు -       2
మొత్తం -                     33

కొన్ని చోట్ల అశ్వనీ దేవతల బదులుగా ఇంద్రుడు, ప్రజాపతి ఉంటారు. మొత్తం మీద ఎలా చూచినా ఈ 33 దేవతలే వేదాలలో ఉన్నారు. ప్రకృతిలో కూడా మనకు ఇవే శక్తులు కనిపిస్తాయి.

నేడు మనం పూజిస్తున్న దేవతలందరూ, వేదకాలపు దేవతలు కారనీ, పురాణకాలంలో మనం కల్పించుకున్న రూపాలేనన్నది ముందుగా మనం గ్రహించాల్సిన చేదునిజం. నేడు మనం పూజిస్తున్న దేవతలెవరూ వేదాలలో లేరు. నేడు వైదికులుగా చెప్పుకుంటున్నవారు కూడా వేదకాలపు దేవతలను పూజించడం లేదు. పురాణకాలపు దేవతలని పూజిస్తున్నారు. అసలు వేదాలలో ఏయే దేవతలున్నారో కూడా నేటి వైదికులలో ఎవరికీ గుర్తులేరు. ఇదొక విచిత్రం ! 

ఈ రకరకాల కల్పిత దేవతలకు కూడా ఈ 33 మూలశక్తి వైబ్రేషన్స్ మాత్రమే ఆధారశక్తులుగా ఉంటాయి. ఈ 33 అక్షరాల లోనుంచే అన్ని మంత్రాలూ పుట్టాయి. మంత్రశాస్త్రానికి కూడా ఈ 33 అక్షరాలే ఆధారాలు. అందుకనే మంత్రశక్తిలో (శబ్దశక్తిలో) దైవశక్తి ఉంటుందని మంత్రశాస్త్రం అంటుంది. ఇదే అసలైన మంత్ర - తంత్ర విజ్ఞానం.

కనుక, లగ్నాధిపతిని సూచించే మంత్రశబ్దాలైన అక్షరాల ప్రకారం జాతకునికి పేరు పెట్టడం కరెక్ట్ అవుతుంది. అంతేగాని, నామనక్షత్ర స్కీమ్ ప్రకారం పేర్లు పెట్టడం తప్పున్నర తప్పేగాక దాని వెనుక ఏ విధమైన లాజిక్కూ లేదు.

ఇకపోతే, పేర్లను బట్టి వివాహపొంతనం చూడటం కూడా శుద్ధ తప్పుపధ్ధతే. జాతకంలోని లగ్నభావం, చతుర్ధభావం, సప్తమభావం, అష్టమభావాలను గమనించి, ఇద్దరి జాతకాలలోనూ ఈ రెండూ సరిపోయినప్పుడు మాత్రమే వారిద్దరికీ వివాహం చెయ్యాలి. కానీ, ఇది నేటి జ్యోతిష్కులు చాలామంది పాటించడం లేదు. దీనిగురించి మరో పోస్ట్ లో వ్రాస్తాను.

ఈ నామనక్షత్ర స్కీమ్ ఎంత ఎగతాళి పాలైపోయిందంటే, పాతకాలంలోని ఏదో జానపద సినిమాలో మాంత్రికుడి శిష్యుడు 'లీలూలేలో -  దేదోచాచీ' మొదలైన మాటలను మంత్రాలుగా వాడుతూ ఉంటాడు. అంటే, కామెడీ మంత్రాలన్నమాట !

లగ్నాధిపతిని బట్టి జాతకుడికి పేరు పెడితే, ఆ పేరు వైబ్రేషన్ ఆ జాతకంతో తులతూగుతుంది (నేటి భాషలో చెప్పాలంటే, మ్యాచ్ అవుతుంది) కాబట్టి, ఆ పేరుతో పిలిచిన ప్రతిసారీ, అతని లగ్నం శక్తిని పుంజుకుంటూ ఉంటుంది. ఆ విధంగా అతనికి మేలు జరుగుతుంది. దీనికి విరుద్ధంగా, ఏవేవో పిచ్చిపిచ్చి పేర్లు, లేదా నామనక్షత్రం ప్రకారం, లీలూలేలో స్కీమ్ ప్రకారం పేర్లు పెడితే దానికి విరుద్ధంగా జరుగుతుందని గమనించాలి. అప్పుడు ఆ జాతకుడికి మంచి జరగకపోగా, అతని జాతకంలో చెడు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే, వేరే ఏదో లగ్నం పేరుతో ఆ జాతకుడిని  పిలవడం వల్ల అతని జాతకం శక్తిని కోల్పోతూ ఉంటుంది. అందువల్ల అతని జీవితంలో నెగటివ్ వైబ్రేషన్ పెరుగుతూ ఉంటుంది !

నేను చెబుతున్నది నిజం అనడానికి ఒక రుజువును చూపిస్తాను !

చాలామందికి మామూలు పేరుతో బాటు ముద్దుపేర్లు ఉంటాయి. ఆ ముద్దుపేరుతో వారు పిలిపించుకుంటూ ఉన్నంత కాలం వారి జీవితం బాగా ఉంటూ ఉంటుంది. దానికి కారణం వారి జాతకంలో పుణ్యకర్మ బలంగా ఉండటమే. దానికి అనుగుణమైన ముద్దుపేరుతో వారు పిలువబడుతూ ఉండటమే !

దీనికి విరుద్ధంగా మరి కొంతమందికి వారి జాతకానికి విరుద్ధమైన ముద్దుపేర్లు చెలామణీలో ఉంటూ ఉంటాయి.  వారు ఆ పేరుతో పిలిపించుకుంటూ ఉన్నంతకాలం, వారి జీవితంలో చేదు అనుభవాలు కలుగుతూనే ఉంటాయి. దీనికి కారణం వారి జాతకంలో బలంగా ఉన్న చెడు ఖర్మ.  అందుకే వారా పేర్లతో పిలువబడుతూ ఉంటారు.

ఒక ఉదాహరణ !

ఒకతనికి 'నాగ వెంకట ఆంజనేయ దుర్గా వరప్రసాద్' అని తల్లిదండ్రులు పేరు పెడతారు. ఇందులో, తాత ముత్తాతలనీ, కులదేవతలనీ అందరినీ కలుపుకుని ఆ పేరు పెడతారు. కానీ పిలవవలసి వచ్చేసరికి, "వెంకట్" అని మాత్రమే పిలుస్తూ ఉంటారు. లేదా, 'పప్పీ!' అంటూ కుక్కపేరుతో పిలుస్తూ ఉంటారు. అన్ని దేవతల పేర్లూ తన పేరులో ఉండి, చివరకు కుక్కపేరుతో ఆ వ్యక్తి పిలువబడుతూ ఉంటాడు. అలా పిలవబడటానికి కూడా ఆ జాతకంలో ఉన్న బలమైన గ్రహం ( వాడి ఖర్మను బట్టి అది చెడుగ్రహం కావచ్చు లేదా మంచిగ్రహం కావచ్చు) మాత్రమే కారణం అవుతుంది. అంతేగాని నామనక్షత్రమూ కారణం కాదు. లేదా మనిష్టం వచ్చినట్లు పెట్టుకునే పేరూ కారణం కాదు.

అలా పెట్టుకోడానికి కూడా ఆ మనిషికి స్వతంత్రం లేదన్నది సారాంశం. ఆ మనిషి జాతకంలో బలమైన గ్రహాన్ని బట్టి ఆ సమయానికి ఆ పేరు పెట్టబడుతుంది. ఆ పేరు పెట్టేవాడికి ఆ సమయానికి అలాంటి బుద్ధి పుడుతుంది. లేదా అలాంటి ముద్దు పేరుతో పిలిపిస్తుంది. ఆ పేరు పెట్టేవారు హిందువులైనా కాకపోయినా సరే, జాతకాలను నమ్మేవారైనా నమ్మనివారైనా సరే, ఇండియాలో ఉండేవారైనా, లేక విదేశాలలో ఉంటూ వేరేభాష మాట్లాడేవారైనా సరే, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. గ్రహప్రభావాలకు మన నమ్మకాలతో, మనం ఉండే దేశాలతో, మనం మాట్లాడుకునే భాషతో పని లేదు.

'మోహన్ దాస్ కరంచంద్ గాంధీ' అని పేరు పెట్టబడిన గాంధీజీ, 'బాపూ' అని  పిలువబడుతున్నాడు. జవహర్లాల్ నెహ్రూని 'చాచాజీ' అంటూ పిలుస్తున్నారు. అసలు పేర్లు పోయి, ఇవి మిగిలాయి. అది వారివారి ఖర్మను బట్టి జరుగుతుంది. అర్థమైందా అక్షరాల వైబ్రేషన్ శక్తి?

మనం నమ్మినా నమ్మకపోయినా ఎండ వేడిగానే ఉంటుంది, వెన్నెల చల్లగానే ఉంటుంది కదా మరి !
read more " నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (నామ నక్షత్రాల గోల) "

6, జనవరి 2020, సోమవారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (అమెరికా ముహూర్తాలు)

పాపం మనవాళ్ళు ఎక్కడకు పోయినా చిన్నప్పటినుంచీ నేర్చుకున్న ఆచారాలనూ పద్ధతులనూ అక్కడకు కూడా తీసుకుపోతూ ఉంటారు. ఇది మంచి విషయమే. ఏ దేశానికి పోయినా, మనం మనంగానే ఉండాలి. అయితే, అక్కడి పద్ధతులను కూడా ఆకళింపు చేసుకోవాలి. పాటించాలి. కానీ, లోలోపల మనం మనంగానే ఉండాలి. అప్పుడే మన వ్యక్తిత్వం మనదిగా ఉంటుంది. కానీ, దీనిని ఆసరాగా తీసుకుని దొంగ గురువులు, దొంగ జ్యోతిష్కులు, దొంగ పురోహితులు, దొంగ పూజారులు అలాంటివారికి చుక్కలు చూపిస్తున్నారు. ఈ బెడద అమెరికాలో ఉన్న మనవారికి బాగా ఎక్కువగా ఉంటోంది.

పాపం అక్కడున్న మనవాళ్ళు, ఏ శుభకార్యం తలపెట్టుకున్నా, మంచి ముహూర్తం కోసం పురోహితుడినో, జ్యోతిష్కుడినో సంప్రదిస్తారు. అందులోనూ, అమెరికాలో ఉంటున్నారు గనుక, డబ్బులు బాగా ఉంటాయి గనుక, పేరుమోసిన పంచాంగకర్తలకు ఫోన్ చేసో, లేదా టీవీలో కనిపించే జ్యోతిష్కులకు ఫోన్ చేసో, ముహూర్తం పెట్టమని అడుగుతూ ఉంటారు. వీళ్ళు పెడుతూ ఉంటారు. వాళ్ళు ఆ సమయానికి అమెరికాలో ఆ కార్యక్రమం చేస్తూ ఉంటారు. పప్పులో కాలేస్తూ ఉంటారు. కానీ అలా కాలేశామని కూడా తెలియనంత స్థితిలో ఉంటారు. వెరసి ఏదో ఒక దుర్ముహూర్తంలో ఆ కార్యక్రమం జరిగిపోతూ ఉంటుంది. వింతగా ఉంది కదూ? నేను చెబుతున్నది పచ్చి నిజం. ఎలాగో వినండి మరి !

ఒక ఉదాహరణ చెప్తాను. విషయం బాగా అర్ధమౌతుంది !

ఒకాయన కూతురూ అల్లుడూ కాలిఫోర్నియా లో ఉన్నారు. వాళ్లకు ఒక పాప పుట్టింది. అన్నప్రాశన ముహూర్తం పెట్టాలి. ఇండియాలో ఉన్న ఒక పేరుమోసిన జ్యోతిష్కుల వారిని ఫోన్లో సంప్రదించారు. ఈయన సింపుల్ గా పంచాంగం చూసి, కాలిఫోర్నియాకీ మనకీ ఉన్న time difference ను తీసేసి, అలా తియ్యగా వచ్చిన అమెరికా టైం కి కార్యక్రమం చేసుకోమని చెప్పాడు. వాళ్ళు చేసుకున్నారు. కానీ అది శుద్ధ తప్పుడు ముహూర్తం ! ఇంతా చేస్తే, ఒక దుర్ముహూర్తంలో ఆ పాప అన్నప్రాశన జరిగింది. ఎలాగో వినండి !

ఏ ముహూర్తమైనా సూర్యోదయకాలం నుంచి లెక్కించాలి. మనకు సూర్యోదయమే అన్నింటికీ ముఖ్యం. ఆ రోజున కాలిఫోర్నియాలో సూర్యోదయం ఎప్పుడౌతుందో లెక్కించి, అక్కడనుంచి లెక్క పెడుతూ ఇష్టసమయానికి ఏ ముహూర్తం ఉన్నదో చూచి ఆ ముహూర్తాన్ని పెట్టుకోవాలి. అంతేగాని, డే లైట్ సేవింగ్ అవర్స్ ని లెక్కలోకి తీసుకోకుండా, సూర్యోదయ సమయాన్ని లెక్కించకుండా, సింపుల్ గా ఇండియా టైం లోనుంచి ఇంత తగ్గించండి సరిపోతుంది అని చెప్పే ముహూర్తాలన్నీ తప్పులే ! ఎందుకంటే, ఇండియాకూ కాలిఫోర్నియాలకూ కాలగణనంలో చాలా తేడాలుంటాయి. ఇవి ముఖ్యంగా సూర్యోదయకాలంలోనూ, దినప్రమాణంలోనూ ఉంటాయి.

కాలగణనం అనేది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ ఉన్న సమయాన్ని బట్టి లెక్కించబడుతుంది. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో అయితే ఇది 12 గంటలకు అటూ ఇటూ గా ఉంటుంది. కానీ దానికి దూరంగా ఉండే ప్రదేశాలలోనో. లేక దినప్రమాణం  చాలా తక్కువగా ఉండే ప్రాంతాలలోనో ఇది మారిపోతూ ఉంటుంది. కనుక ఆయా దేశాలలోని హోరలు, కాలప్రమాణాలు, లగ్నప్రమాణాలు,  పుష్కరాంశలు మొదలైనవన్నీ మారిపోతాయి.

ఉదాహరణకు, దినప్రమాణం 12 గంటలు ఉండే దేశాలలో మాత్రమే, హోరలు ఒక్కొక్క గంట పాటు ఉంటాయి. అది తగ్గితే ఇవీ తగ్గుతాయి. కానీ జ్యోతిష్కులు ఇది చెప్పరు. అలాగే రాహుకాలం సంగతి చూడండి. దీనిని సామాన్యంగా గంటన్నరగా చూపిస్తారు. ఎందుకంటే 12 గంటలను 8 భాగాలు చేస్తే (ఏడు గ్రహాలు+1 ఖాళీ భాగం) ఒక్కొక్కటి గంటన్నర వస్తుంది గనుక. అదే, పగటి సమయం ఎనిమిది గంటలు మాత్రమే ఉండే దేశాలలో, రాహుకాలం ఒక గంట మాత్రమే ఉంటుంది. ఈ విధంగా అన్ని ముహూర్తాలూ, కాలహోరలూ, ఉపగ్రహసమయాలూ అన్నీ సూర్యోదయాన్ని బట్టి, దినప్రమాణాన్ని బట్టి మారిపోతాయి. ఈ విషయం గుర్తించకుండా, మనకీ ఆ దేశానికీ ఉన్న టైం డిఫరెన్స్ ను బట్టి, ఇండియా టైం లోనుంచి అన్ని గంటలు తగ్గించి, అదే అసలైన ముహూర్తం అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. అర్ధమైంది కదూ !

కానీ, నేటి ప్రముఖ టీవీ జ్యోతిష్కులూ, పంచాంగకర్తలూ ఇవే ముహూర్తాలను అమెరికా వారికి పెడుతున్నారు ! వారు చంకలు చరుచుకుంటూ దుర్ముహూర్తాలలో కార్యక్రమాలు చేసుకుంటున్నారు, నవ్వొస్తోందా? హాయిగా నవ్వుకోండి. ఇదే కలిమాయ అంటే !!

ఆ మధ్యన, విజయవాడలో ఒక జ్యోతిష్యసభ జరిగింది. ఆ సభలో, మిత్రుడు పాలపర్తి శ్రీకాంత్, ఒక ప్రముఖ పంచాంగకర్తను ఇలా ప్రశ్నించాడు. 'ఒక ప్రదేశానికి సూర్యోదయసమయాన్ని ఎలా గణిస్తారో, వేదిక మీద నుంచి కొంచం వివరించండి'. ఆ పంచాంగ కర్తగారు తెల్లముఖం వేసి, 'సారీ! మర్చిపోయామండి. మేము సూర్యోదయ సమయాన్ని మూడేళ్ళకు ఒకసారి మాత్రమే లెక్కలు వేస్తాము. తర్వాత గుడ్డిగా దానినే అనుసరిస్తాము' అని ఒప్పుకున్నాడని శ్రీకాంత్ నాతో చెప్పారు. ఇదీ నేటి పంచాంగజ్యోతిష్కుల పరిస్థితి ! ఇక గ్రహగణితం ఏ మాత్రమూ రాని టీవీ జ్యోతిష్కుల సంగతి చెప్పనే అక్కర్లేదు.

జ్యోతిష్కులలో ఒక విచిత్రం ఉంది. గణితం వచ్చినవాడికి ఫలితం చెప్పడం రాదు. ఫలితం చెప్పేవాడికి గణితం రాదు. గణితం ఫలితం రెండూ వచ్చినవాడికి పరిహారం (రెమెడీ) చెయ్యడం రాదు. గణితం - ఫలితం - పరిహారం - ఈ మూడూ వచ్చినవాడు లోకంతో బిజినెస్ చెయ్యడు. మౌనంగా వాడి పని వాడు చూసుకుంటాడు. ఎందుకంటే వాడొక ఋషిగా మారిపోతాడు. కనుక వాడు లోకానికి పనికిరాడు. ఈ మధ్యలో ఉన్నవారు మాత్రం తమతమ వేషాలతో లోకాన్ని బాగా ఆడుకుంటూ ఉంటారు. పిచ్చిలోకులు మోసపోతూ ఉంటారు. ఈ మొత్తం నాటకంలో, జ్యోతిష్కుడూ, పృఛ్చకుడూ ఇద్దరూ చెడుకర్మను మూటగట్టుకుని భుజాన వేసుకుని మోస్తూ ఉంటారు. ఇదీ అసలు సంగతి !

అందుకే ఈ ఆశుపద్యాన్ని ఇక్కడ చెబుతున్నాను.

కం || గణితము, ఫలితము, మఱియున్
గుణముగ పరిహారమెల్ల గురుతుగ జెప్పన్
పణమున నెగ్గెడి జోస్యుల్
అణువుల్ ! పరికింతమన్న నందరు సత్యా !

గణితం, ఫలితం, పరిహారం - ఈ మూడూ శుద్ధంగా తెలిసిన, ఋషితుల్యులైన జ్యోతిష్కులు ఈ భూమిమీద లక్షకొకరో, కోటికొకరో ఉంటారుగాని ఎక్కడబడితే అక్కడ దొరకరు.

పాపం అమెరికా ఎన్నారైలు మాత్రం ఇండియా జ్య్తోతిష్కుల చేతుల్లో ఇలా మోసపోతున్నారు. దుర్ముహూర్తాలకు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఏం చేస్తాం? సముద్రాలు దాటి వెళ్ళినా ఎవరి కర్మ వారిని వెంటాడటం తప్పదు గదా !
read more " నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (అమెరికా ముహూర్తాలు) "

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (యమగండం ఎందుకు చెడ్డది?)

'యమగండం' అనేది ఎవడో కల్పించిన కల్లబొల్లి మాట తప్ప, అసలది ప్రామాణిక జ్యోతిష్య గ్రంధాలలో లేదని వ్రాశాను కదా ! కానీ దీనికి ప్రత్యామ్నాయంగా వేరే మాట లేదు గనుక ప్రస్తుతానికి ఈ మాటనే వాడుకుందాం. దీని గురించి మరికొంత వినండి !

యమగండ సమయంలో ఏ పని చేసినా చెడిపోతుందని, సర్వనాశనం అవుతుందని అనేవాళ్ళు ఆ సమయంలో ఏదైనా చేసి చూడండి. ఏమీ కాదు ! ఎవరైనా కొన్నిసార్లు సరదాగా టెస్ట్ చేసి అప్పుడు చెప్పండి !

పోనీ ఇంకో విషయం ! మనం ఏదైనా ముహూర్తం పెట్టుకున్నప్పుడు ఈ యమగండం అనేదాన్ని చూసి, దాన్నుంచి తప్పుకుంటున్నాం కదా ! మామూలుగా మనం చేసే రోజువారీ పనులలో కూడా  యమగండం అనేది ఎన్నోసార్లు వస్తూనే ఉంటుంది. కానీ ఆ విషయం మనం పట్టించుకోము. రీసెర్చి మైండ్ తో దీనిని చూసేవాళ్ళు మాత్రమే అలా గమనిస్తారు. నేనలా చాలాసార్లు గమనించాను. ఆ సమయంలో మనం చేసే పనులన్నీ చెడిపోవాలి కదా ! అలా ఏమీ జరగదు. జరగకపోగా, చాలాసార్లు ఆ సమయంలో మనం చేసే పని సక్సెస్ అవుతుంది. ఇది చాలాసార్లు గమనించాను. అప్పుడే నాకు అనుమానం వచ్చింది 'ఇదేంటి?' అని.

ఇంకో విషయం వినండి ! యమగండ సమయంలో చాలామంది పుడుతూ ఉంటారు. మరి వాళ్ళందరూ వెంటనే చనిపోవాలి కదా ! అలా ఏమీ జరగదు. ఈ విషయం ఎవరైనా గమనించారా మరి? అలాంటివాళ్ళు, వారివారి జీవితాలలో ఆధ్యాత్మిక మనస్కులుగా ఉండటం నేను చాలాసార్లు గమనించాను. అంటే, ప్రతి పనినీ స్వార్ధపూర్తితంగా 'నాకేంటి?' అంటూ చెయ్యకుండా, మంచీ చెడూ, న్యాయం ధర్మం, ఆలోచించి, నిదానంగా, ఎదుటి వ్యక్తులను బాధపెట్టకుండా, ఉన్నంతలో హాయిగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. 'యమగండం' అనేది అలా పనిచేస్తుంది. ఎందుకంటే, అది గురువు యొక్క ఉపగ్రహం గనుక, మనిషిని న్యాయమార్గంలో, ధర్మమార్గంలో నడిపిస్తుంది. న్యాయం, ధర్మం అనుసరించే మనిషి తన నిత్యజీవితంలో దూకుడుగా ఉండడు. స్వార్ధపూరితంగా ఉండడు. 'ఎవడెలా పోతే నాకేంటి? నాపని నాకు కావాలి' అనుకోడు. కనుక అలాంటివాడు తన జీవితంలో - నేడు లోకం అనుకుంటున్న 'సక్సెస్' ను - పొందలేడు.

అసలు, నేటిలోకం దృష్టిలో సక్సెస్ అంటే ఏమిటి? 'ఎలా సంపాదించావు? అని ఎవరూ అడగడం లేదు. 'ఎంత సంపాదించావు? అని మాత్రమే అడుగుతున్నారు. 'ఎంత ధర్మంగా బ్రతుకుతున్నావు?' అని అడగడం లేదు. 'ఎంత జల్సాగా బ్రతుకుతున్నావు? అని మాత్రమే అడుగుతున్నారు. 'ఇన్ని తప్పులు ఎందుకు చేశావు?' అనడగడం లేదు. 'ఇంత అమాయకంగా ఎలా దొరికిపోయావు?' అని మాత్రమే అడుగుతున్నారు. 'ఇంత తక్కువమందిని మాత్రమే ఎందుకు ముంచావు?' అనడుగుతున్నారు. కనుక నేటి లోకంలో ' సక్సెస్' నిర్వచనమే మారిపోయింది. అలాంటి సక్సెస్ ను 'యమగండకాలం' ఇవ్వదు గనుక అది పనికిరాని సమయం అయి కూచుంది. ధర్మంగా బ్రతకమని చెబుతుంది గనుక, 'అవసరమైతే దేనినైనా వదులుకోగాని ధర్మాన్ని మాత్రం వదలకు' అని చెబుతుంది గనుక అది 'గండకాలం' అయి కూచుంది. బూచిగా మారింది. దోషకాలం అయింది.

అంటే, నువ్వు చేసే ప్రతి వెధవపనికీ ఆసరాగా నిలవకపోతే అది చెడు అవుతుందా? ఆలోచించండి ! నువ్వు చెయ్యాలనుకున్న తప్పుడు పనులను  చెడగొడుతుంది గనుక యమగండకాలం దుష్ట సమయం అయింది. కాలక్రమేణా శుభకార్యాలలో కూడా దీనిని 'చెడు'గా చూడటం మొదలుపెట్టారు. పంచాంగాలలో వ్రాస్తున్నారు. జనం అనుసరిస్తున్నారు. జనానికి లాజిక్ అక్కర్లేదు కదా ! గొర్రెలమందకు లాజిక్ ఎందుకు? ముందు గొర్రె ఎటు పోతే వెనుకవి కూడా ఆటే పోతాయిగాని, 'ఇలా పోవడం సరియైనదేనా?' అని ఆలోచించవు. అదే ప్రస్తుతం మన సమాజంలో జరుగుతోంది.

యమగండం అనేది ఆధ్యాత్మికానికి చాలా మంచిది. ఈ సమయంలో చేసిన ధ్యానం చాలా మంచి ఫలితాలనిస్తుంది. ఈ విషయం నేను లెక్కలేనన్ని సార్లు గమనించాను. ఎన్నోసార్లు నాకిలా జరిగింది. ఆఫీస్ పనిలో ఉన్నపుడైనా, లేదా ఎక్కడో ఏదో స్టేషన్లో ఇన్స్పెక్షన్ లో ఉన్నప్పుడైనా, లేదా ఇంకేదో పనిలో ఉన్నప్పుడైనా, అకస్మాత్తుగా నాకు ధ్యానస్థితి చాలాసార్లు దానంతట అదే కలుగుతూ ఉంటుంది. అప్రయత్నంగా మనస్సు ఏకాగ్రం అవుతుంది. 'సతోరి' అనుభవంలోకి వస్తూ ఉంటుంది. నా చిన్నప్పటినుంచీ ఇలా చాలాసార్లు జరిగింది. అలా జరిగిన చాలాసార్లు ఆ సమయంలో 'యమగండకాలం' నడుస్తూ ఉండటం నేను గమనించాను. ఆ సమయంలో 'డబ్బు' గురించి, 'సంపాదన' గురించి, విలాసాల గురించి, సినిమాలు షాపింగులు, రాజకీయాల గురించి, ఇంకా ఇలాంటి చెత్త విషయాల గురించి, ఎవరైనా మాట్లాడితే వాళ్ళు క్రిమికీటకాలుగా నాకు కన్పిస్తారు. నేనెక్కడో మేఘాల పైన వెలుగులో ఉన్నట్లు, వాళ్లంతా బురదలో దొర్లుతున్నట్లు అనిపిస్తుంది. మనస్సు అంత ఎత్తులో ఉంటుంది. 'అమూల్యమైన మానవజన్మను పొంది కూడా ఎలా బ్రతుకుతున్నార్రా మీరు? ఎంత టైం ని వేస్ట్ చేసుకుంటున్నార్రా?' అని చాలా జాలి నాలో తలెత్తుతూ ఉంటుంది. ఇలాంటి మానసికస్థితిలో ఉన్న మనిషి  సోకాల్డ్ ' సక్సెస్' ను ఎలా పొందగలడు? ఎదుటివాడిని దోచుకోవాలని ఎలా అనుకోగలడు? కనీసం ఆ కోణంలో ఎలా ప్రయత్నించగలడు? కుదరదు. అలాంటివాడు తన జేబులోనుంచి ఎదుటివాడికి ఇస్తాడు గాని, ఎదుటివాడి జేబులోంచి లాక్కోడు. కనుక, యమగండకాలం దోషపూరితం అయింది. అన్నింటినీ చెడగొట్టే పాడుసమయం అయి కూచుంది. అదీ అసలు సంగతి !

సున్నితంగా, మెత్తగా, మంచిగా, ఆధ్యాత్మికంగా ఉండే మనుషులు ఈ లోకం దృష్టిలో చేతగానివాళ్ళు, పనికిరానివాళ్ళు, బ్రతకడం తెలియనివాళ్ళు, దద్దమ్మలు, మేనేజిమెంట్ తెలియనివాళ్ళు. ఎదుటి మనిషిని మాయమాటలతో బోల్తా కొట్టించి, దోచుకుని, బ్రతికేవాళ్ళు తెలివైనవాళ్ళు. ఇదీ నేటి లోకం తీరు !

యమగండం అనేది లౌకికమైన పనులకు, అందులోనూ స్వార్ధపూరితమైన పనులకు మాత్రమే చెడును చేస్తుంది. ఎందుకంటే అది ధర్మపూరిత సమయం గనుక. ధర్మానికి ప్రతిరూపమైన గురువు యొక్క ఉపగ్రహమైన యమఘంటక సమయం కనుక, ధర్మాన్ని ప్రోత్సహిస్తుంది. అధర్మాన్ని ఖండిస్తుంది. పాడుపనులను ఖచ్చితంగా చెడగొడుతుంది. అంతేగాని అది అన్నింటినీ చెడగొట్టదు. ఆధ్యాత్మిక సాధనలకు ఈ సమయం చాలా మంచిది.

ఈ విషయాన్ని నేను అనుభవంలో నిగ్గు తేల్చుకున్న తర్వాత మాత్రమే చెబుతున్నాను. మీరూ గమనించి చూడండి మరి !
read more " నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (యమగండం ఎందుకు చెడ్డది?) "

5, జనవరి 2020, ఆదివారం

Kalpataru Day Celebration - 2020

ప్రతి ఏడాదీ జనవరి ఒకటో తేదీన లోకం క్రొత్త సంవత్సరాన్ని జరుపుకుంటుంది. నేనూ దీనిని పాటిస్తాను. అయితే లోకం చేసే విధంగా కాదు. షాపింగులు, పార్టీలు చేసుకుని, తిని, తాగి, తందనాలాడి, రాత్రంతా మేలుకుని సొల్లు మాటలు చెప్పుకుంటూ, సినిమాలు, టీవీలు చూస్తూ కాదు. ఇవన్నీ చేస్తూ క్రొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడం చాలా చౌకబారు పోకడగా, ఇలా చేసేవారిని చాలా చౌకబారు మనుషులుగా నేను భావిస్తాను. దీనికి పూర్తిగా భిన్నమైన విధానంలో నేను క్రొత్త సంవత్సరాన్ని జరుపుకుంటాను. పూర్తిగా ఏకాంతంలో, మౌనంలో, ధ్యానంలో నేను ఈ రోజున కాలం గడుపుతాను. సరదాలలో, కులాసాలలో, పనికిమాలిన కాలక్షేపాలలో వేస్ట్ చేసుకోవడానికి మానవజీవితం ఉద్దేశించబడలేదని నా భావన.

1886 సంవత్సరంలో జనవరి ఒకటో తేదీన ఈ అధ్బుతం జరిగింది. ఆ రోజున తన భక్తులు ఏది కోరితే దానిని ఇచ్చారు శ్రీ రామకృష్ణులు. అది ఆధ్యాత్మికమైనా, లౌకికమైనా సరే, వారి కోరికలన్నీ ఆ రోజున అనుగ్రహించబడ్డాయి. ఆ రోజున తనను అర్ధించిన వారిని కాదనకుండా ఆయన తన కరుణను వారిపైన వర్షించాడని ఆ సంఘటనను చూసిన వారు వ్రాశారు. అందుకని అప్పటినుంచీ ఆయన భక్తులు ఆ రోజును 'కల్పతరు దినోత్సవం' గా జరుపుకుంటారు.

ఈ మహత్తరమైన సంఘటనను తలచుకుంటూ ప్రతి ఏడాదీ జనవరి ఒకటో తేదీన మితాహారం, జపం, ధ్యానం, యోగాభ్యాసాలలో నేను కాలం గడుపుతాను. ఇది ఎన్నో ఏళ్ళ నుంచీ నేను పాటిస్తున్నాను. అదే విధంగా ఈ ఏడాది కూడా చేశాను. కాకపోతే, ఈ ఏడాది నేనొక్కడినే లేను. నాతో పాటు పంచవటి బృందం ఉంది. ఆ రోజంతా ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక భావనా తరంగాలలో గడిచింది. నాతో బాటు ఉన్నవారికి ఎన్నో insights ను, spiritual experiences ను ఇచ్చింది.

ప్రస్తుతం నేను హైదరాబాదులోనే ఉంటున్నాను గనుక హైదరాబాద్ వాస్తవ్యులు చాలామంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వారికి, మిగతా దూరప్రాంతాలనుండి ఇక్కడకు వచ్చినవారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

విదేశాలలో ఉన్న పంచవటి సభ్యులకు ఫేస్ బుక్ లింక్ ద్వారా దీనిని వీక్షించే అవకాశం కల్పించాము. రాత్రంతా మేలుకుని దీనిని వీక్షించిన, వారికి కూడా నా కృతజ్ఞతలు.

ఆ ఫోటోలలో కొన్నింటిని ఇక్కడ చూడండి.

















read more " Kalpataru Day Celebration - 2020 "