“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, సెప్టెంబర్ 2020, సోమవారం

'వైద్యజ్యోతిష్యం - మొదటి భాగం' తెలుగు 'ఈ బుక్' విడుదలైంది


మీరు ఎన్నో 
నెలలనుండీ ఎదురుచూస్తున్న తెలుగు పుస్తకం 'వైద్య జ్యోతిష్యం - మొదటిభాగం' ను ఈ రోజున విడుదల చేస్తున్నాము. అయితే ఇది 'ఈ బుక్' మాత్రమే. ప్రింట్ పుస్తకాన్ని ఒక నెలలోపు విడుదల చేస్తాము.

ఈ పుస్తకం యొక్క ఇంగ్లీషు మాతృక 'Medical Astrology - Part I' మంచి ప్రజాదరణను పొందింది. నార్త్ ఇండియాలో, అమెరికా, యూరప్ లలో ఎంతోమంది దీనిని ఆదరిస్తున్నారు. ఈ పుస్తకం తెలుగులో రావాలని చాలామంది ఎప్పటినుంచో అడుగుతున్నారు.  అందుకే దీనిని తెలుగుపాఠకుల కోసం తెలుగులో ప్రచురిస్తున్నాము.

ఇంగ్లీషుమూలాన్ని తెలుగులోకి అనువాదం చెయ్యడానికి రెండునెలలుగా నిర్విరామంగా శ్రమించిన నా శిష్యురాలు అఖిలజంపాల కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పుస్తకాలు వ్రాసే స్థాయిలోని తెలుగు తనకు రాకపోయినా, నేర్చుకుని మరీ ఆమె చాలా సంతృప్తికరంగా ఈ అనువాదాన్ని చేసింది.

నా శిష్యులలో ఇలాంటి పట్టుదలను. చిత్తశుద్ధిని, కార్యదీక్షను నేను కోరుకుంటాను. నా అడుగుజాడలలో నడిస్తేనే కదా నా శిష్యులయ్యేది? ఊరకే మాటలు చెబుతూ కూర్చుంటే ఎలా అవుతారు? నా జీవితంలో నేనెంతో కష్టపడి ఎన్నో సాధించాను. నా శిష్యులలో కూడా ఆ పట్టుదల నాకు కన్పించాలి. అప్పుడే వారిని ఒప్పుకుంటాను.

ఆధ్యాత్మికత అనేది చేతలలో కూడా కనిపించాలి. ఉత్త మాటలలో మాత్రమే కాదు.

యధావిధిగా ఈ పుస్తకం కూడా google play books నుంచి లభిస్తుంది. చదవండి ! ఇందులో పంచిన జ్ఞానాన్ని మీ జీవితాలను దిద్దుకోవడానికి ఉపయోగించుకోండి ! 

read more " 'వైద్యజ్యోతిష్యం - మొదటి భాగం' తెలుగు 'ఈ బుక్' విడుదలైంది "

27, సెప్టెంబర్ 2020, ఆదివారం

బాలసుబ్రమణ్యం జాతకంలో రాహుకేతువుల పాత్ర

సుమధురగాయకుడు బాల సుబ్రమణ్యం 
4-6-1946 న నెల్లూరు దగ్గరలో పుట్టాడు. ఆయన గురించి అందరికీ తెలుసు. అదంతా మళ్ళీ నేను వ్రాయవలసిన పని లేదు. ఆయన జాతకంలోని కొన్ని ముఖ్యమైన యోగాలను మాత్రం చెప్తాను.

నీచ కుజుడు, చంద్రుడు ఇద్దరూ బుధనక్షత్రంలో ఉండటం వల్ల మహాపట్టుదల ఉన్న మొండిమనిషని అర్ధం అవుతోంది. బుధుడు తృతీయాధిపతి కావడం వల్ల పాటలు పాడుతూ, డబ్బింగ్ చెప్పే కళాకారుడని తెలుస్తున్నది. గురువు వక్రత్వం వల్ల శాస్త్రీయసంగీతంలో లోతైన ప్రజ్ఞ లేదన్న విషయం స్ఫురిస్తున్నది.

చూడటానికి ఇది కాలగ్రస్తయోగ జాతకంలాగా కన్పిస్తుంది గాని సూర్యుడు బుధుడు రాహుకేతువుల పట్టులో లేరు గనుక ఆ యోగం లేదు. జననసమయం మనకు తెలియదు గనుక ఇతర పద్ధతుల ద్వారా చూద్దాం.

వృత్తికారకుడు, ఆత్మకారకుడైన శని, సినిమారంగానికి కారకుడైన శుక్రునితో కలసి, సాహిత్యానికి సంగీతానికి కళలకు నెలవైన మిధునంలో ఉండటం సినిమారంగంతో సంబంధమున్న వృత్తిని, పేరు ప్రఖ్యాతులను ఇచ్చింది. అయితే, పంచమంలో ఉచ్చకేతువున్నప్పటికీ పంచమాధిపతి కుజుని నీచత్వస్థితివల్ల, చంద్రునితో కలయిక వల్ల- సంతానమూలకంగా మనోవ్యధ, నష్టమూ తప్పవని, సంపాదించినది మిగిలే అదృష్టం లేదన్న సూచన స్పష్టంగా ఉన్నది. నవమాధిపతి అయిన గురువు వక్రిగా ఉంటూ దీనిని బలపరుస్తున్నాడు.

రాహువు ఉచ్చశుక్రుడిని సూచిస్తున్నందు వల్ల, సూర్యునితో బుధునితో కలసి ఉన్నందువల్ల సినిమారంగంలో విజయాన్నిచ్చాడు.

రాహుకేతువులు ఆయన పుట్టినపుడు ఏ స్థానాల్లో ఉన్నారో ఇప్పుడు అదే స్థానాలకు వచ్చారు. అంటే, 4 ఆవృత్తులు పూర్తిచేశారు. కనుక ఆయనకు 72+ ఏళ్లు నిండాయి. జాతకంలో రాహుకేతువుల ఉచ్చస్థితి చాలా మంచిసూచన. ఈ జాతకులు బిచ్చగాడి స్థితినుంచి మహారాజస్థితికి ఎదుగుతారు. బాలూగారు అలాగే, సున్నా నుంచి ఈ స్థాయికి ఎదిగాడు. అనేక భాషలలో పాడటమూ, రకరకాల గొంతులు పెట్టి ప్రయోగాలు చేయడమూ, మిమిక్రీ చేయడమూ, అనేక దేశాలు తిరిగి ప్రదర్శనలివ్వడమూ ఇదంతా శుక్రుడిని సూచిస్తున్న ఉచ్చరాహువు అనుగ్రహమే.

కానీ రాహుకేతువులు ఇస్తున్న యోగం నాలుగో ఆవృత్తితో అయిపోయింది. కనుక రాహువు వృషభంలోకి ప్రవేశించగానే మరణం కూడా ఆయన జీవితంలో ప్రవేశించింది. ఎన్ని ఆవృత్తులకు రాహుకేతువుల యోగం అయిపోతుంది అని మాత్రం ఆడక్కండి. ఆ రహస్యాలు చెప్పను.

రాహువు 23 న వృషభం లోకి వచ్చాడు. బాలూగారు 25 న చనిపోయాడు. అంతకు ముందు ఆగస్ట్ 5 న కరోనా లక్షణాలతో ఆయన ఆస్పత్రిలో చేరాడు. అప్పుడు రాహువు మిథునం మొదటి నవాంశలో ఉన్నాడు. అప్పటికే వృషభం మీద రాహువు యొక్క ఆచ్చాదన మొదలైంది. అందుకే ఆస్పత్రిలో పడేశాడు. ఆ నవాంశ అయిపోయేవరకూ అంటే, సెప్టెంబర్ 23 వరకూ ఆస్పత్రిలోనే ఉన్నాడు. రాహువు రాశి మారి వృషభం లోకి రాగానే తీసుకుపోయాడు.

కరోనా అనేది రాహువు కన్నెర్ర చేయడం వల్ల లోకానికి మూడిన రోగమే !

బాలూగారి జాతకం మీద రాహుకేతువుల ఉచ్చస్థితి ప్రభావం స్పష్టంగా కన్పిస్తున్నది.

read more " బాలసుబ్రమణ్యం జాతకంలో రాహుకేతువుల పాత్ర "

25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

పుచ్చు ప్రశ్నలు - చచ్చు జవాబులు

'మంచి ప్రశ్నలు అడగండిరా బాబూ' అని ఎంత మొత్తుకుంటున్నా కూడా, నా బ్లాగు, నా పుస్తకాలు చదివేవాళ్ళు, నాకు అందని చాలా హై లెవల్ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అవేమో మనకర్ధం కావు. ఏం చేస్తాం మరి? అందుకని నా చిన్ని బుర్రకు అర్ధమైన రీతిలో నా చదువరుల ప్రశ్నలకు జవాబులు చెబుతూ ఉంటాను.

వాళ్ళ పుచ్చుప్రశ్నలకు నా చచ్చుజవాబులు ఎలా ఉంటాయో వినండి, మీకూ కాస్త రిలీఫ్ గా ఉంటుంది.

ఒకామె ఇలా అడిగింది.

'రామమందిరం శంకుస్థాపన రాహుకాలంలో చేశారేమిటి? అలా చెయ్యవచ్చా?'

అంటే, నీకున్నంత బుర్ర మోడీగారికి అందుబాటులో ఉన్న రాజజోతిష్కులకు లేదా? వాళ్ళు పిచ్చివాళ్ళా? రాహుకాలం మనకొక్కరికే తెలుసా? ఇంకెవరికీ తెలీదా?

ఆమెకిలా చెప్పాను.

'రాహువును గంగలో కలవనీ, నీకేంటి బాధ?'

ఆమె ఊరుకోదు కదా? మళ్ళీ ఇంకో ప్రశ్న సంధించింది.

'మీరు శ్రీ విద్య ఉపాసకులు కదా? శ్రీ విద్య ఉపాసకులు ఇలాగేనా మాట్లాడేది?'

ఇలా చెప్పాను.

'శ్రీవిద్య ఉపాసకులను ఇలాంటి చెత్తప్రశ్నలా అడిగేది? ఇంతకంటే మంచి ప్రశ్నలు అడగడం మీకు రాదా? మంచి ప్రశ్నలు అడగడం ముందు నేర్చుకోండి'.

పట్టువదలని విక్రమూర్ఖురాలు మళ్ళీ ప్రశ్న వదిలింది.

'అసలు మీకు శ్రీ విద్య తెలుసా?'

ఇక నిజరూపదర్శనం ఇవ్వక తప్పేటట్టు లేదనిపించి, ఆమెకు ఇలా జ్ఞానబోధ గావించాను.

'చూడమ్మా. ఎప్పుడో కాలేజిరోజుల్లో శ్రీవిద్య ఉపాసన చేసేవాడిని. కానీ శ్రీవిద్య ముసలిదైపోయింది. అందుకని శ్రీదేవి ఉపాసన మొదలుపెట్టాను. అదీ చచ్చిపోయింది. ఇప్పుడు వేరే దేవత ఉపాసన మొదలుపెట్టాను. నువ్వొక పని చెయ్యి. నీకు ఆధ్యాత్మిక రహస్యాలన్నీ బాగా అవగతం కావాలంటే, ఒక దేవతా ఉపాసన ఉపదేశిస్తాను. నువ్వు రజనీకాంత్ ఉపాసన చెయ్యి. పోనీ ఆయన ముసలాడై పోయాడని నీకనిపిస్తే, నీ ఇష్టం వచ్చిన కుర్రహీరోను ఎంచుకుని వాడి ఉపాసన చెయ్యి. అప్పుడిలాంటి చచ్చు సందేహాలు రాకుండా ఉంటాయి. ఇక నీ పుచ్చుప్రశ్నలతో నన్ను బాధపెట్టకు. నిన్ను బ్లాక్ చేస్తున్నాను. బై'.

మరికొంతమంది నన్ను 'గురూజీ' అని పిలిస్తే నేను ఫ్లాట్ అయిపోతానని అనుకుంటూ ఉంటారు. ఆ పదమంటే నాకు పరమ ఆసహ్యమన్న సంగతి వాళ్లకు తెలీదు. తెలీనితనం వల్లనో, మరెందుకనో గాని, లోకంలో అలవాటైన జిత్తులను నా దగ్గర ప్రదర్శిస్తూ ఉంటారు. తల బొప్పి కట్టించుకుంటూ ఉంటారు.

ఇంకొక సందేహసుందరం ఇలా అడిగాడు.

'గురూజీ ! మీ దగ్గర కర్ణపిశాచి, వటయక్షిణి ఉన్నారని తెలిసింది. ఆ విద్యలను నాకు పరిచయం చేస్తారా?'

అతనికి ఇలా చెప్పాను.

'సారీ బాబు ! మొన్నటిదాకా నా దగ్గరే ఉండేవాళ్ళు. నిన్న షాపింగ్ కని బయటకెళ్ళిన వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు. ఈ మధ్యనే వాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చి తగ్గింది కూడా. ఏమైపోయారో తెలియడం లేదు. పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లెయింట్ కూడా ఇచ్చాను. వాళ్ళు భద్రంగా తిరిగి వస్తే అప్పుడు నీ సంగతి ఆలోచిస్తా'.

మనవాడు అంత త్వరగా వదలడు కదా ! అలా వదిలితే అలాంటి విద్యలను ఎందుకు కోరుకుంటాడు?

'జోకులాపండి సార్ ! పోనీ మీకు ఇంకేం విద్యలు వచ్చో చెప్పండి అవి నేర్చుకుంటాను. మీరేం చెబితే అది చేస్తాను. మీరే నా గురువు దైవం కూడా'.

నాకు భలే నవ్వొచ్చింది.

'ఈ రకంగా 'మీరే నా గురువు, మీరే నా దైవం, మీ తర్వాతే ఎవరైనా' అని పెద్దపెద్ద డైలాగులు చెప్పిన దగుల్బాజీలను చాలామందిని గతంలో చూచాను. ఆ తర్వాత వాళ్ళు అనుకున్నవి నా దగ్జర సాగనప్పుడు వాళ్ళే నన్ను నానామాటలూ అన్నారు. అలాంటి రోడ్ బేవార్స్ గాళ్ళు చాలామంది గతంలో నా శిష్యులే గనుక మళ్ళీ మళ్ళీ మోసపోదలుచుకోలేదు. ఇవన్నీ అవసరార్ధం మాట్లాడే మాటలని నాకు బాగా తెలుసు.

'చూడు బాబు. నాకే విద్యలూ తెలీదు. నా ఇంట్లో ఏ దేవతలూ పనిమనుషులుగా పని చెయ్యడం లేదు. నీ కోరికలు నేను తీర్చలేను. లోకంలో చాలామంది దొంగ గురువులు నీకు సరిపోయేవాళ్ళున్నారు. వాళ వెంటపడు. ఇక నాకు మెయిల్స్ ఇవ్వకు. ఇచ్చావంటే నిన్ను బ్లాక్ చేస్తాను. గుడ్ బై'.

ఇంకొకామె ఇలా ప్రశ్నించింది.

'సంకల్పానికి క్రతువుకి తేడా ఏమిటి?'

'అంత పెద్ద పెద్ద ప్రశ్నలు నాకర్ధం కావమ్మా. నేనంత చదువుకోలేదు. నా స్థాయి ప్రశ్నలు నన్నడుగు' అన్నాను.

'అదేంటండి. ఈ మాత్రం అర్ధం కాకపోతే, మీరసలు గురువెలా అవుతారు?' అంటుంది.

ప్రతివాళ్ళూ ఇదే గోల ! అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. వాళ్ళ అవసరాలుంటే 'గురువుగారు, గురువుగారు' అంటారు. అవసరాలు తీరాక 'నువ్వేం గురువ్వి?' అంటారు. వినీ వినీ ఈ మాటంటేనే నాకు చీదర పుడుతోంది. చెత్త మనుషులు చెత్త మాటలు !

ఈమెకిలా కాదని ' సరే చెప్తా వినమ్మా. మీ ఆయన నిన్నేమైనా చెయ్యాలనుకుంటే అది సంకల్పం. చేస్తే అది క్రతువు' అన్నా.

ఆమెకు భలే కోపమొచ్చేసింది. ఎట్ లీస్ట్ అలా నటించింది.

'ఏంటండి? అలాంటి అసభ్యమైన మాటలు?' అంది

'నేనన్నదాంట్లో అసభ్యం ఏముందమ్మా? అసభ్యత ఉంటే గింటే నీ మనసులో ఉందేమో? అందుకే నేను మామూలుగా అన్న మాటకూడా నీకు అసభ్యంగా కనిపిస్తోంది.  పోనీ నీకెలా కావాలో చెప్పు అలాగే చెప్తా' అన్నాను.

అంతే, ఆ దెబ్బతో మళ్ళీ ఆమె మాట్లాడితే ఒట్టు !

ఇంకొక మహనీయుడు ఇలా అడిగాడు.

'గురుగారు ! మీరు కర్ణపిశాచి గురించి తెగ రాశారు. అసలెన్ని పిశాచాలున్నాయి సార్ మీ ఎరుకలో?'

అదేంటో గాని, ఎన్ని ఉన్నతమైన విషయాల గురించి వ్రాసినా, జనాలు కర్ణపిశాఛి గురించే మాట్లాడుతూ ఉంటారు. పిశాచాలంటే ఎంత ముద్దో మనకి?

అతనికి ఇలా చెప్పాను. 

'చాలా ఉన్నాయి నాయన ! కానీ మనకు ఉపయోగ పడేవి మూడే'

'ఏంటి గురూజీ అవి?'

'శ్రద్ధగా విను నాయన ! ఒకటి కర్ణపిశాచి, రెండు కామపిశాచి , మూడు ధనపిశాచి'

'అబ్బ ! ఎంత గొప్పగా సెలవిచ్చారు గురూజీ'

'ఏం నాయనా నీకు కర్ణపిశాచి కావాలా?' అడిగాను.

'ఇప్పటిదాకా అదే అనుకున్నాను గురూజీ. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాను'.

విషయం అర్ధమైంది నాకు.

'ఇప్పుడెవరు కావాలి నాయన?'

'అదే ... అదే... కా... కా.... కా...' అని కాకిలా అరుస్తున్నాడు.

'అర్ధమైంది నాయనా నీ బాధ ! కానీ ధ ధ ధ లేకుండా కా కా కా వస్తే నువ్వు తట్టుకోలేవు నాయన'

'అదేంటి గురూజీ?'

'ధనపిశాచి నీ దగ్గర లేకపోతే కామపిశాచిని నువ్వేం భరిస్తావురా పిచ్చివాడా ?'

'మరి మార్గం లేదా గురూజి? మీ  దగ్గర ఈ ముగ్గురూ ఉన్నారా?' దీనంగా అడిగాడు.

'ఉన్నారు నాయన ! చిన్నప్పుడు కర్ణపిశాచి ఉపాసన చేశాను. మాంఛి వయసులో ఉన్నపుడు కామపిశాచి ఉపాసన చేశాను. ఇప్పుడు ధనపిశాచిని పట్టుకున్నాను'.

'అదేంటి గురూజీ? మీరు గురువు కదా మీకు ధనం ఎందుకు?'

నవ్వుతో నాకు పొలమారింది.

'హోరి పిచ్చివాడా ! డబ్బెవరికి చేదురా? మీలాంటి మామూలు మనుషులకే ఇంత డబ్బు యావ ఉంటె, ఇక మాలాంటి గురువులకి ఇంకెంతుండాలి? మీది ఒక చిన్న కుటుంబం నాయనా, మాది విశ్వకుటుంబం. ఒక చిన్న ఫేమిలీ నడపడానికే నీకు కిందా మీదా అవుతుంటే, ఇక ఈ విశ్వకుటుంబం నడపాలంటే  మాకెంత కావాలి? ఆలోచించు. మీ డబ్బంతా మాక్కావాలి. మీది కాజెయ్యటానికే  మేమున్నది. మా దాహం అనంతం నాయనా ! మాకు అన్ని దాహాలూ ఎక్కువే. ఎక్కువైతేనే గురువౌతాడు. తక్కువగా ఉంటె మామూలు మనిషౌతాడు. అసలు లేకపోతే అక్కాయౌతాడు'. అన్నాను.

శిష్యుడు పట్టించుకునే మూడ్ లో లేడు. 

'నాకా మూడూ అర్జంటుగా కావాలి గురూజీ. ఉపదేశం చేస్తారా?' ఆక్రోశించాడు.

'ఛస్తే చెయ్యను'

'అదేంటి గురూజీ? నువ్వే నా దేవుడు. నువ్వే నా అమ్మా నాన్నా అన్నీ. నువ్వే కాదంటే నేనెక్కడికి పోవాలి గురూజీ. నువ్వేం చెబితే అది చేస్తా. కావాలంటే నీ ఎంగిలి తినమన్నా తింటా !' భోరుమన్నాడు.

అసహ్యమేసింది. 

'ఛీ ఛీ ... నీ లాంటి బొచ్చెల్ని చిన్నప్పుడే బోల్డుమందిని చూశాన్రా బొండ్లే. నా దగ్గర నాటకాలెయ్యకు. నువ్వు నన్ను గురూజీ అనగానే నీకన్నీ చెప్పెయాలా? మా నాయనే. ఏళ్ళకేళ్ళు నాకు సేవ చేస్తున్నవాళ్ళకే ఇక్కడ దిక్కు లేదు. నువ్వీరోజు వచ్చి బిస్కెట్ వేస్తె పడతానని అనుకున్నావా వెర్రినాగన్న? అది జరిగేపని కాదుగాని, సందుల్లో గొందుల్లో వెతుక్కో, కొండదొరలు, కోయదొరలు ఉంటారు. వాళ్ళ కాళ్ళు పట్టుకో పోయి' అన్నాను  అతన్ని బ్లాక్ చేశాను.

కొద్ది రోజుల తర్వాత దొంగ ఈ మెయిల్ ఐడీలతో తిడుతూ మెయిల్స్ రాసాగాయి. వీడి పని ఇలా ఉందా అని మా ఫ్రెండ్ ఒక ఎస్ పీ కి పోన్ చేసి విషయం చెప్పా.

'వాడి అడ్రస్ తెలుసా నీకు?' అడిగాడు ఎస్ పీ.

'తెలీదు. కానీ పట్టుకోడం పెద్ద కష్టం కాదు. ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాడు' చెప్పాను.

'సరే. అడ్రస్ కనుక్కో. వాణ్ని బట్టలిప్పి తలక్రిందులుగా వేలాడదీసి నీ ఎదురుగానే ఉతుకుతా. చూద్దువు గాని' అన్నాడు నవ్వుతూ.

'అంతవద్దులే. చస్తాడు అర్భకపు వెధవ. రోడ్ బేవార్స్ గాడు. మన స్థాయి కాదు వాడిది' చెప్పాను.

'సరే, మళ్ళీ నీకు ఎబ్యూసివ్ మెయిల్స్ ఇస్తే, నాకు చెప్పు, తోలు తీస్తా వాడిది' అన్నాడు ఫ్రెండ్.

నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశా.

ఇంకొక మెంటల్ కేసు ఈ మధ్యనే ఇలా అడిగింది.

'గురూజీ, నాకు శరీరం బయటికి వచ్చి సూక్ష్మశరీరంలో తిరగాలని ఉంది. మీకు తెలుసా ఈ విద్య?'

'ఓ ! ఎందుకు తెలీదు? చాలా వీజీ' చెప్పా.

'నాకు చేయిస్తారా?' అడిగింది.

'తప్పకుండా. కాకపోతే ఒకటే సమస్య ! బయటకు పంపడం వరకూ నాకు  బాగా తెలుసు. లోపలి తేవడం మాత్రం తెలీదు' అన్నాను.

'మరి అపుడు నేనేమౌతాను?' అడిగింది.

'దయ్యమౌతావు' అన్నాను.

'బాబోయ్ నాకసలే దయ్యాలంటే భయం ! అలాంటి మాటలు చెప్పకండి గురూజీ' అరిచింది.

'అంత ఒంటూపిరిదానివి? నీకెందుకే సూక్షశరీరప్రయోగాలు? నోర్మూసుకుని చెప్పిన సాధన చెయ్యి' అన్నా.

ఇంకొక అత్యాశా శిష్యుడు ఇలా అడిగాడు.

'గురూజీ. సంస్కారాలు ఎలా నాశనం అవుతాయి?'

వీడు నోరు తెరిస్తే అబద్దాలు చెబుతాడని, చాడీలు చెబుతాడని, కుట్రలు చేస్తాడని నాకు తెలుసు.

'చూడు నాయన. ముందు సంస్కారం నేర్చుకో. ఆ తర్వాత అవి ఎలా పోతాయో చెబుతా. సంస్కారం ఉన్నవాడికి కదా సంస్కారనాశనం? నీకు లేనిదే అది. కనుక ముందు అబద్దాలు చెప్పడం, చాడీలు చెప్పడం, ఇక్కడి మాటలు అక్కడా అక్కడి మాటలు ఇక్కడా చేరవేయ్యడం మానుకో. నిజాయితీగా కొన్నాళ్ళు అయినా  బ్రతుకు. ఆ తర్వాత ఆలోచిద్దాం' అన్నా.

ఇలా రకరకాల పిచ్చోళ్ళు మనకు తగులుతూ ఉంటారు. చెబితే వినరు. వాళ్లకి అర్ధం కాదు.  వీళ్ళతో పడలేక నా ఫోన్ నంబర్ మార్చి పారేశా. ఒక్క మెయిల్స్ లో మాత్రమే వీళ్ళతో మాట్లాడుతున్నా. అప్పటికీ ఎలాగో నా నంబర్ కనుక్కొని వాట్సప్ లో కదిలిస్తూ ఉంటారు. ఈ విధంగా గడ్డి పెట్టించుకుంటూ ఉంటారు.

నేను చెప్పేది చేసే శిష్యులు నాకు కావాలి గాని, వాళ్ళ పిచ్చిని నా ద్వారా సాగించుకుందామని అనుకునే నాటకాలరాయుళ్ళు నాకక్కర్లేదు. అలాంటి వాళ్ళు బొక్కబోర్లా పడటమే చివరకు జరిగేది. నా దారిలో వినయంగా నాతో నడిచేవాళ్ళు నాతో మిగులుతారు. మిగతావాళ్ళు పోతారు. అంతే.

చచ్చుప్రశ్నలు పుచ్చుప్రశ్నలు కాదురా బాబు, కాస్త స్థాయి పెంచుకొండిరా. ఎప్పుడూ బురదలోనే దొర్లకండిరా. కాస్త ఆకాశంలో ఎగరడం కూడా నేర్చుకోండి. ఉన్నతంగా బ్రతకడం, ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకోండి. అని మొత్తుకొని చెబుతున్నా. వింటారా? అబ్బే ! వింటే వీళ్ళు ఇలా ఎందుకుంటారు?

ఎప్పుడు బాగు పడతారో ఏంటో ఎర్రి జనాలు?

read more " పుచ్చు ప్రశ్నలు - చచ్చు జవాబులు "

21, సెప్టెంబర్ 2020, సోమవారం

రాహుకేతువుల రాశి మార్పు - ఫలితాలు

 23 - 9 - 2020 న రాహుకేతువులు రాశులు మారుతున్నారు. ఇప్పటివరకూ వారున్న స్థితులు మారి, రాహువు వృషభంలోకి, కేతువు వృశ్చికం లోకి వస్తారు. ఈ స్థితిలో వీళ్ళు ఏడాదిన్నర పాటు ఉంటారు. అంటే, మార్చ్ 2022 వరకు.

దీనివల్ల అనేక రకాలైన మార్పులు మనుషుల జీవితాలలో రాబోతున్నాయి.

అవేమిటో చూద్దాం

-------------------------

మేషరాశి

మాట దూకుడు ఎక్కువౌతుంది. ఉత్సాహం పెరుగుతుంది. ఆ దూకుడులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండాలి. కన్నులకు సైట్ పెరుగుతుంది. రకరకాలైన తిండ్లు తినే అవకాశం కలుగుతుంది. డబ్బుకు లోటుండదు.

వృషభరాశి

అహంకారం బాగా పెరుగుతుంది. ఎదుటి మనుషులను, జీవిత భాగస్వాములను ఇబ్బంది పెడతారు. ప్రేమ వ్యవహారాలు బలం పుంజుకుంటాయి. ఆకర్షణలు ఎక్కువౌతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహాలు, విలాసాలు, రకరకాల పనులు ఎక్కువౌతాయి. సంతానం వృద్ధిలోకి వస్తారు.

మిధునరాశి

రహస్యప్రేమలు మొదలౌతాయి. సంతానం విదేశాలలో స్థిరపడతారు. బ్లాక్ మనీ కూడబెడతారు. అనవసర ఖర్చులు ఎక్కువవుతాయి. గుప్తరోగాలు, అజీర్ణరోగాలు పట్టుకుంటాయి. శత్రుబాధ బాగా పెరుగుతుంది. 

కటకరాశి

రోగాలు ఎక్కువౌతాయి. అసాంఘికశక్తులతో స్నేహాలు కలుగుతాయి. మొండితనం పెరుగుతుంది. సంతానం చెప్పిన మాట వినకుండా తయారౌతారు. అక్రమ సంబంధాలు ఏర్పడతాయి. ఇతరులను హింసిస్తారు.

సింహరాశి

ఇంటా బయటా ఎదురులేకుండా ఉంటుంది. విందులు, వినోదాలు, విలాసాలు, జల్సాలు మొదలౌతాయి. ప్రమోషన్ వస్తుంది. వ్యాపారం కలిసొస్తుంది. జీవితం ఆనందంగా ఉంటుంది.

కన్యారాశి

ధైర్యం పెరుగుతుంది. సునాయాసంగా పనులు జరుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎదురుండదు. ఆధ్యాత్మిక చింతన, దైవదర్శనం, పుణ్య క్షేత్రసందర్శనం లభిస్తాయి. విదేశాలకు వెళతారు. రకరకాల ప్రదేశాలు చూస్తారు. దొంగగురువుల వలలో పడతారు.

తులారాశి

మాట దూకుడు వల్ల చాలా నష్టపోతారు. పిత్రార్జితం వస్తుంది. ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది. స్త్రీల మాయలో పడి నష్టపోతారు. నయంకాని దీర్ఘరోగాలు పట్టుకుంటాయి. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతారు.

వృశ్చికరాశి

జీవితభాగస్వామితో గొడవలౌతాయి. విడిపోయేవరకూ వస్తుంది. పార్ట్నర్స్ మోసం చేస్తారు. దీర్ఘరోగాలు ఏడిపిస్తాయి. యాక్సిడెంట్ అవుతుంది. హఠాత్ నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటారు.

ధనూరాశి

పాతరోగాలు తిరగబెడతాయి. నయం కాని రోగాలు పట్టుకుంటాయి. శత్రువులు దెబ్బ తీస్తారు. కాలం ఎదురుతిరుగుతుంది. ఖర్చులు విపరీతంగా ఎక్కువౌతాయి. సంపాదన అంతా రోగాలకే సరిపోతుంది.

మకరరాశి

ఉత్సాహం పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాధన ఫలిస్తుంది. ప్రేమలు ఫలిస్తాయి. సోల్ మేట్ ను కలుస్తారు. ధనలాభం ఉంటుంది. సంతానం బాగా వృద్ధిలోకి వస్తారు. మంచి మిత్రులు లభిస్తారు. అయితే, వారివల్ల బాధలుంటాయి.

కుంభరాశి

గృహసౌఖ్యం బాగుంటుంది. మనస్సు ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది. మాట చెల్లుబడి అవుతుంది. కాలం కలిసొస్తుంది. జీవితం ఆనందంగా ఉంటుంది.

మీనరాశి

ధైర్యం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. దూరప్రయాణాలు చేస్తారు. మిత్రులను కలుస్తారు. కాలం కలిసొస్తుంది.

ఈ ఫలితాలు ఏడాదిన్నర పాటు నడుస్తూ, మధ్యలో మిగతా గ్రహాల గోచారప్రభావం వల్ల మార్పులకు లోనౌతూ ఉంటాయి. గమనించండి.

read more " రాహుకేతువుల రాశి మార్పు - ఫలితాలు "

14, సెప్టెంబర్ 2020, సోమవారం

నిత్యానంద జాతకంలో గోచార గ్రహాల పాత్ర - కొన్ని ప్రశ్నలు

గత పోస్టు చదివిన తర్వాత నేను నిత్యానందను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. ఆ ప్రమాదం మీకు లేకుండా చెయ్యడానికే ఈ పోస్ట్. అదీగాక, గత  పోస్ట్ లో గోచారగ్రహాల పాత్రను నేను చెప్పలేదు. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి కదా ! 

అందుకని, ఇప్పుడు చదవండి.

ఏలినాటి శని

పుట్టినపుడు ఎవరికైతే శనిచంద్రులు కలసి ఉంటారో వారు ఏలినాటి శని రెండవ ఘట్టంలో పుట్టినట్లు లెక్క. ఆ జాతకానికి శని యోగకారకుడైనా సరే, ఇలాంటి యోగం జాతకంలో ఉన్నపుడు ఆ జాతకుడిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తాడు. ఇది జాతకుడి జన్మంతా తప్పని ఒక చెడుయోగం. నిత్యానంద జాతకంలో ఈ యోగం ఉన్నట్లు మనం చూడవచ్చు. పైగా ఈ లగ్నానికి శని అర్ధపాపి. చంద్రలగ్నానికి పూర్ణపాపి. కనుక, ఈ యోగం ఒక విధమైన ఆధ్యాత్మికజీవితాన్ని ఇచ్చినప్పటికీ, ఏదో రకమైన వేధింపులు మాత్రం ఇతనికి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.

పన్నెండేళ్ళ వయసులో 360 డిగ్రీల దృష్టి

అంటే అది 1990 వ సంవత్సరం. ఆ సమయంలో గోచారశని పంచమంలోను, గురువు ద్వాదశంలో ఉచ్చస్థితిలోనూ ఉన్నారు. ఇది ఆధ్యాత్మికంగా అనుభవాలను కలిగించే గోచారమే గనుక ఒక క్షణికమైన అనుభవాన్ని కలిగించి ఉండవచ్చు. కానీ ఒక విషయాన్నీ గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మిక అనుభవాలు ఎల్లకాలం నిలబడి ఉండవు. ఆ కాసేపు ఉంటాయి. తరువాత పోతాయి. అందుకే వాటిని లెక్కపెట్టకూడదని యూజీగారు అనేవారు. జిల్లెళ్ళమూడి అమ్మగారు మహిమలను కొట్టి పారేసేవారు. 

శ్రీ రామకృష్ణులు, వారి భక్తులు కూడా మహిమలను మహత్యాలను లెక్కచెయ్యరు.  వారూ ఇదే అంటారు. అనుభవాలు శాశ్వతం కాదు. అనుభవి శాశ్వతం. ఇంకొక మెట్టు పైకెక్కితే అనుభవి కూడా లేడు. యోగి గమ్యం అది కావాలి గాని ఈ క్షణం ఉండి మరుక్షణం మాయమయ్యే చిన్నచిన్న అనుభవాలకోసం అతడు అర్రులు చాచకూడదు. సాధనామార్గంలో వేలాదిగా అలాంటి అనుభవాలు కలుగుతాయి. కానీ మనం పట్టించుకోకూడదు.

ఒకవేళ ఆ సిద్ధి అలాగే నిలబడి ఉన్నది అనుకుంటే, రంజిత వీడియో సమయంలో తన గదిలో సీక్రెట్ కెమెరా ఉన్నదన్న విషయం 360 డిగ్రీల దృష్టి ఉన్నవాడికి ఎందుకు తెలియలేదు? మూడోకన్ను అప్పుడెందుకు పని చెయ్యలేదు? రంజిత సమక్షంలో అన్ని శక్తులూ నీరుగారిపోయాయా? దీనికి సమాధానం ఉండదు. కనుక ఈ సిద్ధి ఆయనకు శాశ్వతంగా ఉన్నట్టి సిద్ధి కాదని అర్ధం కావడం లేదా?

ఇదే సంఘటనకు సమాంతర సంఘటనలు మిగతా గురువుల జీవితాలలో కూడా జరిగాయి.

ఆరిగాన్ లో తన ఇంటిని, తన గదిని షీలా వైర్ ట్యాపింగ్ చేయించినప్పుడు ఓషో తెలుసుకోలేకపోయాడు. తర్వాత, అమెరికన్ మీడియా ఆయన్ను అడిగింది - 'నువ్వు జ్ఞానివైతే నీ గదిలో జరుగుతున్నది నీకు తెలీలేదా?' అని. దానికి ఓషో ఏవేవో కాకమ్మ కబుర్లు చెప్పాడు. నవ్వుల పాలయ్యాడు.

ఎన్నో శక్తులున్నాయని చెప్పుకునే అరబిందో కూడా ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు. మనకు స్వతంత్రం వచ్చిన రోజున, పాండిచేరి అరబిందో ఆశ్రమాన్ని నాస్తికులు ఎటాక్ చేసారు. అరబిందో వ్యక్తిగత అనుచరుడు ఆ కొట్లాటలో స్పాట్ లో చనిపోయాడు. దీనిని అరబిందో ముందుగా తెలుసుకోలేక పోయాడు. ఆపలేక పోయాడు. దీనికి ఆయన భక్తులు ఇప్పటిదాకా తృప్తికరమైన సమాధానం చెప్పలేకపోతున్నారు.

ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ప్రత్యక్షమై ఆపరేషన్లు కూడా చేశాడని ప్రచారం చేయించుకున్న సత్యసాయిబాబా, స్టూడెంట్స్ మర్డర్ నాటి రాత్రి, తన గదిలోకి పారిపోయి లోపలనుంచి గడియ బిగించుకుని దాక్కున్నాడు. పెద్దవయసులో ఆరోగ్యంతో పాటు శక్తులూ తగ్గిపోయాయా?  ఏంటిదంతా?

జరిగే ప్రచారాలేమిటి? జరుగుతున్న వాస్తవాలేమిటి? ఎక్కడైనా పొంతన ఉందా అసలు? పిచ్చిలోకం పిచ్చి గోల?

కనుక, ప్రతి సాధకుడికీ, గురువుకూ,  కొద్దో గొప్పో శక్తులు ఉంటాయి. కానీ ప్రచారం మాత్రం గోరంతలు కొండంతలు చేసుకుంటారు. ఇది తప్పు. ఇక్కడే ప్రతి గురువూ అతని శిష్యులూ  తప్పు చేస్తున్నారు. శిష్యుల అతిప్రచారం వల్లనే గురువులు పతనం అవుతారు. ఉన్నవీ లేనివీ ప్రచారాలు చేసి జనాన్ని మోసం చేస్తే, సమయం వచ్చినపుడు శనిభగవానుడి చేతిలో శిక్ష తప్పదు. అందుకే, గొప్పలు ఎచ్చులు పనికిరావు.

14 ఏళ్ళ వయసులో పరమశివానుభవం

అప్పుడు 1992 వ సంవత్సరం. ఆ సమయంలో గోచార శని వక్రస్థితిలో మకరంలో ఉన్నాడు. ఇది గోచారానికి షష్ఠమస్థితి, మంచిదే. పోనీ, వక్రత్వం వల్ల పంచమం లోకి వచ్చాడని అనుకుంటే ఒక ఆధ్యాత్మిక అనుభవం కలిగే అవకాశం ఉన్నది. కానీ గురువు ద్వితీయంలో కన్యలో ఉన్నాడు. కనుక ఏ విధమైన అనుభవమూ కలిగే అవకాశం లేదు. కనుక ఈ సంఘటన జరగడానికి సూచన లేదు.

1995 - 1996

సప్తమ శని, తృతీయ గురువు. ఆ సమయంలో మద్రాస్, బేలూర్ మఠాలలో బ్రహ్మచారిగా ఉన్నాడు. గురువు నవమాన్ని చూస్తూ ఒక నిజమైన ఆధ్యాత్మికసంస్థలో ప్రవేశాన్నిచ్చాడు. కానీ 1996 లో బేలూర్ మఠాన్ని వదిలేసి, హిమాలయాలకు పయనం సాగించాడు. దానికి కారణం అప్పుడే మొదలైన అష్టమశని ప్రభావం.  గురువు కూడా పంచమంలో ధనుస్సులోకి వచ్చాడు. కనుక మంత్రతంత్రాల పైకి శక్తుల పైకి మనస్సు మళ్ళింది. అందుకే, శుద్ధమైన ఆధ్యాత్మికమార్గాన్ని ప్రబోధించే రామకృష్ణమఠంలో ఇమడలేక బయటకు వచ్చాడు. సిద్ధులు శక్తుల కోసం ప్రయత్నాలు చేశాడు.

2000 సంవత్సరం ప్రాంతంలో తన తిరుగుడును ఆపి తమిళనాడులో స్థిరపడ్డాడు. అప్పటికి శని గురువులు వృషభంలో కలిశారు. అది ఈయనకు వృత్తి స్థానమైన దశమం అయింది. కనుక తన ఆశ్రమాలు, ప్రచారాలు, శిష్యులను పోగేసుకోవడం మొదలు పెట్టాడు.

ఏలినాటి శని మళ్ళీ మొదలు

2004 లో ఇతనికి మళ్ళీ ఏలినాటి శని మొదలైంది. ఇక అక్కడనుంచి ఇతనికి చెడుకాలం మొదలైంది. సినిమా యాక్టర్లు అమ్మాయిలూ చుట్టూ చేరడం మొదలు పెట్టారు. 2006 మధ్యవరకూ ఏలినాటి శని మొదటి ఘట్టం జరిగింది. తరువాత 2009 వరకూ రెండవ ఘట్టం జరిగింది. ఆ సమయంలోనే, అంటే 2008 డిసెంబర్ లోనే ఇతని జన్మనక్షత్రం అయిన ఉత్తర మీదకు శనిసంచారం జరిగింది. తరువాత కొంతకాలం వక్రించి మళ్ళీ ఆగస్ట్ 2009 లో పూర్తిగా ఆ నక్షత్రం మీదకు శని వచ్చాడు.  అక్కడనుంచీ ఇతని పతనం ప్రారంభమైనది.

ఏ మనిషికైనా ఇది జరుగుతుంది. మీరు కావాలంటే మీమీ జాతకాలలో పరిశీలించి చూసుకొండి. మీ జన్మనక్షత్రం మీదకు గాని, అనుజన్మ నక్షత్రాలమీదకు గాని శనిసంచారం జరిగినప్పుడు మీరు నానాబాధలు పడి ఉంటారు. దీనిని ఎవరూ తప్పుకోలేరు. ఇతనిది ఉత్తరానక్షత్రం. కరెక్ట్ గా ఉత్తరానక్షత్రం మీద  శని సంచరిస్తున్నపుడే రంజిత ఉదంతం జరిగింది. అక్కడనుంచి ఇతని జీవితం కష్టాలపాలు కావడం మొదలైంది. నాటకాలాడితే ఎవరైనా క్షమిస్తారేమో గాని శని భగవానుడు మాత్రం క్షమించడు.

2012, 2013 లలో శని తులారాశిలో ఇతని తృతీయంలో ఉచ్చస్థితిలో సంచారం సాగించాడు. అందుకే అన్ని బిరుదులు పదవులు వరించాయి. శని భగవానుడు ఇంతే, ఇచ్చేటప్పుడు గొప్పగా ఇస్తాడు. కోసేటపుడు దయాదాక్షిణ్యం లేకుండా కోసేస్తాడు.

ఎవరి జీవితమైనా సరే, గ్రహప్రభావం ప్రకారం ఖచ్చితంగా జరుగుతుంది. గీచిన గీత దాటదు. అర్ధం చేసుకుంటే అంతా అర్ధమౌతుంది.

ఆ తరువాత 2014 లో మొదలైన అర్దాష్టమశని అనేక వక్రత్వాల వల్ల 2017 ఫిబ్రవరి వరకూ సాగింది. ఇది ఇతనిని నానా బాధలూ పెట్టింది. కోర్టు కేసులు వెంటాడాయి. మీడియా వెంటాడింది. సమాజం ఛీ కొట్టింది. ఇదంతా మళ్ళీ శని ప్రభావమే.

ఆ తరువాత 2019 వరకూ ధనుస్సులో పంచమంలో శని సంచరించాడు. పంచమం బుద్ధిస్థానం. అప్పుడు ఇతని మనస్సు బాగా క్రుంగిపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. ఎటు చూచినా అన్నీ సమస్యలు అడ్డంకులు కనిపిస్తున్నాయి. నిస్సహాయ స్థితిలో పడ్డాడు.

2020 ప్రారంభ్డంలో శని మకరరాశిలోకి షష్ఠరాశిలోకి ప్రవేశించాడు. గోచారశని 3, 6, 11 లలో ఉన్నప్పుడు మంచి చేస్తాడు. కనుక 2022 వరకూ ఇతనికి మంచిసమయం జరుగుతున్నది. అందుకే ఇండియా నుంచి పారిపోయి ఎక్కడో తన ద్వీపంలో తానున్నాడు. రాజ్యం ఏలుతున్నాడు.

2022 ఏప్రిల్ నుంచీ ఇతనికి కష్టాలు మళ్ళీ మొదలౌతాయి. ఎందుకంటే అప్పుడు గోచారశని ఇతనికి సప్తమంలోకి వస్తాడు. మళ్ళీ వేధింపులు మొదలౌతాయి. ఇప్పుడు తానున్న చోటనుండి మళ్ళీ ఇంకొక చోటకు పోవలసి రావచ్చు. లేదా అరెస్ట్ కావచ్చు.

2025 లో శని మీనరాశిలో, ఇతనికి అష్టమం లోకి రావడం తోనే, ఇతని పరిస్థితి మళ్ళీ గందరగోళంలో పడుతుంది. ఆ పైన మూడేళ్ళు ఇతనికి చాలా కష్టకాలమే. మళ్ళీ నానా బాధలు పడతాడు.

ఈ విధంగా గోచారశని ఇతనిని ఎన్ని బాధలు పెట్టాడో మనం చూడవచ్చు. ఈ బాధలు తప్పాలంటే ఈ క్రింది సూచనలను ఇతను పాటించాలి.

1 . తను అవతార పురుషుడనని గప్పాలు కొట్టడం మానుకోవాలి. ఇదస్సలు నిజం కాదు.

2 . తనకు లేని శక్తులు ఉన్నట్టు చెప్పుకోవడం మానుకోవాలి. ఉన్నవి ఉన్నట్టు చెప్పాలి, నిజాలు మాట్లాడాలి.  మహిమలు మహత్యాల పేరిట చిన్నపిల్లలకు చీప్ ట్రిక్స్ నేర్పించి డబ్బులు చేసుకునే దరిద్రపు అలవాటు మానుకోవాలి. 

3 . అమ్మాయిల నుంచి దూరం ఉండాలి. లేదంటే వాళ్ళవల్లనే చివరకు ఈ సంస్థ మూతబడే ప్రమాదం ఉన్నది. పెద్దపెద్ద సంస్థలన్నీ 'డబ్బు - అమ్మాయిలు' ఈ రెంటివల్లనే దెబ్బ తిన్నాయన్న విషయం మరచిపోకూడదు.

4. అపవాదులు ఎక్కడ వచ్చే అవకాశం ఉన్నదో అక్కడ జాగ్రత్తపడాలి. జనం లోకి ఎక్కువగా చొచ్చుకుపోవడం మానుకోవాలి. లోకులతో ఎక్కువగా పెట్టుకుంటే పతనమే అన్న విషయం గ్రహించాలి. లోకాన్ని లోకులను ఏకమొత్తంగా ఎవ్వరూ ఉద్ధరించలేరన్న విషయం తెలుసుకోవాలి. ఈ పని అవతారపురుషుల వల్లనే కాలేదు. ఇక మామూలు సాధకుల వల్ల, స్వాముల వల్ల ఏమౌతుంది?

5. సాధనాశక్తి తగ్గకుండా చూసుకోవాలి. డబ్బు, పేరు ప్రతిష్టలు, అమ్మాయిలు, బంగారం ఇవన్నీ చుట్టూ చేరితే సాధన భ్రష్టు పడుతుంది. అది పోతే అన్నీ పోతాయి. కనుక ఈ విషయంలో ముఖ్యంగా ఇతను చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ సూచనలు పాటిస్తే, ఈ తరానికి ఇతను ఒక గురువు అవుతాడు. లేకుంటే పతనం తప్పదు.

తస్మాత్ జాగ్రత తమ్ముడూ !
read more " నిత్యానంద జాతకంలో గోచార గ్రహాల పాత్ర - కొన్ని ప్రశ్నలు "

13, సెప్టెంబర్ 2020, ఆదివారం

చిన్నతమ్ముడు నిత్యానంద జాతకం - విశ్లేషణ

నిత్యానంద జననతేదీ కోసం వెదికితే,  ఇంటర్ నెట్ లో మనకు రెండు తేదీలు లభిస్తున్నాయి. ఒకటి 19-3-1977, మరొకటి 1-1-1978. మొదటిది తన పాస్ పోర్ట్ లో ఇచ్చుకున్నది. రెండవది హైకోర్టులో సమర్పించినది. కనుక ఉన్నంతలో రెండవదే సరియైనదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వ్రాతపూర్వకంగా కోర్టుకు అబద్ధం చెప్పలేడు గనుక.

ఇకపోతే, జననసమయం గురించి వెదికితే అర్ధరాత్రి 00.32 అని ఒక సమయం దొరికింది. ఇదెంతవరకు నిజమో తెలియదు. ఇతని అఫిషియల్ వెబ్ సైట్లో మాత్రం ఏమీ లేదు. కారణాలేమిటో తెలియదు గాని, ప్రముఖులు తమ అసలైన జననతేదీలను సమయాలను సామాన్యంగా  బయటపెట్టరు. కానీ ప్రస్తుతానికి ఇదే దొరికింది. సరియైనది దొరికేవరకూ ఇది సరిపోతుందో లేదో చూద్దాం.

అనుమాననివృత్తి కోసం ప్రశ్నశాస్త్ర సహాయం తీసుకుందాం. 

ప్రశ్నసమయం : ఈరోజు ఉదయం 10.10 గంటలు

ప్రదేశం : హైదరాబాద్

లగ్నం తుల అవుతూ స్వక్షేత్రంలో ఉన్న కుజునితో చూడబడుతున్నది. లగ్నాధిపతి దశమకేంద్రంలో ఉన్నాడు. దశమాదిపతి చంద్రుడు లగ్నాన్ని చూస్తున్నాడు. కనుక ఈ సమయం సరియైనదే అన్న సూచన ఉన్నది.

ఈయన పుట్టింది తిరువన్నామలై లో. అది మాత్రం సరిగానే దొరుకుతోంది. ఇప్పుడీయన జాతకాన్ని చూద్దాం.

నా విధానంలో ఈ సమయాన్ని సంస్కరించగా అర్ధరాత్రి ౦౦.24 నిముషాలు అవుతోంది. అదంతా ఎలా చెయ్యాలి? అన్న విషయం నన్నడక్కండి. పాత పోస్టులలో చాలా జాతకాలకు జననకాల సంస్కరణ చేశాను కావాలంటే అవి చూసుకోండి.

ఇది ఇతని జాతకమేనా కాదా తెలియాలంటే ముందుగా కొన్ని కొన్ని పరీక్షలు చెయ్యాలి.

జాతక పరీక్ష

ఇద్దరు సంతానంలో ఇతను చిన్నవాడు. 11 లో కుజుని వల్ల ఇది సరిపోతున్నది. మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లమో చేశాడు. వక్రత్వం వల్ల మిధునంలోకి వచ్చిన కుజుడు చతుర్దంలో ఉన్న రవి శుక్రులను చూస్తున్నాడు కనుక ఇంజనీరింగ్ విద్యనూ ఇస్తాడు. సరిపోయింది. లగ్న సప్తమాలలో ఉన్న రాహుకేతువుల వల్ల వివాహజీవితం భగ్నం అయింది. ఇదీ సరిపోయింది. కనుక జాతకం సరిపోతున్నట్లే కనిపిస్తున్నది. ఇక ముందుకెళదాం.

జాతక పరిశీలన

లగ్నరాహువు సూచిస్తున్న ఉచ్చబుధుని వల్ల ఇతను చాలా అతితెలివైనవాడని తెలుస్తున్నది. పైన చెప్పినట్లుగా లగ్న సప్తమాలను అందులోనూ కన్యా మీనరాశులను రాహుకేతువుల ఇరుసు పాడు చేసినందువల్ల ఇతనికి వివాహజీవితం చెడిపోయింది. ఇంజనీరింగ్ లో డిప్లొమా ఎలా వచ్చిందో పైన వివరించాను. తృతీయ వక్రబుధుని వల్ల మంచి మాటకారని అవసరమైతే అబద్దాలు బాగా చెబుతాడని సూచన ఉన్నది. కుజబుధ గురుశనుల వక్రత్వం వల్ల జీవితం అనేక ఒడుదుడుకులకు ఎత్తుపల్లాలకు లోనౌతుందని  పూర్వకర్మ చాలా బలంగా ఉన్నదని తెలుస్తున్నది.

ఆధ్యాత్మిక యోగమైన శనిచంద్రుల కలయిక ఈ జాతకంలోనూ ఉండటాన్ని చూడవచ్చు. ఇది ఆధ్యాత్మిక యోగమే. అయితే, శని వక్రత్వం వల్ల, ఈ యోగం పరిపూర్ణమైన సిద్ధికి సూచిక కాదు. కనుక ఈయన చెప్పుకుంటున్నట్లుగా ఈయన ఒక అవతారం కానే కాదు. ఒక అవతార పురుషునికి ఉండవలసిన యోగాలు ఈ జాతకంలో లేవు. శని వక్రత్వమనేది లోకంతో, లోకులతో ఉన్న బలమైన కర్మను సూచిస్తుంది.

ఇది ఒక తాంత్రికయోగి  జాతకం మాత్రమే గాని అవతార పురుషుని జాతకం ఎంతమాత్రం కాదు. బ్రతికి ఉన్నపుడు అవతార పురుషుని ఎవరూ గుర్తించలేరు. అది సాధ్యం కాదు. లోకం తమను గుర్తిస్తున్నదని గమనించిన వెంటనే వాళ్ళు లోకాన్ని విడచి వెళ్ళిపోతారు. ప్రచారాలు చేసుకుంటూ గౌరవాలు పొందేవాళ్ళు యోగులు సిద్ధులు అయితే కావచ్చేమో గాని అవతారపురుషులు మాత్రం కారు.

ఇతని విమ్శాంశ లగ్నం సింహం అయింది. 9 లో నీచశని ఉండటం చూడవచ్చు. ఇది సాంప్రదాయ విరుద్ధమైన నీచ పోకడలను, సాధనలను సూచిస్తుంది. ఈ శని మీనంలోకి వస్తూ ఉచ్చశుక్రునితో కలవడం వల్ల, ఆ మీనం 8 వ భావం కావడం వల్ల అందగత్తెలైన సినిమా స్టార్స్ తో రహస్య రొమాన్స్ కనిపిస్తున్నది. 12 వ అధిపతి చంద్రుడు దశమంలో ఉచ్చస్థితిని బట్టి రహస్యమైన ఆధ్యాత్మికమార్గం (తంత్రం) లో ఇతనికి సిద్ధి ఉన్నదని, శక్తి ఉపాసన ఉన్నదని, దానిలో కొన్ని శక్తులు సాధించాడని కనిపిస్తున్నది. మేము కాదని ఎంత బుకాయించినప్పటికీ ఆ వీడియోలో ఉన్నది వాళ్లిద్దరే నన్నది సత్యం. 9 వ అధిపతి కుజుడు సప్తమంలో ఉండటం దీనికి బలాన్నిస్తున్నది. 6 లోకి వచ్చి ఉచ్చస్థితిని పొందటం వల్ల, సంప్రదాయ విరుద్ధమైన తంత్రమార్గంలో గట్టి పట్టు ఉన్నవాడని, ఈ పనుల వల్ల లోకంతో విరోధం కలుగుతుందని తెలుస్తున్నది. కనుక ఆధ్యాత్మిక జీవితాన్ని సూచించే విమ్శాంశ చక్రం ఇతని జీవితానికి సరిగ్గా సరిపోతున్నది. ఇప్పుడు దశలను పరిశీలిద్దాం.

దశాఫలితాలు

ఇతను పుట్టినప్పుడు రవి - రవి - రాహుదశ నడుస్తున్నది. ఇది తంత్రమార్గాన్ని సూచించే దశ. అంతేగాక దీనివల్ల అనేక కష్టాలు, విరోధాలు, లోకంలో గొడవలు ఉంటాయి. రాహువు ఉచ్చ బుధుని సూచిస్తూ తెలివైన మాటకారిని, రహస్య కార్యకలాపాల నేర్పరిని, అనేక దేశాలు తిరిగేవాడిని సూచిస్తున్నాడు. 12 అధిపతిగా సూర్యుడు తంత్రజ్ఞానాన్నిస్తాడు. అదే సమయంలో అధికారులతో గొడవలను, జైలు జీవితాన్ని కూడా ప్రసాదిస్తాడు. 4 లో 9 వ అధిపతి అయిన శుక్రునితో కలసి, 7 అధిపతి మరియు బాధకుడైన గురువుతో చూడబడుతూ - ఆధ్యాత్మికజీవితం గడుపుతూ, అందగత్తెలతో రహస్యకలాపాల వల్ల చిక్కులు ఎదుర్కోవడం కనిపిస్తున్నది. జరిగినది అదే కదా మరి !  ఇతని జీవితం ఇలాగే జరుగుతున్నది గనుక మనం చూస్తున్న ఇతని జనన సమయం సరియైనదే కావచ్చు.

1982 లో నాలుగేళ్ల చిన్న వయసులో ఈయన గురువైన మాతా విభూతానంద పురి ఇచ్చిన కాషాయవస్త్రాలను ధరించాడని అంటున్నారు - ఈ సంఘటన రవి - కేతువులో గాని, రవి - శుక్ర దశలో గాని జరిగి ఉంటుంది. కేతువు మోక్షకారకుడు, మోక్షరాశి అయిన మీనంలో ఉన్నాడు. శుక్రుడు 9 వ అధిపతిగా 12 వ అధిపతి అయిన రవితో కలసి ఉన్నాడు. కనుక ఈ సంఘటన జరగడానికి ఆస్కారం ఉన్నది. అయితే, ఆ తరువాత చేసిన గోలంతా ఏమిటి? అని ఆలోచిస్తే ఆ కాషాయాలకు ఏమీ విలువ లేదని అర్ధమౌతుంది.

పన్నెండేళ్ళ వయసులో ఈయనకు 360 డిగ్రీల దృష్టి వచ్చిందని అంటారు. మామూలు మనుషులకు 90 డిగ్రీల దృష్టి మాత్రమె ఉంటుంది. పినియాల్ పిట్యూటరీ గ్రంధులు ఉత్తేజితములైన యోగులకు మాత్రం ఈ పరిధి పెరుగుతూ పోయి 360 ల దృష్టి లభిస్తుంది. అంటే, వీళ్ళు ఆ స్థితిలో ఉన్నపుడు తల తిప్పకుండా వెనుక కూడా ఏమి జరుగుతున్నదో చూడగలుగుతారు.  ఇది యోగంలో సాధ్యమే. పరమహంస యోగానంద గారికి ఇది కలిగింది. యూజీ గారికి ఇది కలిగింది. ఇంకా అనేకమంది యోగులకు ఇది కలిగింది. సరిగ్గా సాధన చేస్తె,  ఇప్పటికైనా సరే, ఇది ఎవరికైనా కలుగుతుంది. కానీ ఈయన భక్తులు చెబుతున్నట్లుగా ఇది జ్ఞానస్థితి మాత్రం కాదు. ఇది ఒకరకమైన చిన్నపాటి సిద్ధి మాత్రమే. ఆ వయసులో ఈయనకు చంద్ర - బుధ దశ జరిగింది. ఇది భ్రమపూరిత దశేగాని సిద్ధిదశ కాదు. కనుక ఇది అబద్దం.
 
1992 లో ఈయనకు 14 ఏళ్ళ వయసులో పరమశివానుభావం కలిగిందని చెబుతున్నారు. ఇది నిజం కాకపోవచ్చు. అప్పుడాయనకు చంద్ర-శుక్ర దశ జరిగింది. చంద్రుడు 12 లో 5 వ అధిపతి అయిన శనితో కలసి ఆధ్యాత్మిక యోగంలో ఉన్నాడు. శుక్రుడు 9 వ భావాదిపతి. కనుక ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవం కలిగే సూచన ఉన్నది. కానీ ఇంత స్థాయి అనుభవం కలిగే సూచన లేదు. కాకపోతే, ఏదో ఒక చిన్నపాటి సమాధిస్థితి కలిగి ఉండవచ్చు. లగ్నంలో ఉన్న రాహువు భ్రమలకు కారకుడు గనుక దానినాయన 'పరమశివానుభవం' అనుకుంటూ ఉండవచ్చు. కనుక ఇదీ అబద్దమే.

ఈయన వేదాంతమును తంత్రమును శ్రీవిద్యను ఔపోశన పట్టినట్లుగా చెబుతున్నారు ఈయన శిష్యులు. ఇది నిజం కాదు. కాకపోతే వాటిలో ప్రవేశం ఉండి ఉండవచ్చు గాని ఔపోశన పట్టాలంటే మానవమాత్రుని వల్ల జరిగే పని కాదు. శ్రీ రామకృష్ణుల వంటి అవతార పురుషులకే అది సాధ్యమౌతుంది. అలాంటి యోగాలు ఈయన జాతకంలో ఎక్కడా లేవు. కనుక ఇది ఉత్త ప్రచారం మాత్రమేగాని నిజం కాదు. తనను తాను ఒక అవతారంగా ప్రచారం  చేసుకుంటూ నిత్యానంద మళ్ళీ తప్పు చేస్తున్నాడు. ఇదీ అబద్దమే.

1992 - 1995 - ఈ సమయంలో ఈయన మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశాడు. అప్పటికే జ్ఞానసిద్ధిని, పరమశివానుభావాన్ని పొంది వేదాంతమును, తంత్రమును శ్రీవిద్యను ఔపోశన పట్టిన వ్యక్తికి మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చెయ్యవలసిన అవసరం ఎంతమాత్రం ఉండదు. కనుక పైన చెప్పుకుంటున్న ప్రచారాలు నిజం కాదని తెలుస్తున్నది. ఇంజనీరింగ్ మొదలయ్యే సమయంలో చంద్రదశ చివరలో ఉంది. చంద్రునిమీద ఉన్న శని ప్రభావం వల్ల ఇనుప మిషన్లకు సంబంధించిన విద్య అబ్బింది. చదువు అయిపోయే సమయానికి కుజదశలో మొదటి మూడు అంతరాలు జరిగాయి. కుజుడుయంత్రాలకు సూచకుడు గనుక ఇది కూడా సరిపోయింది. 

1995 లో మద్రాస్ రామకృష్ణ మఠంలో బ్రహ్మచారిగా చేరాడు - ఈయనను నేను స్వల్పంగా అభిమానించడానికి ఉన్న కారణాలలో ఇదొకటి. నా గురువులలో ఒకరైన శ్రీమత్ స్వామి నందానందగారికి ఇతను కొన్నాళ్ళు శ్రద్దగా సేవ చేశాడు. అందుకని ఇతను నా చిన్నతమ్ముడిలాంటి వాడు. ఆ ఒక్క పాయింట్ మీద ఇతనిని నేను కొద్దిగా లైక్ చేస్తాను.

ఆ సమయంలో ఇతనికి కుజ - గురు దశ జరిగింది. గురువు నవమంలో ఉండటం చూడవచ్చు. కుజుడు 8 వ అధిపతిగా సాధనామార్గాన్ని సూచిస్తు, మంత్రస్థానమైన పంచమాన్ని చూస్తున్నాడు. కనుక సరిపోయింది.

1996 - లో బేలూర్ మఠానికి చేరుకున్నాడు. అప్పుడు కుజునిలో శని అంతర్దశ జరిగినిది. శని 5 అధిపతిగా సాధనను సూచిస్తూ 12 భావమైన మోక్షస్తానంలో ఉన్నాడు. తరువాత రామకృష్ణ మఠాన్ని వదిలేసి హిమాలయాలకు యాత్ర సాగించాడు. కుజ-శనిదశ యాక్సిడెంట్లను ఇస్తుంది. రామకృష్ణమఠాన్ని వదిలెయ్యడం ఇతని జీవితంలో ఒక యాక్సిడెంటే. అక్కణ్ణించి ఇతని దారి పెడదారిపట్టింది. అందులో ఉంటే ఇప్పుడు తను చేస్తున్న పనులు చెయ్యడం కుదరదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్ధిగా అణిగిమణిగి ఉండాలి. వివేకానందస్వాములవారు పెట్టిన నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అక్కడుంటూ ఇలాంటి పనులు చేస్తే, వాళ్ళే తన్ని బయటకు నెడతారు.

కానీ ఇతని పూర్వకర్మ చాలా బలంగా ఉన్నది. నాలుగు గ్రహాల వక్రత్వము, కుజుని నీచత్వము, అంశచక్రాలలో శని నీచత్వము, లగ్మలో రాహువు పరిస్థితి - ఇవన్నీ ఆపనిని చేయ్యనివ్వవు. లోపలనుంచి పూర్వకర్మ ఊపుతూ ఉంటుంది. కనుక రామకృష్ణమఠంలో ఇమడలేక బయటకు వచ్చాడు. 
 
దేశమంతా ఆ విధంగా తిరిగి తిరిగి 2000 సంవత్సరానికి మళ్ళీ తమిళనాడు చేరుకున్నాడు. అప్పటికి కుజ మహర్దశ అయిపోయింది.

కుజుడు 3 వ భావాదిపతి, అంటే దగ్గర ప్రయాణాలిస్తాడు. అందుకే ఇండియాలో తిరిగాడు. అప్పటికి విదేశాలకు ఇంకా పోలేదు. నీచ వక్రకుజుడు గనుక ఒక సన్యాసిగా కాలినడకన దేశమంతా తిరుగుతూ చాలా బాధలు పడి ఉంటాడు. రామకృష్ణమఠంలో చేరి కొన్నాళ్ళుండి బయటకు వచ్చాడు. ఇదంతా కుజ మహర్దశలో జరిగింది.

ఆ తరువాత మొదలైన 18 ఏళ్ళ రాహు మహర్దశ ఇతనికి చుక్కలు చూపించింది. మరి రాహువంటే మాటలా? చుక్కలూ చూపిస్తాడు, బురదలోనూ పడేస్తాడు, ఎక్కడెక్కడో దొర్లిస్తాడు, ఏవేవో పనులు చేయిస్తాడు. రాహువు రాక్షసుడు కదా మరి ! రాహు దశ అలాగే ఉంటుంది. ఈ సమయంలోనే ఆశ్రమాలు పెట్టడం, ఊళ్లు తిరగడం, మూడవ కన్నుకు సంబంధించిన ప్రయోగాలు, నిదర్శనాలు చూపించడం, రోగాలు తగ్గించడం, మహిమలు చూపించడం మొదలైనవన్నీ జరిగాయి. ఇవన్నీ నిజాలెలా అవుతాయి? అన్ని శక్తులు ఒక్కసారి ఎలా వస్తాయి? కాబట్టి ఇవన్నీ చీప్ ట్రిక్స్ అయి ఉంటాయి. హస్తలాఘవంతో, చీప్ గారడీతో కొంతమంది పిచ్చోళ్ళని మాయ చెయ్యవచ్చు. సత్యసాయి అలా చేసినవాడే. ఇతనూ అదే దారిలో పోతూ తమిళనాడు పల్లెకారు జనాలను కొందరిని బుట్టలో వేసుకుని ఉండవచ్చు. అంతేగాని, ఈ మహిమలు నిజాలు కావు. ఉత్త ప్రచారాలు మాత్రమే.

2010 - లో సినీనటి రంజితతో గడిపిన వీడియో బయట పడటంతో గగ్గోలు చెలరేగింది. ఈ సమయంలో ఇతనికి రాహు-బుధ దశ జరిగింది. తనమీద తనకున్న అతి నమ్మకం కొంప ముంచింది. నమ్మినవాళ్ళే శత్రువులయ్యారు. ఇది ఖచ్చితంగా రాహు ప్రభావమే.

ఇతని జీవితంలో రాహువు అతిముఖ్య గ్రహం. దీనికి రుజువుగా ఇతని ఉత్తాన పతనాలు రెండూ రాహు దశలోనే జరిగాయి. ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతులు పుంజుకున్నాయి. అదే విధంగా పడిపోవడమూ జరిగింది. ఇది రాహు ప్రభావమే.

రాహువు పంచమమైన మకరాన్ని, సప్తమమైన మీనాన్ని, నవమమైన వృషభాన్ని చూస్తున్నాడు. నవమం శుక్రస్థానం అయింది. కనుక మతముసుగులో అమ్మాయిలతో సంబంధాలు కనిపిస్తున్నాయి. సప్తమం కూడా శుక్రునికి ఉచ్చస్తానమయింది. ఇది కూడా అగ్నికి ఆజ్యం పోస్తుంది. అక్కడే గురువును సూచిస్తున్న కేతువున్నాడు. కనుక దైవ రాక్షస గుణాలు కలగాపులగం అయ్యాయి. అమ్మాయిల ఆకర్షణకు లోబడ్డాడు. పతనమయ్యాడు. పరువు పోగొట్టుకున్నాడు.

ఓషోకూ నిత్యానందకూ కొన్ని పోలికలున్నాయి. కొన్ని భేదాలున్నాయి. ఓషోను చూస్తే మొండివాడైన పెద్దన్నను చూసినట్లు నాకు చాలా కోపమొస్తుంది. నిత్యానందను చూస్తే తెలిసీ తెలియని చిన్నతమ్ముడిని చూసినట్లు జాలేస్తుంది.

అమ్మాయిలతో సంబంధాలు బయటపడినప్పుడు ఓషో ఏమీ తొణకలేదు బెణకలేదు. 'నేనింతే, మీ దిక్కున్నచోట చెప్పుకోండి' అన్నాడు. కానీ నిత్యానంద భయపడ్డాడు. ఆ వీడియో మాది కాదన్నాడు. తరువాత నేనసలు మొగాడినే కాదన్నాడు. పరీక్షలు  చేశారు. 'నువ్వు మగాడివే, నీకు పటుత్వం ఉంది' అన్నారు. అందుకే నేను రాసిన పోస్ట్ కి 'వీడు మగాడ్రా బుజ్జీ' అని పేరు పెట్టాను.

ఇలా రకరకాలైన అబద్ధాలు చెప్పడంలో పరువు పోగొట్టుకున్నాడు. అలా కాకుండా ఓషోలాగా ధైర్యంగా నిలబడి ఉంటె బాగుండేది. కానీ అలా చెయ్యలేకపోయాడు. ఓషో మహా ముదురు, బరి తెగించినవాడు. అమెరికాలో ఉంటూ అమెరికా ప్రభుత్వానికే ఎదురు తిరిగి సవాల్ చేసిన జగమొండి జగన్నాధం. కానీ నిత్యానంద అలా చెయ్యలేకపోయాడు. పరువు కోసం చూసుకున్నాడు. అబద్ధాలు చెప్పాడు. ఆ క్రమంలో పరువు పోగొట్టుకున్నాడు.

ఒక దారీ తెన్నూ లేకుండా ఎన్నో ప్రయోగాలు చేసి, తనతో బాటు వేలాదిమంది జీవితాలను నాశనం చేశాడు ఓషో. అందుకే ఆయనంటే నాకు ఒళ్ళుమంట. కానీ, నిత్యానంద అలా చెయ్యడం లేదు. అతన్ని అనుసరిస్తున్న ఎవరి జీవితాలూ నాశనం కావడం లేదు. రంజిత పరువు తనవల్ల పోయింది. అందుకే ఆమెకు తన సంస్థలో ఉన్నతమైన పదవినిచ్చాడు నిత్యానంద. ఆమె హాయిగా ఉన్నది. ఉంటుంది కూడా!  తన స్వార్ధానికి అందరినీ వాడుకొని వదిలేశాడు ఓషో. తన పొరపాటు వల్ల దెబ్బతిన్న వారిని వదిలెయ్యకుండా ఆదుకుంటున్నాడు నిత్యానంద. అదే ఓషోకూ నిత్యానందకూ తేడా !

2012 - లో రాహు - కేతుదశలో మదురై ఆదీనం అనే మఠానికి 293 వ అధిపతిగా నియమితుడయ్యాడు. మళ్ళీ జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది.

2012 -  అదే సమయంలో 100 మంది ఆధ్యాత్మిక ప్రముఖులలో ఒకడిగా గుర్తించబడ్డాడు.

ఫిబ్రవరి 2013 - లో రాహు - శుక్ర - చంద్ర దశలో పంచవటి మహానిర్వాణి అఖారా అనే పీఠం ఈయనకు ' మహామండలేశ్వర్' అనే బిరుదునిచ్చింది. ఇచ్చిందనడం కంటే కొనుక్కున్నాడని అనడం బాగుంటుంది.

ఆ తరువాత ఆరేళ్ళ పాటు ఈయనను రకరకాల కోర్టు కేసులు వెంటాడాయి. ఆ సమయంలో రాహు - రవి , రాహు - చంద్ర దశలు జరిగాయి. ఇవి గ్రహణ దశలు గనుక ఇతన్ని నానా తిప్పలు పెట్టాయి.

నవంబర్ 2019 - లో ఈ వేధింపులు తారాస్థాయికి చేరాయి. వాటిని తట్టుకోలేక ఇండియా వదలి పారిపోయాడు. 2018 నవంబర్ లో ఇతడికి ఔన్నత్యమూ పతనమూ రకరకాల ఎత్తుపల్లాలూ అన్నీ చూపించిన రాహుదశ అంతమై గురు మహర్దశ మొదలైంది. జీవితం మళ్ళీ మలుపు తిరిగింది.

భవిష్యత్తు ఎలా ఉంటుంది?

2035 వరకూ ఇతనికి గురు మహర్దశ జరుగుతుంది. ఈ సమయంలో ఒక పేరుగాంచిన గురువుగా ఇతను చెలామణీ అవుతాడు. కానీ బాధలు వేధింపులు తప్పవు. కోటానుకోట్ల సంపదకు అధిపతి అవుతాడు. కానీ సంస్థలో అంతర్గత కుట్రలుంటాయి. ఇతను మొదలు పెడుతున్న కైలాస అనే దేశం అంత త్వరగా అంతర్జాతీయ గుర్తింపును పొందదు. చాలా కష్టపడవలసి ఉంటుంది. 16 ఏళ్ళ ఈ గురు దశలో ఇతను ఎంతో జీవితాన్ని చూస్తాడు. ఆయా అంతర్దశలు మళ్ళీ ఎన్నో ఉత్తాన పతనాలను చూపిస్తాయి. అవి వచ్చినపుడు వాటిని వివరిస్తాను.

ఈ దశ అయిపోయేసరికి ఇతనికి 57 ఏళ్ళు వస్తాయి. అప్పటికి పరిపక్వత వస్తుంది. వేడి చల్లారుతుంది. 19 ఏళ్ళ శని మహర్దశ మొదలౌతుంది. దానిలో మాత్రమే ఇతనికి నిజమైన ఆధ్యాత్మిక ఔన్నత్యం అందుతుంది, అది కూడా ముందు చేసిన తప్పులకు పశ్చాత్తాపపడి మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ఉన్నపుడు మాత్రమే.
read more " చిన్నతమ్ముడు నిత్యానంద జాతకం - విశ్లేషణ "

9, సెప్టెంబర్ 2020, బుధవారం

'వరాహోపనిషత్' ప్రింట్ పుస్తకం ఈ రోజు విడుదలైంది


కరోనా టైమ్స్ లో గత ఆరునెలలుగా నేను వ్రాసిన 18 పుస్తకాలను ప్రింట్ చేసే కార్యక్రమం నిరంతరంగా సాగుతోంది. ఈ పనిలో భాగంగా 'వరాహోపనిషత్' ప్రింట్ పుస్తకాన్ని ఈ రోజు హైదరాబాద్ లోని మా ఇంటినుండి నిరాడంబరంగా విడుదల చేశాము.

మిగతా శిష్యులందరినీ పిలవలేదని బాధపడకండి.  ఈ కరోనా గోల అయిపోయిన తర్వాత అందరం కలుద్దాం. మళ్ళీ మన స్పిరిట్యువల్ రిట్రీట్స్ అన్నీ యధావిధిగా మొదలవుతాయి. అంతవరకు కొంచం ఓపిక పట్టండి.

యధావిధిగా ఇది కూడా google play books నుండి లభిస్తుంది.

read more " 'వరాహోపనిషత్' ప్రింట్ పుస్తకం ఈ రోజు విడుదలైంది "

8, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఓషో ప్రియురాలు 'మా యోగ వివేక్' చంపబడిందా?

31 ఏళ్ళుగా నలుగుతున్న ఒక రహస్యాన్ని తేల్చడానికి జ్యోతిష్యశాస్త్రాన్ని ఉపయోగిద్దాం.

క్రిస్టియన్ వుల్ఫ్ స్మిత్ అనే అమ్మాయి 'యునైటెడ్ కింగ్ డం' లో 19-3-1949 న పుట్టింది. 9-12-1989 న  పూనాలో ఓషో ఆశ్రమంలో చనిపోయింది. ఈమెకు ఓషో 'మా యోగ వివేక్' అని పేరు పెట్టాడు. తర్వాత 'మా ప్రేమ్ నిర్వానో' అని ఇంకొక పేరు ఈమెకు పెట్టబడింది. ఈ అమ్మాయి 40 ఏళ్ళు మాత్రమె బ్రతికింది. అందులో 20 ఏళ్ళు ఓషో పక్కనే తోడునీడగా ఉంటూ అన్ని సేవలూ చేస్తూ ఉన్నది. ఈమె గనుక పక్కన ఉండి ఎంతో జాగ్రత్తగా 20 ఏళ్ళపాటు చూచుకోకపోయినట్లైతే ఓషో అన్ని ఏళ్ళు బ్రతికేవాడు కాదు. ఎందుకంటే ఓషో ఆరోగ్యం అంత గట్టిది కాదు.

ఈమె గురించి ఓషో ఒక కధ చెప్పేవాడు. ఓషో చిన్నప్పుడు వాళ్ళ పల్లెటూళ్ళో డాక్టర్ శర్మ అనే ఒకాయన ఉండేవాడు. ఆ కుగ్రామంలో ఆయనే డాక్టరు. ఆ డాక్టరు కూతురిపేరు శశి. ఈ అమ్మాయి రజనీష్ ఇద్దరూ చిన్నప్పటి నుంచీ స్నేహితులు. కలసి మెలసి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ మధ్యన ప్రేమ చిగురించింది. చిన్ననాటి ప్రేమ చాలా మధురమైనది. దానిలో సెక్స్ అనేది ఉండదు. అలాంటి ప్రేమ వాళ్ళిద్దరి మధ్యన ఉండేది. అయితే, ఉన్నట్టుండి ఏదో జబ్బు చేసిన శశి 1947 లో చనిపోయింది. అప్పటికి రజనీష్ కి 16 ఏళ్ళు. ఆ అమ్మాయికి 14 ఉంటాయేమో? చనిపోయేటప్పుడు రజనీష్ ని చూస్తూ ఆ అమ్మాయి ఇలా అన్నది ' నేను మళ్ళీ వస్తాను. నీ తోడుగా ఉంటాను. నిన్ను చూసుకుంటాను'.

తర్వాత రెండేళ్లకు 1949 లో క్రిష్టియన్ ఉల్ఫ్ స్మిత్ అనే అమ్మాయిగా శశి మళ్ళీ బ్రిటన్ లో పుట్టిందని ఓషో అనేవాడు. ఈ అమ్మాయి 20 ఏళ్ళ వయసులో ఆధ్యాత్మికతను వెతుక్కుంటూ ఇండియాకు వచ్చి 1989 లో చనిపోయేవరకు ఓషోతో ఉండిపోయింది. ఓషో సమక్షంలో ఈమెకు తన పూర్వజన్మ గుర్తు వచ్చిందని అంటారు. అది నిజమో కాదో మనకు తెలియదు. ఎవరికీ తెలియదు. కానీ వాళ్ళిద్దరి మధ్యనా చాలా గట్టి ప్రేమ ఉండేది. దాదాపు 20 ఏళ్ళపాటు ఒషోని కంటికి రెప్పలాగా చూసుకుంది.

ఓషోకు సేవ చెయ్యడం అంటే మాటలు కాదు. అది ఒక ధ్యానం లాంటిదే. అనుక్షణం ఎంతో జాగరూకతతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఆయన ఆరోగ్యం మంచిది కాదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఆయనకు ఉండేది. ఆయనకు ముఖ్యంగా డస్ట్ ఎలర్జీ ఉండేది. కొద్దిగా దుమ్ము తగిలినా ఆయనకు జలుబు చేసేది. ఆస్తమా ఎటాక్ కూడా వచ్చేది. 17 డిగ్రీలు దాటిన వాతావరణం ఆయనకు పడేది కాదు. దీనికి తోడూ ఆయనకు డయాబెటీస్ ఉండేది. ఒక చిన్న పిల్లవాడిని చూసుకున్నట్లు ఆయనను చూసుకోవాల్సి వచ్చేది. ఇదిగాక, పెద్ద చప్పుడులు ధ్వనులు ఆయన భరించలేడు. కొంతమంది ఒంటి వాసన ఆయనకు పడేది కాదు. ఇంటి గదులు ఎంతో క్లీన్ గా ఉంటె తప్ప ఆయన ఉండలేకపోయేవాడు. ఇలాంటి సమస్యలున్న మనిషిని ఎలా చూసుకోవాలి? వివేక్ ఈ పనులన్నీ చాలా ఓపికగా 20 ఏళ్ళ పాటు చేసింది. కానీ ఏనాడూ తన ఆధిపత్యం చేలాయించాలని చూసేది కాదు. ఒక నీడలాగా మౌనంగా ఆయన పక్కనే ఉండేది. సేవ చేసేది. అంతే !

ఇదంతా ఇంటర్ నెట్లో దొరుకుతుంది. ఓషో పుస్తకాలలో దొరుకుతుంది. అది కాదు నేను చెప్పబోయేది. వివేక్ చాలా అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయింది. ఇప్పటికీ ఈ మిస్టరీ తేలలేదు. ఈమె చావును హడావుడిగా ముగించేసి, చనిపోయిన రెండే రెండు గంటలలో ఆమెను దహనం చేసేసి, ఏమీ జరగనట్టు నటించారు ఓషో ఆశ్రమ నిర్వాహకులు. అప్పటికి ఓషో చక్కగా బ్రతికే ఉన్నాడు.  జీవితాంతం తనకి సేవ చేసిన అమ్మాయికి అదా ఓషో ఇచ్చిన బహుమతి? ఇదా గురుత్వమంటే?

ఓషోకు ఇంత నమ్మకంగా ప్రేమగా 20 ఏళ్ళు సేవ చేసిన వివేక్. ఓషో చనిపోయే 40 రోజుల ముందుగా తను చనిపోయింది. అప్పటికి ఆమెకు 40 ఏళ్ళు మాత్రమే. ఆమె చనిపోయిన వెంటనే ఒక రెండు గంటలలో చడీ చప్పుడూ లేకుండా, ఒక అనామకురాలిని చేసినట్లు, ఆమెను దహనం చేసేశారు. ఇది వివేక్ ను అభిమానించే ఎందరినో కలచివేసే సంఘటన ! ఇది జరిగి నేటికి 31 ఏళ్ళు  గడిచినప్పటికీ వివేక్ మరణం ఈనాటికీ ఒక తేలని రహస్యంగానే మిగిలిపోయింది.

ఓషో శిష్యులలో ఇప్పటికీ బ్రతికున్నవాళ్ళు ఈ విషయం మీద కల్లబొల్లి కాకమ్మ కధలు చెబుతున్నారు గాని అసలు విషయం ఎవరూ చెప్పడం లేదు. అందుకని, ఈ రహస్యాన్ని జ్యోతిష్యం సహాయంతో చేదిద్దామని అనుకున్నాను. జ్యోతిష్యశాస్త్రాన్ని సరిగ్గా ఉపయోగించడం తెలిస్తే, జరిగిపోయినది, జరగబోయేది, జరుగుతున్నది అన్నీ ఇంట్లోనుంచి కదకుండా తెలుసుకోవచ్చు. అదే ఈ సైన్స్ గొప్పదనం. ఇక  చదవండి !

ఓషో శిష్యులలో చాలామంది 1949 ప్రాంతాలలో పుట్టారు. ఆ సమయంలో గురువు మకరరాశిలో సంచరిస్తూ నీచస్థితిలో ఉన్నాడు. వీళ్ళందరూ గురుదోష బాధితులు. అందుకే వీళ్ళ జీవితాలు అలా గడిచి, చివరికి  రకరకాలుగా విషాదాంతాలయ్యాయి.

అందులోనూ ఈమెది అనూరాధా నక్షత్రం అయింది. అనూరాధా నక్షత్ర జాతకులు విచిత్రమైన మనుషులు. ఎందుకంటే వీరికి చంద్రుడు నీచస్థితిలో ఉంటాడు. అందుకే వీళ్ళ మనస్సు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో వీరికే తెలియదు. విశాఖ - 4 వ పాదం, జ్యేష్ట నాలుగు పాదాలు కూడా అంతే. వీళ్ళ మనసులు ఎటు పోతుంటాయో వీరికే తెలియదు.

నక్షత్రాలకు కొన్ని లక్షణాలు ఉండటం నిజమే. ఆయా నక్షత్రాలలో పుట్టినవారికి ఆయా లక్షణాలు ఉండటం కూడా నిజమే. ప్రాచీన వేదకాలంలో విశాఖ నక్షత్రాన్ని 'రాధ' అనేవారు. దానిని అనుసరించి ఉంటుంది గనుక దాని తరువాత నక్షత్రం అనూరాధ అయింది. అనూరాధా నక్షత్రజాతకులు ఎప్పుడూ ఎవరినో ఒకరిని అనుసరిస్తూ ఉంటారు. లేదా ఎవరినో ఒకరిని ఆశ్రయించి, వారిపైన ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. ఈ ఆధారపడటం అనేది భౌతికంగా కావచ్చు లేదా మానసికంగా కావచ్చు. వివేక్ విషయంలో రెండూ జరిగాయి. 1970 లో ఓషోను కలిసినది మొదలు 1989 లో తను చనిపోయేవారకూ వివేక్ ఓషోతోనే ఉన్నది.

ఈమెది కర్కాటక లగ్నం తులా నవాంశ అని నా ఉద్దేశ్యం. కనుక ఈమె మధ్యాహ్నం 12.50 నుంచి 1.04 లోపు పుట్టి ఉంటుంది. ఈ నిర్ధారణకు ఎలా వచ్చానో అదంతా వివరించను. అదంతా చెప్పాలంటే ఇంకో రెండు పోస్టులు అవుతాయి. సూచనాప్రాయంగా కొన్ని మాత్రం చెబుతాను.

నవమాదిపతి ఐన గురువు సప్తమంలో నీచస్థితిలో ఉండటం - ఈమె గురువు, లవరు రెండూ అయిన ఓషోని సూచిస్తున్నది.

కుటుంబస్థానంలోని శని - ఈమె కుటుంబంలో ఉన్న శాపాన్ని సూచిస్తున్నాడు. ఈమె పెద్దల జీవితాలలో కూడా ఇలాంటి సంఘటనలే ఉండి ఉండవచ్చు.

పంచమంలో నీచస్థితిలో ఉన్న లగ్నాధిపతి చంద్రుడు సమాజపు కట్టుబాట్లకు లొంగని ఒక విపరీతప్రేమ వ్యవహారాన్ని చూపుతున్నాడు. నవమంలో ఉన్న పంచమాధిపతి కుజుడు - ఒక ప్రసిద్ధుడూ శక్తివంతుడూ అయిన గురువుతో ప్రేమలో పడటాన్ని సూచిస్తున్నాడు.

ఇంతకంటే ఎక్కువగా వివరించవలసిన పని లేదు. ఇది ఈమె జాతకమే.

ఈమె చనిపోయిన 9-12-1989 న గ్రహస్థితి ఇలా ఉన్నది.

అప్పుడామెకు ఏలినాటి శని రెండోపాదం జరుగుతున్నది. కనుక కష్టకాలమే. ఇకపోతే గురువు అష్టమంలో వక్రించి ఉన్నాడు. జీవశక్తి బాగా క్రుంగిపోవడాన్ని ఇది సూచిస్తుంది. ఓషో వల్ల వివేక్ గర్భవతి అయింది. కానీ ఓషో పట్టుపట్టి ఆమెకు అబార్షన్ చేయించడమే గాక, ఆమెకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేశాడు. ఈ సంఘటనతో ఆమె బాగా క్రుంగిపోయింది. ఆ తరువాత ఆమె ఆరోగ్యం కూడా బాగా చెడిపోయింది. ఆమెకు తీవ్రమైన ప్రీ మెన్సురల్ సిండ్రోమ్ ఉండేది. ఆ సమయంలో ఆమె పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేది. చూసేవాళ్లకు స్కిజోప్రేనియా అనిపించేటంతగా ఆమె విపరీత ప్రవర్తన ఉండేది. ఇవన్నీ కలసి ఆమె ఆరోగ్యాన్ని చిన్న వయసులోనే బాగా దెబ్బతీశాయి.

ఈమె చనిపోయిన రోజున ఉన్న గోచార గ్రహస్థితి ఇలా ఉన్నది.

జననకాల రాహువు మీదకు గోచార చంద్రుడు 

దీనివల్ల మనసు నిలకడ తప్పుతుంది. మీనంలో ఉన్న జననకాల కుజుడిని దాటిన చంద్రునివల్ల, ఆ సమయంలో ఈమె నెలసరికి దగ్గరగా ఉందని తెలుసుకోవచ్చు. కనుక శరీర బాధలకు తోడుగా మనసుకూడా ఈమె అదుపు తప్పిందని తెలుస్తున్నది. అలాంటి సమయాలలోనే విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇది మైక్రో పిక్చర్ మాత్రమే. అంటే, ఈ స్థితి నాలుగైదు రోజులపాటే ఉంటుంది.

జననకాల నీచచంద్రునిమీద గోచార రవి కుజులు

దీనివల్ల, మొండి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు చెప్పినా మాట వినరు. తాము తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తారు. ఈ స్థితి నెలా నెలన్నర పాటు వెంటాడుతుంది. అంటే, నెలనుంచీ తర్జన భర్జన పడుతున్న విషయాన్ని ఈమె ఆ సమయంలో అమలు చేసినట్లు తెలుస్తున్నది. ఏంటా విషయం?

జననకాల నీచ గురువు మీద గోచార రాహుశుక్రులు

ఇది ఈమె చావును కొనితెచ్చిన మేక్రో సూచన. ఇందులో రాహుస్థితి ఏడాదిన్నర పాటు ఉంటుంది. శుక్రుడు ఒక నెలపాటు మాత్రమే రాహువుతో కలుస్తాడు. ఈ కలయిక వల్ల ఏం జరుగుతుంది?

అప్పటికే ఓషో ఆరోగ్యం చాలా వేగంగా క్షీణిస్తున్నది. ఆయన మహా బ్రతికితే ఒక నెల పాటు బ్రతుకుతాడని అందరూ అనుకుంటున్నారు. గురువుమీద ఉన్న అమితమైన ప్రేమను చంపుకోలేకపోయిన వివేక్,  ఆయనకంటే ముందే తాను చనిపోవాలనుకుంది. అబార్షన్ మొదలైన పిచ్చి పనులవల్ల ఎలాగూ తన ఆరోగ్యం కూడా వేగంగా క్షీణిస్తున్నది. ఓషో పోయాక తనుండి చేసేదేముంది? అన్న ఆలోచన ఆమెలో ఏడాది నుంచీ ఉన్నది. ఒక నెలనుంచీ తీవ్రమైంది. ఆ మూడు రోజులలో ఉధృతమైంది. అందుకే తనంతట తాను చనిపోయింది.

ఓషో కమ్యూన్ లో బయటకు కనపడని నేరపూరిత రహస్యాలు చాలా ఉన్నాయి. ఆరిగాన్ లో వీళ్ళంతా ఉన్నపుడు - ఒక మనిషి బాధ లేకుండా చనిపోవాలంటే ఏ ఏ సింథటిక్ విషాలు తీసుకోవాలి. ఎంత మోతాదులో తీసుకోవాలి? ఏయే విషాలు కలపాలి? మొదలైన వాటిమీద చాలా రీసెర్చి చేశారు. దానికోసం ఒక గ్రూప్ ప్రత్యేకంగా ఉండేది. ఒకవేళ తన ఆరోగ్యం బాగా క్షీణిస్తే, ఈ విధంగా చనిపోవడానికి ముందే ప్లాన్ వేసిన ఓషో ఆయా విషాలు, ఇంజెక్షన్లు తెప్పించి సిద్ధంగా ఉంచుకున్నాడు. ఈ సంగతి ఆయన ఇన్నర్ సర్కిల్ లో వారికి తెలుసు. ఆయన ఆదేశాల మేరకు వాళ్ళే అవన్నీ తెప్పించి పెట్టారు.

వివేక్ కు కూడా ఇవన్నీ తెలుసు. చివరి రోజులలో, ఓషో పర్సనల్ డాక్టర్ తో ఆమె ఎఫైర్ లో ఉన్నదని అంటారు. కనుక ఆ గ్రూపులోని నిపుణుల సహాయంతో ఆమె ఆ ఇంజక్షన్ తీసుకుని ఉండవచ్చు. లేదా అందరూ నమ్ముతున్నట్టు ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు మింగి ఉండవచ్చు. మొత్తం మీద ఆమెది సహజ మరణం మాత్రం కాదు. ఆమెది ఆత్మహత్య అయినప్పటికీ ఇతరులకు తెలియకుండా జరిగినది మాత్రం కాదు. దీనిలో ఓషో ఇన్నర్ సర్కిల్ శిష్యుల పాత్ర ఖచ్చితంగా ఉన్నది.

దశా ప్రభావం

ఆ సమయానికి జాతకంలో శుక్ర - రాహు - గురు దశ జరుగుతూ నేను చెబుతున్నది నిజమే అని రుజువు చేస్తున్నది. సరిగ్గా గోచారంలో కూడా ఇవే గ్రహాలు ఉన్నాయి గమనించండి. జననకాల గురువు మీదకు గోచార రాహు శుక్రులు సంచరించారు. కనుక ఈ మూడు గ్రహాలలోనే ఈ రహస్యం దాగున్నది.

శుక్ర రాహువులు ఎఫైర్లకు సూచకులు. ఓషో డాక్టర్ తో ఈమె ఎఫైర్ అందరికీ తెలిసినదే. ఇతనే కాక ఇంకా కొంతమంది లవర్స్ ఈమెకు ఉన్నారని తెలుస్తోంది. ఓషోను అంతగా ప్రేమించిన ఈమె మళ్ళీ ఇలా చేయడం ఏమిటి? అదేంటో ఆ దేవుడికే తెలియాలి. ఓషో ఆశ్రమంలో జరిగిన చండాలమంతా వర్ణించాలంటే ఆ బ్రహ్మకు కూడా సాధ్యం కాదేమో మరి? అసలీ తప్పంతా ఓషోది. ఫ్రీ సెక్స్ ని ప్రోత్సహించడం ఆయన చేసిన అతి పెద్ద తప్పులలో ఒకటి. దానివల్ల ఎవరూ బాగుపడలేదు. ఎవరికీ ఆధ్యాత్మికత అనేది అందలేదు. చివరకి అందరూ భ్రష్టు పట్టారు. అంతా సర్వనాశనం అయింది.

రాహుగురువులు కలిస్తే గురుచండాల యోగం అవుతుంది. అంటే, గురువుకు సంబంధించిన గోలలో పడి ఈమె తన గొయ్యి తానే తవ్వుకుందని అర్ధమౌతున్నది. దొంగ గురువుల మాయలో పడితే ఇలాగే అవుతుంది మరి !

శుక్ర గురువుల కలయిక ఎటూ తేల్చుకోలేని గందరగోళపు పరిస్థితినిస్తుంది. ఒకరు రాక్షస గురువు, ఇంకొకరు దేవ గురువు కావడమే ఈ పరిస్థితికి కారణం. జాతకురాలి మనసుని ఒకరు ఒకవైపు లాగితే ఇంకొకరు ఇంకోకవైపు లాగుతారు. ఈ స్థితిలో మరేం జరుగుతుంది? ఊహించండి.

ఈమె జాతకంలో శుక్రుడు 11 వ అధిపతిగా ద్వితీయ రోగ స్థానాధిపతి. పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన రోగాలను సూచిస్తున్నాడు. ఈమెకు జరిగిన అబార్షన్, పీ ఎమ్మెస్, హిస్టీరికల్ ప్రవర్తనలను పైన వివరించాను. ఈ దశ వీటిని స్పష్టంగా సూచిస్తున్నది. ఆ శుక్రుడు బుధునితో కలసి చావును సూచించే 8 వ ఇంటిలో ఉండటం చూడవచ్చు. ఈ 8 వ ఇల్లు నిస్వార్ధరాశి యైన కుంభం అవుతున్నది. ఇతరులమీద ప్రేమతో చనిపోవడాన్ని సూచిస్తున్నది.

అంతర్దశానాధుడైన రాహువు దశమంలో ఉంటూ మనస్సుకు సూచిక అయిన 4 వ ఇంటిని చూస్తూ, రాక్షసమైన ప్లాన్ ను సూచిస్తున్నాడు. అంటే, విషప్రయోగంతో చనిపోవడమన్నమాట. ఈ రాహువు కుజునికి సూచకుడు. ఆ కుజుడు గురువును సూచించే నవమంలో రవితో కలసి ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్ లో ఉన్నాడు. అంటే తీవ్ర అస్తంగత దోషంలో పాపార్గళం పట్టి ఉన్నాడు. కనుక గురువుకోసం చనిపోవడాన్ని సూచిస్తున్నాడు.

విదశానాధుడైన నీచగురువు, సప్తమంలో ఉంటూ, ఓషో పాత్రను కూడా సూచిస్తున్నాడు. ఆసలిలాంటి చెత్త ప్లాన్లను తన శిష్యుల బుర్రలలో ఎక్కించింది ఓషోనే. అందుకే ఈ పాపమంతా ఆయనదే అని నేనంటాను.

ఆ సమయంలో వివేక్ పరిస్థితి ఎలా ఉందో ఈ క్రింది లైన్లు చదివితే మీకర్ధమౌతుంది.  

  • ఓషో మీద విపరీతమైన ప్రేమ.
  • ఓషో ఇంకో నెలలో పోతాడని డాక్టర్లు చెప్పడం
  • పూర్తిగా చెడిపోతున్న తన ఆరోగ్యం. 
  • దానికితోడు గజిబిజి మనసు
  • చెడు దశ
  • చెడు గోచారం
  • వేధిస్తున్న పీ ఎమ్మెస్ 
  • అందుబాటులో ఉన్న రకరకాల ఆత్మహత్యా పద్ధతులు
  • వాటిని అమలు చేయగల నిపుణులు
  • ఓషో పోయాక తన గతి ఏమౌతుందో అన్న భయం 
ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది? జవాబు నేను చెప్పనక్కర లేదు. మీరే చెప్పండి.

ఇంకా క్లారిటీ కోసం ప్రశ్న శాస్త్ర సహాయం తీసుకుందాం !

సమయం : రాత్రి 10.15 నిముషాలు
తేదీ : 7-9-2020 
ప్రదేశం : హైదరాబాద్

లగ్నాధిపతి శుక్రుడు ఆయుష్హు సూచించే 3 వ ఇంటిలో ఉంటూ, గురువును సూచించే 9 వ ఇంటిలో ఉన్న వక్రశని చేత చూడబడుతున్నాడు. ఈ శని ఈ లగ్నానికి బాధకుడు. అంటే ఏంటి దీనర్ధం? గురువుకు తెలిసే ఈమె చావు జరిగిందని లేదా గురువుకోసం ఈమె చనిపోయిందని అర్ధం.

దీనికి ఇంకా బలాన్నిస్తూ, వక్ర గురువు రహస్యాలకు నిలయమైన 8 వ ఇంటిలో మరణసూచకుడైన ఉచ్చకేతువుతో కలసి ఉన్నాడు. తెలివికి కారకుడైన బుధుడు బుద్ధిస్థానంలో ఉచ్చస్థితిలో ఉంటూ అతితెలివితో కూడిన ప్లాన్ ని సూచిస్తున్నాడు. మనస్సుకు కారకుడైన చంద్రుడు మారకుడైన కుజునితో కలసి చావును సూచించే 12 వ భావంలో ఉంటూ బలవంతపు చావును సూచిస్తున్నాడు.

ఇంతకీ అసలు ప్రశ్న తేలలేదు. వివేక్ చనిపోయినది ఇంజక్షన్ తోనా లేదా నిద్ర మాత్రలు మ్రింగడం వల్లనా? మనఃకారకుడైన చంద్రుడు కుజునితో కలసి ఉన్నాడు. కుజుడు కత్తులకు సూదులకు గాయాలకు కారకుడు. కేతువు సూదిని సూచిస్తాడు. ఆయన ధనుస్సులో ఉఛ్చస్థితిలో ఉంటూ చంద్ర కుజులను చక్కగా చూస్తున్నాడు. ఇంకా చెప్పాలా ఆమె పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని చనిపోయిందని? అందుకే హడావుడిగా ఎవరి కంటా పడకుండా ఆమెను దహనం చేసేశారని? 

జాతకవిశ్లేషణలో కనిపించిన నిజాలన్నీ ప్రశ్నలో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయా లేదా? క్లారిటీ వచ్చిందా లేదా? చెప్పండి !

అసలీ పాపమంతా ఓషోదే. తనను నమ్మిన ఎవరికీ ఆయన మోక్షాన్ని ఇవ్వలేకపోయాడు సరిగదా కనీసం ఆ మార్గంలో సరిగ్గా నడిపించలేకపోయాడు. చివరికి అందర్నీ ముంచాడు. తానూ మునిగాడు. ఇదే జరిగింది.

ఓషో ఎందరో గురువులను విమర్శించాడు. చివరకు అవతారాలను కూడా విమర్శించాడు. కానీ తనను నమ్మి వచ్చిన తన శిష్యులను తానేం చేశాడు? నట్టేట ముంచాడు. వివేక్ కూడా అలాగే మునిగింది.

తన తండ్రిని గురించి చెబుతూ 'ఆయన సమాధి స్థితిలో చనిపోయాడు' అని ఓషో అన్నాడు. ఇది పక్కా కట్టుకధ. ఎందుకంటే, తను, తన శిష్యులు ఎవరూ ఇప్పటిదాకా సమాధిస్థితిలో చనిపోలేదు కాబట్టి. వీళ్ళ చావులన్నీ ఘోరంగా ఉన్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలు. డ్రగ్స్, ఇలాంటి గోలలో చనిపోయేవాళ్ళు యోగులా? వీళ్ళకు సమాధిస్థితి అందుబాటులో ఉన్నదా? వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే ఎన్నయినా చెప్పి నమ్మించవచ్చు !

సోది మాటలు చెప్పడం వేరు. నిజంగా ఆయా ధ్యానస్థితులను సాధించడం వేరు. సోదితో లోకాన్ని నమ్మించవచ్చు. కానీ ప్రకృతిని, దైవాన్ని, కర్మను మోసం చేయలేం. అది జరిగే పని కాదు.

'యధా గురు తధా శిష్య:' అంటే ఇదేగా మరి !
read more " ఓషో ప్రియురాలు 'మా యోగ వివేక్' చంపబడిందా? "