“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, జులై 2011, మంగళవారం

మార్మిక నగరం

మార్మిక నగరపు వీధుల్లో 
మనసు సంచరిస్తోంది
వింత వింతలను చూస్తూ 
మౌనంగా సాగుతోంది 

సృష్ట్యాదినుంఛి జారుతున్న 
జ్ఞాపకాల జలపాతం 
హృదయాన్ని అభిషేకిస్తోంది 
అనుభూతుల వెల్లువతో 

ఆత్మ దూదిపింజలా తేలి 
దేన్నో వెతుకుతోంది 
నిశీధాంతరాళపు
నిశ్శబ్ద సీమలలో 

విశ్వపుటంచుల కావల 
ఏముందో చూద్దామని
ప్రియతముని జాడకోసం 
మనసు పరుగులెత్తింది  

నీరవ నిశీధశూన్యంలో 
ఉబికొచ్చిన ప్రియుని స్వరం 
హృదంతరాళపు లోతుల్లో
మధురనాదం నింపింది 

విశ్వపు హద్దులు దాటి
ఎక్కుపెట్టిన చూపు
విచలితమై పోయింది.
గమ్యాన్ని కానలేక

సృష్టికి ముందున్న 
అగాధ జలాశయం 
అడుగులోతుల్లోంచి
ఉబికోచ్చిందొక  నాదం 

పట్టిచ్చింది ప్రియతముని జాడలను 
ఆ నాదం వింటున్న మనసు
మూగగా మారింది.
మౌన పరవశ వేదనలో 

అన్వేషణ మరచింది 
అడుగులన్ని ఆపింది 
మార్మిక నగరపు అంచున
నిలిచి చూస్తోంది మౌనంగా

శూన్యాకాశపు సముద్రంలోకి
దూకడానికి సిద్ధంగా ...........  

read more " మార్మిక నగరం "

25, జులై 2011, సోమవారం

చైనా బుల్లెట్ ట్రయిన్ ప్రమాదం -- ప్రపంచ వ్యాప్తంగా రాహుకేతువుల ప్రభావం

23-7-2011 రాత్రి 20.37 గంటలకు చైనా లోని వెంజౌ నగరం సమీపంలో ఆగిఉన్న ఒక రైలును మరొక రైలు గుద్దుకుని భయంకర ప్రమాదం సంభవించింది. ఈ రెండూ బుల్లెట్ రైళ్ళు కావడం అతివేగంగా ప్రయానించేవి కావడం గమనార్హం. ఇందులో ఒకటి ఆగిఉన్నప్పుదు ఇంకొకటి వచ్చి దీనిని గుద్దుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. అదే హెడ్ ఆన్ కొలిజన్ జరిగి ఉన్నట్లయితే ఆ ప్రమాదం ఊహించలేనంత స్థాయిలో ఉండేది. పెద్ద ప్రమాదం తప్పి చిన్నదిగా పోవడంలో ( ప్రస్తుతం జరిగిందేమీ చిన్నది కాదు, కాని హెడ్ ఆన్ కొలిజన్ తో పోలిస్తే ఇది చిన్నదే ) కారణం కుజ కేతువుల separating aspect మాత్రమే. కుజుడు 28 డిగ్రీలలోనూ కేతువు 27 డిగ్రీలలోనూ ఉంటూ ఒకరికొకరు దూరంగా పోతున్నారు. కనుక ఘోర ప్రమాదం తప్పింది. లేకుంటే ఇంతకంటే పెద్దప్రమాదం  జరిగి ఉండేది.  

కుజ కేతువుల కంజంక్షన్ ఎంత ఘోరాలు చేస్తుందో ఈ ఉదాహరణల వల్ల తెలుసుకోవచ్చు. ఒకవైపు నార్వే లో అరగంట పైగా వెతికి వెతికి దాదాపు 90 మందిని కాల్చి చంపిన రాక్షసుడి దుర్మార్గం జరిగీ జరగకముందే, చైనా లో బుల్లెట్ రైళ్ళు  గుద్దుకొని ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడా దాదాపు వందల్లో చనిపోయి ఉండవచ్చు. ఈ రెండు సంఘటనలూ "బహుళ అష్టమి" రోజునే జరగటం కాకతాళీయం అనలేం. కుజుని నక్షత్రంలో కుజకేతువులు (అందులోనూ రాహుకేతువులు నీచలో ఉన్నప్పుడు)  ఖచ్చితమైన డిగ్రీ  కంజంక్షన్లో  ఉండడం ఎంత ప్రమాదాలు సృష్టిస్తుందో ఈ సంఘటనలవల్ల తెలుసుకోవచ్చు. 

ఈవెంట్ చార్ట్ ను ఇప్పుడు పరిశీలిద్దాం.దుర్ఘటన జరిగిన సమయానికి వెంజౌ నగరంలో కుంభలగ్నం ఉదయిస్తున్నది. ఇక్కడ వాహనాలకు కారణమైన చతుర్ధ స్థానంలో భయంకర ప్రమాదాలకు కారణమైన కుజకేతువుల డిగ్రీకల్ గ్రహయుతి సంభవిస్తూ ఉంది. ఈ యుతి శుక్రుని వృషభరాశిలో జరిగినందువల్ల  విలాసవంతమైన వాహనాలకు సూచికగా ఉన్నది. బుల్లెట్ ట్రెయిన్ అయేది విలాసవంతమైన వాహనమే. 

ఇదేగాక లగ్నడిగ్రీలకు దగ్గరగా నెప్ట్యూన్ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. లగ్నం 9 డిగ్రీలలో ఉంటె నెప్ట్యూన్ 6 డిగ్రీలలో ఉండటం కాకతాళీయం ఎంతమాత్రం కాదు. నెప్ట్యూన్ గుణాలు ఏమిటో చూద్దామా? కనిపిస్తున్నదానిని మాయతో కప్పడం, గందరగోళం సృష్టించడం, మోసపూరిత భ్రమను కల్పించడం ఇతని లక్షణాలు. పిడుగుపాటువల్ల ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతిని ముందు ఒక రైలు పట్టాలపైన నిలిచి ఉన్నదన్న సిగ్నల్ వెనుకనుంచి వేగంగా  వస్తున్న రైలుకు అందలేదు. ఇది విషయాన్ని మాయతో కప్పడమే కదా. దుర్ఘటనా స్థలంలో ఉన్న గందరగోళాన్ని చూస్తె, గందరగోళం సృష్టించడం అన్న రెండవ లక్షణమూ నిజమైనట్లే కనిపిస్తుంది.  సుఖంగా  ప్రయాణం చేస్తున్నామన్న భ్రమలో ఉన్న ప్రయాణీకులు మోసం చెయ్యబడటమూ నిజమే. నెప్ట్యూన్ ప్రభావం ఈ రకంగా అక్కడ పనిచేసింది. కుజ కేతువుల కలయిక భయంకర విస్ఫోటనాన్ని సూచిస్తుంది. పిడుగు అనేది అటువంటి లక్షల వోల్టుల శక్తి ప్రసారమే.

ముంబై పేలుళ్ళలోనూ, ఓస్లో మారణకాండ లోనూ, వెంజౌ రైలు ప్రమాదంలోనూ కొన్ని కామన్ ఫేక్టర్స్   ఉన్నాయి. 

1. ఈ మూడూ జలస్థానాల దగ్గరే జరిగాయి. ముంబైలో సముద్రం ఉంది. ఉతోయా ద్వీపం సముద్రానికి దగ్గరగానే ఉంది. వెంజౌ ప్రమాదం నదిమీద ఉన్న బ్రిడ్జి పైనే జరిగింది.
2. ఈ మూడు సంఘటనలూ విలాస వంతమైన పరిసరాలలోనే జరిగాయి. ముంబై విలాస నగరం, ఉతోయ ద్వీపం పిక్నిక్ స్పాట్. బుల్లెట్ ట్రెయిన్ విలాస వాహనం. 

జలప్రదేశాలూ, విలాసప్రాంతాలూ శుక్ర కారకత్వం లోనివే  అనీ, ప్రస్తుత కుజకేతువుల యుతి శుక్ర రాశి అయిన వృషభంలోనే జరుగుతున్నదన్న విషయం గుర్తుంచు కుంటే పిక్చర్ క్లియర్ గా అర్ధమౌతుంది. వృషభం భూతత్వ రాశి. జలతత్వ గ్రహం అయిన శుక్రుని అధీనంలో ఉంది. కనుక ఇప్పటివరకూ జరిగిన దుర్ఘటనలు అన్నీ, భూమీ జలమూ కలిసి ఉన్న ప్రదేశాలలోనే జరిగాయి. ముంబై నీ, ఒస్లోనీ, వెంజౌ నీ పోల్చి చూస్తే ఈ విషయం చక్కగా కనిపిస్తుంది.

మరొక్క విషయం ఇక్కడ చెప్పాలి. ఈ మూడు చార్టు లలోనూ angular houses అనబడే కేంద్ర స్థానాలు స్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఓస్లో చార్టులో సప్తమ కేంద్రం ఇన్వాల్వ్ అయింది. వెంజౌ లో చతుర్ధ కేంద్రం ఇన్వాల్వ్ అయింది. మేదినీ జ్యోతిష్య విశ్లేషణలో కేంద్రస్థానాల పాత్రను ఈ కోణాలు చక్కగా చూపిస్తున్నాయి. అయితే ముంబై చార్ట్ కీ మిగిలిన రెండింటికీ కొన్ని తేడాలున్నాయి. ముంబై చార్ట్ లో లగ్నం ధనుస్సు అయింది. దీన్నుంచి షష్టమ స్థానంలో కుజ కేతువుల యుతి ఉంది. రాహువు రహస్య స్థానం అయిన ద్వాదశంలో ఉన్నాడు. కనుక ఇది ఖచ్చితంగా శత్రువుల, ఉగ్రవాదుల కుట్ర అని తెలుస్తున్నది. సప్తమంలో రవీ, దశమంలో శనీ ఉన్నప్పటికీ అవి అటువంటి బాంబు దాడిని సూచించే గ్రహాలూ కావు. దానికి పూర్తి భిన్నంగా కేంద్ర స్థానాల పాత్ర ఉన్నటువంటి ఓస్లో దుర్ఘటన ఒక రైట్ వింగ్ రాజకీయ చర్య అనీ, వెంజౌ ప్రమాదం Act of God అనీ చెప్పవచ్చు. అందుకనే ముంబై ఘటనా కుండలిలో (ఉగ్రవాద చర్యలో) కేంద్ర స్థానాల పాత్ర లేదు. అక్కడ 6 , 12 భావాల పాత్ర ఉంది. ఈ రకమైన తేడాలు ఈ మూడు చార్టుల మధ్య ఉన్నాయి.

ఎవరు చేసిన ఖర్మ వారు తప్పక అనుభవించేట్లు చెయ్యడంలో  ప్రక్రుతి ఎంత తెలివిగా వ్యవహరిస్తుందో, ఆ ప్లాన్ ను అమలుపరచడం ఎంత వేగంగా జరుగుతుందో, disaster compass ను గ్రహాలు ఎంత ఊహాతీతంగా ఎంత వేగంగా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి తిప్పుతాయో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సూక్ష్మంగా గమనిస్తే ఆయా గ్రహాల, రాశుల, భావాల సిగ్నేచర్ అనేది సంఘటనా పరిసరాలలో కనిపిస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా రాహుకేతువుల ప్రభావాలు ఇంకెన్ని కనిపిస్తాయో చూద్దాం.
read more " చైనా బుల్లెట్ ట్రయిన్ ప్రమాదం -- ప్రపంచ వ్యాప్తంగా రాహుకేతువుల ప్రభావం "

24, జులై 2011, ఆదివారం

ఓస్లో మారణకాండ -- జ్యోతిష్య కోణాలు

మొన్న మధ్యాన్నం15 .26 కి నార్వే రాజధాని ఓస్లో లో బ్రీవిక్ అనే క్రైస్తవ మతోన్మాది చేసిన  బాంబుదాడి, తరువాత రెండుగంటలకు ఉతోయా ద్వీపంలో అరగంట పాటు జరిగిన మారణకాండల నేపధ్యంలో కొంత జ్యోతిష్య విశ్లేషణ చేద్దాం. రాహు కేతువులు - దుర్మరణాలు అని నేను వ్రాసిన పోస్ట్ లో  రాహు కేతువుల నీచ స్తితివల్ల ముందుముందు మరిన్ని ఘోరాలు జరుగుతాయి అని చెప్పాను. ఓస్లో దుర్ఘటన వెనుక కూడా ఈ గ్రహాల పాత్ర ఉంది.  ఘటనాసమయానికి వేసిన కుండలి ఇక్కడ జత చేస్తున్నాను. ముఖ్యంగా ఏడు ముఖ్యమైన గ్రహగతులు ఈ కుండలిలో కనిపిస్తున్నాయి. 

ఒకటి -- లగ్నం రాహు శనుల మధ్యన పాపార్గళం అవడం. దీనివల్ల దుష్టశక్తుల ప్రోద్బలం లగ్నం మీద ఉన్నదని సూచన వస్తుంది. కాని ఈ లగ్నం ప్రతి ప్రదేశానికీ 24 గంటలలో ఒక రెండు గంటలపాటు (దాదాపుగా) వస్తుంది. మరి ప్రతి ప్రదేశంలోనూ ఈ మారణకాండ జరగలేదు. నార్వే లోని ఓస్లో నగరంలో మాత్రమె దీనికి అనుకూలమైన పరిస్తితులు వచ్చాయి. కనుక దీనికి మించిన వేరే కోణాలు ఇందులో ఉన్నాయి.

రెండు -- కేతు కుజుల ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్. ఈ గ్రహాలూ రెండూ 27 డిగ్రీల మీద కుజునిదైన మృగశిరా నక్షత్రంలో ఉన్నాయి.కుజ కేతువుల డిగ్రీ కంజంక్షన్ భయంకరమైన హింసకు, మారణకాండకూ  సూచిక అవుతుంది. కాని ఇవి కలిసి ఉన్న వృషభ రాశి అరేబియా, రష్యా, మరియు యూరోప్ లోని కొన్ని బార్డర్ ప్రాంతాలను మాత్రమె సూచిస్తుంది. యూరోప్ ను సూచించినప్పటికీ  ఖచ్చితంగా ఓస్లో నగరాన్ని సూచించే గ్రహస్తితులు ఏమున్నాయో పరిశీలించాలి. రాశి అనేది రెండు మూడు దేశాలనూ, ఒక్కొక్క సారి ఒక ఖండం మొత్తాన్నీ  సూచిస్తుంది. అందుకని ఒక నగరానికి మాత్రమె పరిమితమైన ఇంకేదో పారామీటర్ ఇందులో ఉండి ఉండాలి.
 
మూడు-- ఈ రోజున బహుళ అష్టమి అయింది. పౌర్ణమి అమావాస్యలతో బాటు దానికి మధ్య బిందువులైన చతుర్ధీ, అష్టమీ కూడా ప్రమాదకారులే. ఈ విషయం ఇక్కడ మళ్ళీ రుజువు అయింది. కానీ ఇది ఒక ప్రమాదకర టైం స్లాట్ ను మాత్రమె సూచిస్తుంది కాని ఒక ప్రదేశాన్ని సూచించదు.

నాలుగు -- ఈ సంఘటన జరిగినప్పుడు ప్రమాదాలకు కారకుడైన కుజుని హోర జరుగుతున్నది. కుజ హోర అనేక ప్రదేశాలలో జరుగుతుంది. కాని ప్రతిచోటా ఈ స్థాయిలో దుర్ఘటనలు జరుగలేదు. కాకుంటే చిన్న చిన్న ఘర్షణలు జరిగితే జరిగి ఉండవచ్చు. మరి ఓస్లో నగరంలోనే ఇంత పెద్ద స్థాయిలో ఇలా జరిగేటట్లు చేసిన గ్రహ ప్రభావం ఏమై ఉంటుంది?
 
అయిదు -- కుజ కేతువులు లగ్నాత్ అష్టమంలో ఉంటూ నాశనాన్ని సూచిస్తున్నారు. పైన లగ్న విచారణలో స్ఫురించిన కోణాలే దీనికి కూడా వర్తిస్తాయి. 
 
ఆరు -- లగ్నాధిపతి శుక్రుడు నవమ స్థానంలో ఉంటూ ఈ సంఘటన వెనుక మతప్రమేయం ఉందన్న విషయం సూచిస్తున్నాడు. ఈ ఘటనకు పాల్పడిన బ్రీవిక్ అనేవాడికి ముస్లిములు అంటే గిట్టదన్న విషయం తెలుస్తున్నది. అంతేగాక ఇతనికి బహుళజాతులసమాజం అంటే కూడా పడదని తెలిసింది.
 
ఏడు -- సప్తమంలో గురువూ చంద్రుడూ, దశమంలో రవీ ఉండటం వల్ల, ఈ వ్యక్తికి ప్రభుత్వం మీద కసి ఉందన్న విషయమూ, ప్రభుత్వ విధానాలు ఇతనికి సరిపోవడం లేదు అన్న విషయమూ సూచింపబడుతున్నది. అంతే గాక ఇతనికి తత్వశాస్త్ర పరిచయం కూడా ఉంటుంది అని గురు చంద్రుల కలయిక సూచిస్తున్నది. ఇతని బ్లాగులో చూస్తే కాంట్, హెగెల్, మాకియవెల్లి, జాన్ స్టువర్ట్ మిల్ మొదలైన పాశ్చాత్య తత్వవేత్తల భావాలు అందులో వ్రాసుకున్నాడు. ఇతనొక right wing activist అనీ, తీవ్ర భావాలు కలిగినవాడనీ మీడియా వల్ల తెలుస్తున్నది.

ఒక భయంకర దుర్ఘటన జరిగే అవకాశాలు ఉన్న గ్రహస్తితి ఇక్కడ కనిపిస్తున్నప్పటికీ, అది యూరోప్ లోని నార్వేలో ఉన్న ఓస్లో నగరంలోనే ఎందుకు జరగాలి అన్న విషయం పరిశోధనలో తేలవలసి ఉంది. ప్రదేశాలకూ రాశులకూ గ్రహాలకూ ఉన్న సంబంధాన్ని రాబట్టటానికి Astro Mapping సూత్రాలు పరిశీలించవలసి ఉంటుంది.

ఇవన్నీ అలా ఉంచితే, అసలు నార్వే స్వతంత్రదినపు కుండలి ఏమి చెబుతున్నదో చూద్దాం. స్వీడన్ నుంచి నార్వే కు స్వతంత్రం 7-6-1905 న ఉదయం 11 .01 .03 గంటలకు వచ్చింది. ఈ సమయాన్ని కుందస్ఫుట విధానంతో లాహిరీ అయనాంశను ఉపయోగించి సవరించాను. నార్వే స్వతంత్రదిన కుండలి ఇక్కడ ఇస్తున్నాను.

లగ్నమూ రాహువూ కలిసి మఖా నక్షత్రంలో ఉంటూ ఈ దేశంలో ఉన్న మల్టీ రేషియల్ జనాభాను సూచిస్తున్నది. అంతే గాక ఈ దేశానికి ముస్లిముల వల్ల ప్రమాదం ఉందని సూచిస్తున్నది. ప్రస్తుతం ఈ దేశంలోకి  వలసల ద్వారా వస్తున్న జాతులలో పాకిస్తానీ ముస్లిమ్స్ ఎక్కువనీ దాదాపు 32,000 మంది ఇప్పటికే ఓస్లో లో నివసిస్తున్నారనీ  అంచనా ఉంది. బహుశా బ్రీవిక్ అనేవాడికి ఇదే నచ్చని విషయం అయ్యి ఉండవచ్చు. తమ దేశంలోకి వస్తున్న వలస జనాభా వల్ల దేశం దెబ్బ తింటుందనీ, క్రిస్టియన్ దేశం అయిన నార్వేలో, ముస్లిం జనాభా పెరిగితే అది ముందు ముందు మత ఘర్షణలకు దారి తీస్తుందని, అతని బాధ అయి ఉండవచ్చు. ఇదే విషయాన్ని అతను ట్విటర్ లో వ్రాసాడు. "బహుళ జాతులు నివసిస్తున్న దేశాలలో ముస్లిములు కూడా ఉన్నట్లయితే అలాటిచోట్ల శాంతి ఎక్కడుందో చెప్పండి?" అంటూ ట్విటర్ లో కామెంట్ చేశాడుట.  

మొత్తం మీద వంద సంవత్సరాల క్రితం నాటి స్వతంత్ర కుండలిలో కనిపిస్తున్న విషయాలు ఈనాడు నిజం కావడం ఆశ్చర్యకరం. మనుషులకైనా, దేశాలకైనా, అనుకూల దశలు వచ్చినపుడు ఆయా విషయాలు తప్పక  జరుగుతాయన్న జ్యోతిష్య సూత్రం ఎంత నిజమో అని ఆశ్చర్యం కలుగుతుంది. 


ఈ దేశపు కుండలిలో రవి బుధులు దశమ స్థానంలో ఉండి, విశాల భావాలు కలిగిన, స్థిరమైన, ఇంటలేక్చువల్ ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు. నార్వే శాంతియుతమైన దేశమే. ప్రస్తుతం ఈ దేశానికి గురు/రాహు/కుజ/బుధ/కుజ విమ్సోత్తరీదశ జరుగుతున్నది. జ్యోతిశ్శాస్త్రంలో దీనిని దశాచ్చిద్ర   సమయం అంటారు. ఈ సమయంలో దేశంలో కల్లోలం గానీ, మోసంగానీ, దుండగుల దాడులు గానీ తప్పక జరుగుతాయి. కుజుని విధశా ప్రాణ దశల ప్రభావం వల్ల హింస పెట్రేగింది. రవితో కూడిన బుధుని దశమ స్థితివల్ల ప్రభుత్వం మీద, ప్రభుత్వ పాలసీలమీదా జరిగిన దాడిగా దీనిని అనుకోవచ్చు.

గోచార రీత్యా పరిస్తితి ఎలా ఉందో చూద్దాం. గోచార కుజ కేతువులు దశమ స్థానపు రవి బుధుల మీద ఉండటం గమనించవచ్చు. గోచారరాహువు నాలుగింట ఉంటూ ప్రజలలోని అసంతృప్తిని సూచిస్తున్నాడు. కనుక ప్రభుత్వం మీద హింసతో కూడిన ప్రజాదాడి జరిగింది. గోచార కుజుడు ఏడాదికొకసారి ఈ బిందువుపైన సంచరిస్తాడు. కాని రాహు కేతువులు 18 ఏళ్లకొకసారి మాత్రమే అలా సంచరిస్తారు. అందులోనూ ప్రస్తుతం నీచ స్తితిలో బలవత్తరంగా  ఉన్నారు. కనుక ఈ మారణకాండ వీరి ప్రభావమే అనడంలో సందేహం లేదు. 


స్వతంత్ర కుండలిలో నవమ స్థానంలో ఉన్న శుక్ర గురువులను మూడవ స్థానం నుంచి వక్రించిన కుజుడు చూస్తున్నందువల్ల, మతపరమైన విషయాలు ప్రజలలో హింసకూ ఘర్షణకూ దారి తీస్తాయని తెలుస్తున్నది. అదేగా ప్రస్తుతం జరిగింది. గోచార గురువు ప్రస్తుతం మత పరమైన విషయాలను సూచించే నవమ స్థానంలో సంచరిస్తూ ఉండటం గమనించవచ్చు. 


ఈ దేశానికి 11 -8 -2011 తో గురు మహాదశ అయిపోయి శని మహా దశ మొదలౌతున్నది. శని ఈ దేశ కుండలిలో సప్తమంలో ఉంటూ దిగ్బలం కలిగి ఉన్నాడు. రాహు నక్షత్రంలో కేతువుతో కలిసి ఉన్నాడు. కనుక వచ్చే 19 ఏళ్లలో ఈ దేశంలో ప్రజా సంబంధమైన గొడవలు కల్లోలమూ తప్పవు. 2016 నుంచి 2017 వరకూ జరిగే శని/కేతు దశలలో ఈ దేశంలో అలజడీ, కల్లోలం, ప్రజా జీవితం సంక్షోభంలో పడటమూ జరుగుతుంది. దేశ ప్రభుత్వం స్థిరంగా ఉన్నప్పటికీ, అనేక దేశాల నుంచి వస్తున్న వలసలను, ముఖ్యంగా ముస్లిముల వలసలను నివారించకపోతే, బ్రీవిక్ లాటి వాళ్ళు మరింతమంది పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. అదే జరిగితే అప్పుడు ప్రజా జీవితం అతలాకుతలం అయ్యే ప్రమాదం లేకపోలేదు.
read more " ఓస్లో మారణకాండ -- జ్యోతిష్య కోణాలు "

22, జులై 2011, శుక్రవారం

సైంటిఫిక్ టెంపర్

"సైంటిఫిక్ టెంపర్" అన్న పదం మొదటగా వ్రాసింది నెహ్రూ అని CCMB మాజీ డైరెక్టర్ భార్గవ మొన్నీ మధ్య  చెప్పారు. చాలా గొప్ప విషయం. అంతటితో ఆయన ఆగితే బాగుండేది. హిందూ మతం మీదా, హోమియోపతీ సిస్టం మీదా ఆయన విరుచుకు పడి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసారు. అది ఆయనలోని మేధోపరమైన డొల్లతనాన్ని బయట పెట్టుకున్నట్లు అయింది.

ఆయన చేసిన విమర్శలు ఎంత అల్పంగా ఉన్నాయంటే, ఏ మాత్రం బుర్ర ఉన్నచిన్న పిల్లవాడికి కూడా వాటిలోని  లోపాలు స్పష్టంగా కనిపించాయి. శాస్త్ర వేత్తలమీద ఆయన ఆరోపణ ఏమిటంటే పగలంతా డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని నమ్మిన శాస్త్రవేత్తలు సాయంత్రానికి గుళ్ళూ గోపురాలకు వెళుతూ దేవుణ్ణి నమ్ముతున్నారట. దేవుణ్ణి నమ్మితే సృష్టి దేవుడే చేసినట్లు అవుతుందనీ అప్పుడు డార్విన్ సిద్ధాంతం తప్పనీ ఆయన వాదన. శ్రీహరికోట రాకెట్ శాస్త్రవేత్తలు తమ ప్రయోగం ఏ విఘ్నమూ లేకుండా సాగాలని తిరుపతి వెళ్లి పూజలు చేయించారట. దానినీ ఆయన తప్పు బట్టాడు. శాస్త్రవేత్తలలో ఈ ద్వంద్వ ధోరణి మారాలని ఆయన ఆశట. ఆయన ఈ మధ్యన ఇచ్చిన ఉపన్యాసం ఈ ధోరణిలోనే సాగింది. అది చదివి నాకు నవ్వాగలేదు. ఇదీ మన శాస్త్రవేత్తల స్థాయి !!!  

దేవుడు అనేవాడు ఎక్కడో మేఘాల మాటున కూచుని ఆరు రోజులు సృష్టి చేసి ఏడోరోజునించీ శాశ్వత రెస్టు తీసుకుంటున్నాడని నమ్మే, కాలంచెల్లిన క్రైస్తవ సిద్ధాంతాన్ని పట్టుకుని ఆయన మాట్లాడుతున్నాడని తెలిసిపోతున్నది. ఈ ధోరణి గత వందా ఏభై సంవత్సరాల పాశ్చాత్య శాస్త్రవేత్తల, నాస్తికమ్మన్యుల ఆలోచనా విదానమనీ, ఆయన ఏవో బూజు పట్టిన పాత యూరోపియన్ పుస్తకాలు చదివి ఈ మాటలు మాట్లాడుతున్నాడనీ, అటువంటి ఆటవిక అవగాహనను దాటి ప్రస్తుత సైన్స్ చాలా ముందుకు వచ్చిందనీ, అసలు హిందూమతం అంటే ఆయనకు ఏ మాత్రం అవగాహన లేదనీ అర్ధమౌతున్నది. మతాన్ని గుడ్డిగా అనుసరించే వాళ్ళ కంటే, ఇలా అర్ధం చేసుకోకుండా మాట్లాడేవాళ్ళ వల్లే ఎక్కువ ప్రమాదం ఉంది. నేటి మోడరన్ ఫిజిసిస్టులు అద్వైత వేదాంతానికి చాలా దగ్గరగా వచ్చేసారని ఆయనకు తెలుసో లేదో మరి.

సైన్స్ లో స్థిరత్వం లేదనీ, అది రోజుకో మాట చెబుతుందనీ,  దానికి భిన్నంగా, వేదాంతం స్థిరమైన భావాలు కలిగినదనీ ఆయన మర్చిపోయినట్లున్నారు. ఇన్నేళ్ళ బయలాజికల్ రీసెర్చిలో, మెడికల్ రీసెర్చిలో, వెధవ మలేరియానూ, టైఫాయిడ్ నూ ఎందుకు నివారించలేకపోతున్నారో ఆయన వివరించి ఉంటె బాగుండేది. ఇన్ని మాట్లాడే ఆయన "భార్గవ" అని ఒక వేదరుషి పేరు ఎందుకు పెట్టుకున్నారో బహుశా ఆయనకే తెలియదు లాగుంది. ఒకవేళ ఆయన్ను ఇదే విషయం అడిగితే, ఆ పని చేసింది నేను కాదు, నాకు నేనెలా పేరు పెట్టుకోగలను? ఆ పని నా తల్లి దండ్రులు చేసారు. తప్పు వారిది. ఆ మాత్రం తెలియదా అంటూ ఎగతాళి చేసినా చేస్తాడు.  శాస్త్రవేత్తలు ఎంత చేసినా, chance factor అనేది ఒకటి ఎప్పటికీ ఉంటుందనీ, దానిని తమకు అనుకూలంగా చెయ్యమనే,  తిరుపతి వెళ్లిన శాస్త్రవేత్తలు విశ్వశక్తిని కోరుకున్నారనీ ఆయన గ్రహించలేకపోవడం వింతగా ఉంది. 

అసలు సైన్స్ కనుక్కున్న అనేక ఆవిష్కరణలు వారి గొప్ప కాదనీ, అవి వారి అంతచ్చేతన నుంచి ఉబికి వచ్చి వారి ముందు ప్రత్యక్షమైన విషయాలనీ ఆయన మర్చిపోయారా? అటామిక్ స్ట్రక్చర్, బెంజీన్ రింగ్ స్ట్రక్చర్ మొదలైన అనేక ఆవిష్కరణలు శాస్త్రవేత్తల  మనస్సులో మెరిసిన తళుకులనే విషయం బహుశా ఆయనకు తట్టలేదు.

హోమియోపతీ కూడా అసలు వైద్యం కాదనీ దానిలో డిగ్రీలివ్వడం ప్రభుత్వం ఆపాలనీ ఆయన వాదించాడు. "ప్లాసిబో ఎఫెక్ట్" వల్లే హోమియో పనిచేస్తున్నదన్న భ్రమ కలుగుతుందనీ అంతే కాని అది అసలు పని చెయ్యదనీ ఆయన వాదన. హోమియో ఔషధాలలో దేనినైనా సరే  హైయ్యర్ పోటేన్సీలో తీసుకుని రిపీటేడ్ గా ఒక మూడు నాలుగు డోసులు వేసుకుని చూస్తె అందులో పదార్ధం లేకున్నా అవి ఎలా పనిచేస్తాయో ఆయనకే విషయం అర్ధం అయ్యి ఉండేది. 

హోమియో ఔషధాలలో తాచుపాము విషం నుంచి తీసిన "నజా" అనే మందు ఒకటి ఉంది. అవగాడ్రో థీసిస్ ప్రకారం 6 పోటేన్సీ దాటితే హోమియో ఔషధాలలో మేటర్ ఉండదు కదా. పోనీ ఇంకాస్త వెసులుబాటు ఇద్దాం. 30 పోటేన్సీలో అయితే ఖాయంగా అసలు పదార్దమే ఉండదు.  అంటే పాము విషం ఉండదు. "నజా-30 " మందును గంటకొకసారి రెండు మాత్రల చొప్పున భార్గవగారిని  వేసుకుని చూడమందాం. 24 గంటల తర్వాత గుండె నొప్పి తదితర "నజా" లక్షణాలతో ఆయన హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో చేరవలసి వస్తుందో లేదో ఆయనే చూడవచ్చు. పదార్ధం ఏమీలేని ఉత్త పంచదార గుళికలు ఎలా ఈ లక్షణాలను పుట్టిస్తాయో అప్పుడు ఆయనే చెప్పాల్సి ఉంటుంది.   
 
నీటి రుచి తెలుసుకోవాలంటే తాగి చూడాలి. అంతే కాని నీటిని చేత్తో తాకి నాకు నీటి రుచి తెలియలేదు కాబట్టి యిది నీరు కాదు అంటే ఎలా ఉంటుందో ఈయనగారు చెబుతున్నదీ అలాగే ఉంది. ఒక విషయాన్ని అర్ధం చేసుకోవాలంటే ఆ సబ్జెక్టుకున్న పరిధికి సంబంధించిన సూత్రాల ద్వారా చూడాలి. అంతేకాని వేరొక పరిధికి చెందిన సూత్రాలను ఇక్కడ అప్లై చేసి, నేను చిన్నప్పుడు నేర్చుకున్న సూత్రాలు ఇక్కడ పనిచెయ్యడం లేదుకనుక యిది అసలు సైన్సే కాదు అనడం హాస్యాస్పదంగా ఉంది. 

ఈ శాస్త్రవేత్తలతో వచ్చిన చిక్కే యిది. వారికి అర్ధమైన సూత్రాలతో ప్రపంచంలో ఉన్న అన్నింటినీ అర్ధం చేసుకోగలమని వారి భావన. ఈ భావన సైంటిఫిక్ స్పిరిట్ ఎలా అవుతుందో వారే చెప్పాలి. తనకు తెలిసిందే సర్వస్వం అన్న భావనే సరైనదైతే, ఇక రీసెర్చికి ఆస్కారం ఎక్కడుంది? మధ్యయుగాలలో  కోపెర్నికస్ నూ గెలీలియోనూ హింసించిన క్రైస్తవమతపిచ్చిగాళ్ళకూ ఈయనకూ తేడా ఏముంది? వారికి అర్ధం కానివాటిని వారు ఒప్పుకోలేదు. ఈయనకు అర్ధం కానివాటిని ఈయనా ఒప్పుకోడం లేదు. అర్ధం చేసుకునే ప్రయత్నాన్ని మాత్రం వాళ్ళూ చెయ్యలేదు. ఈయనా చెయ్యడం లేదు. మధ్య యుగపు క్రైస్తవమతకిరాతకులు  ఆ కాలపు సైంటిష్టులను హింసించారు. ఈయన సైంటిష్టునని చెప్పుకుంటూ సైన్సుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ  సైంటిఫిక్ స్పిరిట్ ను  అపహాస్యం చేస్తున్నాడు. అదే తేడా.

హోమియో పోటేన్సీలు పని చేసే మాట వాస్తవం. యిది ఎన్నో సార్లు ప్రాక్టికల్గా రుజువైంది. ప్రపంచ వ్యాప్తంగా ఎపిడెమిక్ రోగాలు ప్రబలినప్పుడు హోమియో ఔషధాలు బ్రహ్మాండంగా పనిచేసినట్లుగా ఎన్నో రుజువులున్నాయి. ఇంగ్లాండ్ రాజూ రాణీ హోమియో ఔషధాలనే వాడతారనీ, రాయల్ లండన్ హోమియోపతిక్ హాస్పిటల్ అనేది 1850 నించీ రాయల్ పేట్రోనేజ్ తో నడుస్తోందనీ ఆయన తెలుసుకోవాలి. "సర్ జాన్ వేయిర్" పేరును భార్గవ గారు విన్నారో లేదో నాకు తెలియదు. సర్ జాన్ వేయిర్ ప్రఖ్యాత హోమియో వైద్యుడే కాక, ఇరవయ్యో శతాబ్దపు అనేక యూరోపియన్ రాజ కుటుంబాలకు రాజవైద్యుడు. కింగ్ జార్జ్-5, కింగ్ జార్జ్-6 , కింగ్ ఎడ్వర్డ్ -8 , క్వీన్ ఎలజబెత్-2 మొదలైన రాజకుటుంబీకులకు ఈయన ఫామిలీ ఫిజీషియన్ అన్న సంగతి సైంటిస్ట్ భార్గవ గారికి తెలీదు కాబోలు. రాయల్ ఫేమిలీస్ పిచ్చివాళ్ళా హోమియోపతి వాడటానికి? మన మాత్రం తెలివితేటలు వాళ్లకు లేవని భార్గవ గారి ఉద్దేశమా? సర్ జాన్ వేయిర్ వ్రాసిన పుస్తకాలు కొన్నైనా చదివితే హోమియోపతి అనేది ఎంత గొప్ప వైద్య విధానమో మన మట్టి బుర్రలకు తెలుస్తుంది. 

హోమియో ఔషధాలు ఎలా పని చేస్తాయో భార్గవగారు పెట్టిన CCMB లాటి సంస్థలు ప్రయోగాలు చేసి నిరూపించాలి. ఆ పని చెయ్యకుండా, పోటేన్సీలలో పదార్ధం లేదు గనుక అవి పని చెయ్యవు అని మొండిగా వాదించడం ఎలా ఉందంటే గాలి నాకు కనిపించదు కనుక అసలు గాలే లేదు అన్నట్లు ఉంది. ఇదీ మన సైంటిష్టుల మేధో స్థాయి.

మనకు స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్ళు దాటింది. దేశం నలుమూలలా ప్రఖ్యాత సైంటిఫిక్ సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఈ 60 ఏళ్లలో ఎంతోమంది సైంటిస్టులు ఎన్నో పరిశోధనలు చేశారు. Ph D పట్టాలు పొందారు. వీరందరూ చేసిన, చేస్తున్న పరిశోధనలలో ప్రజలకు ఉపయోగపడేవి ఎన్నున్నాయో ఆయన చెబితే బాగుండేది. అలా ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేసి ఉన్నట్లయితే ఇన్నాళ్ళబట్టీ   ప్రజా జీవితం ఇంత అద్వాన్నంగా ఎందుకుందో ఆయనే వివరించాలి. 

ఎంతసేపూ పాశ్చాత్యులు చేసిన ఆవిష్కరణలను కాపీ కొట్టి వాడుకుంటున్న మనం సైన్స్ కు ఏమి ఒరగబెట్టామో  ఆయన వివరించాలి. రామన్ ఎఫేక్టూ, చంద్రశేఖర్ లిమిటూ వంటి ఒకటి రెండు తప్ప మన శాస్త్రవేత్తలు సైన్సుకు ఒరగబెట్టిన మౌలికమైన ఆవిష్కరణలు ఏమీ లేవు.  మనవాళ్ళు చేస్తున్న పరిశోధనలన్నీ చాలావరకూ wasteful thesis లేననీ వాటిలో ప్రజాజీవితాన్ని సరాసరి మెరుగుపరిచే ఆవిష్కరణలు ఏమీ లేవనీ ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త నాకు చెప్పాడు. 

ప్రజాధనంతో ప్రజలకు పనికిరాని పరిశోధనలు ఏళ్ల తరబడి చేస్తున్న శాస్త్రవేత్తలు ఇతరులను విమర్శించడం, అందులోనూ తమకు అర్ధం కాని సబ్జెక్టుల మీద వ్యాఖ్యానం చెయ్యడం  గురివింద గింజ సామెతను గుర్తు చేస్తోంది. మానవాళికి దొంగబాబాలు ఎంత ప్రమాదకారులో దొంగ సైంటిస్టులూ అంతే.

నిజమైన సైంటిస్ట్ కు స్థిరమైన అభిప్రాయాలు ఏమీ ఉండవు. ఎందుకంటే సృష్టిలో ఏదీ ఇదమిద్ధంగా నిర్ణయింపబడేది, నిర్వచింపబడేదీ కాదని అతనికి అర్ధమౌతుంది. దేన్నైనా నిరూపించబడనంతవరకూ నమ్మకపోవడం మంచిదే. కాని దానిని నిరూపించే ప్రయత్నమూ, అర్ధం చేసుకునే ప్రయత్నమూ చేసేవాడే సైంటిస్ట్. అంతేగాని ఊరకే ప్రతిదాన్నీ తెలిసినా తెలియకపోయినా విమర్శిస్తూ ఇంకేమీ చెయ్యకుండా కూచునేవాడికి  సైంటిఫిక్ స్పిరిట్ ఉన్నదని నమ్మలేం. అది బయాస్ అవుతుంది గాని సైంటిఫిక్ స్పిరిట్ అవ్వదు.  

హోమియో పోటేన్సీలు ఎలా పని చేస్తాయో తన అధీనంలో ఉన్న modern scientific infrastructure సహాయంతో కనుక్కునే ప్రయత్నాన్ని భార్గవగారు చేస్తే బాగుంటుంది. బూజుపట్టిన క్రైస్తవసిద్ధాంతాలను పక్కనపెట్టి వేదాంతాన్ని చదివి అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది. There are no absolutes in this universe, even in Physics. -- అన్న ఐన్ స్టీన్ మాటలను   భార్గవగారు ఒక్కసారి మననం చేసుకుంటే, అవి వశిష్టగీత లోని వేదాంతభావాలతో ఎంత దగ్గరగా ఉన్నాయో ఆయనకు అర్ధం అవుతుంది.

అప్పుడైనా సైన్సుకూ భారతీయ వేదాంతానికీ ఎటువంటి ఘర్షణా లేదనీ, సైన్సు యొక్క తిరుగుబాటు అంతా జుదాయిజం, క్రైస్తవం, ఇస్లాం వంటి ఎడారి మతాలలో ఉన్న "దేవుని" భావనతోనేననీ, ఆ భావన చాలా ప్రిమిటివ్ అనీ ఆటవికస్థాయిభావన అనీ కనీసం అప్పుడన్నా ఆయన తెలుసుకోగలుగుతారు.
read more " సైంటిఫిక్ టెంపర్ "

21, జులై 2011, గురువారం

రాహుకేతువులు - దుర్మరణాలు

మే నెలలో రాహుకేతువులు గోచారరీత్యా నీచస్థితిలోకి రావడం జరిగింది. మే, జూన్, జూలై నెలలలో ఆ ప్రభావం వల్ల ప్రజాజీవితంలో  అనేక ప్రమాదాలూ, రక్తపాతాలూ, గొడవలూ, అసహజమరణాలూ, దుర్మరణాలూ జరిగాయి.

రాహుకేతువులు ప్రమాదాలకూ, స్మశానాలకూ, చావుకూ ఆధిపత్యం వహిస్తారు. వారు ప్రస్తుతం నీచస్తితిలో ఉండటం వల్ల బాగా బలాన్ని పుంజుకున్నారు. క్రూరగ్రహాలు నీచస్తితిలో ఉంటే మహా బలవత్తరములౌతాయి. అప్పుడు వాటి ప్రభావం బలంగా కనిపించడం మొదలౌతుంది. తమ తమ పరిధిలో భూభారాన్ని తగ్గించే పని అవి ఆ సమయంలో అతి సమర్ధవంతంగా చేస్తాయి. అలా చెయ్యడానికి మనిషిలోని అహంకారాన్నీ, పొగరునూ, అతితెలివినీ, నిర్లక్ష్యాన్నీ ఊతంగా తీసుకుని తమ కార్యాన్ని చక్కగా పూర్తి చేసుకుంటాయి.

ఒక్క జూలై నెలలోనే నాకు తెలిసిన వారు 4 గురు చనిపోయారు. వీరంతా బాగా ముసలి వారా అంటే కానేకాదు. అందరూ ఏభై లోపు వారే. హటాత్తుగా గుండెపోటుతో పోయిన వారు కొందరైతే, ఆత్మహత్యలు చేసుకున్నవారూ, ప్రమాదాలలో పోయినవారూ ఇంకొందరు. వీరిలో ఎవరూ కూడా చావును ఎక్స్పెక్ట్ చేసినవారు కారు. ఇటువంటి రకమైన ఆకస్మిక చావులు రాహు కేతుల అధీనంలోనే జరుగుతాయి.

ఇలా మరణించినవారిలో అందరూ హటాత్తుగా పోయినవారే. దీర్ఘకాలిక రోగాలతో మంచానపడి పోయినవారు ఎవరూ లేరు. అప్పటిదాకా బాగానే ఉండి సడెన్ గా ఆత్మహత్యలు చేసుకున్న వారూ, అప్పటిదాకా ఆనందంగా కేరింతలు కొడుతూ ప్రయాణం చేస్తూ సడెన్ గా యాక్సిడెంట్ అయి పోయినవారూ వీరిలో ఉన్నారు. రాహు కేతువుల ప్రభావం వల్ల జరిగే సంఘటనలు ఇలాగే హటాత్తుగా జరుగుతాయి. కన్ను మూసి తెరిచేలోపల అంతా అయిపోతుంది.
 
ఇలాటి కేసులను జాగ్రత్తగా గమనిస్తే, వీరిలో ఎక్కువమంది 17, 22. 40 , 44 , 48  ఏళ్ల వారే కనిపిస్తున్నారు. కారణం ఏమంటే 2, 4, 8 అంకెలకు రాహుకేతువులకూ సంబంధం ఉండటమే. జాతకంలో చెడు దశలు జరుగుతున్నవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. సాహసకార్యాలకూ దుడుకుపనులకూ దూరంగా ఉండాలి. అహంకారం పనికిరాదు. రాహువు జ్యేష్టానక్షత్ర సంచారం ఫిబ్రవరి 2012 వరకూ ఉంటుంది. ఈలోపల ఇటువంటి ఘోరాలు మరిన్ని జరిగే అవకాశం ఉందని చెప్పక తప్పదు.
read more " రాహుకేతువులు - దుర్మరణాలు "

19, జులై 2011, మంగళవారం

రాహుకేతువులు - రాశి ఫలితాలు

May 2011 నుంచి December 2012 వరకూ ఏడాదిన్నర పాటు నీచ స్థితిలో ఉండబోతున్న రాహు కేతువుల ప్రభావాలు ఏ ఏ రాశులపైన ఎలా ఉంటాయో చెప్పమని నన్ను చాలామంది కోరుతున్నారు. విడివిడిగా అందరికీ సమాధానం ఇవ్వడం వీలుకాదు. అందుకే ఈ వ్యాసం వ్రాస్తున్నాను. ఇందులో చాలా పాయింట్స్ వారి జీవితాలలో జరుగుతున్నాయని మరింత వివరంగా వ్రాయమని కొందరు ఈ మెయిల్ ద్వారా కోరారు. అందుకే ఇతర గ్రహాలనుకూడా లెక్క లోకి తీసుకుని కొన్ని మార్పులు చేసి వ్రాస్తున్నాను.

ఆయా ఫలితాలను అర్ధం చేసుకుని జాగ్రత్తపడటం ద్వారా,తగిన రేమేడీలు పాటించడం ద్వారా, మేలు పొందవచ్చు.

మేష రాశి వారికి 
కళ్ళ జబ్బులు తీవ్రమౌతాయి. చదువు సంధ్యలలో అనుకోని హటాత్ మార్పులు వస్తాయి. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. మాటమీద అదుపు లేకపోవడం వల్ల గొడవలు వస్తాయి. గుహ్య స్థానంలో దురదలు మొదలైన రోగాలు, దీర్ఘ రోగాలు విజ్రుమ్భిస్తాయి. కష్ట నష్టాలు చుట్టుముడతాయి. అదే సమయంలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముందు మాట తూలడం తరువాత పశ్చాత్తాప పడటం ఉంటుంది. ఒక్క క్షణం బేలతనం మరొక్క క్షణం విపరీతమైన ధైర్యాలతో మనసు ఊగిసలాట అవుతుంది. పిల్లలకు మంచి జరుగుతుంది. ఖర్చులు ఎక్కువ అవుతాయి. రోగులకు సేవలు అందించవలసి వస్తుంది. 
వృషభ రాశి వారికి , 
హటాత్తుగా అనారోగ్యం పాలుకావడం జరుగుతుంది. యాక్సిడెంట్లు అవుతాయి. దెబ్బలు తగులుతాయి. ప్రత్యర్ధుల ప్లానులకు బలి కావడం ఉంటుంది. చిన్న చిన్న కారణాలకు ఎక్కువ రోజులు అనారోగ్యాలు పీడిస్తాయి. పార్ట్ నర్లు, భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తాయి. కొంతమంది దుర్మరణం చెందటం జరుగుతుంది. విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి. అయితే ఈ ఖర్చులు మంచి పనులకై ఉంటాయి. డిప్రెషన్లో పడతారు. లోకం అంతా నిరాశామయంగా కనిపిస్తుంది. తన శక్తిమీద తనకే నమ్మకం సడలుతుంది. ఇంట్లో దైవ సంబంధమైన కార్యాలు జరుగుతాయి. చదువు కుంటుపడుతుంది.

మిథున రాశి  వారికి,
ఆస్పత్రిలో చేరడం జరుగుతుంది. జైళ్ళు, ఆస్పత్రులు సందర్శించవలసి వస్తుంది. హటాత్ ప్రయాణాలు జరుగుతాయి. శత్రు విజయం కలుగుతుంది. అసంభవం అనుకున్న పనులు అనుకోకుండా నెరవేరుతాయి. చిన్న చిన్న రోగాలు చికాకు పెడతాయి. అనుకోని ఖర్చులు హటాత్తుగా తలెత్తుతాయి. కాని సమయానికి ధనం ఎలాగో సర్దుబాటు అవుతుంది. పెద్దలు ఆదుకుంటారు. గృహ సౌఖ్యం లోపిస్తుంది. ఇంటిలో ఎప్పుడూ చిర్రు బుర్రులు ఉంటాయి. ఇల్లు విడిచి ఎటైనా పోదామని అనిపిస్తుంది.

కర్కాటక రాశి వారికి,
అనుకోని లాభాలు హటాత్తుగా వచ్చి పడతాయి. స్నేహితులు సహాయ పడతారు. విలాసాలు పెరుగుతాయి. పార్టీలు జల్సాలు జరుగుతాయి. ప్రేమ వ్యవహారాలూ ఎక్కువ అవుతాయి. మనస్సు చంచలం అవుతుంది. కుతంత్రాలు ఊపందుకుంటాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. సంతానానికి చెడు జరుగుతుంది. ఉద్యోగులకు అధికారం పెరుగుతుంది. మాట చెల్లుబడి అవుతుంది. ధైర్యం పెరుగుతుంది. మాట కరుకుగా ఉంటుంది. ఇతరులను ఆదేశించడం వార్నింగులు ఇవ్వడం జరుగుతుంది.

సింహ రాశి వారికి ,
గృహ సౌఖ్యం లోపిస్తుంది.ఇంట్లో అనుకోని చెడు సంఘటనలు జరుగుతాయి. చికాకులు ఎక్కువ అవుతాయి. త్రిప్పట అధికమౌతుంది. తల్లికి గండం. చదువు చట్టుబండలౌతుంది. వాహన ప్రమాదాలు కలుగుతాయి. వృత్తిలో హటాత్తుగా చెడు జరుగుతుంది. చెడ్డ పేరు పైన పడుతుంది. పుణ్య క్షేత్ర సందర్శనం, సాధువులను గురువులను కలవడం జరుగుతుంది. అనుకోకుండా ధనలాభం కలుగుడుంది. కాని ఆ ధనం నిలబడదు. మనసులో మాటలో జంకు భయం ఏర్పడతాయి. ఏమి చెయ్యాలో పాలుపోని స్తితులు కలుగుతాయి.

కన్యా రాశి  వారికి,
కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఉన్నత విద్య ఫలిస్తుంది. పుణ్య క్షేత్ర సందర్శనం ఉంటుంది. సాధువులు గురువులను కలుస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. కుటుంబంలో పెద్దలు గతిస్తారు. మాటలో ధైర్యం పెరుగుతుంది. కాని మనసులో పీచు పీచు మంటూ ఉంటుంది. ఆహారంలో లోపాలవల్ల రోగాల పాలౌతారు. జీర్ణశక్తి మందగిస్తుంది.

తులా రాశి వారికి,
కళ్ళ జబ్బులు తీవ్రమౌతాయి. చదువు సంధ్యలలో అనుకోని హటాత్ మార్పులు వస్తాయి. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. మాటమీద అదుపు లేకపోవడం వల్ల గొడవలు వస్తాయి. గుహ్య స్థానంలో దురదలు మొదలైన రోగాలు, దీర్ఘ రోగాలు విజ్రుమ్భిస్తాయి. కష్ట నష్టాలు చుట్టుముడతాయి. ఇతరుల అధికారానికి తలవంచవలసి వస్తుంది. పార్ట్ నర్లు  మోసంచేస్తారు. సోదరులకు, పెద్దలకు గండకాలం. అనవసరమైన పనులకు ఖర్చులు పెట్ట వలసి వస్తుంది.

వృశ్చిక రాశి వారికి ,
హటాత్తుగా అనారోగ్యం పాలుకావడం జరుగుతుంది. యాక్సిడెంట్లు అవుతాయి. దెబ్బలు తగులుతాయి. ప్రత్యర్ధుల ప్లానులకు బలి కావడం ఉంటుంది. చిన్న చిన్న కారణాలకు ఎక్కువ రోజులు అనారోగ్యాలు పీడిస్తాయి. పార్ట్ నర్లు, భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తాయి. కొంతమంది దుర్మరణం చెందటం జరుగుతుంది. మనసు పరిపరివిధాలుగా పోతుంది. దురుసు మాటలు ఎక్కువ అవుతాయి. దానివల్ల సన్నిహితులు బాధ పడతారు. రాష్ బిహేవియర్ ఎక్కువౌతుంది. జీర్ణక్రియ  మందగిస్తుంది. వేళకు తినక  పోవడం వల్ల, నానా తిండీ తినడం వల్లా అనారోగ్యాలు వస్తాయి. కుటుంబంలో పెద్దలు అనారోగ్యాల పాలౌతారు. కాని చివరకు అంతా సుఖాంతం అవుతుంది.కీడు చేస్తారేమో అనుకున్న వారినుంచి కూడా మేలే జరుగుతుంది.

ధనుస్సు వారికి ,
ఆస్పత్రిలో చేరడం జరుగుతుంది. జైళ్ళు, ఆస్పత్రులు సందర్శించవలసి వస్తుంది. హటాత్ ప్రయాణాలు జరుగుతాయి. శత్రు విజయం కలుగుతుంది. అసంభవం అనుకున్న పనులు అనుకోకుండా నెరవేరుతాయి. చిన్న చిన్న రోగాలు చికాకు పెడతాయి. అనుకోని ఖర్చులు హటాత్తుగా తలెత్తుతాయి. మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. మంత్ర తంత్రాల మీద, దైవ సంబంధమైన పనుల మీదా ఆసక్తి పెరిగుతుంది. కాని ఆచరణలో ఆలస్యాలు అవుతాయి. అనుకున్న పనులు ఎందుకు చెయ్యలేకపోతున్నారో అర్ధం కాదు. ఉద్యోగంలో అన్నీ ఆలస్యాలే అవుతుంటాయి. సమయానికి అనుకున్న పనులు పూర్తీ కావు.

మకర రాశి వారికి,
లాభాలు వచ్చి పడతాయి. స్నేహితులు సహాయ పడతారు. విలాసాలు పెరుగుతాయి. పార్టీలు జల్సాలు జరుగుతాయి. ప్రేమ వ్యవహారాలూ ఎక్కువ అవుతాయి. మనస్సు చంచలం అవుతుంది. కుతంత్రాలు ఊపందుకుంటాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. సంతానానికి చెడు జరుగుతుంది. ధర్మ చింతన పెరుగుతుంది. తమకు న్యాయంగా రావలసినవి కూడా రాకుండా పోతాయి. కుటుంబలో పెద్దలకు అనారోగ్యం చేస్తుంది. వైరాగ్యం పెరుగుతుంది.
కుంభ రాశి వారికి,
గృహ సౌఖ్యం లోపిస్తుంది.ఇంట్లో అనుకోని చెడు సంఘటనలు జరుగుతాయి. చికాకులు ఎక్కువ అవుతాయి. త్రిప్పట అధికమౌతుంది. తల్లికి గండం. చదువు చట్టుబండలౌతుంది. వాహన ప్రమాదాలు కలుగుతాయి. వృత్తిలో హటాత్తుగా చెడు జరుగుతుంది. చెడ్డ పేరు పైన పడుతుంది. దీర్ఘ రోగాలు విజ్రుమ్భిస్తాయి. ధన నష్టం కలుగుతుంది. మాటలో జంకు భయం శాంతం తయారౌతాయి. చాలా కాలంగా అనుకుంటున్న ఉన్నత విద్యలు, దగ్గర ప్రయాణాలు అనుకూలిస్తాయి. సోదరులకు మంచి జరుగుతుంది. మనసులో భయం ఆందోళనా అధికం అవుతాయి.

మీనరాశి వారికి,
కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఉన్నత విద్య ఫలిస్తుంది. పుణ్య క్షేత్ర సందర్శనం ఉంటుంది. సాధువులు గురువులను కలుస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. కుటుంబంలో పెద్దలు గతిస్తారు. శత్రు బాధ మిక్కుటమౌతుంది. దిష్టి ఎక్కువౌతుంది. బిజినెస్స్ లో ఆలస్యాలు ఆటంకాలు ఎక్కువ అవుతాయి. సమయానికి ఎలాగో ధనం సర్దుబాటు అవుతూ ఉంటుంది. కాని మనశ్శాంతి ఉండదు.
read more " రాహుకేతువులు - రాశి ఫలితాలు "

18, జులై 2011, సోమవారం

ముంబై బాంబు పేలుళ్లు - జ్యోతిష్య పరిశీలన

రాహు కేతువులు మనిషి యొక్క జీవితంలో వచ్చే అన్ని చెడుఘటనలలోనూ ముఖ్యపాత్ర వహిస్తాయి. ముఖ్యంగా బాంబుపేలుళ్లు, పెద్ద పెద్ద దుర్ఘటనలు, యాక్సిడెంట్లు,  కుట్రలలో వీరిపాత్ర తప్పకుండా ఉంటుంది. మానవ జీవితం మీద వారికి తిరుగులేని అధికారం ఉంది.
 
రాహుకేతువులు కాల స్వరూపాలు.అందుకే వీటితో ఏర్పడే కాలసర్పయోగం ఉన్నవారికి కాలం అనుకూలించదు. ఇవి ఉచ్చస్థితిలో ఉన్నవారికి కాలం అనుకూలించడమూ  నీచ స్థితిలో ఉన్నవారికి కాలం పామై కాటువెయ్యడమూ గమనించవచ్చు. జాతకంలో మంచిదశలు గనుక జరుగుతుంటే ఎండకు పట్టిన గొడుగులాగా ఈ చెడుప్రభావం నుంచి దశలు రక్షిస్తాయి. దశలు కూడా చెడువి జరుగుతుంటే ఇక చెప్పనక్కర్లేదు. అన్నీ కలిసి  మనిషిని పీల్చి పిప్పిని చేస్తాయి. 

అయితే ఇదంతా గ్రహాలు ఎవరిమీద కోపంతోనో చేస్తున్నట్లు భావించరాదు. మన కర్మ ఫలితాన్నే గ్రహాలూ చూపిస్తాయి. అంతేగాని వాటికి ఒకరంటే ద్వేషమూ ఒకరంటే ప్రేమా లేవు. అవి దైవీ శక్తులు. లోకులందరి పైనా సమదృష్టితో మనకు రావలసిన కర్మ ఫలాన్ని అవి ఇస్తూ ఉంటాయి. అంతిమ విశ్లేషణలో మనం చేసుకున్నదే మనం అనుభవిస్తాము.

ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ప్రస్తుతం మే 3 తేదీనుంచి రాహు కేతువులు నీచ స్థితిలో ప్రవేశించారు. వీరు ఈ స్తితిలో ఒకటిన్నర సంవత్సరం ఉంటారు.
కనుక ఈసమయంలో మనుషుల జీవితాలలో విపరీత మార్పులు కనిపిస్తాయి. ఏ ఏ జాతకాలకు వీరు బాధకులో వారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తారు. అంటే ఆయా జాతకులు చేసిన పూర్వ చెడుకర్మ అంతా ఈ సమయంలో ఫలితానికి వస్తుంది. రాహు కేతు ప్రబావాల నుంచి తప్పించుకోగలమని లోకులు అనుకుంటారు. కానీ అది తేలికగా జరిగేపని కాదు. చేసిన చెడుకర్మ, దొంగపూజలవల్ల తొలగదు. ఎవరికో డబ్బులు పడేసి చేయించిన రాహుకేతు పూజలవల్ల దోషాలు పోతాయని అనుకోవడం పిచ్చి భ్రమ. అవి అంత తేలికగా పోయేవి కానే కావు. మన జీవితాలను శాసిస్తున్న దైవీ శక్తులను మనం బురిడీ కొట్టించగలమని అనుకోవడం వెర్రి తనం. అయితే రేమేడీలు అన్నీ బూటకాలేనా అన్న అనుమానం వస్తుంది. కానేకావు. రేమేడీలు నిజాలే. అయితే వాటిని చేసే తీరు ఒకటి ఉన్నది. ఆ తీరులో వాటిని చేసినపుడే అవి ఫలితం చూపిస్తాయి. జాగ్రత్తగా గమనిస్తే మే నెలనుంచి, అనుకోని పరిస్తితులు తలెత్తడం, ప్రమాదాలు జరగడం, త్రిప్పట, విసుగు, చికాకులు ఎక్కువకావడం మొదలైన విపరీతపు సంఘటనలు జరగడం, అనేకమంది జీవితాలలో ఎవరికి వారే చూసుకోవచ్చు.

ఆ సంగతి అలా ఉంచితే, ప్రస్తుతం 13 -7 -2011 న జరిగిన ముంబై బాంబు పేలుళ్ళ కూ వీటికీ సంబంధం ఉందంటే విచిత్రంగానే ఉంటుంది. అదెలాగో వివరిస్తాను. నేనెన్నో సార్లు సూచించిన పౌర్ణమి అమావాస్య ఎఫెక్ట్ ఈసారికూడా
మళ్ళీ నిజమైంది. ఈసారి ఆషాఢ పౌర్ణిమకు ఒకరోజు ముందు ముంబై పేలుళ్లు జరిగాయి.

సహజ ద్వితీయ స్థానమూ, సంపదకు సూచికా, శుక్రునిచే సూచింపబడుతున్న విలాసప్రదేశం  అయిన వృషభంలో కుజుడూ కేతువూ కలిసి ఉండటం చూడవచ్చు. అంటే ఒక విలాసవంతమైననగరంలో దుర్ఘటన జరుగబోతున్నదని  సూచన వస్తుంది. రాహువు కుజునిదైన వృశ్చిక రాశిలో ఉన్నాడు. వృశ్చికం కుట్రలకూ కుతంత్రాలకూ రహస్య ప్లానులకూ, నీటివనరుల దగ్గర ఉండే ప్రదేశాలకూ మూలస్థానం. రాహువు కుట్రదార్లకూ విద్రోహులకూ అధిదేవత. ఇక కేతువు శుక్రునిదైన వృషభంలో కుజునితో కలిసి ఉన్నాడు. కుజ కేతువులు పేలుళ్లకు, శక్తి విస్ఫోటనాలకూ సూచికలు.

11.7.2011 నుంచి 16-7-2011 వరకూ అగ్ని ప్రమాదాలకు సూచిక అయిన కుజుడు నవాంశలో నీచస్థితిలో ఉంటూ విధ్వంసకరమైన   నీచుల పన్నాగాలను సూచిస్తున్నాడు. అలాగే 13 , 14   తేదీలలో మాత్రమె నవాంశలో శుక్రుడు ఉచ్చ స్థితిలోకి వస్తూ రాహువుతో కలిసి మీనంలో ఉంటున్నాడు. అంటే విధ్వంసకారుల కుట్రలు ఈ సమయంలో బలం పుంజుకుంటాయని తెలుసుకోవచ్చు. 14 తేదీన పౌర్ణమి ఘడియలు వస్తున్నాయి. కనుక డేంజరస్ టైం స్లాట్ 13 , 14 తేదీలకు కుదించబడింది. 13 సాయంత్రం పేలుళ్లు జరిగాయి. పౌర్ణమి అమావాస్యలు కొన్ని గ్రహ ప్రభావాలను విపరీతంగా ఉత్తెజపరుస్తాయనీ ప్రధాన సంఘటనలు వీటికి అటూ ఇటూ జరుగుతాయనీ ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకేనేమో మన జ్యోతిర్విద్యలో చంద్రునికి అమితమైన ప్రాధాన్యత ఇవ్వబడింది.

ఇప్పుడు రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి?


ఒకటి-- ముంబై లోనే ఈ ఘటన ఎందుకు జరగాలి? ఈ గ్రహ పరిస్తితులు అన్ని నగరాలకూ వర్తిస్తాయి కదా? అన్ని నగరాలకూ ఒకే పరిస్తితి ఉండదు. ముంబైకీ ఈ సమయానికీ ఉన్న సంబంధం పరిశోధనలో  నిర్ధారించాలి.

ఇకపోతే రెండవది-- ఘటన జరిగిన తర్వాత ఈ పరిశీలన వల్ల ఉపయోగం ఏమిటి? ముందే చెబితే జాగ్రత్తలు తీసుకునేవారు కదా? దీనికి నా జవాబు ఏమిటంటే, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఉన్న గ్రహ స్తితులను గుర్తించడం వల్ల ముందుముందు ఇలాటి సంఘటనలు ఎప్పుడు జరుగుతాయో తెలుసుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇకపోతే, జాగ్రత్తల విషయానికొస్తే,  అదేన్నటికీ జరిగే పని కాదు. పొరపాటున దొరికిన దొంగలనూ  హంతకులనూ, ఏళ్ల తరబడి రాజభోగాలతో పోషిస్తున్న మనం, జరుగబోయేవి చెబితే జాగ్రత్తలు తీసుకుంటామా? అసంభవం. ఈ దేశంలో అది ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. 

మరి ఈ ఎనాలిసిస్ ఎందుకూ అని అనుమానం సహజం. పరిశీలన వల్లా, రీసెర్చిల వల్లనే, సూత్రాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పటి సంఘటనలు, భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండటానికి, ముందు జరుగబోయే సంఘటనలను తెలుసుకోవడానికీ   ఉపయోగపడతాయి. ఈ ఎనాలిసిస్ ఉపయోగం అంతవరకే.

రాహు కేతువులు 24-12-2012 వరకూ నీచ స్థితిలోనే ఉంటాయి. ఈ లోపల మరిన్ని దుర్ఘటనలు జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీలును బట్టి ఆయా సమయాలను సూచించడం జరుగుతుంది. 
read more " ముంబై బాంబు పేలుళ్లు - జ్యోతిష్య పరిశీలన "

16, జులై 2011, శనివారం

పానగల్లు ఆలయాలు



మొన్నీమధ్య నల్గొండ వెళ్ళినపుడు పానగల్లు పచ్చల సోమేశ్వరాలయం, ఛాయాసోమేశ్వరాలయాలను చూడటం జరిగింది. 10 -11 శతాబ్దాలలో ఈ నిర్మాణాలు జరిగాయట. పొందూరుచోడులు అనే రాజులు కాకతీయరాజుల సామంతులు. వాళ్ళు ఈ ఆలయాలు కట్టించారు. 

పక్కనే కొంత దూరంలో ఉదయసముద్రం అనే పెద్ద చెరువు ఉంది. అదీ ఆ రాజులు కట్టించినదే. కొండల్లో ఉన్న లోతట్టు ప్రాంతాన్ని ఎంచుకుని దానిచుట్టూ గట్టు కట్టారు. వర్షపు నీరు అక్కడికి చేరుతుంది. అప్పట్లోనే ఐదువేల ఎకరాలను అది సాగు చేసేదిట. దాని దిగువన నేటి నల్లగొండ పట్టణం ఉన్నది. ప్రాచీన కాలంలో తెలుగునాడులోని ముఖ్య నగరాలలో పానగల్లు ఒకటిట.

ఈ రెండు ఆలయాలూ ముస్లిం దండయాత్రల్లో ఘోరంగా ధ్వంసం చెయ్యబడ్డాయి. విరిగిపోయి దిక్కులేకుండా పడి ఉన్న శిల్ప సంపదను చూస్తె గుండె తరుక్కుపోతుంది. ఒక్కొక్క శిల్పాన్నీ చెక్కడానికి ఎన్నెన్ని నెలలు పట్టాయో ఊహకందదు. అంత చక్కని శిల్పాలు అక్కడ ఉన్నాయి. వాటిని నాశనం చెయ్యడానికి ముస్లిములకు చేతులెలా వచ్చాయో అర్ధం కాదు. 

ఆ విరిగిన శిల్పాల మధ్యన నిలబడి ఆలోచిస్తే, వాళ్ళంత రాక్షసజాతి ఈ భూ ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో అనిపించింది. ఈనాటికీ వాళ్ళలో మార్పు రాలేదు. ఈ మధ్య కాలంలోనేగా బమియాన్ బుద్ధ విగ్రహాలను షూటింగ్ రేంజిగా మార్చుకుని  వరల్డ్ హెరిటేజి సైట్ ను కూడా రాక్షసంగా ధ్వంసం చేసారు -- అని పక్కనే ఉన్న స్నేహితుడు కామెంట్ చేసాడు. పైగా ఇస్లాం అంటే శాంతి అని చెప్తారు. వీళ్ళు చెప్పే నీతులు దయ్యాలు నీతులు చెప్తున్నట్లు ఉంటాయి. 

విరిగిపోయి ధ్వంసం కాబడిన ముక్కల్ని ఒకచోట ఉంచి "మ్యూజియం" నడుపుతోంది ప్రభుత్వం. ఆ మ్యూజియం చూస్తె హృదయం ద్రవిస్తుంది. మ్యూజియం చుట్టూ ఉన్న ఆవరణలో యుద్ధం లో కాళ్ళూ చేతులూ తెగి పడి ఉన్న సైనికులలాగా అనేక శిల్పాలు శిదిలావస్తలో వికలాంగుల లాగా పడి ఉండటం చూస్తె కళ్ళలో నీరు గిర్రున తిరిగుతుంది. కాళ్ళూ చేతులూ విరిగిన గణేశ విగ్రహాలు, బుద్ధ విగ్రహాలు, నిలువునా నరికివేయబడిన నంది విగ్రహాలు లెక్కలేనన్ని కనిపిస్తాయి. సంపదను దోచుకుంటే దోచుకున్నారు. కళాఖండాలను కూడా నాశనం చెయ్యటం ఏమిటో? వారిది అసలు మానవ జన్మేనా అని అసహ్యం కలుగుతుంది.   

ఈ రెండు ఆలయ సముదాయాలూ కట్టిన శిల్పరీతిని త్రికూట ఆలయనిర్మాణం అంటారుట. అంటే ఒక ఆలయంలో మూడు ఆలయాలు ఉంటాయి. అన్నీ కలిసి ఒకే కప్పు కింద ఉంటాయి. ఛాయా సోమేశ్వరాలయం లో ఉన్న రెండు స్తంభాల నీడా ఒక్కటిగా శివలింగం మీద పడుతూ లింగాకారం కప్పువరకూ ఉన్న భ్రాంతిని కలిగిస్తుంది. ఏ నెలలో అయినా సూర్యకాంతి ఒకే విధంగా పడుతూ ఈ రకమైన ఎఫ్ఫెక్ట్ ఏడాది పొడుగునా ఒకేలా ఉంటుంది.  సింపుల్ టెక్నిక్ తో దీనిని రాబట్టారు. 

పచ్చల సోమేశ్వరాలయంలోని రాతిని ఓరుగల్లు వద్ద దొరికే పచ్చ రాయితో కట్టించారని దానికా పేరు వచ్చిందట. ఈ ఆలయంలో ఒకరకమైన శాండ్ స్టోన్ తో తయారు చేసిన గణేశ విగ్రహం ఒకటి ఉంది. గట్టిగా పిసికితే ఆ రాయి పిండి అయిపోతుంది. అంత మెత్తని రాతిని ఎంత అద్భుతంగా చేక్కారంటే, గణపతి చేతిలోని లడ్డులో ఉండే రవ్వ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మధ్యనే ఇక్కడికి వచ్చిన హరిహర్ శృంగేరీ శంకరాచార్యస్వామి ఈ విగ్రహాన్ని చూచి "ఇది మహత్తరమైన విగ్రహం. దీనిని జాగ్రత్తగా కాపాడుకున్నంత వరకూ నల్లగొండకు ఏమీ భయం లేదు." అని చెప్పారట. 

నల్లరాతితో చెక్కిన నందివిగ్రహాల నునుపు ఎంత బాగుంటుందంటే నేటి ఆధునిక మిషన్లతో కూడా అటువంటి నునుపును తీసుకు రాలేము. చెన్న కేశవ స్వామి విగ్రహానికి ఉన్న కిరీటమూ మరియు ఆభరణాల పనితనం వర్ణించడానికి మాటలు చాలవు. రాతి చెక్కడంలో అంత సూక్ష్మమైన వర్క్ ను చెక్కడం అంటే ఎంతో అద్భుతం. ఆలయం గోడలపైన చెక్కిన ఏనుగుల బొమ్మలు నిజంగా అద్భుతం. ఆడుకుంటున్నవి, ఒకదానివేనుక ఒకటి పరిగేట్టుతున్నవి, యుద్ధం చేస్తున్నవి, ఇలా ఏనుగుల అనేక మూడ్స్ ను ఎన్నో శిల్పాలలో అద్భుతంగా చెక్కారు. అవీ ధ్వంసం అయి హృదయ విదారకంగా ఉన్నాయి. అటువంటి కళాఖండాలను ధ్వంసం చెయ్యడానికి మనసెలా వచ్చిందో ఆ రాక్షసులకు అని చాలా బాధ కలిగింది.

ఛాయా సోమేశ్వరాలయంలో పై కప్పు తొమ్మిది భాగాలుగా విభజించబడి ఉంది. వాటిలో ఒక్కొక్క భాగంలోనూ ఒక్కొక్క గ్రహం యొక్క యంత్రం పద్మాకారంలో చెక్కబడి ఉండటం గమనించాను. అంటే తొమ్మిది ఖాళీలలో నవగ్రహాల యంత్రాలు ఉన్నాయి. మధ్యలో ఉన్న సూర్య యంత్రంలో మధ్యలో సూర్యుణ్ణి ఉంచి చుట్టూ నవగ్రహాలను చెక్కారు. దానికేదో ఖగోళపరమైన  ఉపయోగం ఉందని అనిపించింది. 

ఈ ఆలయం ముందున్న కోనేటినుంచి నీరు కాలువల ద్వారా ఆలయంలోనుంచి ప్రవహిస్తూ తిరిగి మళ్ళీ కోనేటిలోకి చేరేటట్లు కట్టబడి ఉన్న కన్సీల్డ్ కాలువలు చూస్తె రీ సైక్లింగ్ అనేది వెయ్యి సంవత్సరాల నాటి ఆ రోజుల్లో కూడా ఉందా అని ఆశ్చర్యం కలిగింది.

బాలనాగమ్మ నాటకమూ, సినిమా మనకు తెలుసు. అందులో మాయలపకీరు బాలనాగమ్మను బంధించితే రాజు చివరకు విడిపిస్తాడు. ఆ కధ ఇక్కడే జరిగిందని స్థానికులు చెబుతారు. మాయల పకీరు ఇక్కడే ఛాయా సోమేశ్వరాలయం లో ఉండేవాడట. సినిమాలో చూపినట్లు అతను దుర్మార్గుడు కాదుట. ఈశ్వర ఉపాసకుడై ఉండి, తన శక్తులతో ప్రజలకు మేలు చేస్తూ ఈ ఆలయంలోనే ఉంటూ ఉండేవాడట. తరచుగా ఈశ్వర దర్శనానికి వచ్చే రాణిని చూచి మోహించి ఆమెను తన మంత్రశక్తులలో వశపరచుకుందామని ప్రయత్నించాడుట. అది తెలిసిన రాజు, మాంత్రికుణ్ణి తన కత్తికి బలిచేసాడని ఒక స్థానిక గాధ వినిపిస్తుంది. పాపం మాంత్రికుడు మంచివాడే. అతను అసలు మాంత్రికుడు కాదనీ, శైవ ఉపాసకుడనీ కూడా అంటారు.
కాకుంటే అతనికి రావణునికి ఉన్న బలహీనత లాటిదే ఉంది. తన స్థాయిని  మరచి ఏకంగా రాణినే మోహించేసరికి రాజు చేతిలో బలయ్యాడు. సినిమాకోసం దీన్ని చిలవలు పలవలుగా కథ అల్లి మూడు గంటలకు పెంచారు. వెయ్యి సంవత్సరాల క్రితం ఇక్కడ  శైవ మతం బాగా పరిడవిల్లింది అనడానికి రుజువులు చాలా కనిపిస్తాయి.

ఆలయంలో ఫోటోలు తీసుకుంటున్న సమయంలో నాలుగో ఐదో తరగతులు చదువుతున్న స్కూలు పిల్లలు ఒక ఇరవై మంది అక్కడకు వచ్చారు. మాకూ ఫోటోలు తియ్యండి అంకుల్ అని వాళ్ళడిగితే సరే అని కొన్ని ఫోటోలు తీశాను. "బాబూ మీరంతా బాగా చదువుకొని జీవితంలో పైకి రావాలి" అని వారితో చెప్పాను. అదే నే చేసిన తప్పు. వాళ్ళలో ఒక బొడ్డూడని కుర్రకుంక " ఎందుకు చదువుకోం సార్? తెలంగాణా వస్తే మేమూ బాగా చదువుకొని మంచిఉద్యోగాలు చేస్తాం.జై తెలంగాణా" అని నినదించాడు. అంతే. ఆ పిల్లలందరూ "జై తెలంగాణా, జై తెలంగాణా" అని ఒకటే గోల. అది చూసి నాకు నోట మాట రాలేదు. అంత చిన్న పిల్లలకు కూడా ఎంతగా ఈ పిచ్చిని నూరిపోశారో అనిపించింది.

ఇలాటి సైట్ ఒకటి అమెరికాలో ఉంటె దాన్ని ఎంత బాగా డెవెలప్ చేసి, ఒక టూరిస్ట్ సెంటర్ గా మార్చి ఉండేవారో కదా అనిపించింది. లక్షల కోట్లు స్విస్స్ బ్యాంకులలో మూలుగుతున్న డబ్బుతో ఇలాటి హెరిటేజ్ సైట్స్ బాగు చేస్తే ఎంత బాగుంటుంది? మన చరిత్ర ఎంత గొప్పదో, మన దేవాలయాలు ఎంత గొప్పవో, మన కళలు ఎంత గొప్పవో కనీసం ఈ తరాలకు తెలుస్తుంది. దిక్కూ మొక్కూ లేకుండా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఎంత శిల్ప సంపద ఇలా అఘోరిస్తున్నదో? ఇదంతా చూస్తుంటే ఛీ మనది ఎంత సిగ్గులేని జాతో అని అసహ్యం కలుగుతుంది. బానిస బతుకే మనకు కరెక్ట్. మన సంస్కృతీ వారసత్వాన్ని ఆస్వాదించే హక్కు మనకు లేదు అనిపించింది.

ముష్కరుల చేతుల్లో ముక్కలైన మన జాతిసంపదను మ్యూజియాల్లో పెట్టుకుని చూసుకుంటూ మురిసిపోయే ముదనష్టపు నిర్వీర్యత మన ముఖాలనుంచి ఎప్పుడు తొలగుతుందో? మన ప్రాచీన శిల్ప సంపదను, నాశనం అవుతున్న ఇతర కళా సంపదలను రక్షించుకుని వాటిని చూచి గర్వపడే రోజు ఎప్పుడొస్తుందో?
read more " పానగల్లు ఆలయాలు "

15, జులై 2011, శుక్రవారం

పంచవటి -- సత్య ప్రేమికుల, జిజ్ఞాసువుల సమూహం.

పంచవటి -- నిజమైన సత్య ప్రేమికుల, ఆధ్యాత్మిక జిజ్ఞాసువుల సమూహం. నా బ్లాగు చదువుతున్నవారికి ఈ గ్రూపు గురించి తెలుస్తుంది.  25-7-2010 గురుపూర్ణిమ రోజున పంచవటి గ్రూప్ మొదలైంది. అంటే నేటికి సరిగ్గా ఒక సంవత్సరం అయింది. 

ఈ ఏడాదిలో పంచవటిలో ఎన్నో మార్పులు వచ్చాయి. సభ్యుల ఆధ్యాత్మిక అవగాహన వేగంగా పెరిగింది. వారియొక్క అంతరిక పరిధి విస్తృతమైంది. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో వారికి అర్ధమైంది. ఆధ్యాత్మిక సాధనవైపు వారి ఆకాంక్ష బాగా పెరిగింది. ఏడాదిగా పంచవటిలో ఉంటూ అసంతృప్తికి లోనైనవారు ఎవ్వరూ లేరు. దీనిని సక్రమంగా ఉపయోగించుకుని అద్భుతమైన ఆద్యాత్మిక ప్రగతి సాధించినవారు మాత్రం ఉన్నారు.

ఊకదంపుడు చర్చలు కాక ఆచరణతో కూడిన అవగాహనను పెంపొందించేదీ, సత్యం వైపు అడుగులు వేయించేదీ, అయిన జిజ్ఞాసువుల సమూహమే పంచవటి. ఇక్కడ అహంకారులకూ, వితండవాదులకూ, ఊకదంపుడు పుస్తకజ్ఞానులకూ, పాండిత్య ప్రదర్శకులకూ  చోటు లేదు. పంచవటి అంటే, మనం చెయ్యలేని పనులను గురించి వ్యర్ధంగా  చర్చించుకుంటూ ఇతరులను తిట్టుకునే రచ్చబండ కాదు.ఆద్యాత్మికంగా ఎదగాలనుకునే వారికోసం ఉన్నతమైన సదుద్దేశ్యాలతో మొదలైన గ్రూప్ పంచవటి. 

ఇందులో చేరడానికి ఏదో గొప్ప లక్షణాలు అక్కరలేదు. విశాలభావాలూ, మర్యాదపూర్వకంగా విషయాన్ని చర్చించగలగడమూ, ఎదుటి మనిషిని గౌరవించడమూ, సత్యాన్ని తెలుసుకోవాలన్న తపనా, తెలుసుకున్నదానిని ఆచరణలో పెట్టగల ధైర్యమూ ఉంటే చాలు.

మౌన సభ్యులుగా ఉండేవారు పంచవటిలో ఇమడలేరు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాటలాడేవారూ ఇక్కడ ఇమడలేరు. నిత్యమూ తాము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, ఇతరులతో మర్యాదపూర్వకమైన, సంస్కారవంతమైన, అర్ధవంతమైన, ఉన్నతమైన చర్చలు చెయ్యగల వారే ఇక్కడ ఉండగలరు. ఇటువంటి లక్షణాలు మీకున్నాయా? అయితే పంచవటి లో చేరడానికి ఇదే ఆహ్వానం. 

ఆసక్తి ఉన్నవారూ, పై లక్షణాలున్నవారూ, గ్రూప్ లో చేరాలనుకుంటున్న వారూ నా e - mail కు వ్రాయండి.
read more " పంచవటి -- సత్య ప్రేమికుల, జిజ్ఞాసువుల సమూహం. "

6, జులై 2011, బుధవారం

ఇదీ ఒకరకమైన దివ్యదృష్టే

ఒక వ్యక్తి జీవితం లో అనుభవిస్తున్న రోగాలకూ, అతనికి అప్పుడు నడుస్తున్న గ్రహదశలకూ, అతని మనస్తత్వానికీ  అతనికి సూచింప బడుతున్న ఔషదాలకూ అవినాభావ సంబంధం ఉంటుంది. 

పరిశీలనగా గమనిస్తే ఈ లింకులన్నీ చక్కగా కనిపిస్తాయి. ఈ విధమైన పరిశీలనతో ఒక మనిషిని ఎంతో చక్కగా అర్ధం చేసుకోవచ్చు. ఒక్కోసారి ఒక మనిషిని చూడకుండానే ఇవన్నీ మన కళ్ళముందు దర్శించవచ్చు. దూరంనుంచే అతని జీవితాన్ని చదివినట్లుగా చెప్పవచ్చు. ఇదీ ఒక రకమైన దివ్యదృష్టే అని నేనంటాను. దీనికి రుజువుగా, ఈ మధ్య జరిగిన ఒక సంఘటన చెప్తాను.

మొన్నీ మధ్య నా స్నేహితుడు ఒకాయన వచ్చాడు. ఆయనిప్పుడు హైదరాబాద్లో పని చేస్తున్నాడు. అందుకని ఇంతకుముందు లాగా తరచూ కలవడం లేదు. 


"మా అమ్మాయికి పెళ్లి చేద్దామనుకుంటున్నా". అన్నాడు.
"మంచిదే. కానీయ్." అన్నాను.

"ఒక చిక్కొచ్చి పడింది. అందుకే నీ దగ్గరికి వచ్చాను." అన్నాడు.

"చెప్పు". అన్నాను.

"ఏం లేదు. పెళ్ళికొడుకు మా మేనల్లుడే. MBA చేసాడు. "శాప్" కోర్స్ చేసాడు. హైదరాబాద్లో పని చేస్తున్నాడు. కాని ఈ మధ్యన వింతగా ప్రవర్తిస్తున్నాడు. "  

"ఏమైందో వివరంగా చెప్పు." అన్నాను.

"కాన్సర్ ఉందని అతనికి ప్రగాఢ నమ్మకం. అన్ని టెస్టులూ  చేయించాము. మద్రాస్ కాన్సర్ ఆస్పత్రిలో చూపించాము. ఏమీ లేదని చెప్పారు. అయినా అతనికి అనుమానం మాత్రం పోలేదు."

"అతని బాధ ఏమిటి?" అడిగాను.

"ఏది తిన్నా వికారంగా ఉంటుంది. ఇమడదు. వాంతికి  వచ్చినట్లు అవుతుంది. అందుకని భయపడి ఏమీ తినడం లేదు. ప్రస్తుతం స్కేలేటెన్ లా తయారయ్యాడు. హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాస్త్రో ఎంటరాలజీ  డా|| నాగేశ్వర రెడ్డి గారికి చూపించాము. ఆయన అన్ని టెస్టులూ  చేసి, కొద్దిగా ఫాటీ లివర్ తప్ప ఇంకేమీ లేదు. నీకేమీ రోగం లేదు అని చెప్పాడు. అయినా మావాడు నమ్మడు. తనకు కాన్సర్ ఉందని అతనికి ప్రగాఢమైన విశ్వాసం. డాక్టర్లతో వాదిస్తాడు. ఏమీ లేకపోతే నాకీ వికారం ఎందుకుంది అంటాడు. మీరు చదువుకున్న చదువంతా తప్పు అంటాడు. నాకు కాన్సర్ ఉంది. అందుకే పెళ్లి చేసుకోను. మీ అమ్మాయి జీవితం నాశనం చెయ్యడం నాకిష్టం లేదు అంటాడు. ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు. రిపోర్టులు తెచ్చాను. చూడు." అన్నాడు.

రిపోర్టులు అన్నీ నార్మల్ గా ఉన్నాయి. కొద్దిగా ఫాటీ లివర్ తప్ప ఏమీ లేదు.

"అసలీ గోల ఎలా మొదలైంది." అడిగాను.

"ఒకరోజు ముఖం కడుక్కుంటుంటే నోట్లోంచి రక్తం పడింది. అప్పటినుంచీ ఈ వరస మొదలుపెట్టాడు. కొంత కాలం క్రితం ఇతని బాబాయి స్టమక్ కాన్సర్ తో చనిపోయాడు. అతనికి వీడే దగ్గరుండి అన్నీ సేవలు చేసాడు. అతను పడిన బాధలు అన్నీ చూచాడు. బహుశా తనకు కూడా అవే బాధలు ఉన్నాయని భ్రమలో ఉన్నాడేమో. పైగా ఇతనికి చైన్ స్మోకింగ్ అలవాటుంది. అలాటి వాళ్లకు నోట్లోంచి బ్లడ్ పడుతుంది. నేనూ ఒకప్పుడు సిగిరెట్లు బాగా తాగేవాన్ని. నాకూ కొన్నిసార్లు అలా బ్లడ్ పడేది. అది మామూలేరా. భయపడకు అని చెప్పాను. అయినా వీడు వినడం లేదు." అన్నాడు.  

"కావచ్చు. ఇప్పుడూ  తాగుతున్నాడా మరి.? అడిగాను

"లేదు. మానేశాడు. సైకియాట్రిస్ట్ దగ్గరికో, హిప్నాటిస్ట్ దగ్గరికో తీసికెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని అనుకుంటున్నాను. ఏమంటావ్ ?" అడిగాడు.

"శుద్ధ దండగ. ఆపని మాత్రం చెయ్యకు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళితే ట్రాన్క్విలైజర్స్ ఇస్తాడు. దాంతో మీవాడు మమ్మీ లాగా తయారౌతాడు. అప్పుడు మీవాడి పరిస్తితి పులిమీద పుట్ర అవుతుంది. " అన్నాను.

"మరేం చెయ్యమంటావ్. నీ సలహా చెప్పు" అన్నాడు.

ఈ అబ్బాయి లక్షణాలను  వింటూ ఉన్నప్పుడే అతని తత్త్వం నాకు అర్ధమైపోయింది. హోమియోపరంగా లోతైన అవగాహన ఉంటె మానవమనస్తత్వం చిటికెలో అర్ధమౌతుంది. అంతేగాక రోగి యొక్క కాన్స్టిట్యూషన్, అతనికి ఏ మందు సరిపోతుంది అన్న విషయాలు వెంటనే అర్ధమౌతాయి. అదేగాక దీనికి జ్యోతిశ్శాస్త్రం తోడైతే ఇక చెప్పాల్సిన పనే లేదు. వేలమైళ్ళ దూరాన ఎక్కడో ఉన్న మనిషి ఎదురుగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తాడు.

వెంటనే మనసులో గ్రహస్తోత్రం జపించి గమనించాను. ఈ సంభాషణ జరుగుతున్న సమయంలో చంద్ర హోర జరుగుతున్నది. అమావాస్య తర్వాత రెండురోజులు గడిచాయి. చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉన్నాడు. బుదునితో కలిసి ఉన్నాడు. వృశ్చికం లో ఉన్న రాహువుతో చూడబడుతున్నాడు. కనుక ఇతనికి మానసిక భ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అబ్సేస్సివ్ బిలీఫ్స్ ఎక్కువగా ఇతన్ని పీడిస్తున్నాయి. అవి మాత్రమె గాక  రోగం కూడా ఉన్నది. రాహు ప్రభావం వల్ల ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా  ఫలితం ఉండటం లేదు. మానసిక చింత, భయం వెంటాడుతూ ఉంటాయి.

"నేను కొన్నిప్రశ్నలు అడుగుతాను జవాబులు చెప్పు" అన్నాను.

"అడుగు"  అన్నాడు మిత్రుడు.

"మీ వాడికి ఆదుర్దా ఎక్కువ. అవునా ?"

"అవును."

"అనుమానం బాగా ఎక్కువ. ప్రతిదాన్నీ అనుమానిస్తాడు. కంగారు పడిపోతూ ఉంటాడు.అవునా?"

"నిజమే. తనను తానే నమ్మడు. అన్నీ అనుమానాలే. గదికి తాళం వేసి బయటకు వెళుతూ కూడా తాళం వేశానా లేదా అని అనుమానంతో మళ్ళీ వెనక్కు వచ్చి చూసుకుంటాడు." అన్నాడు.

"ఏదైనా ఫంక్షన్ కు వెళ్ళాలన్నా, ప్రయాణం పెట్టుకున్నా, మాటమాటకీ బాత్రూం కి వెళ్ళవలసి వస్తుంది. అవునా?"

"ఈ సంగతి నాకు తెలీదు. కనుక్కుంటాను."-- అని వాళ్ళ చెల్లెలికి ఫోన్ చేసాడు. నేను చూస్తూ ఉన్నాను. ఫోన్ పెట్టేసి-- "అలాటిదేమీ లేదని మా చెల్లెలు చెప్పింది." అన్నాడు. 

"కొన్ని విషయాలు తల్లికి, తండ్రికి కూడా తెలీవు. వాళ్ళు అంతగా గమనించక పోవచ్చు. ఆ అబ్బాయినే డైరెక్ట్ గా అడగండి." అని చెప్పాను.

సరే అని, అతనికే ఫోన్ చేసాడు. హైదరాబాద్ లో ఉన్న మేనల్లుడు ఫోన్ ఎత్తాడు. అతనితో మాట్లాడుతూ నా వైపు తిరిగి,

"నిజమే వాడికి ఆ అలవాటు ఉందట." అన్నాడు.  
"అది అలవాటు కాదు. రోగలక్షణం" అన్నాను. "ఇంకొక్క   ప్రశ్న. ఫోన్ కట్ చెయ్యకు. అతనికి స్వీట్లు ఎక్కువగా తినాలని అనిపిస్తుందా అడగండి." అన్నాను. 

"అదీ నిజమే. ఒకప్పుడు తినేవాన్ని. ఇప్పుడు తింటే వికారంగా ఉంటుంది. అయినా నేను స్వీట్లు ఇష్టపడతానని  మీకెలా తెలుసు? " అని అవతలి నుంచి జవాబు వచ్చింది.
"స్టేజి ఫియర్ ఉందా మీ వాడికి. కనుక్కో ?" అడిగాను.
"ఉంది. స్టేజి ఎక్కి మాట్లాడాలంటే కాళ్ళూ చేతులూ వణుకుతాయి." అవతలనుంచి జవాబు వచ్చింది.

ఫోన్ పెట్టేసి మా ఫ్రెండ్ కొద్ది సేపు మాట్లాడలేదు. " మా వాడిని నువ్వు చూడలేదు కదా. ఇదంతా ఎలా చెప్పగలిగావ్. ఏమిటీ వింత?" అడిగాడు. 

"నాకు దివ్యదృష్టి ఉంది. దాంతో చూచి చెప్పాలే." అన్నా నవ్వుతూ.  "ఎలా చెప్తే నీకెందుకు గాని మీ వాడికి రోగం ఉన్నమాట వాస్తవం. అయితే అది కాన్సర్ కాదు. మంచి హోమియో ట్రీట్మెంట్ ఇప్పించు తగ్గుతుంది." అని చెప్పాను. 

"ఆ రోగం పేరు ఏమిటో చెప్పు." అడిగాడు.

"దానికి నామకరణ మహోత్సవం చెయ్యాల్సిన ఖర్మ మనకెందుకు? యాంగ్జైటీన్యూరోసిస్ అనో అబ్సేస్సివ్ కంపల్సరీ డిసార్డర్ అనో ఏదోఒకటి ప్రస్తుతానికి పిలుచుకో. " అన్నాను.

"మరిచిపోయాను. మావాడి జాతకం రాయించాను చూడు." అని ఒక జాతక చక్రం నా చేతిలో పెట్టాడు. 

మా స్నేహితుడు ముస్లిం మతానికి చెందినవాడు. అయినా కొన్నేళ్ళ నా సాంగత్య దోషం (?) వల్ల చాలావరకూ హిందూ పద్దతులు పాటిస్తాడు. జాతకాలు, ముహూర్తాలు, వాస్తు అన్నీ నమ్ముతాడు. అందుకే మేనల్లుడి జాతకాన్ని రాయించి మరీ తీసుకొచ్చాడు.

ప్రస్తుతం మేనల్లుడి జాతకంలో శుక్ర/శని దశ జరుగుతున్నది. శుక్రుడు యూరినరీ ఆర్గాన్స్ కు అధిపతి. శుక్రునిపైన శని యొక్క ప్రభావం వల్ల కంగారు, భయం దానివల్ల మాటిమాటికీ ఒంటేలుకు పోవడం ఉంటాయి. శుక్రుని యొక్క లోహం వెండి. ప్రస్తుతం ఇతనికి ఇండికేట్ అయిన హోమియో ఔషధం పేరు " అర్జెంటం నైట్రికం " అంటే "సిల్వర్ నైట్రేట్" అన్నమాట. శుక్రుని దశలో, శుక్రుని కారకత్వ అవయవాలలో వచ్చిన రోగానికి, శుక్రుని లోహం అయిన వెండికి సంబంధించిన ఔషధం ఇతనికి సూచింప బడుతున్నది. ఇంతకంటే విచిత్రం ఇంకెక్కడుంటుంది? ఇటువంటి విచిత్రాలు చూచినప్పుడు, ఎంత లోతైన పరిశీలనతో గ్రహాలకు లోహాలకూ ఉన్న సంబంధాన్ని ప్రాచీనులు వ్రాసిపెట్టారో అని ఆశ్చర్యం కలుగుతుంది. 

"మీ వాడికి హైదరాబాద్ లో మంచి హోమియో ట్రీట్మెంట్ ఇప్పించు. తప్పకుండా తగ్గుతుంది. ఆ భయం పోతుంది. తరువాత పెళ్లి చెయ్యి. అంతా సర్దుకుంటుంది." అని చెప్పి మా మిత్రున్ని పంపేశాను.

ఇండికేట్ కాబడిన మందు లక్షణాలనూ, హోరానాధుడు సూచించిన లక్షణాలనూ కలిపి అతని రోగాన్నీ మనస్తత్వాన్నీ ఈ విధంగా కళ్ళకు కట్టినట్లుగా చదవడం సాధ్యం అయింది.

ఈ విధంగా ఔషదాలకూ, గ్రహాలకూ, దశలకూ, మానవ మనస్తత్వానికీ, రోగాలకూ, అలవాట్లకూ సంబంధాలు ఉంటాయి. ఒక మనిషిని చూడటం తోనే, లేక అతని వివరాల గురించి వినడంతోనే అతనికి జరుగుతున్న దశలూ, అతన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్న గ్రహమూ, తద్వారా అతని అలవాట్లూ, ఆ సమయంలో అతన్ని పీడిస్తున్న రోగాలూ, అతనికి ఏ మందు పని చేస్తుంది అన్న విషయమూ, అతని భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న విషయమూ, అతని జీవితమూ సమస్తం ఈ విధంగా  తెలుసుకోవచ్చు. 

ఇదీ ఒకరకమైన దివ్యదృష్టే  మరి. కాదంటారా?
read more " ఇదీ ఒకరకమైన దివ్యదృష్టే "

4, జులై 2011, సోమవారం

హోమియో అద్భుత విజ్ఞానం-2

వారం తిరక్క ముందే BHMS ప్రత్యక్షమయ్యాడు. అతని జిజ్ఞాసకు నాకు ముచ్చటేసింది.

" ఆలోచించావా?  ఏం అర్థమైంది? చెప్పు" అని అడిగాను.  

" ఆ సూత్రంలో ఏ ప్రత్యేకతా లేదు సార్. రోగాన్ని నయం చెయ్యడం వైద్యుని కర్తవ్యం అని హన్నేమాన్ చెప్పాడు అంతే కదా. ఇది ప్రతి వారికీ తెలిసిందే. ఇందులో విశేషం ఏముంది?" అన్నాడు. 

"సరే. నీకు అర్ధం కాలేదని నాకర్ధమైంది. చెప్తాను విను." అంటూ ఇలా చెప్పాను. 

"మొదటి సూత్రంలోని పదాలను హన్నేమాన్ వంటి ఘనవైద్యుడూ మేధావీ బహుముఖ ప్రజ్ఞాశాలీ ఆషామాషీగా ఎంచుకొని ఉండడు. ఒప్పుకుంటావా?"

"అవును"

ఇప్పుడు మొదటి సూత్రంలోని ఈ పదాలను మనం ఒక్కసారి ఆలోచిద్దాం. 

1.Physician's high and only mission.
2.Restore the sick to health.
3.To cure.

ఇందులోని మొదటి లైన్ లో హన్నేమాన్ వాడిన పదాలు జాగ్రత్తగా గమనించు. high and only mission అన్నాడు కాని "వైద్యుని పని" అని మామూలు మాటలు అనలేదు. ఉన్నతమైన మరియు ఏకైక ఆశయం అన్నాడు. అంటే వైద్యునికి "ఉన్నతమైన" ఆశయం ఉండాలి. రోగికి స్వస్థత చేకూర్చాలి అన్న "ఏకైక" ఆశయం అతనికి ఉండాలి. ఈ ఒక్క వాక్యంలో మెడికల్ ఎథిక్స్ మొత్తాన్నీ హన్నేమాన్ పొందుపరచాడు. 

అంటే అనవసర టెస్టులు చేయించి కమీషన్ల రూపంలో డబ్బు గుంజటం, అనవసరమైన మందులు వాడి ఒళ్ళు గుల్ల చెయ్యటం, కుల సంఘాలు పెట్టి ఒక్క కులానికే పరిమితం కావడం, సాటి డాక్టర్లతో కలిసి మల్టిస్పెషాలిటీ ఆస్పత్రులు పెట్టి పేషంటును వాళ్ళలో వాళ్ళు ఫుట్ బాల్ ఆడుకోవడం, అవసరం లేకపోయినా డబ్బులకు కక్కుర్తి పడి ఆపరేషన్లు చెయ్యడం, లక్షలు పోసి కొన్న మిషన్ల డబ్బు రాబట్టడం కోసం ఆయా టెస్టులు చేయించడం, తరువాత నీకేమీ రోగం లేదు అని చెప్పడం-- ఇటువంటి నీచమైన ఉద్దేశాలు వైద్యునికి ఉండరాదు అని హన్నేమాన్ చెప్తున్నాడు. 

రోగి మనవద్దకు నమ్మకంతో వస్తాడు. అతన్ని మోసం చేసి  జేబు ఖాళీ చేసి ఆ డబ్బుతో మనం బాగు పడితే ఆ ఉసురు మనకు తగులుతుంది. అంతే కాదు. ఇంకొందరు ఇంకా వికృత చేష్టలు చెసే వైద్యులున్నారు. తమ వద్దకు వచ్చిన స్త్రీ రోగులను వలలో వేసుకుని ఆడించే వాళ్ళున్నారు. ఇదే ఊళ్ళో అలాటి వైద్యులు బోలెడు మంది ఉన్నారు. అలాటి నీచపు పనులు వైద్యునికి పనికి రావు అని మొదటి సూత్రం లోనే హన్నేమాన్ స్పష్టంగా చెప్పాడు. మెడికల్ ఎథిక్స్ మొత్తాన్నీ ఒక్క మాటలో సూచించాడు. ఇది ఈ సూత్రంలోని మొదటి భాగం మాత్రమె అని గమనించు. ఇంకా ఉంది.

"ఇక రెండవ భాగంలో ఆయనేం చెప్పాడో విను. Cure is restoring the sick to health అన్నాడు. ఈ మాటలో-- వ్యాధి అంటే ఏమిటి? ఆరోగ్యం అంటే ఏమిటి? నయం చెయ్యడం అంటే ఏమిటి? అన్న మూడు విషయాలు గుప్తం గా సూచించాడు. అర్ధం అవుతున్నదా ?" అడిగాను 

"అర్ధం అవుతున్నది " అని తలాడించాడు BHMS.

మొదటగా ఆరోగ్యం అంటే ఏమిటో చూద్దాం. అల్లోపతీ చెప్పినట్లు మనిషి ఒక యంత్రం కాదు. అతనిలో మనసుంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. ఆఫ్ కోర్స్. మనసునూ ప్రాణాన్నీ అల్లోపతిలో ఒప్పుకోరు. అది వేరే విషయం. కానీ ఈ మూడింటిలో ఎలాటి వైకల్యం వచ్చినా అది వ్యాధి కిందే లెక్క. మనస్సులో వికృత ఆలోచనలు వస్తే అది మానసిక స్థాయిలో వ్యాధి. ప్రాణ స్థాయిలో వైకల్యం వస్తే అది ప్రాణిక స్థాయిలోని  వ్యాధి. శరీరంలో మార్పులు వచ్చినపుడు అది శరీర స్థాయిలోని వ్యాధి. ఈ మూడు స్థాయిలూ సమతూకంలో ఉన్నప్పుడు ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యానికి పరిపూర్ణమైన హోలిస్టిక్ నిర్వచనం ఇదే. 

హన్నేమాన్ రెండు వందల సంవత్సరాల క్రితమే ఈ నిర్వచనం ఇచ్చాడు. హన్నేమన్ ఎప్పుడో చెప్పిన నిర్వచనానికి  మోడరన్ మెడిసిన్ ఈనాడు దగ్గరగా వస్తున్నది. సైకో-సోమాటిక్ డిసీజెస్ అన్న కాన్సెప్ట్ ను ఇప్పుడిప్పుడే మోడరన్ మెడిసిన్ అర్ధం చేసుకుంటున్నది. ఈ కాన్సెప్ట్ ను హన్నేమాన్ రెండువందల ఏళ్లనాడే చెప్పాడు. హన్నేమాన్ మేధస్సుకు ఇదే తార్కాణం.  అల్లోపతీ మనిషి శరీరాన్ని మాత్రమె గుర్తిస్తుంది. ప్రాణాన్ని ఒప్పుకోదు.  ఇక మనసుకైతే అల్లోపతీలో  విలువే లేదు. ఇదే అల్లోపతీ వైద్యంలోని భయంకరమైన లోపం. ఇంగ్లీషు వైద్యం మనిషిని ఒక పశువుగా చూస్తుంది. హోమియో వైద్యశాస్త్రం మాత్రమె మనిషిని మనసున్న వాడిగా గుర్తిస్తుంది.

ఇప్పుడు రోగం అంటే ఏమిటో చూద్దాం. శరీర, ప్రాణ, మనో స్థాయిలలో వైకల్యమే రోగం అని అర్ధం చేసుకున్నాం. ఈ నిర్వచనాన్ని ఇంగ్లీషు వైద్యం ఒప్పుకోదనుకో. అది వేరేసంగతి. అసలు ఈ వైకల్యం ఎందుకు కలుగుతున్నది అనేది చూద్దాం? వైరస్, బాక్టీరియా, ఫంగస్ మొదలైన మైక్రో ఆర్గానిజమ్స్ దీనికి కారణం అని అల్లోపతీ చెబుతున్నది. కాని ఒక్క విషయం గమనించాలి. మనలో రెసిస్టన్స్ పవర్ గట్టిగా ఉంటె ఏ వైరస్సూ ఏమీ చెయ్యదు. ఎపిడెమిక్ రోగాలు వచ్చినపుడు కూడా ఒక ఇంట్లో పదిమంది ఉంటె పదిమందికీ రావు. కొంత మందికి వాటినుంచి నేచురల్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఒక ఏరియాలో ఏదైనా ఎపిడెమిక్ ప్రబలినప్పుడుకూడా అక్కడ అందరూ చనిపోరు. చాలామంది అక్కడ ఉన్నవాళ్ళే ఆ వ్యాధి బారిన పడనివారు కూడా ఉంటారు. మలేరియా, టైఫాయిడ్, టీ బీ, కుష్టు మొదలైన రోగాలు కూడా అందరినీ ఎటాక్ చెయ్యవు. వీక్ రెసిస్టన్స్ ఉన్నవారినే అవి ఎటాక్ చేస్తాయి. అలాగే ఎయిడ్స్ కూడా. భర్త ఎయిడ్స్ తో చనిపోతే, భార్యకు నెగటివ్ వచ్చిన కేసులు ఎన్నో ఉన్నాయి. 

మన చుట్టూ కోట్లాది మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. మనం తాగే నీటిలో, మనం తినే తిండిలో, పీల్చే గాలిలో కూడా ఉంటాయి. అంతెందుకు మన ఇంటేస్టైన్స్ లో కోట్లాది బాక్టీరియా ఉంటుంది. అది మనకు హాని చెయ్యడం లేదే. కనుక నిజానికి మైక్రో అర్గానిజమ్స్ రోగకారణాలు కావు. మనిషిలోని ప్రాణశక్తి క్షీనించడమే అసలైన రోగకారణం. అల్లోపతీ దీనిని ఒప్పుకోదు. అల్లోపతీ దృష్టిలో ప్రాణం అనేది లేదు. కనుక దాని దృష్టిలో సూక్ష్మ క్రిములే వ్యాధి కారకాలు. ఇది పూర్తిగా పొరపాటు అభిప్రాయం.

ఇప్పుడు "నయంచెయ్యడం" అంటే ఏమిటో అర్ధం చేసుకుందాం. వైకల్యం చెందిన ప్రాణ శక్తిని తిరిగి పునః స్థాపించడమే రోగ నిదానం. దీనినే restore అన్న పదంతో హన్నేమాన్ సూచించాడు. అల్లోపతీ వైద్యం లో ఈ restoration అన్నది ఎన్నటికీ జరుగదు. అక్కడ జరిగేదల్లా సూక్ష్మ క్రిములను చంపడమే. ఈ క్రమంలో మన శరీరంలోని  మంచి బాక్టీరియా, దానితో బాటు శరీరంలోని కణాలూ కూడా చస్తాయి. ప్రాణ శక్తికి మాత్రం బలం రాదు. పైగా ఇంకా క్షీణిస్తుంది. అందుకే అల్లోపతీ మందులు జీవితాంతం వాడుతూనే ఉండాలి. అంతకంతకూ ఇంకా తీవ్ర స్థాయికి చెందిన వ్యాధులు కాలక్రమేణా వస్తుంటాయి.

ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. టైఫాయిడ్ వ్యాధి వచ్చిన ఒక రోగికి అల్లోపతీ వైద్యం చేసి టెంపరేచర్ వెంటనే తగ్గిస్తారు. కాని అతనికి కొన్ని వారాల పాటు ఓపికా, ఆకలీ ఉండవు. ఎందుకని? రోగం అనేది పూర్తిగా తగ్గిపోతే, అతని ఆకలీ, నిద్రా, ఓపికా అన్నీ సక్రమంగా ఉండాలి. అలా ఉండటం లేదు అని మన అనుభవంలో మనం చూడవచ్చు. అంటే అతనికి ఒక్క టెంపరేచర్ మాత్రమె తగ్గింది కాని రోగం పూరిగా నయం కాలేదు. దానికోసం కొన్ని వారాల పాటు టానిక్కులూ, విటమిన్సూ వాడుతూ ఉండాలి. అది పర్ఫెక్ట్ క్యూర్ కాదు. కొన్ని వారాల తర్వాతా కూడా అతను నీరసంగా కనిపిస్తూనే ఉంటాడు. ఏంటీ. అలా ఉన్నావ్. టైఫాయిడ్ తగిలి లేచావా ? అని చూచిన వాళ్ళు అడుగుతుంటారు. అంటే ఇది రోగం యొక్క అణచివేత మాత్రమె గాని నయం చెయ్యటం కాదు. కనుకనే జ్వరం తగ్గినాకూడా రోగికి సుఖంగా ఉండదు. 

ఈ సుఖం లేకపోవడం అన్న ఒక్క లక్షణాన్ని బట్టి అతనికి పూర్తిగా తగ్గలేదు అని చెప్పాలి. హన్నేమాన్ దృష్టిలో ఇది రోగనిదానం కానే కాదు. మోసపూరితమైన అణచివేత మాత్రమె. రోగికి మానసికంగా, ప్రాణికంగా , శారీరికంగా హాయిగా ఉన్నపుడే రోగం పూర్తిగా తగ్గినట్లు లెక్క. ఈ పని ఒక్క హోమియోపతి మాత్రమె చెయ్యగలదు. హోమియో ఔషధాలతో నీకు రోగం తగ్గినపుడు ఏ స్థాయిలోనూ నీకు అసౌకర్యం ఉండదు. నీరసం ఉండదు. ఫాలో అప్ గా ఏ విధమైన టానిక్కులూ వాడనవసరం లేదు. నిజమేనా కాదా? ప్రశ్నించాను.

" నిజమే సార్ " అన్నాడు. 

" To restore the sick to health అన్న మాటల్లో గూడార్ధం ఉంది. రోగాన్ని నయం చెయ్యడంలో వైద్యుని యొక్క దృష్టి రోగం మీద కంటే రోగిమీద ఉండాలి. వైద్యుడు రోగి యొక్క స్థితిని బాగుచెయ్యాలి. అంతే కాని రోగ క్రిముల్ని డైరెక్ట్ గా  చంపడం వైద్యుని పని కాదు. రోగి యొక్క ప్రాణశక్తికి బలం ఇవ్వగలిగితే బాగుపడిన ఆ ప్రాణశక్తి రోగక్రిముల్ని తనంతట తానే సులభంగా తొలగిస్తుంది. ప్రాణానికి సాధ్యం కానిది లేదు. That is why we say, in Homoeopathy, we treat the patient not the disease. Nevertheless, the disease gets cured effortlessly. మనకు రోగంకంటే రోగియొక్క ప్రాణస్థితి  ముఖ్యం. ఇది వినడానికి ఏదోగా ఉంటుంది. కాని అన్ని సత్యాలలాగే ఇది కూడా త్వరగా అర్ధం కాదు. 

To restore the sick to health అనేబదులు to remove the disease అన్న పదం హన్నేమాన్ ఎందుకు వాడలేదో ఆలోచించు. ఆయన యొక్క ఎంఫసిస్ మొదటి సూత్రం నుంచీ రోగియొక్క ప్రాణస్థితి  మీదే ఉంది కాని, రోగం మీద లేదు. రోగిని తన స్వస్థ స్థితికి పునరుద్ధరించడమే క్యూర్ అన్న అద్భుత నిర్వచనం హన్నేమాన్ ఇక్కడ ఇచ్చాడు. ప్రస్తుతం జనం బాధ పడుతున్న ఏ రోగాన్నైనా తీసుకో. 

ఉదాహరణకు డయాబెటిస్ ను తీసుకో. జీవితాంతం మందులు వాడుతూ బాధ పడుతూ ఉండటం restoration ఎలా అవుతుంది? అక్కడ రోగం నయం కావడం లేదు. అంతకంతకూ పెరిగి కాలక్రమేణా ఇతర అనేక బాధలకు కారణం అవుతున్నది. కనుక, వైకల్యం చెందిన ప్రాణశక్తి తిరిగి పునస్థాపితం కాబడటం లేదు. అందుకే రోగి జీవితాంతం మందులు వాడవలసి వస్తున్నది. జనం అదే అసలైన ట్రీట్మెంట్ అన్న భ్రమలో ఉంటారు. హన్నేమాన్ దృష్టిలో  ఇది సరియైన క్యూర్ కాదు. కొన్ని రోగాలకు మందు లేదు అని అల్లోపతీ లో చెప్పే మాట చేతగాక చెప్పే మాటేగాని మరొకటి కాదు. ఇంగ్లీషు వైద్యం చేతులెత్తేసిన అనేక రోగాలు హోమియోపతిలో పూర్తిగా నయం అవుతాయి. అల్లోపతీ లో దేనికి మందుందో చెప్పు. జలుబుకూ లేదు, కాన్సర్ కూ లేదు. ఈ స్పెక్ట్రం  మధ్యలోని ఏ రోగానికీ అందులో పర్ఫెక్ట్ క్యూర్ లేదు. ఆలోచించు.
   
"కనుక ఇప్పుడు చెప్పు. హన్నేమాన్ చెప్పిన మొదటి సూత్రంలోనే ఎంత లోతైన హోమియో తత్వ శాస్త్రాన్ని నిగూడంగా  ఇమిడ్చి చెప్పాడో ఇప్పుడు అర్ధమైందా?  రోగం అంటే ఏమిటి? ఆరోగ్యం అంటే ఏమిటి? క్యూర్ అంటే ఏమిటి? అన్న విషయాలనే కాక, వైద్యుడు ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలి? ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడై ఉండాలి? అన్న విషయాలను హన్నేమాన్ ఈ ఒక్క సూత్రంలో చెప్పాడు. ఇప్పుడు ఈ సూత్రంలోని లోతు అర్ధమైందా?" అడిగాను.

"అర్ధమైంది. హన్నేమాన్ ఎంతటి మేధావో ఇప్పుడు కొద్ది కొద్దిగా అర్ధమౌతున్నది సార్. మొదటి సూత్రంలోనే ఇంత లోతుంటే ఇక ఆర్గనాన్ లోని వందలకొలదీ సూత్రాలలో ఎంత విజ్ఞానాన్ని ఆయన పొందుపరచాడో కదా." అని ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు BHMS.

"అందుకే గదా. హోమియోపతీ మాత్రమే అసలైన, నిజమైన వైద్య శాస్త్రం అని తెలిసిన వాళ్ళు నమ్ముతారు." అన్నాను. 

" బాగుంది సార్. డౌట్స్ వచ్చినపుడు మీ దగ్గిరికి వచ్చి  అడుగుతుంటాను. మీకు చెప్పటానికి వీలౌతుందా సార్. "అడిగాడు.

"యు ఆర్ మోస్ట్ వెల్కం. హన్నేమాన్ చెప్పిన సూత్రాలను తూచా తప్పకుండా పాటించావంటే నీకు గొప్ప వైద్యుడు అన్న పేరు రావటం ఖాయం. ముఖ్యంగా ఆయన చెప్పిన మెడికల్ ఎథిక్స్ ను గట్టిగా గుర్తుంచుకో. ట్రీట్ మెంట్ విషయంలో నీకు ఏ డౌటు వచ్చినా నిరభ్యంతరంగా నన్ను కలువు. ఏ పరిస్తితిలోనూ పేషంట్లను మోసం చెయ్యకు."  అని అతనికి వీడ్కోలు పలికాను.
read more " హోమియో అద్భుత విజ్ఞానం-2 "

1, జులై 2011, శుక్రవారం

హోమియో అద్బుత విజ్ఞానం

హోమియోపతి నాలుగో సంవత్సరం చదువుతున్న ఒక BHMS విద్యార్ధి ఆమధ్య నాతో మాట్లాడాలని వచ్చాడు.

1990 - 95 మధ్యన పొన్నూరు వాస్తవ్యులైన డా|| పీ వీ గోపాలరావు గారి దగ్గర నేను హోమియోపతీని చాలా సీరియస్ గా ఒక తపస్సులాగా అధ్యయనం చేసాను. ఆయన మద్రాస్ హోమియో మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. సమాజంలో హోమియోపతి యొక్క గొప్ప విజ్ఞానాన్ని పంచాలనే సదుద్దేశంతో విజయవాడ లో "హన్నేమాన్న్ హోమియో స్టడీ సర్కిల్" అని ఆయన పెట్టిన సంస్థ ఒకటి ఉండేది. అందులో నేను చేరి హోమియోపతిని పట్టుదలగా అధ్యయనం చేశాను.

అతి త్వరగా ఆ సిద్ధాంతాలలో నాకు పట్టు చిక్కినందువల్ల నన్ను ఆయన బాగా అభిమానించేవారు. అప్పట్లోనే BHMS గ్రాడ్యుయేట్లు సబ్జెక్ట్ ను శుద్ధంగా నేర్చుకోటానికి ఆయన వద్దకు వచ్చేవారు. "అపర హన్నేమాన్" అని ఆయనకు పేరుండేది. హోమియోపతిని ఆయన బోధించే తీరు చాలా విలక్షణంగా ఉండేది. ఆర్గనాన్ లోని అంతరార్ధాలను ఆయన వివరించే తీరు అద్భుతంగా ఉండేది. అప్పట్లో నాతో బాటు నేర్చుకున్న ఒక సహాధ్యాయి నా గురించి చెపితే విని నన్ను కలుద్దామని ఈ అబ్బాయి ఇక్కడకు వచ్చాడు.

తనకు క్లినికల్ అనుభవం ఏ మాత్రమూ లేదనీ, సబ్జెక్ట్ లోతులు ఎవరూ చెప్పడం లేదనీ, మొత్తం తామే చదువుకోవలసి వస్తున్నదనీ, ఒక సామాన్యజ్వరాన్ని కూడా శుద్ధంగా తాము ట్రీట్ చెయ్యలేకపోతున్నామనీ అతను వాపోయాడు. ఒకప్పుడు నేనూ ఇతని లాగా సబ్జెక్ట్ చెప్పగలిగిన గురువుల కోసం తపనతో వెతికినవాణ్ణే గనుక అతని బాధ నాకు అర్ధమైంది.

మామూలుగా డాక్టర్లకు ఉండే అహంకారం ఇతని దగ్గర కనిపించలేదు. పైగా వినయమూ, నేర్చుకుందామనే తపనా కనిపించాయి. కనుక ఇతనితో మాట్లాడదామని నాకూ అనిపించింది. ఇతని దగ్గర సబ్జెక్టు ఎంత ఉందొ తెలుసుకుందామని కొన్ని ప్రశ్నలు వేశాను.

హన్నేమాన్ వ్రాసిన "ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్" లో ఉన్న పేరాలను ఎఫోరిజమ్స్ ( సూత్రాలు ) అని ఎందుకన్నారు? అని ప్రశ్నించాను.

"తెలీదు. దానికి ప్రత్యేకమైన కారణం ఉండక పోవచ్చు. " అని జవాబిచ్చాడు BHMS.

సరే. ఆర్గనాన్ లో మొదటి సూత్రాన్ని చెప్పగలవా? అడిగాను.

ఏమీ జవాబు లేదు. బ్లాంక్ గా చూస్తున్నాడు.

సరే నేను చెప్తాను విను అంటూ ఇలా చెప్పాను." The physician's high and only mission is to restore the sick to health, to cure, as it is termed. అంతేనా."

"అవును" అన్నాడు ఆశ్చర్యంగా.

హోమియోపతి సిద్దాంతం చాలా వరకూ ఈ మొదటి సూత్రం లోనే దాగి ఉన్నదంటే నమ్మగలవా ? అడిగాను.

అతను అనుమానంగా చూచాడు. "ఇందులో ఏమి విశేషం ఉంది సార్. ఇది చాలా సింపుల్ సూత్రం. అందరికీ తెలిసిందే కదా." అన్నాడు.

"అదే నాయనా రహస్యం. మామూలు పేరాలను సూత్రాలని పిలవడం లో ఉన్న రహస్యం అదే. అనల్పమైన అర్ధాన్ని అల్పమైన మాటల్లో పొదిగి చెప్పడమే సూత్రం అంటే. సూత్రానికి భాష్యం అవసరం. లేకుంటే అర్ధం కాదు. అలాగే ఈ సూత్రాలకూ వివరణాత్మకమైన అర్ధాలున్నాయి. వాటిని తెలుసుకుంటే నీవు ఆశ్చర్య పోతావు." అన్నాను.

"అందుకే గదా సార్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. చెప్పండి మరి " అడిగాడు.

"నేను ఇప్పుడే చెప్పను. ఈ సూత్రాన్ని బాగా ధ్యానం చేసి, ఆలోచించి, ఒక వారం తర్వాత వచ్చి నీకేమి అర్ధమైందో చెప్పు. అప్పుడు దాని అసలైన అర్ధాన్ని నేను చెప్తాను." అని అతన్ని పంపించేసాను.

(మిగతా వివరాలు వచ్చే భాగం లో)
read more " హోమియో అద్బుత విజ్ఞానం "