“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

బహుముఖ ప్రజ్ఞా శాలి- భానుమతీ రామకృష్ణ


"మల్టీ ఫేసేటేడ్ క్వీన్ అఫ్ ఇండియన్ సినెమా" అన్న ఒక్క మాటలో భానుమతి గారికి చక్కగా నిర్వచనం ఇచ్చారు ఎవరోగాని. ఒక వ్యక్తిలో సంగీతం, సాహిత్యం, నటనా వైదుష్యం,కార్య నిర్వహణా దక్షత, దర్శకత్వ ప్రతిభా, ఎడిటింగ్ నైపుణ్యం, పాటలు వ్రాయడం, సంగీతం సమకూర్చడం, స్టూడియో నిర్వహణా, మంచితనం, మానవత్వం, ధైర్యం --ఇలా అన్నన్ని సుగుణాలు ఎలావచ్చాయో అని ఆలోచిస్తే అది భగవద్దత్తం అని అనిపించక మానదు.

ఆమెకు జ్యోతిష్య, సాముద్రిక శాస్త్రాలలో మంచి అనుభవం ఉందన్న సంగతి బయటి వారికి కొద్ది మందికే తెలుసు.1950 ప్రాంతాల్లోనే ఆమె నాడీ గ్రందాల మీద పరిశోధన చేసారంటే ఈనాడు చాలామంది నమ్మలేరు. కానీ అది సత్యం. ఎమ్జీ ఆర్ కు రాజపరిపాలనాయోగం ఉందని ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఇరవై ఏళ్ల ముందే షూటింగ్ విరామ సమయంలో చేతిరేఖలు చూచి చెప్పిన సాముద్రిక వేత్త భానుమతి గారు. సంగతి ఆమె మరచి పోయినా, తాను ముఖ్యమంత్రి అయినసమయంలో ఎమ్జీ ఆర్ ఆమెకు గుర్తు చేసారట.

అంతేకాదు ఆమె శ్రీ విద్యోపాసకురాలనీ బాలా, నవాక్షరీ మంత్రాలను శృంగేరి శంకరాచార్యులూ మహా తపస్వులూ అయిన అభినవవిద్యాతీర్థస్వామివారి నుంచి ఉపదేశం పొంది నిత్యమూ లలితా సహస్ర నామాలతో శ్రీ చక్రాన్ని అర్చించేవారనీ , సప్తశతీ పారాయణ చేసేవారనీ కొద్దిమందికే తెలుసు. అటువంటి ఉపాసకురాలికి జ్యోతిష్య జ్ఞానం పట్టుబడటం వింతేముంది ?

అన్నింటినీ మించి, నీతీనియమాలు ఎక్కడా లేని సినిమారంగంలో, నిప్పులాంటి వ్యక్తిత్వంతో లేత్తుకుని హుందాగా నిజాయితీగా బ్రతికిన ఆణిముత్యాల్లో ఆమెది అగ్రస్థానం అని చెప్పవచ్చు.

ఇన్ని విశిష్టలక్షణాలున్న భానుమతిగారి జాతకం తప్పకుండ విశిష్టమైనదే అయ్యుంటుంది. చూద్దామంటే ఆమె జననతేది దొరుకుతున్నది గాని జనన సమయం ఎక్కడా దొరకటం లేదు. ఎవరికైనా వారి జనన వివరాలు తెలిస్తే నాకు మెయిల్ చేయ్యండి. ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి జీవితాన్ని జ్యోతిష్య పరంగా అధ్యయనం చెయ్యడానికి వీలవుతుంది.
read more " బహుముఖ ప్రజ్ఞా శాలి- భానుమతీ రామకృష్ణ "

23, ఫిబ్రవరి 2011, బుధవారం

భారతీయ జ్యోతిష్యంలో ప్రత్యేకతలు

భారతీయజ్యోతిష్యమూ పాశ్చాత్యజ్యోతిష్యమూ ఒకదానికొకటి భిన్నమైనవి. రెండింటి ముఖ్యోద్దేశాలు ఒకటే అయినప్పటికీ వాటి విధానాలు, పద్దతులూ వేరు వేరు. రెండింటితోనూ భవిష్యదర్శనం చెయ్యవచ్చు. కాని పాశ్చాత్యులకు అందుబాటులోలేని కొన్ని ముఖ్యమైనవిధానాలు మన జ్యోతిష్యశాస్త్రానికి సొంతం గా ఉన్నాయి. అవేమిటంటే-- గ్రహ యోగాలు, దశలు మరియు అంశ చక్రాలు.

గ్రహ యోగాలు

గ్రహ యోగాలంటే కొన్ని విచిత్రమైన గ్రహ స్తితులు. వీటినే కాంబినేషన్స్ అని ఇంగ్లీషులో అన్నారు. అనేక వేల జాతకచక్రాలను పరిశీంచి వీటిని తయారు చేసారేమో అని అనిపిస్తుంది. జాతకంలో కొన్నికొన్ని గ్రహయోగాలున్నపుడు కొన్నిసంఘటనలు తప్పకుండా రిపీట్ అవుతుండటం మనం చూడవచ్చు. ఆయా యోగాలను క్రోడీకరించి, వర్గీకరించి,విభజించి మనకు అందించారు ప్రాచీన జ్యోతిష్య శాస్త్రవేత్తలు. వీటిలో స్థూలమైన పంచమహాపురుష యోగాల నుంచి, వివాదాత్మకమైన కాలసర్పయోగం వరకూ కొన్నివందలయోగాలు మనకు కనిపిస్తాయి. జాతకం చూడటం తోనే ఆయాయోగాలను గుర్తించగలగడం ఒక కళ. ఇది అభ్యాసంమీద సులువుగా అలవడుతుంది. తద్వారా జాతక పరిశీలన సులభం అవుతుంది.

దశలు

విధానం కూడా మన జ్యోతిష్యానికి ప్రత్యేకమైనదే. ఇందులో మళ్ళీ గ్రహదశలు, రాశిదశలు అని రెండువిధాలున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే జననకాల చంద్రుని లేక రాశులను ఆ చక్రానికే ప్రత్యేకమైన ఒకపద్దతిలో ముందుకు నడిపించటమే దశావిధానం. కనీసం ముప్పై రకాలైన దశలు ప్రస్తుతం మనకు నిర్ధారణగా కనిపిస్తున్నాయి. ఇవిగాక మన నిర్లక్ష్యంతో లుప్తమైపొయిన దశావిదానాలు ఎన్నో ఉన్నాయి. "టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్" ను తెలుసుకోవడానికి దశావిధానం ఉపయోగపడుతుంది. అంతేగాక ఆయాదశలలో ఉపచారాలు శాంతులు చేసుకోవడానికి, చెడు ఫలితాలను మార్చుకోవడానికీ ఆయా నక్షత్ర, రాశినాధులద్వారా మార్గం కనిపిస్తుంది.

అంశ చక్రాలు

జీవితంలోని ఒక్కొక్క విషయాన్ని భూతద్దం లో పట్టి చూపేవే అంశ చక్రాలు. ఆయా రంగాలలో సునిశిత విశ్లేషణకు ఇవి ఉపకరిస్తాయి. రాశిచక్రం ద్వారా మేక్రో ఎనాలిసిస్ వీలయితే అంశచక్రాల ద్వారా మైక్రోఎనాలిసిస్ చెయ్యడం సాధ్యపడుతుంది. రాశి చక్రాన్నీ ఒక్కొక్క అంశ చక్రాన్నీ పక్కపక్కనే పెట్టి సునిశిత పరిశీలన చెయ్యటం ద్వారా జీవితం యొక్క మొత్తం స్కోప్ ను మాత్రమె గాక ఆయారంగాలలో లోతైనవిశ్లేషణ ద్వారా మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు D-6 ద్వారా ఆరోగ్యపరిస్తితిని, రోగ సంబంధ విషయాలను తెలుసుకోవచ్చు. D-10 ద్వారా వృత్తి, ఉద్యోగం మొదలైన విషయాలుతెలుసుకోవచ్చు. ఇలా జీవితంలోని ప్రతి అంశాన్నీ తెలుసుకోవడానికి ఆయా ప్రత్యెక అంశచక్రాలను పరిశీలించవలసి వస్తుంది. కొన్ని నిముషాల తేడాతో పుట్టిన కవలపిల్లలకు రాశిచక్రం ఒకటే అయినప్పటికీ సూక్ష్మస్థాయిలో అంశచక్రాలు భిన్నంగాఉంటాయి. అందుకే వారిజీవితాలు కూడా తేడాగా ఉండవచ్చు.

చెప్పుకోటానికి సులువుగా కనిపించినప్పటికీ వీటిని విశ్లేషణ చెయ్యటం చాలా కష్టమైనపని. ఒక మనిషిని సంపూర్ణం గాఅర్ధం చేసుకోవాలంటే ఎంత కష్ట పడాలో ఒక జాతకాన్ని ఆమూలాగ్రం చదవాలంటే కూడా అంతే కష్టపడాలి. దానికి కనీసం కొన్నిరోజులు పడుతుంది. ముందుగా జాతకసమయాన్ని రెక్టిఫై చెయ్యవలసి ఉంటుంది. జాతకం చెప్పటం వెనుక ఇంత తతంగం ఉందని తెలియనివారు "నా పూర్తి జాతకాన్ని చెప్పండి" అని అడుగుతుంటారు. విధమైన రిక్వెస్ట్ తో నాకు కొన్ని వందల ఈ-మెయిల్స్ వస్తుంటాయి. వారందరికీ నేను చెప్పేదేమంటే-- పూర్తి జాతకాన్ని ఎనలైజ్ చెయ్యాలంటే ఒక్కొక్క జాతకానికి కనీసం ఒక వారం పడుతుంది. అది ఆషామాషీగా అయ్యేపని కాదు. ఒకవేళ ఎవరైనా అలా చెప్పగలం అంటే అది ఉత్త మాయ మాత్రమే.

భారతీయ జ్యోతిష్య విజ్ఞానం ఇలా ఎన్నో విధాలైన ప్రత్యెక పద్దతులను మనకు అందించింది. వాటిని ఉపయోగించుకొని వెలుగుబాటలో చక్కగా నడుస్తామో లేక మిడిమిడిజ్ఞానంతో అహంకరించి చీకటిలోనే తడుముకుంటూ నడుస్తామో మన ఇష్టంమీద ఆధారపడి ఉంటుంది.
read more " భారతీయ జ్యోతిష్యంలో ప్రత్యేకతలు "

20, ఫిబ్రవరి 2011, ఆదివారం

ఇండియా అండ్ ద రోల్ అఫ్ రాహు

This is a research article on the role of Rahu/Ketu in Indian Politics. This idea struck me when I was pondering over the close relation between the time of Indian Independence and the Kala-Sarpa-Yoga gripping the Lagna and seventh house of our Independence chart.

If we look back at the chronology of events from the time of Indian Independence, we see a strange influence of these two planets, especially that of Rahu, on the entire landscape that stretches before our imagination. It is not an exaggeration to say that our Nation has been under the octopus grip of Rahu and Ketu from the beginning. They are influencing our country's fate in a mysterious way right from the time of our independence. The fact that Rahu was sitting in Lagna of our Independence Chart cannot be overlooked by any means.

In any chart, be it personal or national, Rahu and Ketu play a very vital role. They can make or mar things by their magic. Their influence is very subtle and powerful. Their power holds sway over anyone very effectively.

In the Indian Independence chart, one peculiar thing that strikes me at the outset is, Rahu's positioning in Sun's star Krittika. Krittika is a fiery constellation ruled by Sun according to Vimsottari Dasa Scheme. Sun represents the Ruler. Hence we can deduct from this peculiar combination, that the Rulers will never be able to escape from unwanted influences. They can never be able to offer to this country, good governance free from corruption.

The terrible nature of these two shadowy planets is well known to the students of Jyotish. So, I need not repeat them here. However I will try to highlight a few of them. Wars and scams are under the control of Rahu. He can throw a person or a nation into scandals, scams, wars, bomb blasts and terrorist attacks. His schemes are very subtle and dangerous. Such is his power over human affairs that he can burn anything to dust in a trice. He is a dreadful planet. He was bestowed by the Lord Almighty, the power to play havoc with individuals as well as Nations.

Coming to the point, if we look at the important 'bad' landmarks in our modern history, we can immediately spot the influence of Rahu during such periods. Some of them are shown below:

1962-October:War with China.

Communist China attacked India
and the war lasted for a month from 20-10-1962 to 20-11-1962. Everyone knows very well, what a price we had to pay in our war with China. It was a humiliation to the entire nation. If we look at the chart of India, we can see that,India was running Saturn/Rahu/Moon/Rahu at that time.

Now, Moon is Lord of Vikrama Sthana, our place of valour. Our feeling of invincibility was proved to be a myth by the Chinese aggression and the entire Nation felt betrayed by our leaders. Saturn is 9th and 10th lord, usually a Yogakaraka to this Lagna, representing the ruling leaders and the Government. Rahu influencing both Saturn and Moon gives a picture of bad planning, over confidence in imaginary principles, closing our eyes in front of hard reality, day dreaming in emotional level and escapist attitude. Ultimately, what happened at that time is History now. We can see how Rahu played his clever role and decided the matter to the detriment of our Nation, overruling both Saturn and Moon. The only saving grace was the Dasa of Saturn who is Yogakaraka for Vrishabha Lagna. That is how we could come out of a difficult situation with a bitter lesson and a blue eye. However, going by the current events it is hard to believe that we have learned any lesson at all.

1965 (August 5 - September 22):-India-Pakistan war.

Though we won large territories of Pakistan and reached very close to Lahore,we could gain nothing out of our victory. Even today,we are paying the price of this war. Pakistan won some parts of Kashmir during this war and the Pyre of Ravana has been burning since then. India was running Saturn/Jupiter/Rahu/Venus at that time. Jupiter was the 8th lord of losses in 6th house of enemy. This planetary period has inflicted heavy losses to the enemy, no doubt. However, we could gain little from our victory, because of Jupiter being a malefic planet to this Lagna and also because of the influence of Rahu who always favours the Muslim nations. From all this, I am led to think that though we won the war against Pakistan, we lost it in reality, because we are still paying the price in the form of a burning Kashmir. During this Dasa also, we can again see the influence of Rahu that decided the matter against India,though at a subtle level.

India-Pakistan war December 3-16, 1971:-

Bangladesh was created during this period.India was running Mercury/Sun/Sun dasha at this time. I stated in the beginning that Rahu was sitting in Sun's star. So again, Rahu's influence here was indirect, discreet and clandestine. It acted through the agency of Sun, i.e the rulers. Though Bangladesh was created as a result of this war and we thought our enemy has become powerless, the reality showed up differently. Bangladesh has become a threat in the long run and we had to face much trouble from this country in the form of infiltrators and terrorists. As Mercury is intellectual in nature, the threat posed from this country is not direct, but more diplomatic and cunning. Here too, we can see Rahu's clandestine and devastating role.

The Indian Emergency from 25-6-1975 to 21-3-1977

This was termed by historians as a dark period in the history of our country. The wonder of wonders is --- this happened exactly during Mercury/Rahu period. Rahu antar dasha ran from March 1975 to September 1977. We can see how exactly this Rahu Antara ushered the state of Emergency in our country. So here too, we can notice the power and influence of Rahu on the affairs of India.

The period of Large Scale Scams

Now again, we are running the period of Sun/Rahu from November 2010 to September 2011. Any one can see for himself, how many scams involving looting of public money are surfacing now. It seems the entire National Treasure is being looted and deposited in foreign banks, leaving the millions of this country in dire distress. It appears that the Citizens of India are born to be cheated continuously by their rulers, generation after generation.

What more proof is needed to say clearly and concisely--the hour of Rahu is at hand again. Behold, those who have eyes to see.?
read more " ఇండియా అండ్ ద రోల్ అఫ్ రాహు "

18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

దేశ జాతకం- నడుస్తున్న రవి దశ

మన దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అల్లకల్లోల రాజకీయపరిస్తితులకు, రోజుకోకటిగా బయట పడుతున్న కుంభకోణాలకు సూచికలు ఏమున్నాయో మనదేశజాతకాన్ని పరిశీలించి చూద్దాం.

ప్రస్తుతం మన దేశానికి 11-9-2009 నుంచి 11-9-2015 వరకూ ఆరుసంవత్సరాల రవిమహాదశ జరుగుతున్నది. దశ మొదలైనప్పటి నుంచే గందరగోళపరిస్తితులు కనిపిస్తున్నాయి అన్న సంగతి మనం గమనించవచ్చు.

భారదేశజాతకాన్ని పరిశీలిస్తే--

-- విక్రమ స్థానంలో రవి, శని, శుక్ర, చంద్ర, బుధ గ్రహాలు కలిసి ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఇన్ని గ్రహాల కలయిక వల్ల రాజ్యపాలన అనేక పార్టీల సంకీర్ణంతోనూ, అనేకశక్తుల ప్రమేయంతోనూ నడుస్తున్నదన్న విషయం కనిపిస్తూనే ఉంది. వీరిలో శని దశమాధిపతిగా పరిపాలనూ రాజ్యకార్యాన్నీ సూచిస్తున్నాడు. తనకున్న సహజకారకత్వాల వల్ల ఆయారంగాలు నత్తనడక నడుస్తాయి అని చెప్పకనే చెబుతున్నాడు.

-- అయిదు గ్రహాలలో రవి, చంద్రులు ఒక పక్షం వారు. మిగిలిన బుధ శుక్ర, శనులు ఇంకొక పక్షం వారు. వీరందరూఒకేచోట కలిసిఉన్న పరిస్తితి వల్ల-- సిద్ధాంత పరంగా పరస్పరవ్యతిరేకపార్టీలు అధికారంకోసం కలిసి పనిచేయ్యవలసి వచ్చినపుడు ఏర్పడే గందరగోళ పరిస్తితులు కళ్ళకుకట్టినట్లు కనిపిస్తున్నాయి.

--ఇక్కడ ఇంకొక విచిత్రం ఉన్నది. రవి, శని, శుక్రులు బుదునిదైన ఆశ్లేషానక్షత్రం లోనూ, చంద్ర బుధులు శనిదైన పుష్యమీనక్షత్రం లోనూ ఉండటం ఒక విచిత్ర పరిస్తితి. అంటే వీరిలో మిత్రులు మిత్రులూ కారు, శత్రువులు శత్రువులూకారు. అందుకనే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మిత్రత్వాలు గాని శత్రుత్వాలు గాని లేవు. అవసరార్థం ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అని తెలుస్తున్నది.

-- ఇటువంటి పరిస్తితిలో వీరందరూ కలిసి ఫారెన్ పాలసీ సూచిక అయిన నవమ స్థానాన్ని చూస్తుండటం వల్ల విదేశీవ్యవహారాలు కూడా ఇలాగే గందరగోళంగా ఉంటాయని తెలుస్తున్నది.

-- వీరిలో శనిశుక్రులు అతిదగ్గరగా ఒకేనక్షత్రపాదంలో ఉండటంవల్ల నవాంశలో మకరంలో ఉన్నారు. నవాంశను నాడీవిధానంప్రకారం రాశిచక్రంపైన సూపర్ ఇంపోస్ చెయ్యగా విదేశాలను సూచించే నవమస్థానం అయింది. కనుక కాంబినేషన్ బట్టి ఏమి తెలుస్తున్నది? శుక్రుడు ( సంపద), శని ( రహస్యంగా), నవమ స్థానం ( విదేశాలకు తరలి వెళ్లిపోతుంది) అన్న విషయం కనిపించటం లేదూ ?

--ప్రస్తుతం జరుగుతున్న రవి/రాహు దశ 4-11-2010 నుంచి 29-9-2011 వరకూ ఉన్నది. ఇది గ్రహణ కాలం. కనుక సమయంలో దేశానికి గ్రహణం పట్టింది. అన్నిరకాల మోసాలూ, కుట్రలూ స్కాములూ ఇప్పుడే జరుగుతున్నాయి. బయట పడుతున్నాయి.

-- అసలే కాలసర్పయోగం లో మనకు స్వాతంత్రం వచ్చింది. ప్రస్తుత దశ కూడా అలాగే ఉంది. సెప్టెంబర్ వరకూ ఇదే పరిస్తితి కొనసాగుతుంది. ఇంకా ఎన్నెన్ని గొడవలు, స్కాములు జరుగుతాయో చూస్తూ ఉండటమే సామాన్య పౌరులుగా మన గతి.

రానున్న గురుఅంతర్దశ అన్నా బాగుంటుందా? అంటే అనుమానమే అని చెప్పాలి. ఎందుకంటే లగ్నానికి గురువు మంచివాడు కాదు. పైగా శత్రు స్థానంలో కూచుని ఉన్నాడు. కనుక గురుఅంతర్దశలో పొరుగుదేశాలతో గొడవలు ఎక్కువకావటం జరుగవచ్చు. త్వరలో మొదలు కాబోతున్న అర్దాష్తమశని కూడా దీనినే బలపరుస్తున్నది. దేశంలో ప్రజల కష్టాలు మితిమీరుతాయని సూచన ఇస్తున్నది.

హిమాలయప్రాంతాలలో యోగినీదశకు ప్రాధాన్యత ఎక్కువ. మనం విమ్శోత్తరీ దశను వాడినట్లు ఆ ప్రాంతాలవారు యోగినీదశను ఉపయోగిస్తారు. యోగినీదశావిధానంలో అయితే ప్రస్తుతం జూన్ 2008 నుంచి 2016 వరకూ సంకట (రాహు) దశ జరుగుతున్నది. పేరు సూచించినట్లే అన్నీ సంకట పరిస్తితులు ఎదురౌతున్నాయి. ముందు ముందు కూడా ఇలాగే ఉంటాయి.

ఏతావాతా రవి దశ మొత్తం ఇలాగే ఉండే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. రవి పరిపాలనకు సూచకుడు కనుక ఈ దశ మొత్తం గందరగోళమైన పరిపాలన ఉంటుంది. ఏ నిర్ణయమూ ఎవరికీ నచ్చని పరిస్తితి ఉంటుంది. దీనికి కారణం రవి పైన ఇతరనాలుగుగ్రహాల ప్రభావం బలంగా ఉండటమే. దేశ పరిపాలన మొత్తం ఒక గ్రూప్ చేత నడప బడుతూ ఉంటుంది అని ఈ కాంబినేషన్ సూచిస్తున్నది.

ప్రజల్లో,
పాలకుల్లో నీతినియమాలు పెరగనంతవరకూ, సమాజంపట్ల, సాటి మనుషులపట్ల జవాబుదారీతనం, దేశభక్తీ రానంత వరకూ మన దేశానికి ఖర్మ తప్పదనే చెప్పాలి.

read more " దేశ జాతకం- నడుస్తున్న రవి దశ "

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

నింజుత్సు

అతిప్రమాదకరమైన జపనీస్ వీరవిద్యలలో నింజుత్సు ఒకటి. దాదాపు అయిదువందల సంవత్సరాలపాటు ఈవిద్య అతిరహస్యంగా అభ్యాసం చెయ్యబడుతూ వచ్చింది. జపనీయులు కానివారు ఈ విద్య ఎట్టి పరిస్తితుల్లోనూ నేర్చుకోటానికి వీలుండేది కాదు. అసలు ఈ స్కూల్స్ ఎక్కడున్నాయో ఎవరికీ తెలిసేది కాదు. అటువంటి రహస్య వాతావరణం లో ఈ విద్య అభ్యాసం చెయ్యబడేది.

ఎటువంటి పరిస్థితిలోనూ చలించకుండా ఉండటం నింజుత్సు వీరుల ప్రాధమికసూత్రం. వీరి సింబల్ అయిన "నిన్" అన్న అక్షరం దానినే సూచిస్తుంది. గుండెబొమ్మ, దానిపైన ఖడ్గం దానిగుర్తులు. గుండెలో ఖడ్గం దిగినాసరే చలించకుండాఉండాలని దాని అర్ధం. అటువంటి ట్రైనింగ్ నింజుత్సు విద్యలో ఉంటుంది.బాధను సహించటంలో ఏళ్లతరబడి వీరికి ట్రైనింగ్ ఉంటుంది. అద్భుతమైన సహనశక్తి ఆ ట్రైనింగ్ వల్ల వీరికి అలవడుతుంది.


మహోన్నతమైన ఫిలాసఫీ వీరి ట్రైనింగ్ లో ఉగ్గుపాలతో వంటబడుతుంది. ఎట్టి పరిస్తితిలో నైనా తొణకని ఆత్మవిశ్వాసం వీరి సొంతం. ప్రాణాన్ని ఎంతమాత్రం లెక్కచెయ్యని మనస్తత్వం వీరివిద్యలో అతి ముఖ్యమైన భాగం. ఎలా గెలిచాం అన్నది ముఖ్యంకాదు.గెలిచామా లేదా అన్నదే ముఖ్యం అన్నది వీరిసూత్రం. యుద్దంలో నీతికి,ధర్మానికి తావులేదు అని వీరు నమ్ముతారు. కాని నిత్యజీవితంలో ఉన్నత విలువలు పాటిస్తారు. అనుకున్న పనిని సాధించటంలో ప్రాణాలను లెక్క చెయ్యకుండా ప్రయత్నిస్తారు.

జెన్ ఫిలాసఫీ వీరి సూత్రాలకు దగ్గరగా ఉంటుంది. సమురాయ్ విధానాలు కూడా వీరికి దగ్గరగానే ఉంటాయి. జపాన్ సాధించిన అద్భుత ప్రగతికి కారణం జెన్, సమురాయ్, నింజుత్సు విధానాలే అని ఒక భావన ప్రపంచవ్యాప్తంగా ఉంది.

విచిత్రం ఏమిటంటే, భారతీయసిద్ధులయొక్క యోగశాస్త్రం లోని రహస్యాలకూ నింజుత్సు లోని అత్యున్నత అభ్యాసాలకూ ఏమీ భేదం లేదు. యోగముద్రలు, బంధాలు,ప్రాణాయామ క్రియలు అన్నీ రెంటిలోనూ దాదాపుగా ఒకటిగానే ఉంటాయి.మనం వదిలేసినవాటిని ఇతర ఆసియాదేశవాసులు తీసుకుని వాడుకొని అద్భుతమైన స్థాయికి వాటిని తీసుకెళ్లగలిగారు.మనమో ఎంతసేపూ మా విద్యలు గొప్పవి, మా గ్రంధాలు గొప్పవి, మా సంస్కృతి గొప్పది, అని అరవటమే గాని, వాటిలో ఏముందో తెలుసుకుందామని గాని, వాటిని ఆచరిద్దామని గాని,నేర్చుకుందామని గాని ప్రయత్నించము. బహుశా ఇటువంటి తమస్సుతో నిండిన పరిస్తితిని చూచేనేమో గురు బోధిధర్మ మన దేశాన్ని విడిచి చైనాకు వెళ్లి అక్కడ మన ధ్యానబౌద్ధాన్ని ప్రచారం చేసాడు. ఉన్న సంపదను నిర్లక్ష్యంతో చేజార్చుకునే వారినిఎవరు మాత్రం రక్షించగలరు?

నింజుత్సు విద్య యొక్క ఆత్మ అనదగ్గ పద్యం ఒకటి ఉంది. దానిని ఎవరు వ్రాశారో తెలియదు.కాని నింజుత్సు యొక్క రహస్యఆత్మను ఈపద్యం అక్షరాలా ప్రతిబింబిస్తుంది.


భూమీ ఆకాశం నా తల్లి దండ్రులు
ఈ శరీరం నా ఇల్లు
నిజాయితీ నా శక్తి, సాధనే నా మాయ
శ్వాసే నా బ్రతుకూ చావూ, నిగ్రహమే నా శరీరం
సూర్య చంద్రులే నా కళ్ళు, సున్నితత్వమే నా చెవులు
ఆత్మరక్షణే నా ధర్మం, ఒదిగిపోవడమే నా బలం
అవకాశాన్ని పూర్తిగా స్వీకరించటమే నా నేర్పు
మనసే నా మిత్రుడు, నిర్లక్ష్యమే నా శత్రువు
సరైన ఆచరణే నా రక్ష
కనిపించేవన్నీ నా ఆయుధాలే
శత్రువుకంటే ఒకడుగు ముందుండటమే నా వ్యూహం
నింజుత్సు-- నా మార్గం

ఈ విద్యలో ఉన్నతస్థాయిలకు ఎదిగేకొద్దీ ఇది మర్మవిద్యకు చాలాదగ్గరగా వస్తుంది. జనసామాన్యానికి అందుబాటులో ఉండని తాంత్రికక్రియల సాధన అప్పుడు నేర్పబడుతుంది. సామాన్యజనానికి అర్ధంకాని ఉన్నతసిద్ధాంతాల అభ్యాసం అప్పుడు మొదలౌతుంది. ఆ స్థాయికి చేరిన నింజావీరుడు దాదాపు ఒక యోగిగా మారతాడు.ధ్యానాభ్యాసం ద్వారా ప్రకృతి శక్తులను శాసించడం నేర్చుకుంటాడు. ఏకాంత ప్రకృతితో ఒకడిగా సహజీవనం సాగిస్తాడు.

ఈవిధంగా ఒక మోసపూరిత వీరవిద్యగా మొదలైన ఇతని ట్రైనింగ్ చివరికి అత్యున్నతమైన యోగంలోనూ, జెన్ లోనూ లయిస్తుంది. కానీ దానికోసం జీవితాన్ని ఈవిద్యకు ధారపోయ్యవలసి వస్తుంది. అందుకే ఆ స్థాయిలకు చేరేవారు బాగా తక్కువ అనే చెప్పాలి.

వీరవిద్యగా మొదలై యోగంగా అంతమయ్యే లక్షణం ఆసియా ఖండపు వీరవిద్యల ప్రత్యేకత. ఈ విచిత్రలక్షణం ఇతర ఏఖండాల వీరవిద్యలలోనూ కనిపించదు. అందుకే వీటిని Martial Ways of Enlightenment అంటారు.
read more " నింజుత్సు "

12, ఫిబ్రవరి 2011, శనివారం

జ్ఞానయోగంలో యోగసాధనా ప్రాధాన్యత

మన హిందూ ధర్మానికి పట్టుకొమ్మలు వేదములు మరియు వేదాంతం అనబడే ఉపనిషత్తులు. ఈ వేదములు మరలా కర్మకాండ, జ్ఞానకాండ అని రెండు భాగాలుగా ఉన్నాయి.వీటిలోని జ్ఞానకాండనే వేదాంతమని ఉపనిషత్తులనీ అంటారు. అత్యున్నతమైన తత్త్వజ్ఞానం వీటిలో నిండి ఉంది.

ఉపనిషత్తులలో జ్ఞానోపనిషత్తులవలెనే యోగోపనిషత్తులు కూడా ఒక భాగంగా ఉన్నాయి. వాటిలో యోగశిఖోపనిషత్తు ఒకటి. యజుర్వేదాన్తర్గతమైన యోగశిఖోపనిషత్ యోగసాధనకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. అందులోని ఒక ప్రసిద్ధ శ్లోకం ఇలా చెప్తుంది.

శ్లో|| జ్ఞాననిష్టో విరక్తోపి ధర్మజ్ఞో విజితేన్ద్రియః
వినా యోగేన దేవోపి మోక్షం లభతే విధే ||

అర్ధం||జ్ఞాననిష్ఠ ఉన్నప్పటికీ, విరక్తి ఉన్నప్పటికీ, ధర్మం గురించి తెలిసిఉన్నప్పటికీ, ఇంద్రియజయం కలిగినప్పటికీ, యోగం లేకపోతే దేవతలకు కూడామోక్షం కలుగదు. 

జ్ఞానమొక్కటే మోక్షాన్నిచ్చుటకు సమర్ధము అని శంకరాది బ్రహ్మవేత్తలు చెప్పియున్నారు. "జ్ఞానాదేవతు కైవల్యమ్" అన్న వాక్యములు కూడా దీనినే ప్రతిపాదిస్తున్నవి. కాని యోగోపనిషత్తులు మాత్రం యోగమును పరమప్రమాణముగా చెప్పుటకు కారణమేమి అన్న విచికిత్స కలుగుతుంది. 'పుమాన్ జన్మాంతర శతైర్యోగేనైవ ప్రముచ్యతే'. మానవుడు వందల కొలది జన్మలను ఎత్తిన పిమ్మట యోగం చేతనే మోక్షాన్ని పొందుచున్నాడు. అని ఇంకొకచోట చెప్పడం వల్ల ఈ రెంటిలో ఏది సరియైనది అన్న మీమాంస తలెత్తుతుంది. 

భగవద్గీత లో శ్రీకృష్ణభగవానుడిలా చెప్పినట్లు మనం చూడవచ్చు.

శ్లో|| తపస్విభ్యాధికో యోగీ జ్జానిభ్యశ్చ మతోదికః
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ||

యోగి అన్నవాడు తపస్వుల కన్ననూ, జ్ఞానుల కన్ననూ, కర్మిష్టుల కన్ననూ, అధికుడు. కనుక ఓ అర్జునా నీవుయోగివి కా. ఇటువంటి పరస్పర విరుద్ధ భావనలు అనేకులలో సందేహాలను కలిగిస్తాయి. జ్ఞానము యోగములలో ఏది శ్రేష్టము? ఏది ఉన్నతము అన్న విచికిత్స కలుగుతుంది.

జ్ఞానమనునది అంత తేలికగా కలుగునట్టిది కాదు. దానికి ఉన్నతములైనట్టి అర్హతలు సాధకునకు ఉండాలి. ఆ అర్హతలు ఏమి? అన్న విషయాన్ని వేదములే వివరించాయి. శమదమాది షట్క సంపత్తి, ఇహాముత్ర ఫలభోగవిరాగము, శ్రద్ద, తితిక్ష, ముముక్షుత్వము మొదలైన ఉన్నత లక్షణాలు సాధకునిలో ఉన్నపుడు అట్టివాడు "శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య:" అన్న ఉపనిషద్వాక్యానుసారం ఆత్మ తత్త్వాన్ని గురించి గురుముఖతా విని, ఆ విన్నదానిని మనన నిధిధ్యాసనాది ఉపాయములచేత నిరంతరమూ ధారణ చెయ్యడం ద్వారా అజ్ఞానభ్రాంతిని వదల్చుకొని, మాయావరణాన్ని భేదించుకొని, "భిద్యతే హృదయగ్రంధి: ఛిద్యన్తే సర్వసంశయా:" అని వేదమాత చెప్పినట్లు ఆత్మజ్ఞానమును పొందగలుగుతాడు. కాని, అట్టి మహత్తరమైన దైవీలక్షణసంపత్తి కోటిమందిలో ఒకరికి మాత్రమే ఉంటుందో? లేక అదీ ఉండదో? సంశయమే. అందరికీ అట్టి ఉత్తమలక్షణాలు ఉండవు. ఒక్క వివేకానందులో, ఒక్క శంకరులో, ఎక్కడో కోటానుకోట్లజనులలో ఉత్తమాధికారులుగా ఉద్భవిస్తారు.

కనుక మనవంటి మంధాధికారుల కొరకు, వారివారి దేహేంద్రియప్రాణమనస్సులను క్రమబద్ధీకరించుటకొరకు యోగసాధన విహితముగా చెప్పబడింది. లోకమంతా అల్పజ్ఞులతోనూ మందాధికారులతోను నిండి ఉన్నది కనుక అట్టివారికోసం వేదమాత యోగాన్ని ప్రమాణంగా సూచించింది. 'అథ తద్దర్శనాన్నుపాయో యోగః' అంటూ " పరమ సత్యాన్ని దర్శించే ఉపాయం యోగం" అని వేదం చెప్పింది. అంతేగాని ఉత్తమలక్షణసంపత్తి లేనటువంటి మందాధికారులకు కూడా జ్ఞానమే పరమప్రమాణము అని వేదమాత ఎక్కడా చెప్పలేదు. మనవంటివారు సరాసరి జ్ఞానసాధన చెయ్యబోతే "ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు" అన్న సామెత సార్ధకమౌతుంది.

ఈ విషయాన్ని వివరిస్తూ "వేదాంత పంచదశి " లో మాధవవిద్యారణ్యులు ఇలా అన్నారు

శ్లో|| బహువ్యాకుల చిత్తానాం విచారాత్తత్వ ధీనిహి
యోగో యుక్త స్తతస్తేషాం ధీ దర్పస్తేన శామ్యతి ||

అర్ధం|| అనేక విషయాలతో నిండిన వ్యాకుల చిత్తం కలిగిన వారికి ఉత్త (తార్కిక) జ్ఞాన విచారణ వల్ల ఫలితం లేదు. వారికి ఉన్నపాండిత్య దర్పం యోగం వల్లనే శాంతిస్తుంది. 

కనుక శమదమాది దైవీసంపద లేనట్టి మందాధికారులకు యమనియమాది క్రమానుగతమైన యోగసాధనము ఉపాయముగా చెప్పబడింది. ఉత్తమమైన సాధనా సంపత్తి సహజముగా కలిగినట్టి పుణ్యాత్ములకు సరాసరి జ్ఞానయోగసాధన ఉపకరిస్తుంది. యోగసాధన చేసి అనుభవాన్ని పొందకుండా ఉత్త ఉపనిషద్వాక్యాలను వల్లిస్తున్న పండితగురువులవల్లనే వేదాంతమనునది మెట్టవేదాంతముగా మారుతున్నది. వేదాంతమనునది బుద్ధిపరంగా అర్ధం చేసుకుని ఇతరులకు బోధించగలిగే ఎకాడమిక సబ్జక్ట్ కాదు. అది నియమితయోగసాధన, వివేక వైరాగ్యాది దైవీగుణములు, ఆత్మచింతనల ద్వారా పొందగలుగు అనుభవైక వేద్యమైన సత్యజ్ఞానం. ఈ విషయాన్ని చక్కగా అర్ధం చేసుకోవాలి.

యోగబీజమనే గ్రంధం ఇలా అంటుంది.

'తదా యోగేన రహితం జ్ఞానం మోక్షాయ నో భవేత్' 

యోగరహితమైన జ్ఞానం మోక్షాన్ని ఇవ్వలేదు. యోగము జ్ఞానము రెండూ కలిసినప్పుడే సత్యమైనట్టి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. కనుక ఉత్తమాధికారులకు జ్ఞానయోగము సరాసరి ఉపకరిస్తుంది. మందాధికారులకు అష్టాంగయోగము సాధనమౌతున్నది. ఈ విధముగా ఎవని అర్హతను బట్టి వానికి ఉపాయమును సూచించటమే మన హిందూ ధర్మములోని విశిష్టతలలో ఒకటి. ఈ సూక్ష్మాన్ని చక్కగా తెలుసుకొంటే విచికిత్సకు తావులేకుండా ఉంటుంది.
read more " జ్ఞానయోగంలో యోగసాధనా ప్రాధాన్యత "

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

మాస్టర్ యిప్ చున్ ఫైట్

వింగ్ చున్ దివంగత గ్రాండ్ మాస్టర్ యిప్-మాన్ పెద్దకుమారుడు మాస్టర్ ఇప్ చున్. ఆయనకు ఇప్పుడు 85 ఏళ్ళు. వయసులో "యిప్ మాన్- ది లెజెండ్ ఈస్ బార్న్" సినిమాలో తన తండ్రి యిప్ మాన్ కు ఒక గురువైన "ల్యూంగ్ బిక్" గా నటించాడు. అంతేకాదు అందులో యిప్ మాన్ గా నటించిన "డెనిస్ టో" తో ఫైట్ సీన్ లో అద్భుతమైన ఫైట్ చేసాడు. డానీయెన్ హీరొ గా వచ్చిన రెండు సినిమాలకూ ఈ సినిమా ప్రీక్వెల్.

దీనికి ముందు తీసిన రెండు సినిమాల్లో డానీ యెన్ హీరొ గా నటించాడు. కాని మూడో సీక్వెల్ (ప్రీక్వెల్) మాత్రం మొదటి రెంటి కన్నా చాలా బాగుంది. దానికి కారణాలు: డానీ యెన్ మంచి ఫైటరే కాని అతనికి అసలైన వింగ్ చున్ కుంగ్ ఫూ రాదు. అతను అందులో మొదట్నించీ ట్రైనింగ్ తీసుకోలేదు. సినిమా కోసం కొద్ది నెలలు వింగ్ చున్ అభ్యాసం చేసాడు. అందుకే అతని మూమెంట్స్ లో ఒరిజినల్ వింగ్ చున్ కుంగ్ఫూ కనిపించదు.

కాని మూడో సీక్వెల్ లో హీరో గా నటించిన "డెనిస్ టో" మాత్రం వింగ్ చున్ కొన్నేళ్ళుగా అభ్యాసం చేసాడు. అతనికి స్టైల్లో గట్టి పునాది ఉంది. అందుకే అతని మూమెంట్స్ లో అసలైన వింగ్-చున్ కుంగ్ ఫూ కనిపిస్తుంది. అతనూ మాస్టర్ యిప్ చున్ కలసి చేసిన ఫైట్ చాలా బాగుంది. ఇద్దరూ మంచి మాస్టర్లే కనుక ఫైట్ చాలా బాగా వచ్చింది. వింగ్ చున్ అభిమానులను ఫైట్ బాగా అలరిస్తుంది. విద్య తెలిసినవారికి ఇందులో ఉన్న వింగ్ చున్ కిటుకులు బాగా నచ్చుతాయి.

read more " మాస్టర్ యిప్ చున్ ఫైట్ "

7, ఫిబ్రవరి 2011, సోమవారం

నేను మెచ్చే బ్రాహ్మణత్వం

బ్రాహ్మణత్వాన్ని నిర్ణయించేది కులమా? గుణమా? అని ఎవరైనా నన్నడిగితే గుణమే అని నిస్సందేహంగా చెబుతాను.

ఒక వ్యక్తి పుట్టుకతో బ్ర్రాహ్మణుడై ఉండవచ్చు. కాని అతనిలో అహంకారం, దర్పం,విచ్చలవిడిజీవితం, విలాసాలమీద కోరికలు, అబద్దపునడవడి ఉంటే అతన్ని బ్రాహ్మణుడుగా నేను పరిగణించను. అతను బ్రాహ్మణకులంలో పుట్టిన చీడపురుగు అనిమాత్రమే నేను తలుస్తాను. ఇంకొకడు ఇతరకులాలలో పుట్టినప్పటికీ, అతనిలో ఈ లక్షణాలు లేకపోతే అతన్ని బ్రాహ్మణుడుగానే నేను పరిగణిస్తాను. ఇక బ్రాహ్మణకులంలో పుట్టి, పై దుర్గుణాలు లేనివాని మాట చెప్పేదేమున్నది? అతను అత్యుత్తముడు అని నా భావన.


బ్రాహ్మణత్వం అనేది కులాన్ని బట్టి కాకుండా గుణాన్ని బట్టి నిర్ణయించబడాలన్నది నా అభిమతం. కాని బ్రాహ్మణకులంలో పుట్టినవారిలో మంచి లక్షణాలు చాలావరకు సహజంగానే బీజరూపంలో ఉంటాయన్నదీ వాస్తవమే. దానికి కారణం తరతరాలుగా ఆయా లక్షణాలను వారు ఆచరించడం వల్ల జీన్స్ లో వచ్చిన మార్పులు కావచ్చు. కాని ఇంకొకటి కూడా వాస్తవమే. పుట్టుకతో వచ్చిన ఈ లక్షణాలను వారు అభ్యాసంద్వారా చక్కగా వృద్ధిచేసుకోకపోతే అవి దుస్సాంగత్యదోషంవల్లా, సమాజపు ప్రభావంవల్లా క్రమేణా నశించిపోయే ప్రమాదం ఉన్నది. ఇలాటి కులబ్రాహ్మణులను ప్రస్తుతం చాలామందిని మనం చూడవచ్చు.

నాకు తెలిసిన రెండు ఉదాహరణలిస్తాను.

నేను రోజూ చూచే ఒక పురోహితుడున్నాడు. అతని వయసు ఇరవై ఇరవై అయిదూ మధ్యలో ఉంటుంది. తెలిసినవారి ఇళ్లలో పౌరోహిత్యం చేయిస్తూ ఉంటాడు. కాని తీరిక సమయాల్లో వీధి అరుగుమీద కూచుని వచ్చేపోయే ఆడపిల్లలను అసభ్య మాటలతో వేధిస్తూ ఉంటాడు. అతని నిత్యజీవితప్రవర్తన చాలా అసహ్యంగా ఒక రౌడీలాగా ఉంటుంది. పూర్తి తామసిక ప్రవర్తనగా ఉంటుంది.అప్పుడపుడూ దేవుణ్ణికూడా అసభ్యభాషలో మాట్లాడుతుంటాడు. మూర్తీభవించిన అహంకారి.

దీనికి పూర్తి వ్యతిరేకంగా ఇంకొకాయనున్నాడు. ఆయన ఒక దళిత కుటుంబంలో పుట్టాడు. కాని చాలా సాత్వికుడు. మొన్నీ మధ్యన క్రికెట్ ఆడుతుంటే ఆయన మూతికి క్రికెట్ బంతి తగిలి పెదవి పగిలిపోయింది. బంతి వేసినవాణ్ణి ఒక్క మాట అనకపోగా, "కంటికి తగిలి కన్నుపోకుండా మూతికి తగిలింది. దేవుడి దయ అంటే ఇదే" అన్నాడు. హాస్పటల్ లో పడుకోబెట్టి ఇంజక్షన్ చేస్తుంటే మౌనంగా దైవప్రార్ధన చేస్తూ ఉన్నాడు. "ఏ జన్మలో ఏం చేశానో ఇలా జరిగింది. అందుకే మనం తెలిసి ఎవ్వరికీ హాని చెయ్యరాదు. ఎందుకంటే చేసిన పనులకు ఇక్కడే ఫలితాలు అనుభవించవలసి వస్తుంది." అని నాతో అన్నాడు. నా కళ్లలో నీళ్ళు తిరిగాయి.

వీరిద్ధరిలో ఎవరు నిజమైన బ్రాహ్మణుడు? అని నన్ను ఎవరన్నా అడిగితే దళితమిత్రుడికే నా ఓటు వేస్తాను. కులం ప్రధానం కాదు గుణమే ప్రధానం అన్నది నిర్వివాదాంశం. ఒకవేళ కులమూ గుణమూ కూడా కలిస్తే బంగారానికి సువాసన అబ్బినట్లే అని నా అభిప్రాయం.

బుద్ధుడు కూడా ఇదే భావనను ధమ్మపదంలో అనేక చోట్ల వెలిబుచ్చాడు. అంతేకాదు నిజమైన మహనీయులందరూ ఇదే భావనను ఒప్పుకున్నారు. కులానికీ గుణానికీ మధ్యన నిర్ణయం జరుగవలసి వచ్చినపుడు గుణానికే ప్రాధాన్యం ఇవ్వాలి అన్నది నా నిశ్చితాభిప్రాయం.
read more " నేను మెచ్చే బ్రాహ్మణత్వం "

2, ఫిబ్రవరి 2011, బుధవారం

జెన్ కథలు - పళ్ళెం శుభ్రం చెయ్యి

కొత్తగా ఆశ్రమంలో చేరిన ఒక భిక్షువు, జెన్ మాస్టర్ జోషును సమీపించి ఇలా అడిగాడు.
"నేను ఆశ్రమం లో కొత్తగా చేరాను. ధ్యానం లో ప్రధమ సూత్రాన్ని నేర్చుకోవాలని నాకు చాలా ఆత్రుతగా ఉంది. అదేమిటో చెప్తారా?"
జోషు అతని వైపు చూశాడు.
"భోజనం చేశావా" అడిగాడు జోషు.
"చేశాను" చెప్పాడు శిష్యుడు.
"అయితే నీ పళ్ళెం శుభ్రం చెయ్యి" అన్నాడు జోషు.
------------------------------------------------------------------------------------------
అనవసరమైన సిద్ధాంత రాద్ధాంతాలకు జెన్ దూరం గా ఉంటుంది. జెన్ విధానం అతి సరళం. అందుకనే అతికష్టం కూడా. ఎందుకంటే జీవితంలో అతి సింపుల్ గా ఉండేవాటి విలువను గ్రహించాలంటే అతి లోతైన దృష్టి ఉంటేనే సాధ్యపడుతుంది. ఊహల్లో విహరించేవారిని జెన్ నేలమీదకు దించి నడిపిస్తుంది. ఎందుకంటే ఊహల్లో ఉండేవారికి సత్యం కనిపించదు.

మనుషులు సరళత్వాన్ని ఇష్టపడరు. కాని అలా నటిస్తారు. సరలత్వాన్ని అభిమానిస్తారు. కాని ఆచరించరు. ఎందుకంటే దానిని ఆచరించాలంటే ఎన్నింటినో వదులుకోవాలి. అలా వదులుకోవటం ఎవరికీ ఇష్టం ఉండదు. అందుకే అతి సరళమైన జెన్ విధానం ఆచరణకు కష్టంగా తోస్తుంది. ఏవేవో ఊహించుకుంటూ భావరాజ్యంలో విహరించేవారికి జెన్ బోధపడదు. ఎందుకంటే సత్యం కళ్లెదుటనేఉంది. కళ్ళు తెరిచి చూడగలిగితే సత్యం చక్కగా కనిపిస్తుంది. కాని కళ్ళు తెరవటమే అతి కష్టం. మూసిన కళ్ళు తెరిస్తే సాధన అయిపోయినట్లే. ఆ తెరవడానికే అనేక జన్మలు పడుతుంది.

కొత్తగా చేరిన శిష్యుడు ధ్యాన మార్గంలోని ప్రధమ సూత్రాన్ని తెలుసుకోవాలని తలచాడు. గురువుగారు తనకి ఏదోమంత్రాన్నో, ధ్యానవిదానాన్నో ఉపదేశిస్తారని తలచాడు. అలా ఆశించడమే అతని పొరపాటు. గురువు చెప్పబోతున్న బోధ తన ఆలోచనకు అనుగుణంగా ఉండాలని అతను అనుకోవడమే తప్పు. కాని అందరు శిష్యులూ ఇలాగే ఆశిస్తారు. ఏదో గొప్ప ధ్యానక్రియను నేర్చుకోవాలని వారు ఆశిస్తారు. అన్ని క్రియలకూ అతీతమైనది జెన్ విధానం. ఇది ఏదో బయటి అనుభవాన్ని నీకివ్వదు. దేన్నో అనుభవించాలని ఆశిస్తున్న నిన్నే కరిగిస్తుంది. నిన్ను లేకుండా చేస్తుంది. తద్వారా ఉన్నదేదో అదే మిగులుతుంది. ఓపెన్ మైండ్ తో గురువును సమీపించగలిగితే కిటుకు చిటికెలో అర్ధమౌతుంది. తెలియనంతవరకూ బ్రహ్మ విద్య తెలిస్తే కూసువిద్య అన్న సామెత అందుకే వచ్చింది.


ఎదురుగా ఉన్న పనిని చెయ్యటమే ధ్యానంలో ప్రధమ సూత్రం. అది వదిలిపెట్టి, ఏవో లోకాల్లో విహరించటం జెన్ విధానం కాదు. విధమైన ఉపదేశం ద్వారా ప్రతి నిముషం ఎరుకలో జీవించమని, వర్తమానం లో జీవించమని జోషు శిష్యునికి బోధిస్తున్నాడు. అలా ఉండగలిగినవానికి జీవితంలో చీకటి ఉండదు. ఎరుక అనే వెలుగు ప్రతి క్షణం అతన్ని ఆవరించి ఉంటుంది. జెన్ విధానం ఎరుకతో అనుక్షణం జీవించటమే. అనుక్షణం వర్తమానంలో ఉండటమే.

ఎరుకతో బ్రతకగలిగితే మనస్సు ప్రతి క్షణం వర్తమానం లోనే ఉంటుంది. అది గతం లోనో లేక భవిష్యత్తుకు చెందిన ఊహల్లోనో ఉండలేదు. ప్రతి క్షణం ఎరుకతో ఉండగలిగిన మనిషి తన సహజ స్థితిలోనే నిరంతరం ఉంటాడు. రమణమహర్షి దీనిని సహజ సమాధి అని పిలిచారు. అట్టివాడు దర్శనాలకు కూడా అతీతమైన భూమికను అందుకుంటాడు. ఎల్లప్పుడూ తనలో తాను మునిగి ఉండేవాడు ఆత్మనే ఆరామముగా కలిగిన వాడౌతాడు. ఆత్మారాముడౌతాడు .

జోషు బోధనలో లోతైన అర్ధం దాగుంది. భోజనం చెయ్యటం అంటే కర్మను పోగు చేసుకోవటం. ఇంద్రియముల ద్వారా నిత్యమూ సమస్త సమాచారాన్ని లోనికి స్వీకరిస్తూ ఎప్పుడూ మనం భోజనం చేస్తూనే ఉన్నాం. భోజనం చెయ్యటానికి మనస్సు అనే ప్లేటును వాడుతూ దానిద్వారా మనం ఆహారాన్ని తీసుకుంటున్నాం. ప్రక్రియలోమనస్సు అనే ప్లేటు ఎంగిలి అవుతున్నది. దాని నిండా రకరకాల సాంబారు, రసం, కూరలు, పప్పు, పెరుగు ఇత్యాదిమరకలు నిండి ఉన్నాయి. మరకలతో నిండి, వాసనలతో నిండి, మనస్సు కంపు కొడుతున్నది. తన స్వచ్చమైన స్వభావాన్ని ప్రతిఫలించలేక పోతున్నది. దానిని శుభ్రం చెయ్యగలిగితే, ఎంగిలిని కడిగి వెయ్యగలిగితే, పళ్ళెం మళ్ళీ మిలమిలా మెరుస్తుంది. అలా శుభ్రం చెయ్యటమే సాధన. నిరంతరం ఎరుకతో ఉండటమే సాధన. అలా చెయ్యటం ద్వారా మనస్సుఅనే పళ్ళెం శుభ్రం చెయ్యబడుతుంది.

నిరంతరం ఎరుకతో బ్రతకటం ద్వారా, ఊహల్లో విహరించకుండా తన ఎదురుగా ఉన్న పనిని చెయ్యటం ద్వారా వర్తమానం లో జీవించమని జోషు ఒక గొప్ప ఉపదేశం ఇచ్చాడు. శిష్యుడు ధ్యానం లో మొదటి సూత్రాన్నికోరుకున్నాడు. కాని జోషు అతనికి అంతిమ సూత్రాన్ని ఉపదేశం చేశాడు.

జెన్ లో ఎన్నో అడుగులు ఉండవు. ఒకే అడుగుతో గమ్యాన్ని చేరుకోవచ్చు. జెన్ లో ప్రధమ ఉపదేశమే అంతిమఉపదేశం. ఎవరి పళ్ళెం వారు శుభ్రం చేసుకుంటే సర్వం సమాప్తం అవుతుంది. ఇక తర్వాత మిగిలేది మౌనమే. తన స్వస్తితిలో నిరంతరమూ ఉండగలిగితే ఇక చెయ్యటానికి ఏమున్నది? పొందగలిగేది ఏమున్నది?

read more " జెన్ కథలు - పళ్ళెం శుభ్రం చెయ్యి "