“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, అక్టోబర్ 2023, మంగళవారం

అగమ్య పయనం

ప్రతి చంటిపాప లోనూ ఒక అన్వేషణ

ప్రతి కంటిచూపు లోనూ ఒక ఆవేదన

ఈ అన్వేషణ దేనికోసం?

ఈ ఆవేదన ఎందుకోసం?


ప్రతి మనిషి బ్రతుకూ ఒక వెలితే

ప్రతి మనసు లోనూ ఒక చరితే

ఈ బ్రతుకు లెందుకోసం?

ఈ మనసుకేది  గమ్యం?


ప్రతి కాలూ పయనిస్తూనే ఉంది

ప్రతి కన్నూ పరికిస్తూనే ఉంది

ఈ పయనాలెక్కడికి?

ఈ పరికింపు దేనికని?


ప్రతి రోజూ ఆయువును తరిగిస్తుంది

ప్రతి మోజూ ఓపికను కరిగిస్తుంది

ఈ రోజుల రహస్యమేమిటి?

ఈ మోజుల అసహ్యమెప్పటికి?


ప్రతి వేకువా ఒక వెలుగును తెస్తుంది

ప్రతి వెన్నెలా ఒక జిలుగుల నిస్తుంది

ఈ వేకువలెంత సేపు?

ఈ వెన్నెల లెంతవరకు?


ప్రతి జీవితమూ చావునే వరిస్తుంది

ప్రతి మరణమూ ఒక జన్మను తెరుస్తుంది

ఈ జీవి పయనం దేనికోసం?

ఈ జన్మవలయం ఎంతకాలం?

read more " అగమ్య పయనం "

24, అక్టోబర్ 2023, మంగళవారం

వీధి కుక్కల దాడికి బిజినెస్ టైకూన్ మృతి - It happens only in India

ఇండియాలో అనేక నమ్మలేని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. వాటికుండే కారణాలు మాత్రం చాలాసార్లు అధికారవ్యవస్థ యొక్క నిర్లక్ష్యధోరణి, ప్రజల యొక్క బాధ్యతలేని లేకి ప్రవర్తనలే అయి ఉంటాయి.

ఈ దేశాన్ని బాగుచెయ్యడం చాలా కష్టం.

వీధికుక్కలు రోడ్లమీద చిన్నపిల్లల్ని దాడిచేసి చంపెయ్యడం మన సిటీలలో టౌన్స్ లో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అదొక న్యూసే కాదు. దానినెవరూ పట్టించుకోరు కూడా. కానీ నేడు పరాగ్ దేశాయ్ అనబడే గుజరాతీ బిజినెస్ టైకూన్ వాటిబారిన పడ్డాడు. ఇతను వాఘ్ బక్రీ టీ కంపెనీకి అధిపతి. ఈ కంపెనీ వార్షిక టర్నోవర్ రెండువేల కోట్లు. అలాంటి వ్యక్తి వీధి కుక్కలకు బలయ్యాడు. ఎదుటి మనిషి సామాన్యుడో, అసామాన్యుడో వాటికేం తెలుసు? రోడ్డుమీద పోతున్న ఎవరైనా వాటికి ఒకటే.

అయినా సరే, యానిమల్ యాక్టివిస్ట్ లు ఏమీ మాట్లాడరు. పాలస్తీనా చేసిన దారుణాలను ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు సమర్ధించినట్లే ఇది కూడా జరుగుతూ ఉంటుంది.

ఇది జరిగింది ఎక్కడో కుగ్రామంలో కాదు. ఇండియాలోని పెద్ద సిటీలలో ఒకటైన అహమ్మదాబాద్ లో. తన ఇంటిబయట మార్నింగ్ వాక్ చేసున్న పరాగ్ దేశాయ్ ని వీధికుక్కలు వెంటపడి దాడిచేశాయి. ఆయన భయపడి పరిగెత్తి క్రింద పడిపోయాడు. తలకు గాయమైంది. బ్రెయిన్ హేమరేజ్ జరిగింది. కోమాలోకి పోయాడు. ICU లో వారం ఉండి ఆదివారంనాడు చనిపోయాడు. ఈయన వయసు కేవలం 49 ఏళ్ళు.

వీళ్ళ కుటుంబం నాలుగు తరాలనుంచి టీ బిజినెస్ లో ఉంది. ఈయన నాలుగో తరం వాడు. న్యూయార్క్ దగ్గర లాంగ్ ఐలెండ్ యూనివర్సిటీలో మేనేజిమెంట్ చదువుకున్నాడు. 1995 లో తన తండ్రి నడుపుతున్న ఈ కంపెనీలో అడుగుపెట్టాడు. అప్పటికి దాని టర్నోవర్ 100 కోట్ల లోపే. తన ప్లానింగ్ తో, నేడు దానిని 2000 కోట్లకు తెచ్చాడు. మార్కెటింగ్, సేల్స్, ఎక్స్ పోర్ట్ అన్నీ తనే చూసుకునేవాడు. కానీ అర్ధాంతరంగా వీధికుక్కలకు బలయ్యాడు.

ఒలింపిక్ రన్నింగ్ ఛాంపియన్, తన ఇంటిముందు మురికికాల్వలో కాలుజారి పడి చనిపోయినట్లుగా ఇది ఉంది. ఎంతటి ఖర్మ?

ప్రతీకంపెనీకి ఉన్నట్లే వీళ్ళ కంపెనీకి కూడా CSR (Corporate Social Responsibility) ఉంది. దానిక్రింద వందలాది కోట్లు ఖర్చుపెట్టి సేవా కార్యక్రమాలు చేసేవాడు. బ్లైండ్ పీపుల్ అసోసియేషన్ కు, 'జీవదయ' అనబడే జంతుసంరక్షణా సంస్థకు, ఇంకా అనేక సేవా సంస్థలకు బాగా విరాళాలు ఇచ్చేవాడు. కానీ అదే జంతువుల చేతిలో చివరకు బలై పోయాడు.

ఈయనను వీధికుక్కలు వెంటాడి దాడిచేసిన సంఘటన సరిగ్గా ఈ నెల 15 తేదీన జరిగింది. అది అమావాస్య మరుసటి రోజు. మానవజీవితంపైన గ్రహప్రభావాల గురించి, అమావాస్య పౌర్ణముల ప్రభావం గురించి  పదేళ్లనుంచీ నేను వ్రాస్తున్నాను, దానికి ఇది ఇంకొక రుజువు.

అమావాస్య పౌర్ణముల ఛాయలలో మనుషులు అతలాకుతలం అవుతారు. జంతువులు ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ అవుతాయి. ఆ సమయంలో వాటితో జాగ్రత్తగా ఉండాలి. అది వాటి మేటింగ్ సీజన్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి.

వీధికుక్కలపైన ఎవరూ జాలి చూపకూడదు. వాటిని నిర్మూలించాలి. లేకపోతే మనుషులు రోడ్లపైన తిరగలేని పరిస్థితి వస్తుంది. ఒంటరిగా ఉన్న చిన్నపిల్లలను, ఆడపిల్లలను జంతువులు ఎటాక్ చేస్తాయి. ముఖ్యంగా అవి వైల్డ్ యానిమల్స్ అయినప్పుడు, గుంపులుగా తిరుగుతున్నప్పుడు మరీ ప్రమాదకరంగా ఉంటాయి. కనుక వాటి విషయంలో PETA లాంటి సంస్థలు చెప్పే దయ, జాలి లాంటి కబుర్లు పనికిరావు.

ఒక సంపన్న కుటుంబంలో పుట్టి, అమెరికాలో చదువుకుని, తమ కంపెనీని అత్యున్నత శిఖరాలకు తీసికెళ్ళిన ఒక వ్యాపారవేత్త, మంచిమనిషి ఈ విధంగా వీధికుక్కల దాడికి బలైపోయాడు. ఇది బాధాకరం కాదా?

It happens only in India !

అయినా ఎవరికీ చీమ కుట్టదు. ఈ దేశంలో ఏమి జరిగినా ఎవరికీ ఏమీ పట్టదు. మళ్ళీ జనజీవనం యధావిధిగా సాగిపోతూనే ఉంటుంది. రేప్పొద్దున మళ్ళీ క్రొత్త న్యూస్ కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. కానీ దానినుంచి ఏమీ నేర్చుకోదు. ఇదింతే.

పచ్చి స్వార్థం, బాధ్యతారహిత ప్రవర్తన - ఇవి రెండే మనదేశపు అధికారులలోను, ప్రజలలోను కనిపించే సద్గుణాలు !

ఈ సంఘటన ఇస్కాన్ టెంపుల్ ఉన్న వీథిలో జరిగిందని న్యూస్ చెబుతోంది. వారికి భూతదయ, జాలి ఎక్కువ కదా! వీధికుక్కలకు రోజూ ఆహారం పెట్టి పోషిస్తున్నారేమో? అవి ఇలా చేశాయి. ఈ సంఘటనలో వీరియొక్క indirect పాత్ర ఎంతో ఎవరికీ తెలీదు !

ఈ సంఘటన జరిగిన ఈ నెల 15 వ తేదీన ఉన్న గ్రహస్థితిని పైన ఇచ్చాను చూడండి.

  • కుజశనుల మధ్యన చాలా దగ్గరి డిగ్రీదృష్టి ఉంది. ఇది యాక్సిడెంట్లకు కారణమౌతుందని మెడికల్ ఎస్ట్రాలజీ   పుస్తకంతో సహా ఎన్నోచోట్ల గతంలో వ్రాశాను. మళ్ళీ రుజువైంది.
  • రాహుకేతువులు సున్నా డిగ్రీలలో ఉంటూ, కొద్ది రోజులలో రాశులు మారబోతున్నారు. వీరి రాశిసంధి స్థితి మంచిది కాదు. ఇలాంటి సంఘటనలే జరుగుతాయి.
  • నీచస్థితికి దగ్గరగా ఉన్న చంద్రునికి మీనంలో ఉన్న నెప్ట్యూన్ తో ఖచ్చితమైన డిగ్రీదృష్టి ఉంది. ఈ స్థితి,  మనుషులలోను,జంతువులలోను విపరీత దూకుడు ప్రవర్తనను ప్రేరేపిస్తుంది. ఇది కొన్ని వేల జాతకాలలో రుజువైన సత్యం.
  • కన్యలోని సూర్యునికి మేషంలోని యురేనస్ కు ఖచ్చితమైన డిగ్రీదృష్టి ఉంది. ఇదికూడా పై విధంగానే పనిచేస్తుంది.
  • ఆ రోజు అమావాస్య తరువాత పాడ్యమి. అంటే, అమావాస్య షాడో నడుస్తోంది.

ఇంకా కారణాలు కావాలా? మనుషులపైన, జంతువులపైనా గ్రహప్రభావం ఉందా లేదా? మీరే చెప్పండి !

పరాగ్ దేశాయ్ జాతకం ఎక్కడా దొరకలేదు. కనీసం జననతేదీ కూడా దొరకడం లేదు. దొరికితే, ఈ సంఘటన వెనుక ఉన్న కనిపించని కారణాలను ఇంకా స్పష్టంగా చెప్పడం వీలవుతుంది.

ఈయనకు ప్రస్తుతం 49 ఏళ్ళు అంటున్నారు. అంటే 1973 లేదా 1974 లలో పుట్టి ఉండాలి. అప్పుడు రాహుకేతువులు నీచస్థితులలో ఉన్నారు. 1973 లో అయితే, ధనుస్సు - మిధునాలలో ఉన్నారు. 1974 అయితే వృశ్చిక - వృషభాలలో ఉన్నారు.  రాహువుకు నీచభంగం జరిగి ఉంటుంది. అందుకే సంపన్నకుటుంబంలో పుట్టి అమెరికాలో చదువుకున్నాడు. కానీ ఇతర గ్రహస్థితులు బాగుండి ఉండవు. అలాగే కేతువుకు నీచభంగం జరిగి ఉండదు. కేతువు కుక్కలకు కారకుడు. అందుకే చివరకు ఇలా చనిపోయాడు.

ఇండియాలో మనుషుల జనాభా మాత్రమే కాదు, కుక్కల జనాభా కూడా బాగా తగ్గాలి. ప్రస్తుతం ఇది అత్యవసరం. పొద్దున్నే రోడ్లపైన వాకింగ్ చేసేవారికి రెండో విషయం బాగా తెలుసు కదూ !

మనిషి జీవితంలో అన్నీ పర్ఫెక్ట్ గా ఎవరికీ ఉండవు, జరగవు. ఒకటి బాగుంటే నాలుగు బాగుండవు. ఇది ప్రతివారి జాతకంలోనూ ఉంటుంది. కాకపోతే, అనంత వైవిధ్యాలతో కూడిన మనిషి జీవితం అతని జాతకంలో స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. మీకు  అర్ధమైనా, అర్ధం కాకపోయినా, ఇది సత్యం.

ఏదేమైనా, మనిషి జీవితం ఎలా ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే, ఎంతటివారికైనా సరే, అహంకారం ఎంతమాత్రమూ మంచిది కాదనేది అర్ధం చేసుకోవాలి.

ప్రతిమనిషి జీవితమూ చివరకు విషాదాంతమే అవుతుంది. సుఖాంతం ఎవరికీ ఉండదు. అలా ఉంటుంది అనుకోవడం కేవలం భ్రమ మాత్రమే.

అనేక జీవిత సత్యాలలో ఇదీ ఒకటి.

బీ కేర్ ఫుల్ !

read more " వీధి కుక్కల దాడికి బిజినెస్ టైకూన్ మృతి - It happens only in India "

23, అక్టోబర్ 2023, సోమవారం

RIP Samantha Woll

శుక్రవారం నాడు, డెట్రాయిట్ డౌన్ టౌన్ లో, సమంతా ఓల్ అనే యూదు వనిత హత్య చేయబడింది. ఆమె ఉంటున్న ఇంటిలోనే ఈ సంఘటన జరిగింది. చాలా కత్తిపోట్లు ఈమె ఒంటిమీద కనిపించాయి. ఈమెకు 40 ఏళ్ళు. ఈమె డెట్రాయిట్ సినగాగ్ కు ప్రెసిడెంట్ గా పని చేస్తోంది. ముస్లిం జ్యూవిష్ కౌన్సిల్ అనేదానిని డెట్రాయిట్లో స్థాపించి ఇస్లాంకు జుడాయిజంకు మధ్యన స్నేహాన్ని పెంచాలని ఈమె చాలా ప్రయత్నించింది.  సోషల్  ఇష్యూల మీద చురుకుగా పనిచేసే వ్యక్తి. చిన్నవయసులోనే డెట్రాయిట్ డౌన్ టౌన్ ప్రాంతాలలో రాజకీయంగా ఎదుగుతున్న ఒక సెలబ్రిటీ యూదుమహిళ. అర్ధాంతరంగా ఈమె జీవితం ఇలా ముగిసింది.

ప్రస్తుతం జరుగుతున్న హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం చీకటినీడలు అమెరికాకు కూడా పాకాయని చెప్పడానికి ఈ దురదృష్ట సంఘటన ఒక ఉదాహరణ.

అమెరికాలోని  న్యూయార్క్ లో ఇంకా ఇతర ప్రాంతాలలో, పాలస్తీనాకు సపోర్ట్ గా, ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా, చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాలలో వేలాదిమంది పాలస్తీనా సపోర్టర్స్ ఉన్నారు. ధర్నాలు, శాంతియుత ఆందోళనలు జరగవచ్చు. తప్పులేదు. కానీ ఈ విధంగా మనుషులను టార్గెట్ చేసి చంపడం మాత్రం చాలా దారుణం. ఇలాంటి టెర్రరిస్ట్ కార్యకలాపాలు డెట్రాయిట్ కు కూడా పాకడం దురదృష్టకరం.

ఈ హత్య వెనుక ఇతర కారణాలు కూడా ఉండి ఉండవచ్చు. కానీ, ఈమె యూదు వనిత కావడం మాత్రం, అనుమానాన్ని మతకోణం వైపే చూపిస్తోంది.

ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు 24 గంటల లోపే కేసును ఛేదించే అమెరికా పోలీసులు కూడా ఆధారాలు దొరకలేదని అంటున్నారంటే అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి.

ఈ పోకడలు డెట్రాయిట్ లో  అతిత్వరలో రాబోతున్నాయని నేను గత ఏడాది అక్కడున్నపుడే ఊహించాను. అక్కడ డియర్ బార్న్ అనే సిటీలో ముస్లిం జనాభా చాలా ఎక్కువ. మనం అక్కడకెళితే హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ఉన్నట్లు అనిపిస్తుంది.

అమెరికాలో అతి ఎక్కువ ముస్లిం జనాభా డెట్రాయిట్ లోనే ఉంది. ఇస్లామిక్ తీవ్రవాదం కూడా ఇక్కడే పాకుతోంది. దీనికి లేటెస్ట్ రుజువే సమంతా వోల్ హత్య.  

2022 లో నేను అమెరికాలో ఉన్నపుడు ఒక ఇంటర్ ఫెయిత్ మీటింగ్ కు వెళ్ళాను. అది 'షారె జెడెక్' అనే డెట్రాయిట్ జ్యూవిష్ సెంటర్ లో జరిగింది. దాని వివరాలు ఇక్కడ చూడండి.

డెట్రాయిట్ లో పద్మా కుప్పా అని ఒక తెలుగు మహిళ రాజకీయాలలో ఉన్నారు.. ఈమె 41 హౌస్ డిస్ట్రిక్ట్ నుండి Michigan House of Representatives లో మెంబర్ గా ఉన్నారు. ఈమె ఎన్నికలలో పోటీ చేసినపుడు సమంతా కూడా ఈమెకు మద్దతుగా ప్రచారం చేసింది. పద్మా కుప్పా గారికి డెట్రాయిట్ లోని యూదులతో మంచి రిలేషన్ ఉంది. 

నేను వెళ్ళిన ఇంటర్ ఫెయిత్ మీటింగ్ కు పద్మా కుప్పా కూడా వచ్చారు. సమంతా కూడా వచ్చి ఉండవచ్చు. ఆ మీటింగ్ కు నన్ను ఆహ్వానించిన నారాయణస్వామి గారు, కొంతమంది యూదు ప్రముఖులను నాకు పరిచయం చేశారు. వారిలో సమంతా కూడా ఉన్నదేమో నాకు ప్రస్తుతం గుర్తులేదు.

హిందువులకు యూదులకు స్నేహం బాగానే కుదురుతుంది. కానీ యూదులకు ముస్లిములకు కుదరదు. ఆ మాటకొస్తే ముస్లిములకు ఎవరితోనూ స్నేహం కుదరదు. మతం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. ఆ రోజున లోకల్ ముస్లిం లీడర్స్ ను కొంతమందిని కూడా స్నేహపూర్వకంగా ఆ మీటింగ్ కు యూదులు ఆహ్వానించారు. ఆ రోజున ఆ హడావుడీ అదీ చూస్తుంటే, 'వీళ్ళమధ్య స్నేహం నిజంగా కుదురుతుందా? ఇదంతా ఉత్త ప్రచారపు ఆర్భాటమేనా లేక ఈ రెండు మతాల మధ్యన ఎప్పటికైనా అసలైన సయోధ్య ఏర్పడుతుందా?' అన్న అనుమానం నాలో ఆరోజునే తల ఎత్తింది. మౌనంగా ఆ మీటింగ్ ను, వాళ్ళ ఉపన్యాసాలను గమనిస్తూ ఉండిపోయాను. అప్పుడు నాకేమనిపించిందో ఆ పోస్ట్ లోనే వ్రాశాను చదవండి.

ఈరోజున ఇలాంటి న్యూస్ వినవలసి రావడం చాలా బాధాకరంగా ఉంది. ఆ రోజున నాలో తలెత్తిన భావాలు, ఏడాది తిరగకుండా నేడు నిజం కావడం గమనించవచ్చు.

ఇస్లామిక్ తీవ్రవాదం ఇంకా ఎన్ని దేశాలలో పాకుతుందో, ఎంతమంది అమాయకులను మంచి మనుషులను హతమారుస్తుందో, అసలు ఈ వైరస్ భూమిపైన ఎందుకు పుట్టిందో ఆ దేవుడికే తెలియాలి.

ఎప్పటినుంచో భారతదేశం ఈ సమస్యను ఎదుర్కుంటోంది. ఇప్పుడు యూరప్, అమెరికాలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. పరిష్కారం ఎప్పుడో?

సమంతా వోల్ ఆత్మకు శాంతి కలగాలని ఈశ్వరుడిని ప్రార్ధిస్తున్నాను.

read more " RIP Samantha Woll "

12, అక్టోబర్ 2023, గురువారం

ఇండియా ఇజ్రాయెల్ అనుబంధం

అక్టోబర్ 7 వ తేదీ. ప్రపంచచరిత్రలో మళ్ళీ ఒక దుర్దినం.

యామ్ కిప్పుర్ పండుగ జరుపుకుంటున్న యూదుల పైన పాలస్తీన్ తీవ్రవాదులు దాడిచేసి దాదాపు 1500 మందిని దారుణంగా చంపేశారు. 

పాలస్తీన్ పక్కా ముస్లిమ్ దేశం. ఇజ్రాయెల్ చూద్దామంటే పక్కా యూదు దేశం.

అసలీ గొడవ ఇజ్రాయెల్ పుట్టిన 1948 నాటినుండి ఉంది. గతంలో కూడా 1967 లో 1973 లో వీళ్ళమధ్య యుద్ధాలు జరిగాయి. పాలస్తీనాకు అరబ్ దేశాలు, ఇతర ముస్లిం దేశాలు సపోర్ట్. ఇజ్రాయెల్ ఒంటరిది. ఒక్క అమెరికా తప్ప గట్టి సపోర్ట్ లేదు. కానీ చుట్టూ ఉన్న ముస్లిం దేశాలతో ఒంటరి పోరాటం చేస్తూ వచ్చింది.

50 ఏళ్ల క్రితం, 1973 లో కూడా ఇజ్రాయెల్ ఇదే యామ్ కిప్పుర్ పండగను జరుపుకుంటున్న సమయంలోనే పాలస్తీనా దాడిచేసింది. ఇజ్రాయెల్ మొదట్లో ఖంగుతిన్నప్పటికీ, తేరుకుని ఎదురుదాడి చేసి యుద్ధాన్ని గెలిచింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.

ఈ సారి పాలస్తీనా ముప్పేట దాడి చేసింది. గాజా బార్డర్ అంతా వైర్ కంచెతో మూయబడి ఉంటుంది. జీపులలో దాన్ని పగలగొట్టి బార్డర్ దాటి పాలస్తీనా ఎటాక్ చేసింది. బోట్స్ లో జలమార్గం గుండా కొంతమంది వచ్చారు. గ్లైడర్స్ మీద ఎగురుకుంటూ కొంతమంది వచ్చారు.  అందరూ కలసి ఆదమరచి పండుగ చేసుకుంటున్న ఇజ్రాయెల్ మీద దాడి చేసి దారుణాతి దారుణంగా దొరికినవారిని దొరికినట్లు యూదులను చంపేశారు.

చిన్నపిల్లలను తలలు నరికి చంపారు. గర్భిణీ స్త్రీలను పొట్టలు చీల్చి చంపారు. మంచాలలో వీల్ చైర్లలో ఉన్న వృద్ధులను కాల్చి చంపారు. కనీసం పెంపుడు కుక్కలను కూడా వదలకుండా కాల్చేశారు. శవాల పక్కనే యూదు ఆడవాళ్ళను రేపులు చేశారు. వందలమందిని బందీలుగా పట్టుకుపోయారు.

ఆదమరచి ఉన్న  ఇజ్రాయెల్ ఉలిక్కిపడింది. యుద్ధాన్ని ప్రకటించింది. మూడే మూడు రోజులలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. దాడిచేసిన పాలస్తీనా టెర్రరిస్ట్ లందర్నీ మట్టుపెట్టింది. గాజా స్ట్రిప్ లో ఉన్న పాలస్తీనా నగరాలను బాంబింగ్ చేస్తున్నది. అక్కడున్న టెర్రరిస్ట్ స్థావరాలను, ఆయుధ స్టోర్స్ ను, ప్లానింగ్ సెంటర్స్ ను, ఇస్లామిక్ యూనివర్సిటీని, ఒక పెద్ద మసీదును అన్నింటినీ ధ్వంసం చేస్తున్నది. అవన్నీ పీనుగుల గుట్టలుగా మారుతున్నాయి.

అరబ్ దేశాలు, ఇతర ముస్లిం దేశాలన్నీ పాలస్తీనాకు సపోర్ట్ వస్తున్నాయి. విక్టిమ్ కార్డ్ బయటకు తీశాయి. మానవ హక్కులంటున్నాయి. అమాయక పౌరులను చంపకూడదు అంటున్నాయి. ఇస్లాం పద్దతి మొదట్నించీ ఇంతే. వాళ్ళు చేస్తే రైటు. ఎదుటివారు ఆత్మరక్షణ చేసుకుంటే అది నేరం. మానవహక్కుల ఉల్లంఘన !

ఇండియా మాత్రం ఓపెన్ గా ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తోంది. అమెరికా సంగతి చెప్పక్కర్లేదు. అమెరికా లా మేకర్స్ లో యూదులకు గట్టి పట్టు ఉంది. అమెరికాను నడిపిస్తున్నది యూదులే అని కూడా చెప్పచ్చు.  వారికీ అంత పట్టు సెనేట్ లో ఉంది. మనల్ని చూసి ఫ్రాన్స్ కూడా ఇజ్రాయెల్ కు సపోర్ట్ వచ్చింది. ఇండియా మిత్రదేశాలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి.

ఇదంతా ప్రపంచం గమనిస్తోంది. అందరూ న్యూస్ ఫాలో అవుతున్నారు. మానవత్వం ఉన్న ప్రతిమనిషీ ఇజ్రాయెల్ ను సపోర్ట్ చేస్తున్నాడు. కానీ అసలు విషయం అది కాదు.

అంత కిరాతకంగా, కనీసం పిల్లలు, ఆడవాళ్ళు అన్న కనికరం కూడా లేకుండా రాక్షసంగా యూదులను చంపితే, ఒక్క హిందువులు తప్ప ఇండియాలో కూడా దానినెవరూ తప్పు పట్టడం లేదు. కాంగ్రెస్ పార్టీ పాలస్తీనాను సపోర్ట్ చేస్తోంది.  అధికారం కోసం, ముస్లిం ఓట్లకోసం కాంగ్రెస్ ఎంతటి నీచానికైనా దిగజారుతుంది అనడానికి ఇదే రుజువు.

ఇక, ఇండియన్ ముస్లిముల సంగతి  చెప్పనే అక్కర్లేదు. వారి సపోర్ట్ పాలస్తీనాకే. విచిత్రం ఏంటంటే, చాలామంది ఇండియన్ క్రైస్తవులు కూడా పాలస్తీనా వైపే ఉన్నారు. మళ్ళీ వీళ్లంతా పొద్దున్న లేస్తే చర్చిలకు వెళ్లి, ఓల్డ్ టెస్టమెంట్ ను చదువుతారు. యూదులు ఊచకోతకు గురవుతున్నా వీళ్లకు చీమ కుట్టదు. ఇంకా ఇస్లాం వైపే ఉంటారు. మత మార్పిడులతో ఇండియాను నాశనం చెయ్యాలనే చూస్తుంటారు. ఈ విచిత్రం మాత్రం ఎప్పటికీ అంతుపట్టదు.

అసలు ఈ గొడవ కేవలం భూభాగం కోసం మాత్రమే కాదు. ఇది ఇస్లాం, యూదు మతాల మధ్యన వైరం. కారణం? ప్రపంచంలోని అన్ని మతాలనూ కాఫిర్ మతాలుగా ఇస్లాం అనుకుంటుంది. హిందువులు, బౌద్ధులు, జైనులు, యూదులు, క్రైస్తవులు అందరూ ఇస్లాంకు శత్రువులే. మనం వారిని భాయీ భాయీ  అనుకోవచ్చు. కానీ వాళ్ళలా అనుకోరు. ఖురాన్ ఒప్పుకోదు. అవసరార్ధం ఇతర దేశాలలో ఆయా మతస్థులతో కలిసి ఉన్నప్పటికీ, మౌలికంగా ఇస్లాం దృష్టిలో అన్ని ఇతర మతాలూ సైతాన్ ఆరాధనలే. ఏనాటికైనా నిర్మూలించబడవలసినవే.

యూదులను క్రైస్తవులను ఇతర కాఫిర్లను దొరికినవారిని దొరికినట్లు చంపమని ప్రేరేపించే టెర్రరిస్ట్ వాక్యాలు ఖురాన్లో చాలా ఉన్నాయి. అందుకని, ఎప్పటికైనా ప్రపంచమంతా ఇస్లాంకు శత్రువే.

హమాస్ చీఫ్ ఒక వీడియో రిలీస్ చేశాడు. దానిలో, ' ఏనాటికైనా భూగోళం మొత్తాన్నీ మేమే రూల్ చేస్తాం. వేరే మతం ఏదీ  భూమ్మీద ఉండటానికి వీలు లేదు. ఇజ్రాయెల్ తో ఇది మొదలు మాత్రమే. ఈ యుద్దాన్ని ప్రతిదేశానికీ విస్తరింపజేస్తాం' అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అయినా సరే, ఎన్నో దేశాలు గుడ్డిగా హమాస్ నే సపోర్ట్ చేస్తున్నాయి. గొర్రెలు కసాయినే కదా నమ్మేది?

హమాస్ అనేది ISIS కంటే ప్రమాదం అని నెతన్యాహు స్వయంగా బైడెన్ తో ఫోన్లో అన్నాడు.  నేనేమంటానంటే, HAMAS, LeT, IM. AL Qaida, ISIS లాంటి సంస్థలన్నీ ఒకే గొడుగు క్రింద పనిచేసే సంస్థలు. ఆ గొడుగు పేరు ఇస్లామిక్ టెర్రరిజం.  ఇది ప్రపంచానికే పట్టిన అతి పెద్ద పీడ.

అక్కడిదాకా ఎందుకు? మొన్నటికి మొన్న, హైద్రాబాద్ లో పాకిస్తాన్ శ్రీలంకల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగితే, 'పాకిస్తాన్ జీతేగా' అని నినాదాలు డీజేలో హోరెత్తాయి. అహ్మదాబాద్ హోటల్లో పాకిస్తాన్ క్రికెట్ టీం కు బాలీవుడ్ సాంగ్స్ తో, అమ్మాయిల అర్ధనగ్న డాన్సులతో స్వాగతం చెప్పారు. ఇంతకంటే చేతగానితనం, సిగ్గులేనితనం ఎవరికైనా ఉంటుందా? బీసీసీఐ అనేది 'బ్రోకర్ కమీషన్ కంపెనీ ఆఫ్ ఇండియా' అని పేరు మార్చుకుంటే బాగుంటుంది !

ఇండియా అన్ని రాష్ట్రాలలోను లవ్ జిహాద్ పేరిట వందలాది హిందూ అమ్మాయిలను మోసం చేస్తున్నారు. వీలైతే మతం మారుస్తున్నారు. లేదా  చంపేస్తున్నారు.

అలిఘర్ ముస్లిం యూనివర్సిటీ స్టూడెంట్స్, పాలస్తీనాకు మద్దతుగా ఇండియాలో ర్యాలీ నడిపారు. అదికూడా, మోడీగారు  'ఇండియా ఇజ్రాయెల్ వైపే' అని డిక్లేర్ చేశాక !

ఇప్పటికే బెంగాల్, కేరళ, యూపీ, గుజరాత్ లలో ముస్లిం జనాభా, లెక్కలకంటే చాలా ఎక్కువైపోయింది. పబ్లిగ్గా ఇండియాను వ్యతిరేకిస్తున్నవారు లక్షలలో ఉన్నారు. మళ్ళీ వీళ్ళందరూ ఇండియా పౌరులే. ముందు ముందు ఈ పోకడ ఇండియాలో చాలా సమస్యలను కొని తేబోతోంది 

ఇస్లామిక్ తీవ్రవాదం ఇండియాలో చాపక్రింద నీరులాగా వ్యాపిస్తోంది.  SIMI ని బ్యాన్ చేస్తే PFI అని పేరు మార్చుకుని కొత్త అవతారంలో వచ్చింది. దాన్ని బ్యాన్ చేస్తే  SDPI అంటూ ఇంకో రూపం తీసుకుంటోంది.  కాంగ్రెస్ కమ్యునిస్ట్ లిబరల్ పార్టీలు దానికి వంత పాడుతున్నారు.

ఇటువంటి ప్రతిపక్షాలతో, ఇటువంటి ప్రజలతో,  మనదేశం ఖచ్చితంగా ప్రమాదం వైపే ప్రయాణిస్తోంది. మనకు తోడుగా ఇజ్రాయెల్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడిన దేశాలు ప్రస్తుతం రెండే. ఒకటి ఇండియా. రెండు ఇజ్రాయెల్.

గ్లోబల్ గా చూచినా,  రష్యా కంటే కూడా మనకు ఇజ్రాయెల్ మంచి స్నేహితుడు. ఇండియాకూ ఇజ్రాయెల్ కూ దాదాపు ఒకే సమయంలో స్వతంత్రం వచ్చింది. గత 75 ఏళ్లుగా వాళ్ళూ మనలాగే ఇస్లాం తో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వాళ్ళకేమో పాలస్తీనా, మనకేమో పాకిస్తాన్. అప్పటినుంచీ అనేక సందర్భాలలో  ఇజ్రాయెల్ మనకు అండగా నిలబడింది.  1971 లో, 1999 లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధాలలో ఇజ్రాయెల్ మనకు సహాయం చేసింది 

ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేయడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. 

ప్రపంచంలోని ఏ దేశమూ యూదులకు నీడ నివ్వలేదు, తరిమి తరిమి కొట్టింది. మోషే కాలం నుండి యూదులు తమదంటూ ఒక ప్రాంతాన్ని వెదుక్కుంటూ సంచారజీవితం గడిపినవారే. ఆ క్రమంలో చెల్లాచెదురై అనేకదేశాలకు పారిపోయారు. ఒక్క ఇండియా తప్ప. ఏ దేశమూ వారిని ఆదరించలేదు. తప్పిపోయిన పన్నెడు తెగలు (The 12 lost tribes of Israel) ఇండియాకు చేరుకొని ఇక్కడ తలదాచుకుని ఇక్కడ ప్రజలుగా మారిపోయారని చరిత్ర నిరూపిస్తోంది. కాశ్మీర్లో ఈ తెగలు ఈనాటికీ ఉన్నారు. ఈ విషయం ఇజ్రాయెల్ కు తెలుసు. అందుకే దానికి ఇండియా అంటే గౌరవం.

పైగా ఇజ్రాయెల్, ఇండియా రెండు దేశాలు ఒకే శత్రువుతో పోరాడుతున్నాయి. ఇజ్రాయెల్ చుట్టూ, జోర్డాన్, లెబనాన్, ఈజిప్టు, సిరియా మొదలైన ముస్లిం తీవ్రవాద దేశాలున్నాయి. వీటికి వెనుకనుండి సపోర్ట్ గా ఇరాన్ ఉంది. ఇండియాకు చుట్టూ, పాకిస్తాన్, బాంగ్లాదేశ్,  ఆఫ్గనిస్తాన్, చైనా వంటి శత్రుదేశాలున్నాయి. వాటికి సపోర్ట్ కూడా ఇరానే. కనుక ఇండియా ఇజ్రాయెల్ రెండూ ఒకే పడవలో ప్రయాణిస్తున్నాయి. ఇవి మిత్రదేశాలు కావడం డెస్టినీ అని నేనంటాను.

మొత్తం మీద ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలవాలని, రాక్షసదేశాలు ఓడిపోవాలని మనమందరమూ కోరుకుందాం. ఏమంటే, హిందువులు ఇజ్రాయెల్ తో సహజంగా సహానుభూతిని పొందుతారు. దేశవిభజన సమయంలో జరిగిన మారణకాండ, ఆ తరువాత జరిగిన ఎన్నో మతకలహాలు, అల్లర్లు, గొడవలలో, ఇస్లాం అంటే ఏమిటో వారికీ బాగా అర్ధమైంది. ఇజ్రాయెల్ కూడా అంతే. అదికూడా మనలాగా ఇస్లాం బాధిత దేశమే. కనుక మన సపోర్ట్ ఇజ్రాయెల్ వైపే ఉంటుంది. 

కానీ ముందు ముందు పాకిస్తాన్ తోనో, చైనా తోనో యుద్ధం వస్తే, మన దేశపు ముస్లిములు మన దేశానికి  సపోర్ట్ చేస్తారా? చేస్తే ఎంతవరకు చేస్తారు అనేదే అసలు సమస్య !  

ఏమంటే, ఇజ్రాయెల్ లో 21 శాతం అరబ్బులున్నారు. కానీ వాళ్ళెవరూ ఆ దేశాన్ని సపోర్ట్ చేయరు.  శత్రుదేశాలనే సపోర్ట్ చేస్తారు. అదే విధంగా ఇండియాలో కూడా దాదాపు 25 శాతం ముస్లిములున్నారు. వీళ్ళు కూడా ఇండియాను సపోర్ట్ చెయ్యరు. ముస్లిములు ఏ దేశంలో ఉన్నా వాళ్ళ ఓటు మాత్రం ఖురాన్ కే, దానిలోని హింసపూరిత  మతవిద్వేషానికే ఉంటుందనేది సత్యం. ఈ విషయాన్ని అంబేద్కర్ కూడా వ్రాశాడు. 

కనుక, రేపు మనకు పాకిస్తాన్ లేదా చైనాలతో యుద్ధం వస్తే, లేదా సివిల్ వార్ వస్తే, పరిస్థితి ఏంటనేది ప్రశ్న ! ఇప్పటికే నార్త్ లో, హిందూ పండుగల ఊరేగింపులపైన ముస్లిములు రాళ్ల దాడులు చేస్తున్నారు. ఓపెన్ గా 'కాశ్మీర్ పాకిస్తాన్ లో కలవాలి' అని నినాదాలిస్తున్నారు. 

హైదరాబాద్ పాతబస్తీలోకి హిందువులు పోలేరు. అక్కడ బ్రతకలేరు. ప్రతి రాష్ట్రం లోనూ మిని పాకిస్తాన్ అనేది ఇప్పుడు ఒకటుంది. అది రోహింగ్యాల అడ్డాగా, క్రైమ్ అడ్డాగా ఉంటుంది. 2050 కల్లా ఇండియాను ఇస్లామిక్ దేశంగా మార్చాలన్నది వారి లక్ష్యం. ఇప్పుడే ఇండియాలో ఇలా ఉంటే,  ముందు ముందు పరిస్థితి ఏంటనేది అసలు ప్రశ్న !

ఇజ్రాయెల్ లో పాలకపక్షం, ప్రతిపక్షం ఒకటై, ఎమర్జెన్సీ ప్రభుత్వంగా ఏర్పడ్డాయి. మామూలు సమయాలలో వాటి మధ్య విభేదాలు ఉండవచ్చు. కానీ యుద్ధం వచ్చినపుడు వాటిని పక్కన పెట్టారు. ఒకటిగా దేశంకోసం పోరాడుతున్నారు. మన దేశంలోని రాజకీయపార్టీలకు ఈ మాత్రం బుద్ది, జ్ఞానం, సిగ్గు ఉన్నాయా?

పాలస్తీనా - ఇజ్రాయెల్ యుద్ధం నుంచి మనం  గుణపాఠాలు నేర్చుకోకపోతే మాత్రం ముందు మందు మన దేశంలో చాలా విధ్వంసం ఉంటుంది. ఇండియా ప్రజలు, ముఖ్యంగా హిందువులు చాలా నష్టపోవలసి వస్తుంది.

ప్రస్తుతం ఇజ్రాయెల్ లో జరుగుతున్నదే ముందుముందు ఇండియాలో జరుగవచ్చు.

కులాలకు రాజకీయపార్టీలకు అతీతంగా హిందువులు ఐకమత్యంతో ఉండవలసిన సమయం వచ్చేసింది. ఇంకా హిందువులు తెలివి తెచ్చుకోకపోతే మాత్రం భవిష్యత్తులో ఘోరంగా నష్టపోయేది వాళ్ళే.
read more " ఇండియా ఇజ్రాయెల్ అనుబంధం "