“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, జులై 2010, గురువారం

మార్స్ ఎఫెక్ట్

గత వారం రోజులనుంచీ కుజ శనుల మధ్యన దూరం తగ్గుతూ వస్తున్నది. దీనివల్ల అనేక దుస్సంఘటనలు జరుగుతాయి అని ముందే వ్రాశాను. దానికి నిదర్శనంగా వరుసగా రోజుకొక సంఘటనను వింటున్నాం.

నిన్న రాత్రి ముంబైలోని "కుర్లా" లో భవనం కూలి చాలా మంది దానికింద చిక్కుకుపోయారు. ఇదికూడా ముందే వ్రాసినట్లు "మ", "క" అనే అక్షరాలతో మొదలు కావడం గమనార్హం.

అసలు వింత ఇది కాదు. ఇండోనేషియా భూకంపం గాని, మర్గలా కొండల్లో కూలిన విమానం కాని, కుర్లాలో కూలిన భవనం కాని అన్నీ కుజ హోర లోనే జరిగాయి. ప్రతిరోజు ఈ ఒక్క గంట కాలం కుజుని ఆధీనంలో ఉంటుంది. ఆ సమయంలోనే ఈ ప్రమాదాలు జరగటం కూడా గమనించదగిన విషయం.

అంతే కాదు.గత కొద్ది రోజులుగా జరుగుతున్న కుజ శనుల కలయిక వల్ల అనేక మంది జీవితాలలో అనేక బాధలు కలుగుతూ ఉంటాయి. అవి ఈ క్రింది విధంగా ఉండవచ్చు.

౧. అనుకోకుండా వస్తువులు పాడైపోవటం, ముఖ్యంగా వాహనాలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, రిపేర్లు రావటం. అనవసరంగా డబ్బు ఖర్చు చేయవలసి రావటం.

౨.యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరగటం. ఈ సందర్భంగా, చిన్న చిన్న దెబ్బలు తగలటం కూడా యాక్సిడెంట్లేనని మరచిపోకండి.


౩.అనుకోకుండా కోపాలు పెరిగి చిన్న విషయానికి ఇతరులతో గొడవలు కావడం. తరువాత బాధ పడటం.


౪. అనారోగ్యాల వల్ల బాధలు రావటం. డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు.


౫. సంతానంతో చికాకులు


ఇవన్నీ కుజ శనుల కలయిక వల్లనే జరుగుతున్నాయి. ఎవరి జీవితాలలో వారు పరిశీలించుకోవచ్చు. తెలివైన వారు రెమెడీస్ పాటించి ఈ బాధలనుంచి విముక్తులు కావచ్చు. ఇదే జ్యోతిర్విజ్ఞానంలోని పరమ ప్రయోజనం.

సూచన: లగ్నము లేదా రాశి కన్యా, కుంభ,మేషములలో ఏదో ఒకటి అయిన వారికి ఈ ఫలితాలు జరుగుతాయి. ఒకటి లగ్నము ఒకటి రాశి అయినవారికి నూటికి నూరుపాళ్ళు జరుగుతాయి. చెడు దశలు జరుగుతున్న వారికి ఈ ఫలితాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని మరచిపోకండి.
read more " మార్స్ ఎఫెక్ట్ "

28, జులై 2010, బుధవారం

పాకిస్తాన్ లో కూలిన విమానం- మళ్ళీ నిజమైన జ్యోతిష్యం

రోజు బహుళ తదియ. అనగా పౌర్ణిమ నుంచి మూడోరోజు.

మొన్నటి పోస్ట్ లో ఇలా వ్రాశాను.

"గురు గ్రహం యొక్క కరుణా దృష్టి వల్ల ఎక్కడా పెద్దగా ప్రాణ నష్టం జరుగలేదు. కాని రోజునుంచి గురువు వక్రిస్తున్నాడు. అనగా రెట్రో మోషన్ లోకి పోతున్నాడు. అంటే రేపటినుంచి ఆయన రక్షణ ఉండదు. కనుక జరుగబోయే నష్టాలు రేపటినుంచి మొదలౌతాయి."

"ముఖ్యంగా జూలై 26 న కుజ శనులు ఒకే నక్షత్ర పాదంలోకి వస్తున్నారు. అనగా నవాంశ చక్రంలో కుంభరాశిలో కలిశి ఉంటారు. 27, 28 తేదీలలో వీరితో కేతువు కూడా కలుస్తున్నాడు.కనుక రేపటినుంచి, 28 తేదీలోపల ప్రమాద సూచక కాలంఅనిపిస్తున్నది."

ఈ రోజు పాకిస్తాన్ లోని మర్గలా కొండలలో ఎయిర్ బ్లూ కంపెనీ విమానం కూలిపోయింది. "పా"కిస్తాన్, "మ"ర్గలా, అనే పదాలు ప, మ అనే అక్షరాలతో మొదలు కావటం గమనించ గలరు.

మొన్న జరిగిన ఎయిర్ క్రాప్ట్ ప్రమాదాలలో పెద్దగా ప్రాణ నష్టం జరుగలేదు. కాని ఈ రోజు జరిగిన ప్రమాదం లో 152 మంది చనిపోయారు. ఒక్కరూ ప్రాణాలతో బతికి బయట పడలేదని అంటున్నారు. దీనికి కారణం 25 వ తేదీ నుంచి ఉపసంహరింపబడిన గురుగ్రహ అనుగ్రహమే.

వేద సమ్మతమైన జ్యోతిష్య జ్ఞానం అమోఘమైనది. దీనిలో ఇంకా రీసెర్చ్ జరిగాల్సి ఉన్నది. అదే జరిగితే ఖచ్చితంగా తేదీ,సమయం,ప్రదేశంతో సహా జరుగబోయే సంఘటనలు తెలుసుకోవచ్చు. దానికి సమయాన్ని వనరుల్ని వెచ్చించగల ఔత్సాహికులు కావాలి.

రీసెర్చ్ లో సహకరించడానికి ఎవరన్నా ముందుకొస్తున్నారా?
read more " పాకిస్తాన్ లో కూలిన విమానం- మళ్ళీ నిజమైన జ్యోతిష్యం "

26, జులై 2010, సోమవారం

"పంచవటి"- కొత్త గ్రూప్ మొదలైంది

మిత్రులారా.
"పంచవటి" పేరుతో కొత్త గ్రూప్ మొదలైంది. అదికూడా భారతజాతికి పరమగురువైన వ్యాసభగవానుని ఆరాధనా పుణ్యదినం అయిన గురుపూర్ణిమ (25-7-2010) రోజునే.

అనేకమంది మిత్రులు చాలా పేర్లు సూచించారు. అవన్నీ వాటి వాటి కోణాలలో బాగానే ఉన్నాయి. కాని మనం ఈ గ్రూపులో చర్చించబోయే విషయాలన్నిటినీ అవి ప్రతిబింబించటానికి వీలుగా ర్రూప్ పేరును "పంచవటి" అని పెట్టాను.

పంచవటి మహా పుణ్య స్థలి. శ్రీరామకృష్ణుని దివ్యసాధనలకు, దివ్యానుభవాలకు అది వేదిక, మౌన సాక్షి. అక్కడ సమస్త మతాలూ, యోగాలూ,తంత్రాలూ, సాధనా విధానాలూ సామరస్యంగా మిళితమైనాయి. అలౌకికానుభవాలు ఆవిష్కరించబడ్డాయి. అతీత శక్తులు దిగివచ్చి దర్శనమిచ్చాయి. అద్భుతాలు రోజువారీ సంఘటనల లాగా జరిగాయి. వివేకానందునివంటి మహనీయులు అక్కడనే రూపుదిద్దుకున్నారు.

అంతేకాక, నాకు ప్రవేశం ఉన్న అన్ని విద్యలను అయిదు ముఖ్యమైన శాఖలక్రింద అమర్చవచ్చు. ఆ విధంగా చూచినా పంచవటి అన్న పేరు బాగుంది. చాలామంది శ్రీవిద్య అనే పేరు బాగుందన్నారు. శ్రీ అనునది బ్రహ్మ వాచకము. శ్రీవిద్య అనగా బ్రహ్మ విద్య అని వేదము అర్ధం చెప్పింది. తంత్ర సాంప్రదాయం లో శ్రీవిద్యను స్వతంత్ర తంత్రము అని అంటారు. తంత్ర మార్గంలో శ్రీవిద్య అత్యున్నతమైనది. ఆ పేరు నాకు స్వతహాగా బాగా ఇష్టమే అయినప్పటికీ, నేను శ్రీవిద్యోపాసకుడనే అయినప్పటికీ, మన గ్రూపు లో చర్చించబడే విశయాల దృష్ట్యా ఆ పేరు సరిపోదని నాకనిపించింది. కనుక ఆ పేరును పక్కన ఉంచాను. "పంచవటి" అనే పేరును ఖాయం చేశాను.

నా భావాలు నచ్చినవారికి, నాతో రెగులర్ గా కాంటాక్ట్ లో ఉన్నవారికి ఇన్విటేషన్ పంపుతున్నాను. జాయిన్ కాగలరు. ఇతరులెవరైనా జాయిన్ కాగోరితే, నాకు ఈ మెయిల్ చెయ్యండి. వారికీ స్వాగతం చెబుతాను.
read more " "పంచవటి"- కొత్త గ్రూప్ మొదలైంది "

25, జులై 2010, ఆదివారం

ఇండోనేషియా భూకంపం-మళ్ళీ నిజమైన జ్యోతిష్యం

జ్యోతిష్య విద్య యొక్క మహాత్యం మళ్ళీ నిజమైంది. ఇది దైవిక మైన విద్య కనుక ఎన్ని సార్లైనా ఋజువౌతూనే ఉంటుంది. కళ్ళున్నవారు చూడవచ్చు.

మొన్న 20 వ తేదీన కన్యా రాశిలో జరుగబోతున్న కుజ శనుల యుతిని గురించి వ్రాస్తూ ఇలా వ్రాశాను.

కనుక తూర్పు దక్షిణ దిక్కులలోనూ, ఇవి రెండూ కలిసిన ఆగ్నేయ దిక్కులోనూ, లేక దక్షిణ పశ్చిమ దిక్కులు కలిసే నైరృతి దిక్కులోనూ భూ ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, భూకంపాలు,అగ్ని ప్రమాదాలు జరుగవచ్చు. ఇండోనేషియా, అండమాన్, భారత తూర్పు తీరం వెంబడి ఉన్న భూకంప ప్రభావిత ప్రమాద స్థలాలు మళ్లీ జాగృతం కావచ్చు.

ఏం జరిగిందో చూడండి.

ఈ రోజు గురుపౌర్ణిమ. నిన్న శనివారం ఉదయం ఇండోనేషియాలో, ఫిలిప్పైన్స్ లో పలుమార్లు భూకంపం వచ్చింది. రెచ్టర్ స్కేల్ మీద 7 పాయింట్లు నమోదైంది. అంతర్జాతీయ న్యూస్ లో ఈ విషయం చూడవచ్చు. ఈ విషయాన్ని జ్యోతిష్య విద్య అయిదురోజుల ముందే చెప్పగలిగింది.

అంతే కాదు. మిత్రులు జయదేవ్ గారు ఆ పోస్ట్ కు కామెంట్స్ వ్రాస్తూ ఇలా అన్నారు.

SANI RULES AIR,MARS RULES HIGH SPEED VEHICLES...SO DUE TO THIS Major FLIGHT/SPACE/CYCLONIC EVENTS ALSO WILL NoT B RULED OUT SARMA garu.

జయదేవ గారి ప్రిడిక్షన్ నూటికి నూరు పాళ్ళు నిజమైంది. నిన్న రెండు విమానాలు కూలిపోయాయి. ఒకటి కెనడాలో పైలట్ జెట్ విమానం .ఇంకొకటి బెంగాల్లో మిగ్-27. సైక్లోన్ వాతావరణం వచ్చేసింది. మన కళ్ళ ముందే ఇవన్నీ చూస్తున్నాం.

ఈ ప్రిడిక్షన్స్ నిజం కావటం ఒక అద్భుతం గా నేను భావిస్తున్నాను. కోట్లాది రూపాయల ఖర్చుతో నడుస్తున్న మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కాని, సీస్మోలాజికల్ డిపార్ట్మెంట్ కాని ఈ విషయాలను కనిపెట్టలేక పోయాయి. జ్యోతిర్విద్య యొక్క గొప్పదనాన్ని గురించి ఇంతకన్నా ఋజువు ఇంకేం కావాలి?

గురు గ్రహం యొక్క కరుణా దృష్టి వల్ల ఎక్కడా పెద్దగా ప్రాణ నష్టం జరుగలేదు. కాని ఈ రోజునుంచి గురువు వక్రిస్తున్నాడు. అనగా రెట్రో మోషన్ లోకి పోతున్నాడు. అంటే రేపటినుంచి ఆయన రక్షణ ఉండదు. కనుక జరుగబోయే నష్టాలు రేపటినుంచి మొదలౌతాయి.

జ్యోతిష్యం వ్యక్తిగత విషయాలనే కాదు, దేశాలకు సంబంధించిన విషయాలు కూడా చెప్పగలదు. దీనిలో గట్టి రీసెర్చ్ జరిగితే ఖచ్చితంగా దుర్ఘటనలు జరుగబోయే ప్రదేశం సమయం చెప్పవచ్చు. దీనిద్వారా నష్టం నివారించవచ్చు.

నిన్న శనివారం. శనిహోర లో, కుజ హోరలలోనే భూకంపాలు జరిగాయి. కుజ శనుల ప్రభావం వల్లనే ఇవి జరిగాయని ఇంతకన్నా ఋజువులు ఇంకా ఏమి కావాలి?

ఇంకా విచిత్రాలు చూడాలని ఉందా? అయితే వినండి. మొన్నటి పోస్ట్ లో ఇలా వ్రాశాను.

ప్రమాదాలు జరిగే ప్రదేశాలు,వాహనాలు etc, , , , , అనే అక్షరాలతో మొదలౌతాయి లేదా ఈ అక్షరాలతో సంబంధం కలిగి ఉంటాయి. వ్యక్తులలో కూడా ఆ అక్షరాలతో మొదలయ్యే పేర్లు గలవారికి (ముద్దుపేర్లకు కూడా) ఎక్కువగా ఈ ఫలితాలు వర్తిస్తాయి. వీరిలో కన్యా లగ్నం గాని, కన్యా రాశిగాని ఉన్నవారికి ఈ సరికే ఫలితాలు కనిపించడం మొదలయ్యి ఉంటుంది

ఏం జరుగుతున్నదో చూద్దామా? కెనడా విమాన ప్రమాదం లో తృటిలో తప్పించుకున్న పైలట్ పేరు బ్రియాన్ బూస్, మన దేశమ్ లో కూలిన మిగ్ విమానం బెంగాల్ లో బొత్ పుతి అని గ్రామం లో కూలింది.

భూకంపాలు వచ్చిన ప్రదేశాల పేర్లు చూద్దామా? ఫిలిప్పైన్స్ లొ మిండోనా ద్వీపం లోని కొటాబాబో అనే ఫ్రదేశం లో భూకంపం వచ్చింది.

ఆ అక్షరాలతో మొదలయ్యె పేర్లు ఉన్న అనేక మంది మిత్రుల జీవితాలలో గత వారం నుంచి అనారోగ్యాలు, చికాకులు, అనవసర గొడవలు మొదలయ్యాయని నాకు ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. ఇంతకంటే రుజువులు ఇంకేం కావాలి?

విమాన ప్రమాదాల గురించి, సైక్లోన్ గురించి కరెక్ట్ గా చెప్పిన మిత్రులు జయదేవ గారికి నా అభినందనలు. జయదేవ్ గారు. మనకు ఒకరి పొగడ్తలు అవసరం లేదు. ఆత్మ తృప్తి చాలు.

కొత్తగా మొదలయ్యే గ్రూపులో ఇటువంటి చర్చలు ముమ్మరంగా జరిగి ఇంకా విలువైన అనేక విషయాలు వెలుగు చూడాలని ఆశిస్తున్నాను.
read more " ఇండోనేషియా భూకంపం-మళ్ళీ నిజమైన జ్యోతిష్యం "

24, జులై 2010, శనివారం

త్వరలో మొదలయ్యే గ్రూప్ కు పేరు పెట్టండి

నా బ్లాగు సభ్యులు చాలామంది వారివారి జాతక సమస్యలతో నన్ను సంప్రదిస్తున్నారు. కాని వాటిని బ్లాగు ముఖంగా చర్చించటం భావ్యంకాదు. పర్సనల్ విషయాలు అందరికీ తెలియటం వారికి బాధ కలిగిస్తుంది కనుక బ్లాగులో వాటిని చర్చకు పెట్టరాదు. ఇంకా కొంతమంది, తంత్ర శాస్త్రం మొదలైన రహస్య విషయాలలో నిజమైన ఆసక్తి ఉన్నవారున్నారు. వారు బ్లాగు ముఖంగా ఆ విషయాలను అడగలేకపోతున్నారు. అడిగినా వాటికి బాహాటంగా బదులివ్వలేను.

ఇంకొక్క విషయం. జ్యోతిషవిద్య కంటే నాకు ఇంకా బాగా ఇష్టమైన తంత్ర శాస్త్రం,మంత్ర శాస్త్రం, రహస్యయోగక్రియలు, అతీత శక్తుల సాధన, పారానార్మల్ ఫినామినా, అక్కల్ట్ మొదలైన విద్యలున్నాయి. వాటిలోకూడా నాకు బాగా ప్రవేశం ఉందని చెప్పగలను. కాని వాటిని గురించి వ్రాస్తే సరిగా అర్ధం చెసుకునే వాతావరణం బ్లాగుల్లో కనిపించటం లేదు. నాలుగు ఇంగ్లీషు ముక్కలు వస్తే చాలు భారతీయమైనదంతా అనాగరికం, అశాస్త్రీయం అనుకునే వారి సంఖ్య బ్లాగుల్లో ఎక్కువగా ఉంది.

కనుక నా భావాలు నచ్చేవారి కోసం, "తంత్ర" మొదలైన రహస్య విషయాలు, వ్యక్తిగత విషయాల పైన, జ్యోతిష్య సమస్యలపైన లోతైన చర్చ కోసం ఒక గ్రూప్ మొదలు పెట్టబోతున్నాను. అందులో వ్యక్తిగత సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించడమేగాక, పైన చెప్పిన సబ్జెక్ట్ లలో లోతైన చర్చలు సాధ్యపడతాయి. నా బ్లాగు సభ్యులు అందులో వారి వారి సమస్యలు అడగవచ్చు. లిమిటెడ్ గ్రూప్ కనుక వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

అందులో జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్న బ్లాగర్లు అందరూ పాలు పంచు కోవచ్చు. సమస్యలకు వారి వారి సూచనలు తెలియ చెయ్య వచ్చు. సుహృద్భావ వాతావరణం లో చర్చలు కొనసాగించాలని ఈ ప్రయత్నం.

ఆ గ్రూప్ కు ఒక మంచి పేరు సూచించవలసిందిగా బ్లాగ్ మిత్రులను కోరుతున్నాను. అందరికీ నచ్చిన పేరు పెడదామని నా ఆలోచన. సూచనలకు ఇదే నా ఆహ్వానం.
read more " త్వరలో మొదలయ్యే గ్రూప్ కు పేరు పెట్టండి "

22, జులై 2010, గురువారం

జెన్ కధలు- సూర్యోదయం

అది జబల్‍పూర్ పట్టణం.

ఒక చలికాలం ఉదయం.ఇంకా చీకటి తెరలు తొలగలేదు.

ఇద్దరు వ్యక్తులు మౌనంగా నడుస్తున్నారు. ఒక అరగంట నడక తర్వాత ఊరి బయటికి చేరారు. అప్పటికి చీకటి తెరలు తొలగి తెలతెలవారుతున్నది. తూర్పున ఎర్రని సూర్యుడు ఉదయిస్తున్నాడు.చుట్టూ పచ్చని ప్రకృతి మనోహరంగా ఉన్నది. అప్పటిదాకా ఎవరూ మాట్లాడలేదు. ఇంతలో ఒకాయన " సూర్యోదయం ఎంత బాగుంది" అన్నాడు. "నువ్వింత వాగుడుకాయ వని తెలిస్తే నాతో రానిచ్చేవాణ్ణి కాదు. రేపటినుంచి నాతో వాకింగ్‍కి రావద్దు."అన్నాడు రెండో వ్యక్తి. ఆ రెండో వ్యక్తే ఓషో రజనీష్.

ఓషో రజనీష్ యువకునిగా ఉన్నపుడు జబల్‍పూర్ యూనివర్శిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్‍గా పనిచేశాడు. ఆ రోజుల్లో ఆయన చీకటితోనే లేచి, ఊరి బయటికి నడుచుకుంటూ వెళ్ళి ఉషోదయాన్నీ, ప్రకృతినీ ఆస్వాదిస్తూ, సూర్యోదయాన్ని తిలకించి వెనక్కు తిరిగి వచ్చేవాడు.

రజనీష్ కు పరిచయం ఉన్న ఒకాయన తాను కూడా వాకింగ్‍కు వస్తానని కోరాడు. రజనీష్ మొదట్లో ఒద్దన్నాడు. కాని ఆ వ్యక్తి మరీ మరీ కోరినమీదట సరే నన్నాడు. మరుసటిరోజు పైన వివరించిన ఘటన జరిగింది. ఆ తరువాత రోజునుంచీ రజనీష్ ఆయన్ను తనతో వాకింగ్‍కు రానివ్వలేదు.

ధ్యానుల యొక్క రసాస్వాదన చాలా గాఢంగా ఉంటుంది. వాళ్ళు సముద్రపు అడుగున
మునిగి ఈత కొట్టేవాని వంటివారు. మామూలు వ్యక్తుల యొక్క ఆస్వాదన పేలవంగా ఉంటుంది. వాళ్ళు పై పైన తేలుతూ ఉండే వాని వంటివారు. గాఢమైన ఏకాగ్రతలో తన్ను తాను మరిచినప్పుడే ఏ అనుభవమైనా అవధులు దాటిస్తుంది. ఆ స్థాయికి తగ్గిన అనుభవం చప్పగా ఉంటుంది.

ప్రాణం రెండు పనులను ఏకకాలంలో చెయ్యలేదు. చేసినా తాను రెండుగా చీలినప్పుడే రెండు పనులు చెయ్యగలదు కాని ఒక్కటిగా ఉండి రెండు పనులు చెయ్యలేదు. ఇది యోగులకు అనుభవ సిద్ధం. యోగులు ప్రకృతికి దూరంగా పోయేవారు కారు. వారిది ప్రకృతితో మమేకమైన జీవితం. నిజం చెప్పాలంటే, జీవితాన్ని ఒక ధ్యాని ఎంజాయ్ చేసినట్లు సామాన్యుడు చెయ్యలేడు. కారణం? ధ్యాని తన శక్తిని పూర్తిగా పణం పెట్టగలడు. తనను తాను పూర్తిగా మరచి ఒక అనుభవంలో లీనం కాగల శక్తి అతనికి సాధన ద్వారా కలుగుతుంది. కాని సామాన్యుడు అనేక భయాలు, ఆందోళనలు, సందేహాల వలలో చిక్కుకుని ఉంటాడు. అతను అమృతాన్ని తాగుతున్నా కూడా, అతని మనస్సు ఎక్కడొ ఉంటుంది కాబట్టి, ఆ రుచిని పూర్తిగా ఆస్వాదించలేడు. కాని ధ్యాని అయినవాడు, ఒకే ఒక్క పనిలో తన సర్వ శక్తులనూ ఇంద్రియాలనూ కేంద్రీకరించ గలడు. కనుక అతని అనుభవం మామూలు వ్యక్తి అనుభవం కంటే ఎన్నో రెట్లు గాఢంగా ఉంటుంది.

ఒక యోగి లేక ధ్యాని సూర్యోదయం వంటి ఒక మామూలు సంఘటనను ఎంతో ఎంజాయ్ చెయ్యగలడు. దానిలో లీనమై అతను ప్రపంచాన్ని దాటి పోగలడు. అటువంటి వాని పక్కన ఉన్న వారు అందుకే ఎంతో జాగరూకతతో ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే వారి వేవ్ లెంగ్త్ లు చాలా భిన్నంగా ఉంటాయి. అనవసరంగా వారిని డిస్టర్బ్ చేయని వారే వారితో ఉండగలరు.

రజనీష్ పక్కన ఉన్న వ్యక్తి కూడా సూర్యోదయాన్ని ఎంజాయ్ చేద్దామనే ఆయనతో అంతదూరం కలసి వచ్చాడు. కాని అతనికి దాన్ని ఎలా ఎంజాయ్ చెయ్యాలో తెలియదు. "సూర్యోదయం ఎంత బాగుంది?" అన్న మాట అతను అనవలసిన పని లేదు. అలా అంటున్న క్షణంలోనే ఆ అనుభవం నుంచి అతను దూరమౌతాడు. ఆ సున్నిత అనుభవం అతని నుంచి జారిపోతుంది.

బాహ్యంగా తన అనుభవాన్ని వ్యక్తపరచాలనే కోరిక ఆ అనుభవాన్ని అంతం చేస్తుంది. ఇది ఒక అంతరిక నియమం. నీకు సూర్యోదయం నచ్చితే దాన్ని మౌనంగా ఎంజాయ్ చెయ్యి. కాని అది ఎలా ఉందో ఎందుకు వ్యక్తపరుస్తున్నావు? నీ వ్యక్తీకరణ ఎవరికి కావాలి? అలా వ్యక్త పరచడం వల్ల నీవా అనుభవం నుంచి ఆ క్షణం లోనే దూరమౌతున్నావు. పక్కవాణ్ణి కూడా నీ స్థాయికి దిగలాగుతున్నావు.

ఇటువంటి మామూలు మనుషుల సాహచర్యం ధ్యానులు భరించలేరు. అది వారి నిమగ్నతను భంగపరుస్తుంది. మామూలుగా చూస్తే అతను అన్న మాట తప్పేం కాదు. కాని ఒక ధ్యానానుభవం లో ఉన్న వాని ఏకాగ్రతకు అది విసుగును కలిగిస్తుంది.కారణం? వారి అనుభవం యొక్క క్వాలిటీ భిన్నంగా ఉంటుంది. అది వీరికి అర్ధం కాదు. అందుకే, ధ్యానుల సాహచర్యం కోరేవారు వారి స్థాయిని అర్ధం చేసుకుని తదనుగుణంగా ఉండవలసి ఉంటుంది. అందుకోసం తన మనస్తత్వాన్ని ఎంతో మార్చుకోవలసి వస్తుంది. అందుకే అటువంటివారితో ఉండటం చాలా కష్టమైన పని.

రజనీష్ అతనికి "వాగుడుకాయ" అన్నాడు. మామూలు దృష్టికి ఈ మాట క్రూరంగా కనిపిస్తుంది. అతను అన్నమాటలో తప్పేముంది? అనిపిస్తుంది. కాని ధ్యానికి "సూర్యోదయం ఎంత బాగుంది" అనే చిన్న మాటకూడా ఆ క్షణంలో విసుగును పుట్టిస్తుంది. తానున్న హిమాలయ శిఖరాలనుంచి పాతాళానికి పడినట్లు అనిపిస్తుంది.

సతోరి అనేది ఒక సున్నితమైన అనుభవం. ప్రపంచం లోని అన్ని సున్నిత అనుభవాలలాగానే, ఇది కూడా చాలా సులభంగా జారిపోతుంది. దానిని చేరుకోవడం ఒక ఎత్తు అయితే దానిని నిలబెట్టుకోవడం ఇంకొక ఎత్తు. ఆ పనికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు అవసరం అవుతాయి. పూర్తిగా వర్తమానం లో ఉండి తనను తాను మరచిపోగలిగిన వానికి సతోరి అందుబాటులోకి వస్తుంది. "నేను" అనేది తలెత్తిన క్షణంలో అది జారిపోతుంది.

కనిపిస్తున్న సూర్యోదయాన్ని ఎంజాయ్ చెయ్యకుండా దానిని బయటకు చెప్పాలనుకున్న క్షణంలోనే ఆ వ్యక్తి మనస్సునుంచి ఆ సున్నిత అనుభవం జారిపోయింది. అప్పుడా మనసు వర్తమానాన్ని ఒదిలి బయటి ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. అంతేగాక పక్కవానికి కూడా ఏకాగ్రతను భంగపరుస్తుంది.

ఏ అనుభవమైనా మౌనంలోనే గాఢతను పొందుతుంది. అనుభవి మాయమవ్వగలిగితే అనుభవం హిమాలయ శిఖరాలను అందుకుంటుంది. ప్రపంచపు అవధులను దాటించగలుగుతుంది. అది ఒక గొప్ప అనుభవం కానక్కరలేదు. సూర్యోదయం వంటి అతి మామూలు, సామాన్య అనుభవం కూడా ధ్యానికి స్వర్గాన్ని చూపించగలదు. కాని దానిని ఎలా అందుకోవాలో తెలియాలి. ఎలా ఆస్వాదించాలో తెలియాలి.

అందుకే ధ్యానులు, జ్ఞానులు మౌనాన్ని ఆశ్రయిస్తారు. మౌనంలో, ఏకాంతంలో ఉన్న ఆనందం విలువ వారికి తెలుస్తుంది.
read more " జెన్ కధలు- సూర్యోదయం "

20, జులై 2010, మంగళవారం

కన్యా రాశిలో కుజ శనుల యుతి- ప్రమాద ఘంటికలు

రోజునుంచీ అంగారకుడు (కుజుడు) కన్యా రాశిలో ప్రవేశిస్తున్నాడు. కన్యారాశిలో శనీశ్వరుడు ఇప్పటికే స్థితుడై దాదాపుగా ఆరు డిగ్రీలలో ఉత్తరా నక్షత్రంలో ఉన్నాడు. శని కుజుల యుతి విస్ఫోటనాలకు ప్రమాదాలకు దారితీస్తుంది అని ఇంతకు ముందు పోస్ట్ లలో కూడా వ్రాశాను.

రాబోయే 25 తేదీన ఆదివారం నాడు పౌర్ణమి తిధి వస్తుంది. రోజుకు కుజుడు ఉత్తర ఫల్గుణి రెండవ పాదంలో ప్రవేశిస్తూ శనీశ్వరునికి దగ్గరగా వస్తున్నాడు. సామాన్యంగా ఎనిమిది డిగ్రీల ఆర్బ్ రెండు గ్రహాల మధ్యన ఉంటే అవి ఒకదాని ప్రభావానికి ఒకటి లోనవటం జరుగుతుంది. తద్వారా ఆయా గ్రహాలచే సూచింపబడే ఘటనలు జరుగుతాయి.

గత రెండు మూడు రోజులుగా కుజ శనుల మధ్యన దూరం 8 డిగ్రీలకు వచ్చింది. జరుగుతున్న సంఘటనలు గమనిస్తే రాబోయే అయిదు రోజులలో ఏమేం జరుగబోతున్నాయో ఊహించవచ్చు. ఇరాన్ ఇరాక్ లో పేలుళ్ళు ప్రజల సామూహిక మరణాలు జరిగాయి. మొన్న రాత్రి బెంగాల్ లో ఘోర రైల్ ప్రమాదం జరిగి మళ్లీ సామూహిక జన నష్టం జరిగింది.

రాబోయే పౌర్ణమికి, అనగా 25-7-2010 కి రెండు మూడు రోజులు అటూ ఇటూగా ప్రమాదాలు జరుగుతాయి.అగ్నికి ఆజ్యం పోసినట్లుగా 25 తేదీనుంచి గురువు వక్రిస్తున్నాడు. కనుక ఆయన యొక్క రక్షణ ఉపసంహరింపబడుతుంది. ప్రమాదాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అవుతుంది.

కుజశనుల యుతి భూతత్వరాశి యగు కన్యలో జరుగుబోతున్నది. రవి యొక్క నక్షత్రమైన ఉత్తర ఫల్గునీలో జరుగుతున్నది. కనుక భూమి అగ్ని కలయికలతో ప్రమాదాలు సూచితం అవుతున్నాయి. కన్యారాశి దక్షిణ దిక్కుకు సూచిక.కుజుడు కూడా దక్షిణ దిక్కుకే సూచకుడు. రవి తూర్పు దిక్కుకు అధిపతి.శని పశ్చిమ దిక్కుకు అధిపతి. తూర్పు పడమరలు కలవవు. కాని రెండింటితో దక్షిణ దిక్కు కలుస్తుంది. కనుక తూర్పు దక్షిణ దిక్కులలోనూ, ఇవి రెండూ కలిసిన ఆగ్నేయ దిక్కులోనూ, లేక దక్షిణ పశ్చిమ దిక్కులు కలిసే నైరృతి దిక్కులోనూ భూ ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, భూకంపాలు,అగ్ని ప్రమాదాలు జరుగవచ్చు. ఇండోనేషియా, అండమాన్, భారత తూర్పు తీరం వెంబడి ఉన్న భూకంప ప్రభావిత ప్రమాద స్థలాలు మళ్లీ జాగృతం కావచ్చు.

కుజుడు కన్యారాశిలో సెప్టెంబర్ ఏడవ తేదీవరకు ఉంటాడు. అప్పటివరకూ గడ్డుకాలమే. ముఖ్యంగా జూలై 26 కుజ శనులు ఒకే నక్షత్ర పాదంలోకి వస్తున్నారు. అనగా నవాంశ చక్రంలో కుంభరాశిలో కలిశి ఉంటారు. 27, 28 తేదీలలో వీరితో కేతువు కూడా కలుస్తున్నాడు.

కనుక
రేపటినుంచి, 28 తేదీలోపల ప్రమాద సూచక కాలం అనిపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రమాదాలు పైనసూచించిన దిక్కులలో జరుగవచ్చు. వ్యక్తిగతజాతకాలలో కుజ శనులు బాగా లేనివారు వారం రోజులు జాగ్రత్తగాఉండాలి. ముఖ్యంగా కన్యారాశి,ఉత్తరఫల్గునీ నక్షత్రంలో పుట్టినవారికి అనారోగ్యం,యాక్సిడెంట్స్ కావడం, శరీరానికి దెబ్బలు తగలడం,ఉత్తపుణ్యానికి ఇతరులతో తగాదాలు జరుగవచ్చు. ఎందుకనగా వారి నక్షత్రంలోనే ఈ గ్రహకలయిక జరుగుతున్నందున ఫలితాలు వీరిమీద ఎక్కువగా ఉంటాయి. కాని భయపడవలసిన పని లేదు. మంత్ర జపం, దైవ స్మరణ చేసుకుంటూ, అతి జాగరూకతతో, రాగ ద్వేషాలకు లోనుకాకుండా ఉండాలి. లేనిచో ప్రమాదాలకు లోనవుతారు. తస్మాత్ జాగ్రత.

P.S: ఒక్క విషయం మరిచాను. ప్రమాదాలు జరిగే ప్రదేశాలు,వాహనాలు etc, క, గ, ప, బ, మ అనే అక్షరాలతో మొదలౌతాయి లేదా ఈ అక్షరాలతో సంబంధం కలిగి ఉంటాయి. వ్యక్తులలో కూడా ఆ అక్షరాలతో మొదలయ్యే పేర్లు గలవారికి (ముద్దుపేర్లకు కూడా) ఎక్కువగా ఈ ఫలితాలు వర్తిస్తాయి. వీరిలో కన్యా లగ్నం గాని, కన్యా రాశిగాని ఉన్నవారికి ఈ సరికే ఫలితాలు కనిపించడం మొదలయ్యి ఉంటుంది (గత రెండు మూడు రోజులనుంచి).
read more " కన్యా రాశిలో కుజ శనుల యుతి- ప్రమాద ఘంటికలు "

13, జులై 2010, మంగళవారం

జిల్లెళ్లమూడి స్మృతులు -1

పోయిన్నెలలో జిల్లెళ్ళమూడిలో ఒకరోజు ఉన్నాను. దానిక్కారణం తమ్ముడు చరణ్. నేను గుంతకల్ లో ఉన్నఫ్ఫటినుంచే చాలాసార్లు అంటుండేవాడు "అన్నగారు. మీరు సెలవులోవచ్చినపుడు ఒకరోజు మనం అమ్మదగ్గరికి పోయిరావాలి" అని.

రెండేళ్ళ క్రితం నేను గుంతకల్ కు పోక మునుపు ఒకటి రెండుసార్లు ఇద్దరం కలిసి జిల్లెళ్ళమూడికి పోయి వచ్చేవాళ్ళం. ఉదయాన్నే గుంటూరులో బయలుదేరిపోయి, రోజంతా అక్కడే ఉండి, రాత్రి కితిరిగి వచ్చేవాళ్ళం. కాని గుంతకల్ లో ఉన్న రెండేళ్ళలో ఎప్పుడు గుంటూరుకు వచ్చినా, జిల్లెళ్ళమూడి వెళ్ళటం వీలయ్యేది కాదు. శెలవు పెట్టిన ఒకటి రెండు రోజులు ఏవేవో పనులు సరిపోయేవి. మళ్ళీ తిరుగుప్రయాణం. ఇలా జరిగేది.

అనుకున్నట్లుగానే ఒకరోజు పొద్దున్నే అందరం కలసి జిల్లెళ్ళమూడి ప్రయాణం కట్టాము. దారిలో బాపట్లలో ఉపాహారంసేవించి పదిన్నరా పదకొండుకి జిల్లెళ్ళమూడి చేరుకున్నాము. నా కోసమని కొన్నిఆధ్యాత్మిక పత్రికలు, కొన్ని జ్యోతిష్యపత్రికలు కొని కార్లో పెట్టాడు చరణ్. దారి పొడుగునా ఆధ్యాత్మిక సంభాషణలు జరుగుతున్నాయి. శ్రీమతీ పిల్లలూ వెనకసీటులో కూర్చుని మధ్య మధ్యలో సంభాషణల్లొ వారి వంతుగా పాలు పంచుకుంటున్నారు.

"అన్నగారు, ఈ నెల విశ్వజనని సంచికలో అమ్మ జాతకం గురించి వ్రాశారు చూడండి" అన్నాడు చరణ్.

"ఎక్కడా" అంటూ పేజీలు తిప్పాను.

"అది వ్రాసింది ఎవరో కాదు మా అన్నయ్య. తను కూడా ఎం ఏ (జ్యోతిషం) చేశాడు. ప్రస్తుతం విజయవాడలోఉంటున్నాడు" అన్నాడు చరణ్.

తను మాట్లాడుతూనే ఉన్నాడు, ఈ లోపే ఆ వ్యాసం చదివేశాను.

"ఎలా ఉంది?" అని చరణ్ ప్రశ్న. మౌనంగా తలూపాను.

కాసేపాగి ఇలా అన్నాను. "ఈ జాతకం చాలా నిగూఢమైనది. స్థూలదృష్టికి అందేది కాదు. ఈ జాతకం గురించి ఇంకాచాలా వ్రాయవచ్చు. మీ అన్నయ్య చాలా తక్కువ వ్రాశారు".

"పోనీ మీరు వివరంగా వ్రాయండి" అని చరణ్ సలహా ఇచ్చాడు.

"అంత సాహసం నేను చేయలేను. కాని అమ్మ కరుణ ఉంటే అలాగే వ్రాస్తాలే" అన్నాను. దైవాంశతో పుట్టినవారివి, అవతారమూర్తుల జాతకాలు అంచనా వేయడం చాలా కష్టం. శారదామాత జాతకం కూడా ఇలాగే ఉంటుంది. మామూలు దృష్టికి చాలా సాధారణమైన వ్యక్తి జాతకంలా ఉంటుంది. ఏ ప్రత్యేకతలూ కనిపించవు. చాలా సూక్ష్మవిశ్లేషణతో చూస్తేగాని వీరి జాతకాల మహాత్యం ఏమిటో అర్ధం కాదు. అప్పుడు కనిపించే స్థాయి చూస్తే నోట మాట రానంత ఆత్మోన్నతి కనిపిస్తుంది.

మాటల్లోనే 7 వ మైలు రాయి వచ్చింది. చరణ్ చిన్నప్పుడు జిల్లెళ్ళమూడిలో ఉన్నాడు. జిల్లెళ్ళమూడి అమ్మగారి అనుగ్రహానికి పాత్రులైన ప్రసిద్ద, అజ్ఞాత వ్యక్తుల పేర్లు ఎన్ని చెబుతాడో? ఆ సంఘటనలు నాటకీయంగా ఎలా వివరిస్తాడో? అలా వింటూ ఉంటే గంటలు గడిచిపోతాయి. అతని ఉపనయనం అమ్మ చేతులమీదుగా జరిగింది. ఎంత పుణ్యాత్ముడో? అతని పుణ్యబలాన్ని ఊహించి "ఎంత అదృష్టవంతుడివి తమ్ముడూ. స్వయంగా అమ్మ నీకు బ్రహ్మోపదేశం చేసిందా?" అని ఆశ్చర్యపోతుంటాను. చరణ్ నవ్వుతూ "బ్రహ్మోపదేశం కాదు అన్నగారూ అమ్మోపదేశం" అంటాడు.

కారు మెయిన్ రోడ్డుమీద నుంచి జిల్లెళ్ళమూడి వైపు తిరిగింది. కాలువపక్కగా పోతున్నది. దూరంగా జిల్లెళ్ళమూడిగ్రామం కనిపిస్తున్నది. దూరం నుంచి ఆ గ్రామం కనిపించగానే చరణ్ కళ్లనుంచి ధారగా నీళ్ళు కారిపోతున్నాయి. అలాగేడ్రయివ్ చేస్తున్నాడు. మేం మౌనంగా ఉన్నాం.

(మిగతాది తరువాత పోస్ట్ లో)
read more " జిల్లెళ్లమూడి స్మృతులు -1 "

10, జులై 2010, శనివారం

వాడపల్లి ఆలయాలు

నడికూడి దగ్గర కృష్ణాతీరాన వాడపల్లిలో గల అగస్త్యేశ్వరాలయాన్ని, దానికి కొంతదూరంలోగల లక్ష్మీనరసింహాలయాన్నిదర్శించే అవకాశం రోజు కలిగింది. వాడపల్లి అనేది కృష్ణాతీరాన నల్లగొండ జిల్లాలోగల ఒక పల్లెటూరు. ఇది రెండువేలఏళ్ళనాడు ఒక వాణిజ్యకేంద్రం. ఇక్కడికి గ్రీస్,అరేబియా మొదలైన విదేశాలనుంచి వచ్చే నౌకలద్వారా వాణిజ్యం జరిగేది.

ఇక్కడ దాదాపు ఎనిమిది వేల ఏళ్ళనాటి ఆలయాలున్నాయి. ఇక్కడ ఈశ్వరుని, నరసింహస్వామిని అగస్త్య మహర్షి ప్రతిష్ట చేసినట్లు చెబుతారు. పదమూడో శతాబ్దంలో ఇక్కడ ఒక పట్టణాన్ని నిర్మిద్దామని రాజులు తవ్విస్తుంటే ప్రాచీన ఆలయాలు దేవతా మూర్తులు బయటపడ్డాయి.వాటిని తిరిగి పునరుద్దరించి నిర్మించిన ఆలయాలు ప్రస్తుతం మనం చూడవచ్చు.

సంగమేశ్వరాలయం


అనుకోకుండా మాస శివరాత్రి రోజున శివ దర్శన భాగ్యం కలిగింది. మీనాక్షీ సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయాన్ని సంగమేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ కృష్ణా మూసీ నదుల సంగమం జరుగుతుంది. ఎత్తుగా ఉన్న ఆలయం నుంచి సంగమ స్థానానికి, నదిలోనికి మెట్లు ఉన్నాయి. సాయంత్రం వేళ నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ధ్యానానికి అత్యంత అనుకూల ప్రదేశం. ఇక్కడ తేలికగా మనస్సు ఏకాగ్రం, అంతర్ముఖం అవుతుంది. సాధారణంగా ఇక్కడ భక్తుల సంఖ్య చాలా తక్కువ. ఒకరో ఇద్దరో ఉంటారు. చాలాసార్లు వారూ ఉండరు. ఇక్కడ ఆలయాన్ని కాశీ ఆలయం నమూనాలో కట్టినట్లుగా తోస్తుంది. ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న అన్నపూర్ణ ఆలయం మూతబడి ఉంది. విగ్రహం ఏనాడో మాయమైందని ఆలయ ధర్మకర్త చెప్పారు. అలాగే కొద్ది దూరంలో ఉన్న భద్రకాళీ వీరభద్రుల ఆలయాలు కూడా ధ్వంసం అయ్యాయి. ముస్లిం దండయాత్రలలో నాశనమైన ఆలయాలు పోగా మిగిలినవాటిని గుప్తనిధులు తవ్వేవారు నాశనం చేశారు అని ఆయనే చెప్పాడు.

శివుని జటాజూటంలో గంగామాత ఉంటుందని మనకు తెలుసు. ఈ లక్షణాన్ని ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక్కడి శివలింగం పెద్దది. మనిషి నిలబడితే ఇంకా కొంచెం ఎత్తు ఉంటుంది. శివలింగం పైభాగం ఒక దొన్నెలాగా ఉంటుంది. అందులోనుంచి ఎప్పుడూ నీరు ఉబుకుతూ ఉంటుంది. కాని బయటకు కారిపోదు. తీర్ధంగా ఆ జలాన్నే వాడతారు. భక్తులపైన జల్లటానికీ ఆ జలాన్నే వాడతారు. ఇది గంగా జలంతో సమానం అని అంటారు. ఎక్కడనుంచి ఆ నీరు వస్తుందో తెలియదు. కొండపక్కనే రెండు నదులున్నాయిగనుక నీరు భూగర్భంలోనుంచి పైకి ఉబికి వస్తున్నది అనుకుందాం. కాని కారిపోకుండా ఆ లెవెల్ వరకే ఎలా నిలబడి ఉంటుందో అర్ధం కాదు. దీన్ని బట్టి శివలింగం పునాది చాలా లోతుకు కొండలోపలికి ఉన్నదని అనిపిస్తుంది. లేదా సహజమైన రాతినే శివలింగంగా మలిచారని అనిపిస్తుంది. కాని, శివుని శిరస్సుమీద గంగామాత ఉన్నదనే భావనను ఇలా మలిచినవారి ఆలోచన అద్భుతంగా ఉన్నది. ఈ ఆలయంలో ఇది గొప్ప విశేషం అని చెప్పవచ్చు. ఇది కూడా ఒక సివిల్ ఇంజనీరింగ్ మార్వెల్ అనిపిస్తుంది.


పంచ నారసింహ క్షేత్రాలు

ఇక్కడకు కొద్ది దూరంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కూడా పురాతనమైనదే. ఇది పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటి. వాడపల్లి, మట్టుపల్లి, కేతవరం, వేదాద్రి, మంగళగిరి అనేవి పంచ నారసింహ క్షేత్రాలు. ఇవన్నీ కృష్ణా తీరాన ఉన్న నారసింహ క్షేత్రాలు. ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే అసలైన అనుభూతి కలుగుతుంది. చిమ్మచీకటిలో చాలా దూరం నడచినట్లు అనిపిస్తుంది. గర్భగుడిలో కూడా చీకటిగా ఉంటుంది. ఒకే దీపపు సెమ్మెకు రెండు దీపాలు వెలుగుతుంటాయి. స్వామి ముఖం ఎత్తులో ఉన్న దీపం కొద్దిగా గాలి తగిలినట్లు చలిస్తూ ఉంటుంది. నడుము ఎత్తులో ఉన్న ఇంకొక దీపం నిశ్చలంగా ఉంటుంది. స్వామి ఉఛ్చ్వాస నిశ్వాసాలకు ప్రతీకగా పై దీపం చలిస్తూ ఉంటుందని ఇక్కడ నమ్మకం. గర్భ గుడిలోకి గాలి ప్రవేశించే సందులు ఎక్కడా కనిపించవు. కాని ఏదో ప్రాచీన ఇంజనీరింగ్ ప్రక్రియ వల్ల అలా కట్టుబడి చెయ్యటం సాధ్యపడినట్లు నాకనిపించింది. సామాన్య భక్తులలో భగవంతుని ఉనికి పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి ఇటువంటి ప్రక్రియలు వాడారేమో అనిపించింది. ఈ ఆలయంలో యోగాంజనేయ స్వామి విగ్రహం ఉన్నది. యోగానికి నరసింహస్వామికి సంబంధం ఉన్నది. తిరుమలలో కూడా యోగనరసింహ స్వామి ఆలయం మనం చూడవచ్చు. పశుత్వం మానవత్వం కలిసి ఉన్న మానవుడు దైవత్వం వైపు చేసే ప్రయాణమే కదా యోగమంటే.

ఈ ఆలయాలను పదిహేను ఏళ్ళక్రితం నేను దర్శించాను. కాని ఇరవై అయిదేళ్ల క్రితం వచ్చిన కృష్ణా పుష్కరాల సమయంలో మొదటిసారి ఈ ప్రాంతానికి వచ్చి కృష్ణా నదిలో స్నానం చేశాను. అప్పటికి ఇప్పటికి చాలా అభివృద్ధి కనిపించింది. భక్తుల ఆదరణ కూడా పెరిగినట్లు కనిపించింది. వైష్ణవాన్ని శైవాన్ని సమంగా పోషించిన రాజుల కాలంలో ఈ ఆలయాలు జీర్ణోద్దరణ గావించబడ్డాయి. జనుల తాకిడికి దూరంగా ఉన్న ప్రశాంత ఆలయాలలో ఉండే ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇక్కడ అనుభూతి చెందవచ్చు.
read more " వాడపల్లి ఆలయాలు "

6, జులై 2010, మంగళవారం

Visit to Andhra Valmiki's Ashram

Last month I went to Repalle on some work. On the way back, I remembered that the Ashram established by Andhra Valmiki Sri Vasudasa Swamy should be somewhere nearby. While passing through Angalakuduru village, I stopped and inquired about the Ashram. It was not very difficult to locate the Ashram, because the humble sign-board was visible by the roadside.

When we reached the Ashram, it was dusk. The atmosphere was calm, in tune with Nature. One or two villagers stared at us in silence. The Ashram was unimposing and the building was old. I had seen many flourishing Ashrams where only third rated religion is doled out to the devotees. In contrast to those luxurious Ashrams, this Ashram wore a desolate look. But the spiritual atmosphere of the Ashram caught my attention at once.

I was accompanied by 7 or 8 of staff. We met the head of Ashram, Sri RamanujaDasa Swami. He was talking with someone at that time. So we waited in the verandah for a while. I could hear that they were talking on some mundane matters. I was gazing all around the Ashram and trying to feel the aura of the Ashram with my psyche. There were some inmates,mostly aged women, who were silently engaged in their daily chores. The atmosphere was silent and serene.

The Swami bade good bye to the visitor and called us. We introduced ourselves. I told him that I had been to Ontimitta during my stay at Guntakal.His eyes twinkled on hearing about Ontimitta. Later he said during the conversation that he worked as Head Master in the school at Ontimitta, some 25 years ago, before being ordained as the successor to the then reigning swami.

I could see he was impressed with our curiosity towards Andhra Valmiki. I told him about the 108 poems that poured out through my hand at Ontimitta and recited one or two of them. He was happy to hear them and told me to get them printed for the benefit of devotees. During the conversation, I told him how Andhra Valmiki who died in 1936, appeared at Ontimitta a year ago, to the astonishment of one and all. The swami nodded and said " I am the eye witness to this incident. However, there is a small variation in the narration. I was having my midday meal in the room of his Ashram at Ontimitta.When I heard that an old man is waiting outside, I told my attendant to invite him to the meal. But the old man, apparently very fragile, replied " I have my food always ready in my shoulder bag. I don't want any food. I have come just to see my home. Since you are reciting Ramanama with so much devotion, I just came to see all this." When my attendant reported this to me and went out again, the old man had simply disappeared. There was nobody around".

We were holding our breath in astonishment. The Swami, seeing our rapt attention, narrated another incident that happened in the life of Andhra Valmiki. He said " Ramayana was written in Telugu by Vasudasa Swamy from 1904 to 1908 at Ontimitta. At that time many wonderful incidents happened. Listen to one of them. Vasudasa swamy used to take only a glass of cow's milk as his food for the entire day and used to be immersed in meditating and writing Ramayana for 20 to 22 hours a day, at a stretch. One day when he was in his room on the top of the hill,immersed in writing, he heard the voice of a small girl calling from outside " Annaa. Can I come inside?". Annaa is the word used by youngsters in Rayalaseema, to address elders. He came out and found a girl of 8 or 9 years, wearing golden ornaments, standing at the door. From her appearance, she looked like a goddess. He immediately recognized her as Mother Sita and said to her with folded hands " Mother! It is my fortune that you have come. But where is Father? You should have brought him also along with you." Hearing this, the divine girl simply smiled and vanished into thin air.

At another time, he had the darshan of Lord Sri Rama along with Mother Sita,Hanuman, Lakshmana, Bharata and Shatrughna. When he was deeply immersed in writing Ramayana, he suddenly saw them entering his room. They blessed him and disappeared. He had so many visions like this. He was, no doubt, a blessed soul."

I could only nod my head in agreement, having experienced the grace of Sri Rama at Ontimitta during my visit last year. I was about to narrate the experience I had at Ontimitta to him, but controlled myself seeing that my companions are listening.

The Swami appeared to be in his sixties, well educated, outspoken and open minded. He talked freely with us, for an hour or so , touching many spiritual points. Among them, one particular idea impressed us very much. He said " I worship Sri Rama. This is ingrained in me since my childhood. I like to worship God in the form of Rama. So I cannot worship God in any other form. There is a local temple of Shirdi Sai Baba here. They wanted me to do Puja to Sai Baba. But I could not go. I see only Rama in all vigrahas. Even in a Siva Linga I see only Rama. So I can worship only Rama. But they wanted me to do Sai puja with mantras. I said I cannot do it. I do not have dislike for other deities. I know that they too are manifestations of the same Divine. But my mind is attached to the form of Sri Rama. I call this,Ekeswaropasana."

I was impressed by his words. He was right. At a certain stage in spiritual development, one feels so. Having heard it from my Gurus many a time, I could see the truth in his words. Ekeswaropasana is not what people generally think it to be. It is not worshipping the One God,who is form-less and quality-less, as many ignorant fanatics believe. What the Swami said is the Ekeswaropasana of a devotee. There is another Ekeswaropasana of a Jnani. It is altogether different.

Sri Ramakrishna used to tell a story. Once Hanuman came to Dwaraka to have Darshan of the Lord. So Lord Krishna said to Rukmini " Let us assume the forms of Sri Rama and Sita immediately. These are the forms dear to Hanuman. So we have to appear to him as his Ishta Devatas." The Lord says in the Gita "Ye yadha maam prapadyante taam sthadhaiva bhajamyaham", In whichever form my devotee worships me, I will bless him in the same form".

The Swami asked us to wait a little, till he takes the bath and opens the shrine. But we could not wait. I excused myself and took leave of him with a promise that I will pay a visit to the Ashram very soon.

I, along with my companions, left the Ashram in an elevated mood.
read more " Visit to Andhra Valmiki's Ashram "

3, జులై 2010, శనివారం

Adi Sankara's life-Role of retro planets

Retrograde Planets

One of the peculiar techniques of Nadi Jyotisha is to consider a retrograde planet as if it is in the previous sign. I found this rule handy and working well in many charts. This is not to be found anywhere in the normal Jyotish texts, standard or otherwise. Many such peculiar rules exist in NADI system, perhaps owing to its highly advanced techniques aiming at pin-pointed accuracy. Many such rules are found in Deva Keralam and other famous Nadi texts. Coming to the present topic, two planets are found retrograde in Sankara Bhagavatpada's chart. My humble experience shows that it is a mistake to consider retro planets as bad indicators.To be precise, when Mercury is retrograde, we should not jump to a conclusion that the native is a dunce. Similarly, when Jupiter is retro, it need not indicate moral deficiency.

A chart is a homogeneous
whole and to concentrate on one particular indication to the exclusion of all others will lead the prediction astray. For a good analysis, the general indications of a chart should support its particular bhava analysis. In other words, in Jyotish analysis, like in Homoeopathic system of Medicine, the generals should support the particulars and the particulars should find a place in the generals.

I pondered a lot over the phenomenon of retrogression of planets and their effects on human lives. I found it to be a subject in itself, having deep impact over emotional,material and spiritual areas of human lives. Like many intricate points of Astrology, it is not easy to grasp the true purport of retro planets, unless one is equipped with sound knowledge of Astrological principles, coupled with intuition resulting from Mantra Siddhi.

Mastering Jyotisha requires burning of midnight oil for years, sacrificing many joys of ordinary life. A beginner is usually baffled to see hundreds of combinations and yogas in the body of Jyotisha, most of them mutually contradictory to one another. So I firmly believe that Jyotisha, being a Vedanga, is to be learned from a competent guru to learn it speedily,avoiding pitfalls. It is like moving in an unknown forest. It takes a long time to find the way out on one's own. But this trouble can be avoided if one takes the help of an experienced guide who is quite familiar with the intricate pathways of the forest. A lot of hardship and trouble can be avoided in this way.

In Sankara Bhagavatpada's chart, Budha(in Mesha) and Guru(in Vrischika) are retrograde. For me, it means they are in Meena and Tula respectively. Let us now analyse the effects of retrograde Mercury and Jupiter in the life of Sankara Bhagavatpada.

Guru in 4 th house

Guru in 4 th house is a strong point for a chart especially so, if the Lagna or Moon sign is Kataka. It gives good education, religious education, good mother and father(usually),vehicle comfort etc. Adi Sankara had all these in good measure. From 4 th, Guru aspects exalted Ravi (2 nd lord) who is in Mesha.This is a wonderful combination. It shows things like-- strong ability to be a good Teacher, deep religious education, a real guru par excellence, excellent oratory skills and victory in debates.The native will shine like the midday Sun in his profession (Sun in 10th) which involves religious learning (Guru in 4 th) and philosophical debate (2 nd lord in 10 th with Guru's aspect). From the Moon, the same combination gives another set of results. From 5th house Guru looks at exalted Sun in 11th house. Now,exalted Sun in 11th is a great placement that can wipe out a million blemishes from the chart. It supports the boon of argumentation( as shown earlier from Lagna) on rightous grounds, "Dharma vaagvivaado jeta".It also confers on the native Mantra Siddhi (Jupiter's aspect from 5 th house on 11 th) and Atma Jnana ( Sun is natural significator for self-knowledge).

Guru with his 5th special aspect, looks at 8th house which is a mystic house and a Moksha Trikona. It shows that the native is not a mere academician but has real experience in occult subjects. From the Moon, the 4th house becomes 5th and 8th house becomes 9th. So here, the indications are more pronounced. The native is Dharmic in nature,a highly evolved soul, has tremendous poorvapunya and a master of traditional Vedic knowledge.

Guru with his 9th aspect, looks at Moon in 12th another Moksha Trikona. This only reinforces the earlier indication. From Moon, it again reinforces everything already discussed, but only adding that, though he is a master of scriptural knowledge, his speech is gentle and soothing like the Moon, his mind kind & generous(Moon is 2 nd lord from himself and natural significator for mind).

From Lagna, all the 3 Moksha Trikonas (4,8,12) and from the Moon, all the Dharma Trikonas(1,5,9) are under the benign influence of Jupiter. This is a very secret and powerful indication which is saying that the native is not an ordinary being but an embodiment of Dharma and Moksha, in other words an incarnation of Divine Power.From the Sun, the Kama Trikonas (3,7,11) are under Guru's aspect. This is saying that his Kama (material desires and lustful thoughts) is under total subjugation. He has no desire for himself.

As Lagna,Moon and Sun represent the grand triad of life, this simple analysis is enough to show the tremendous spiritual heights of Sankara Bhagavatpada. Sage Parasara instructs in his magnum opus "Brihat Parasara Hora" to analyse a chart from the 3 pivots, by a novel method called "Sudarsana Chakra Method". This is another forgotten technique which gives wonderful results if properly applied. "Su-darsana" means good vision or comprehensive view. Common pointers from all the three i.e Lagna,Sun and Moon,can be taken as sure-shot predictions.

Budha in 9 th house

It is an established rule in Jyotisha that Saturn's influence on Moon and/or Mercury gives spiritual bent of mind. Mercury united with Saturn in the house of Dharma produced here an exalted spiritual personality and an introvert. However, since Sun is exalted in Karma sthana, it gave intense activity and travel also. So Sankara's personality is a blend of deep immersion into spiritual realms along with intense worldly activity in the form of travel,arguments and debates.

From Lagna, the combined aspect of Saturn and Mercury falls on 3 rd house. So his communication skills, writing skills and oratorial skills are all full of deep philosophy and spiritual insights accessible only to very sharp minds. From Moon lagna, this focus falls on 4 th house giving him education in spiritual matters. The sad part of this aspect is a life full of misery and destitution lived by his mother.

The 3 rd aspect of Saturn(along with Mercury) falls on Rahu and Venus. Exalted Rahu in Vrishabha is equal to a double venus. Since Venus also is present here, it is as if 3 venuses are present in labha sthana. This gives a very resourceful personality. The aspect of Saturn and Mercury on the 3 Venuses colors the entire energy of the native with spiritual,philosophical and Dharmic tendencies. The 10 th aspect of Saturn and Mercury on Mars in 6 th house only reinforces this trait, giving him victory after victory in philosophical debates. From Moon sign also, this aspect bestows on the native, victory over powerful enemies (Mars in 7 th house) in philosophical debates.

9 th house denotes Dharma, philosophy, religious study, pilgrimages etc. Saturn is a planet of introversion and hardships. It is but natural that Sankara's buddhi (Saturn with Budha) is colored by Saturn's deep philosophical attitude that reflected in every walk of his life. Religion comprised of his whole activity to the exclusion of everything else.From Moon sign,Meena becomes 10th house.Saturn and Mercury in 10 th house gave a profession (can we call it a profession?) involving philosophy,religion, intellectual debates and literary activity.

As we know, all the above results are clearly visible in Adi Sankara's life. This is how the effects of retrograde planets are to be understood. However, the original placement is also required to be analysed in addition to this kind of analysis. Only then, the mystery of retro planets can be understood in its entirity.

One relevant question may arise at this juncture. Why at all a planet should be in retrogression in a chart? What does it actually denote from the last birth's point of view? Well, this is an altogether different subject which merits an elaborate and full fledged explanation. We will see to it at some time in future, if anyone really wants to know about it.

In the next post we will discuss the import of other planets in Sankara Bhagavatpada's chart.
read more " Adi Sankara's life-Role of retro planets "

1, జులై 2010, గురువారం

ఆది శంకరుల జీవితం-జాతకం ( ఆఖరి భాగం )

ఇంతకు ముందరి పోస్ట్ లలో ఇప్పటివరకూ కొందరు నమ్ముతున్న శంకరుల జననతేదీలను జ్యోతిశ్శాస్త్ర రీత్యాపరిశీలించడం వాటిని ఖండించడం జరిగింది. ఇప్పుడు క్రీపూ 509 నాటి జనన కుండలిని పరిశీలించి చూద్దాం.

కుండలిలో లగ్నం పునర్వసు నక్షత్రంలోను చంద్రుడు ఆర్ద్రానక్షత్రంలోనూ ఉన్నారు. లగ్నం చరరాశిలోను చంద్రుడుద్విస్వభావరాశిలోను ఉండటం వల్ల అల్పాయుయోగం కలిగింది. లగ్నంచరరాశిలోను,హోరాలగ్నం ద్విస్వభావ (కన్యా) రాశిలోను ఉండటం వల్లఅల్పాయు యోగం కలిగింది. ద్వాదశంలో చంద్రుడు, ఆరింట పాప గ్రహం ఉన్నయోగం అల్పాయువును ఇస్తుంది.

తృతీయాధిపతి యైన బుధుడు వక్ర స్థితిలో ఉండటం, మరియుఅష్టమాధిపతియైన శని నీచ స్థితికి దగ్గరగా ఉండటం, తృతీయం పైన శనిదృష్టి వల్ల ఆయు:స్థానములు రెండూ బలహీనమైనాయి. కనుకఆయుర్భావం దెబ్బ తిన్నది. పై యోగాలన్నీ అల్పాయుష్షునుఇస్తున్నాయి. కనుక మొదటి నియమం సరిపోయింది.

ఇక శంకరుల ఆయష్షు జాతక ప్రకారం ఎంత వచ్చింది అనే విషయంపరిశీలిద్దాం.
ఆయుర్దాయాన్ని లెక్కించడానికి ఉన్న అన్ని విధానాలలోచాలావరకూ సరియైన ఫలితాన్ని ఇవ్వగల అంశాయుర్దాయ విధానరీత్యా శంకరుల ఆయుష్షును లెక్కించి చూద్దాము. ఆయుశ్శ్షును లెక్కించడానికి అంశాయుర్దాయమే సరియైన విధానమనిసత్యాచార్యులు చెప్పారు. వరాహమిహిరుడు, యవనాచార్యుడు వంటి మేధావులు వారికంటే ప్రాచీనుడైన సత్యాచార్యునిఆయుర్గణన విధానాన్ని మెచ్చుకున్నారు . కనుక విధాన రీత్యా గుణించగా, శంకరుల ఆయుష్షు దాదాపు 32 సంవత్సరాలు వచ్చింది. ఆయన జీవించినది సరిగా ముప్పై రెండేళ్ళే గనుక తేదీ చాలా వరకూ సత్యానికి దగ్గరిగాఉన్నది.

ఒక మనిషి
ఎన్నాళ్ళు బ్రతికాడన్నది ముఖ్యం కాదు, ఎలా బ్రతికాడన్నదేముఖ్యం. క్రీస్తు కూడా 33 ఏళ్ళే జీవించాడు అని అందరూనమ్ముతున్నారు. అది నిజంకాదు. క్రీస్తు జీవితాన్ని గురించి మరో సారిచూద్దాం. పోనీ ప్రస్తుతానికి అలాగే అనుకున్నా, ఆయన తన జీవితకాలంలో ఒక చిన్న గ్రూపును మాత్రమే తన అనుయాయులుగాచెసుకోగలిగాడు. వారిలో ఎక్కువమంది కూలీ నాలీ చేసుకునేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, అక్షరజ్ఞానం లేని వాళ్ళూను.

ఇక
మహమ్మద్ డెబ్బయ్ ఏళ్ళు పైబడి బ్రదికాడు. ఆయన జీవితమంతాయుద్ధాలతోనే సరిపోయింది. రక్తపాతంతో, ఊచకోతతో తన మతాన్నివ్యాప్తి చేస్తూ వచ్చాడు. ఒకే ఒక్క రోజున ఆయన సమక్షంలో మూడువేల మంది యూదులను, అదీ లొంగిపోయిన వారిని, పిల్లలు ఆడవారితో సహా అందరినీ మోకాటి తండా వేయించి, ఆయన అనుచరులు ఒక్క క్షణంలో తలలు నరికి చంపారు. ఇటువంటి సంఘటనలు ఆయన జీవితంలో అనేకం ఉన్నాయి. కావలసిన వారు గిబ్బన్ వ్రాసిన మహమ్మద్ జీవితంచదవమని కోరుతున్నాను. కాని శంకరులు 16 ఏళ్ళలో కేవలం పాండిత్యంతోనూ, తార్కిక పటిమ తోనూ, ఎక్కడా హింసలేకుండానే భారతదేశాన్ని మొత్తాన్నీ ఒక్క త్రాటిపైకి తేగలిగారు.

మహమ్మద్ ప్రవక్త తన మతాన్ని భావనలను ఒప్పుకోనివారిని నిలువునా నరికించాడు. కాని శంకరులు తన తలను వరంగా కోరినతన ప్రత్యర్ధి అయిన కాపాలికునికి సరే తీసుకోమని వరమిచ్చి తాను ధ్యాన సమాధిలో ఉన్నపుడు తల ఖండించితీసుకోమని చెప్పి ధ్యాన సమాధి నిమగ్నుడైనాడు. అదీ మహమ్మద్ ప్రవక్తకూ శంకరులకూ తేడా.

క్రీస్తు తన కాలంలోని సనాతన వాదులైన ఫార్సీలు, సద్ధూసీలతో శాస్త్ర పరంగా వాదించలేకపోయాడు. వారడిగిన ప్రశ్నలకుసరియైన సమాధానాలివ్వలేకపోయాడు. క్రీస్తు పెద్దగా చదువుకోలేదని చరిత్ర చెబుతున్నది. ఈయనకు అరమైక్ భాషతప్ప ఇతర భాషలు తెలీవని కూడా చరిత్ర కారులు భావిస్తున్నారు. కాని
శంకరులు ఎనిమిదేళ్ళకే నాలుగు వేదాలనుఔపోశన పట్టిన మహా పండితుడూ, మహా మేధావీ మరియు మహా జ్ఞాని. ఆయన కొన్ని వందల మంది మహాపండితులతోశాస్త్ర చర్చలలో వాదించి వారిని ఒప్పించి సత్యమైన అద్వైత మతాన్ని వారిచేత ఔననిపించారు. ఇది క్రీస్తుకూ శంకరులకూభేదం.

సందర్భంగా అరేబియా, ఇజ్రాయెల్ దేశాలవారికి, మన దేశంలోని ప్రజలకు కొన్ని భేదాలు స్ఫుటంగా కనిపిస్తాయి. కాలంలో ఇతర దేశాలలోని ప్రజలలో మూర్ఖత్వం ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాని మన ప్రాచీన భారతంలో, తార్కికంగా రుజువు కాని భావనలను, నమ్మకాలను, మతాన్ని ఒదులుకోవడానికి సిద్ధంగా ఉన్న మనస్తత్వం ప్రజలలోమతాధిపతులలో కనిపిస్తుంది. వాదనలో ఓడిన వారు తమ మతాన్ని మార్చుకొని శంకరాద్వైతాన్ని అనుసరించారు. ఇదిప్రాచీన భారత ప్రజలకు, ఇతర దేశాల ప్రజలకు భేదం.

వాదానికి తర్కానికి కట్టుబడటం, తను నమ్మిన సిధ్ధాంతాలు తప్పు అని తార్కికంగా తేలితే వాటిని వదులుకోడానికి సిద్ధపడేధీరోదాత్త మనస్తత్వాలు శంకరులతో వాదించి ఓడిన పండితులలో కనిపిస్తాయి. వారు వాదానికి కట్టుబడేవారు. ఈనాటికుహనా మేధావుల వలె, వాదనకు చర్చకు
ముందే కుల మతాల ప్రాతిపదికమీద ఒక నిర్ణయానికి వచ్చి, దాన్నిసమర్ధించుకుంటూ కుతర్కాలు చేసేవారు కారు. విదేశీ మతాధిపతులకు , ప్రాచీన భారత దేశ మతాధిపతులకు మధ్యన భేదం మనకు కనిపిస్తుంది. ఇతర మత ప్రవక్తలతో పోల్చి చూచుకుంటే శంకరుల వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైనదో, ఎంతఉదాత్తమైనదో అర్ధం అవుతుంది.

ఇక ప్రస్తుత విషయానికొద్దాము

కుండలిలో చంద్రుడు ఆర్ద్రానక్షత్రంలో ఉన్నాడు. కనుక జననకాలానికి రాహుదశ జరిగింది. రాహుకేతువులుఉఛ్ఛస్థితిలో ఉండటం స్వామి జాతకంలో చూడవచ్చు. రాహుకేతువులు అనుకూలించిన వారి జీవితంలో టైమ్ వేస్ట్ అనేదిఉండదు. వారు తలచిన పనులు చకచకా జరుగుతాయి. వారు వచ్చిన పని ముగించుకొని నిష్క్రమిస్తారు. మొదటినుంచివారి జీవితాలు చూస్తే వీరు ఒక ఘనకార్యాన్ని సాధించడానికే పుట్టారు అనిపిస్తుంది. వారి జీవితం కూడా అలాగే సూటిగాఒక గమ్యం వైపు సాగుతుంది. అనవసర డైవర్షన్లు ఎక్కడా ఉండవు. స్వామి జీవితం కూడా అలాగే సాగడం చూడవచ్చు.

ఇక పోతే దశాంతర్దశా వివరాలు చూద్దాము

జనన కాలానికి రాహు మహర్దశ 14 సంవత్సరాల 6 నెలలు మిగిలి ఉన్నది. జాతక చక్రం మనవద్ద ఉన్నది. సమాచారంతో స్వామి జీవిత వివరాలు పోల్చి చూద్దాము.

** నాలుగు ఏళ్ళ వయస్సులో స్వామికి రాహు/శని/శుక్ర దశ జరిగింది.
రాహు శుక్రులు పితృస్థానమగు నవమ భావానికి ఆయుష్షును సూచించే మూడింట ఉన్నారు. శని అష్టమాధిపతిగానవమ స్థానంలో ఉండి తండ్రి మరణాన్ని సూచిస్తున్నాడు. అదే సమయంలో గోచార శని దశమ స్థానంలో జనన రవి పైనసంచారం చేశాడు. రవి సహజ కారక రీత్యా పితృకారకుడు. సమయంలోనే స్వామికి తండ్రి మరణం సంభవించింది.

**అయిదేళ్ళవయస్సులో స్వామికి ఉపనయనం అయింది. గోచార శని లాభస్థానానికి వచ్చి మంత్ర స్థానమగుపంచమాన్ని అందులో ఉన్న గురు,కేతువులను వీక్షిస్తున్నాడు. అందువల్లనే మంత్రోపదెశపూర్వకమైన ఉపనయనసంస్కారం జరిగింది.

** ఎనిమిదేళ్ళవయస్సుకే చతుర్వేదాలనూ ఔపోశన పట్టాడు. అప్పుడు స్వామికి రాహు దశలొ కేతు అంతర్ధశ నడిచింది. రాహువు లాభ స్థానంలోనూ, కేతువు మంత్ర స్థానమగు పంచమంలో వేదశాస్త్ర కారకుడగు గురువుతోనూఉన్నారు. కనుక సమయానికి స్వామికి వేదాధ్యయనం పూర్తి అయింది. రాహుదశ కేతు అంతర్ధశలో మనిషి జీవితంలోఒక ముఖ్య అధ్యాయం సమాప్తి అవుతుంది. తన జన్మలో ఒక ముఖ్య ఘట్టం కాని, దశగాని పూర్తి అవుతుంది. అలాగేఇక్కడా జరిగింది. కాల స్వరూపులైన రాహు కేతువులు ఇద్దరూ ఉఛ్ఛ స్తితిలో ఉన్నందువలన సర్వోత్తమమైన వేదవిజ్ఞానాన్ని సాంగోపాంగంగా సకాలంలో అందించారు.

**తొమ్మిదేళ్ళ వయసులో ఇల్లు వదలి బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించగల సమర్ధ గురువును వెదుకుతూ హిమాలయాలకుపయనం కట్టాడు. అప్పుడు స్వామికి రాహువులో శుక్ర అంతరం జరిగింది. రాహువు విదేశీ యానాన్ని, సంచారజీవితాన్ని ఇస్తాడని మనకు తెలుసు. విద్యా,లాభ స్థానాధిపతి యగు శుక్రుడు, ఉఛ్ఛరాహువు లాభస్థానంలో కలిసి ఉండిస్వామిని అన్ని విద్యలలోకీ అత్యుత్తమ విద్య అయిన బ్రహ్మవిద్యాన్వేషణా తత్పరుణ్ణి చేశారు. అదే సమయంలో ఓంకారేశ్వరక్షేత్రంలో తన గురువైన గోవిందయతిని కలుసుకోవడం శాస్త్రోక్తంగా బ్రహ్మవిద్యోపదేశం పొందటం జరిగాయి.

** పదహారేళ్ల వయసులో స్వామికి గురుదశలో గురు అంతర్దశ జరిగింది. అంతకు ముందు సరిగ్గా పదిహేనేళ్లవయసుకు స్వామికి గురు దశ మొదలైంది. అప్పటికే ఆయన జగద్గురువు అన్న పదానికి నిలువెత్తు నిర్వచనంగా తయారైఉన్నాడు. అఖండమైన జ్ఞానపటిమకు తోడు అపారమైన వేద విజ్ఞానాన్ని ఔపసన పట్టి పదిహేనేళ్ళ చిన్న వయస్సులోజగద్గురువుగా అవతరించిన మహనీయుణ్ణి తలచుకుంటే చాలు మనస్సు ఉప్పొంగుతుంది. అప్రయత్నంగా చేతులుముకుళిత హస్తాలై ఆయనకు నమస్కారం చేస్తాయి.

అదలా ఉంచితే, ఆయన పరిపూర్ణమైన గురువుగా మారిన సమయానికే ఆయన జీవితంలో గురుమహర్దశ మొదలుకావడం ఒక విచిత్రమైన ఘటన. గురువు ఆయన జాతకంలో మంత్ర స్థానంలో ఉఛ్ఛ స్థితిలోని కేతువుతో కలిసి ఉన్నట్టుమనం జాతక చక్రం లో గమనించ వచ్చు. అందువల్లనే ఆయనకు శాస్త్ర పాండిత్యంతో బాటు బ్రహ్మ జ్ఞానగరిమకూడాఅలవోకగా కలిగింది. గురువులో గురు అంతరం జరిగిన సమయంలోనే ఆయన ప్రస్థాన త్రయానికి భాష్యమ్ వ్రాశారు. అంతే కాదు మహాజ్ఞాని, కారణ జన్ముడు, వేద విభాగం చెసినవాడూ, గురోత్తముడూ అయిన వ్యాసభగవానుని దర్శనంకూడా ఆయనకు గురుదశలోనే వారణాసిలో జరిగింది.

** ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నీ గురు దశలోనే జరిగాయి. దుర్భర బాధలనూ దశలోనే ఎదుర్కొన్నాడు. తల్లి చనిపోతే దహన సంస్కారం చెయ్యనివ్వకుండా, కట్టెలివ్వకుండా, కనీసం శవాన్ని మొయ్యటానికి ఎవరూముందుకురాకుండా, కాలడిలోని చాందస మూర్ఖ బ్రాహ్మణులు అడ్డుపడితే, తల్లి దేహాన్ని తానొక్కడే మోసుకుని పోయి తనఇంటి పెరటిలో, ఎండిన అరటి చెట్లతో ఆమెను దహనం చేసినప్పుడు మహనీయుడు ఎంతగా బాధపడి ఉంటాడో ఊహిస్తేకళ్ళవెంట నీళ్ళు ధారలు కడతాయి.

** పన్నెండు సంవత్సరాల వయసులో ఆయన తన గురువైన గోవింద భగవత్పాదులను నర్మదాతీరంలోని ఓంకార క్షేత్రంలోకలుసుకున్నాడు.
ఆ సమయంలో స్వామి జాతకంలో రాహువులో శుక్ర దశ జరిగి ఉండవచ్చు అని ఊహిస్తున్నాను. ఎందుకంటే, సామాన్యుల జాతకాలలో యోగాలైతే నీచత్వాన్నిస్తాయో అవే యోగాలు మహనీయుల జాతకాలలోఔన్నత్య కారకాలౌతాయి. శుక్రుడు స్వామికి మాతృస్థానాధిపతి మరియు లాభ స్థానంలో ఉఛ్చ రాహువుతో కలసిఉన్నాడు. రాహువు కూడా మళ్ళీ రాశ్యధిపతిగా శుక్రుని సూచిస్తున్నాడు. కనుక సమయంలోనే స్వామికి గురుప్రాప్తికలిగింది. కారణం? గురువు తల్లి వంటి వాడే కాదు. తల్లి కంటే ఎక్కువైన వాడు. తల్లి తన శరీరాన్ని పంచి శిశువుకు జన్మనిస్తుంది కనుక ఆమె ఋణం తీర్చుకోలేనిది. కాని గురువు తన శిష్యుణ్ణి జనన మరణ చక్రాన్ని దాటించి అమృతత్వాన్నిచేరగల దారి చూపగలడు. తన జీవితకాలమంతా శ్రమించి తాను సంపాదించిన జ్ఞానాన్ని ఏమీ ఆశించకుండా తన శిష్యునికిధారపోయగలడు. తనతో పాటు అతనికి భగవంతుని సన్నిధికి తీసుకుపోగలడు. కనుక గురువే అసలైన తల్లి, తండ్రి, సమస్తమూను. అటువంటి గురువును కలుసుకునే భాగ్యం మాతృస్థానాధిపతి, లాభస్థానాధిపతి ( రెండూ కలిసిమాతృలాభాన్ని సూచిస్తున్నాయి) అయిన శుక్రుని అంతర్దశలో స్వామికి ఒనగూడింది. ఇది చాలా సమంజసంగా ఉంది.

**
స్వామికి పదహారేళ్ళవయస్సులోనే గురు/గురు/బుధ దశ జరిగింది. సమయంలోనే ఆయన కుమారిల భట్టునుకలుసుకున్నాడు. సమయానికి కుమారిలభట్టు అగ్ని ప్రవేశం చెస్తున్నాడు. ఆయన మహాపండితుడు.దీనికితార్కాణంగా బుద్ధి కారకుడైన బుధుని విదశ సమయంలో జరుగుతున్నది. బుధునితో రవి కలసి ఉన్నందువల్లఅగ్నిప్రవేశాన్ని సూచించే రవి ఉఛ్చస్థితి కూడా సమంజసంగా ఉన్నది.

**2-1-491 BC కి సరియగు సాధారణ నామ సంవత్సర మాఘ శుక్ల సప్తమి రోజున స్వామి ద్వారకా మఠాన్నిభారతదేశపు పడమటి తీరంలో ప్రారంభించాడు. సమయానికి ఆయనకు గురు/శని/రాహు దశ జరిగింది. 17-12-486 BC కి సరియగు రాక్షస నామ సంవత్సర పుష్య శుద్ధ పూర్ణిమ రోజున ఉత్తరదిక్కునగల హిమాలయాలలొని జ్యోతిర్మఠాన్ని( నేటి జోషి మఠ్) ప్రారంభించాడు. అప్పుడు ఆయనకు గురు/శుక్ర/రాహు దశ జరుగుతున్నది. 8-4-485 BC కి సరియగునల నామ సంవత్సర వైశాఖ శుక్ల నవమి రోజున తూర్పుతీరంలోని పూరీలో గోవర్ధన మఠాన్ని ప్రారంభించాడు. గురు/శుక్ర/బుధ దశ ప్రాంతంలో జరిగింది. 24-12-484 BC కి సరియగు పింగళ నామ సంవత్సర పుష్య పౌర్ణిమ రోజునదక్షిణాదిన శృంగగిరిలో శారదాపీఠాన్ని ప్రారంభించాడు. అప్పుడు గురు/రవి/శుక్ర దశ జరిగింది.

గురు దశ యొక్క ప్రాముఖ్యత ముందే చూచాము. శనీశ్వరులు
నమవ స్థానంలో ఉండి ఆధ్యాత్మిక వ్యాపకాలనుసూచిస్తున్నారు. రాహు శుక్రులు లాభస్థానంలో ఉండి కార్య సాఫల్యతను ఇస్తున్నారు. రవి బుధులు దశమ స్థానంలో ఉండికార్య రంగంలో విజయాన్ని సూచిస్తున్నారు. కనుక గ్రహాల దశాంతర్దశలలో భారతదేశ నలుమూలలా నాలుగు ధర్మరక్షణా కేంద్రాలను స్థాపన చెయ్యడం చాలా సముచితంగా ఉన్నది. శుక్రుడు లగ్నాత్ చతుర్ధ లాభాధిపతి మాత్రమే గాక చంద్ర లగ్నాత్ మంత్ర స్థానాధిపతిగా ఉఛ్ఛ రాహువుతో ద్వాదశంలో ఉండటం ఒక గొప్ప యోగం. అందువల్లనే స్వామి జాతకంలో శుక్ర ప్రభావం అమితంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సూచించే వింశాంశ చక్రంలో ఆత్మ జ్ఞాన కారకుడగు రవి, మంత్ర స్థానాధిపతి యగు శుక్రుడు ఉఛ్ఛ స్థితిలో ఉండటం చూడవచ్చు.

** తన ముప్పై రెండో ఏట రక్తాక్షి నామ సంవత్సర జ్యేష్ట శుక్ల ఏకాదశి రోజున ఆయన స్వచ్చందంగా యోగమార్గంలోదేహత్యాగం చేసి తేజోమయుడైన పరమశివునిలో లీనమయ్యారు. ఇది ప్రస్తుత లెక్కల ప్రకారం 477 BC. సమయం లోఆయనకు గురు దశ అయిపోయి, శని దశలో శని అంతర్దశలో రవి విదశ జరుగుతున్నది. శనీశ్వరులు లగ్నానికి సప్తమఅష్టమాధిపతిగా మారకశక్తి కలిగినవాడు. రవి మారక సంజ్ఞమాత్రమే కలిగినవాడు. కాని స్వామి అవతరించిన పనిఅయిపోయింది కనుక ఇక లోకంలో ఉండటం అనవసరం అనుకుని ఉండవచ్చు. అదే సమయానికి గోచార శనిమేషరాశిలో ప్రవేశించి జనన రవి మీదుగా సంచారం చేశాడు. అది ఆయనకు నీచ స్థితి. ఇదే సమయంలో స్వామిదేహత్యాగమ్ జరిగింది.

సంఘటన జరిగింది హిమాలయాలలోని ఒక గుహలో అని కొందరు వ్రాశారు. కాని కాంచీ మఠ ఆచార్యులు మాత్రం ఇదికంచిలో జరిగింది అని చెబుతున్నారు. ఎందుకనగా శంకరులు కాంచీపీఠాన్ని మొదలు పెట్టిన తదుపరి తిరిగిహిమాలయాలకు పయనమై పోయిన దాఖలాలు లేవు.

స్వామి జీవితం లోని అన్ని ముఖ్య ఘట్టములూ జాతక వివరాలతో సరిపోతున్నవి గనుక ఆయన క్రీ పూ 509 లో జన్మించారని నేను విశ్వసిస్తున్నాను. ఈ సంవత్సరాన్ని ఆధారంగా తీసుకుని ప్రాచీన భారత చరిత్రను మార్చవలసిన అవసరం ఉన్నది.

వివేకానంద స్వామి తన చివరి రోజులలో ఒక మాటన్నారు. "వివేకానందుడు ఏమి చేశాడో మరొక వివేకానందుడే అర్ధంచేసుకోగలడు". ఆయన భారత జాతి యొక్క ఆత్మను తట్టి లేపాడు. అధోముఖంగా ఉన్న భారతదేశ ధార్మికప్రవాహనికినూతన జీవాన్నిచ్చి ఊర్ధ్వగామినిని చేశాడు. అదే పనిని ఆది శంకరులు 2500 సంవత్సరాల క్రితం ఒంటి చేతితోసాధించగలిగారు. ధార్మిక పరంగా ముక్కలై పోయి ఉన్న భారతదేశాన్ని ఏకీకృతం చేసి వేదవిజ్ఞానానికి అసలైన భాష్యంచెప్పాడాయన. ఇది ఖచ్చితంగా మానవాతీతమైన ఏదో ఒక శక్తి యొక్క ప్రభావమేగాని సామాన్యమైన విషయం కాదు.

శంకరుల జీవితాన్ని సరిగా అర్ధం చేసుకోవాలంటే, ఆయన గురువైన గోవింద భగవత్పాదులు మొదటిసారి ఆయననుచూచినపుడు ఏమన్నారో వినాలి. సమాధి స్థితిలో నుంచి బయటకు వస్తూ ఆయన శంకరులతో " నిన్ను సాక్షాత్తూ పరమశివుని అవతారంగా చూస్తున్నాను" అంటారు. అటువంటి మహాపురుషులు ఎన్ని వేల ఏళ్ళకో ఒకరు మాత్రమే జన్మిస్తారు. వేదములలో ఉన్న అద్వైత సిద్ధాంతాన్ని ఆయన వెలికి తెచ్చారని అనుకోవడమేగాని అసలు ఆయన ప్రతిపాదించినభావనలు లోతుగా అధ్యయనం ఎవరూ చెయ్యరు. ఆయన భావాలను ఆచరించలేకపోయినా, కనీసం భారతీయునిగాపుట్టిన ప్రతి ఒక్కరూ భావాలను అర్ధం చేసుకున్నప్పుడే ఆయన గడ్డపైన పుట్టిన ప్రయోజనం కొంతైనానెరవేరుతుంది.
read more " ఆది శంకరుల జీవితం-జాతకం ( ఆఖరి భాగం ) "