“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, ఆగస్టు 2016, బుధవారం

ఆగస్ట్ - 2016 అమావాస్య ప్రభావం

ఈరోజు అమావాస్య.

ఈసారి అమావాస్య తనదంటూ ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగి ఉన్నది.

ఇది సహజ రాశిచక్రంలో, బుద్ధిస్థానమైన సింహరాశిలో సంభవించడం, అక్కడే రవిచంద్రులకు ప్రబల శత్రువైన రాహువు ఉండి ఇద్దర్నీ మ్రింగడం వల్ల ఈ క్రింది సంఘటనలు సంభవిస్తాయి/ సంభవిస్తున్నాయి.

-- చాలామందికి మనస్సు చికాకుగా అయిపోతుంది.బుద్ధిహీనత ప్రాప్తిస్తుంది. రెస్ట్ లెస్ అయిపోయి ఆందోళనా, అసహనమూ,కోపమూ పెరిగిపోతాయి. అనవసరంగా ఎవర్నో అరవడమూ, గొడవలు పడటమూ జరుగుతుంది. రక్తసంబంధమైన రోగాలూ, జీర్ణకోశ, హృదయసంబంధ రోగాలూ మేమున్నామంటూ గుర్తుచేస్తాయి.

గట్టిగా గమనిస్తే గత రెండు రోజులనుంచీ ఈ మార్పులు మీలో మీరే చూచుకోవచ్చు.

--సింహరాశి - అధికారులకు, నాయకులకు సూచిక గనుక - ఈ ఫలితాలు నాయకులకు బాగా వర్తిస్తాయి.ఉదాహరణకు - చంద్రబాబు పైన 'ఓటుకు కోట్లు కేసు' నీలి నీడలు గట్టిగా ప్రసరిస్తున్నాయి.అలాగే,ఉపవాసాలవల్ల శరీరంలో సోడియం లెవల్స్ తగ్గిపోయి మత నాయకుడైన కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి హటాత్తుగా కుప్పకూలిపోయి విజయవాడ లోని ఒక ఆస్పత్రిలో ICU లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.ఆయన భక్తులు శిష్యులు లక్షలాది మంది ఆందోళనలో ఉన్నారు.చంద్రబాబు రాజకీయ నాయకుడు, కంచి శంకరాచార్య మతనాయకుడు - కానీ ఇద్దరూ నాయకులే. సింహరాశిచే సూచింపబడే వారే.

సోడియం అనేది శరీరంలోని నీటిస్థాయిని నియంత్రిస్తుంది. నీరు అనేది చంద్రుని అధీనంలో ఉంటుందని జ్యోతిశ్శాస్త్రం చెబుతున్నది.కనుక చంద్రుడు శక్తిహీనుడైన అమావాస్య సమయంలోనే జయేంద్ర సరస్వతి గారు,శరీరంలో సోడియం లెవల్స్ తగ్గి, కళ్ళు తిరిగి పడిపోవడం అనేది ఎంత సరిగ్గా ఉన్నదో గమనించండి.

ఇంకా చాలామంది నాయకులు ఉండగా వీరిద్దరి మీదనే ఎందుకు గ్రహప్రభావం ఇలా ఉన్నదన్న చొప్పదంటు ప్రశ్న మీకు ఉదయిస్తుందని నాకు తెలుసు. అందుకే మీరు అడగకపోయినా జవాబు చెబుతున్నాను.

జాతకంలో ఎవరి దశలు బాగా లేవో వారిమీద గ్రహచారం చాలా గట్టిగా పనిచేస్తుంది.ప్రస్తుతం ప్రముఖులలో వీరిద్దరి దశలు బాగా లేవని అర్ధం చేసుకోవచ్చు.పైగా - వీరిద్దరే కాక మిగతా అందరికీ కూడా ఎవరికి అనువైన రీతిలో వారికి వడ్డన జరుగుతూనే ఉంటుంది.

కొంతమంది బయటకు చెప్పుకుంటారు.మరి కొంతమంది చెప్పుకోలేరు.కొంతమంది మీడియాలో బయటపడతారు. కొంతమంది పడరు. అంతే తేడా !

వీరు ప్రముఖులు, వీరు కాదు అని మనకు ఉండవచ్చు.కానీ దైవశక్తులైన గ్రహాలకు అలా ఉండదు.వాళ్ళు ఎవరైనా సరే, సమయం వచ్చినపుడు వారి ఖర్మను అనుభవింప జెయ్యడమే వాటి పని. గ్రహాల ముందు అందరూ ఒకటే.

నిజమైన కమ్యూనిస్టులూ సోషలిస్టులూ గ్రహాలే.

అందరూ ఒకే టైంలో పుట్టలేదు.అందరికీ ఒకే సమయంలో అన్నీ జరగవు. కానీ కొన్ని సిమిలారిటీస్ వల్ల కొంతకొంత మందికి దాదాపుగా ఒకే విధమైన సంఘటనలు ఒకే సమయంలో జరుగుతాయి.అదే జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న విచిత్రం.

--అదే విధంగా రవిచంద్రుల మీద శనికుజుల ప్రభావం వల్ల - ఈరెండు రోజులలో అనేక దుర్ఘటనలు జరుగుతాయి.శుక్రుని నీచస్థితి వల్ల ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతాయి.ప్రముఖుల సెక్సు కుంభకోణాలు వెలుగు చూస్తాయి.ప్రముఖులకు,వారి తల్లిదండ్రులకు చెడుసమయం సూచింప బడుతున్నది.

రేపు అనగా సెప్టెంబర్ ఒకటో తేదీన - ఖగోళంలో చంద్రుడు రాహువును క్రాస్ చెయ్యబోతున్నాడు.ఆ సమయంలో ఖచ్చితంగా మరికొన్ని సంఘటనలు జరుగుతాయి. వేచి చూడండి.
read more " ఆగస్ట్ - 2016 అమావాస్య ప్రభావం "

25, ఆగస్టు 2016, గురువారం

Ye Kaun Chitrakaar Hai - Mukesh



Ye Kaun Chitrakar Hai అంటూ ముకేష్ ఆలపించిన ఈ గీతం Boond Jo Ban Gayi Moti అనే హిందీ సినిమాలోది.ఈ సినిమా 1967 లో వచ్చింది.దీనిని వీ.శాంతారాం నిర్మించి,తనే దర్శకత్వం కూడా వహించాడు.ఈయన సినిమాలు అన్నీ సందేశాత్మకంగా ఆదర్శాత్మకంగా ఉంటాయని వేరే చెప్పనక్కర లేదు కదా. ప్రకృతినీ, దానిని ఇంత అందంగా చిత్రించిన దైవాన్నీ స్మరిస్తూ సాగే పాట ఇది.

మొన్న 23 వ తేదీన కృష్ణానది ఆదిపుష్కరాల చివరి రోజు గనుక ఎక్కడో ఒకచోట కృష్ణలో స్నానం చేద్దామని అనుకున్నాను.పన్నెండు రోజులనుంచీ చాలామంది ఫ్రెండ్స్ స్నానాలకు వెళుతూ నన్నూ రమ్మని అడిగారు.అందరికీ ఒకటే సమాధానం చెప్పాను.

'నాకు తెలిసి నేనే పాపాలూ చెయ్యలేదు.నదిలో స్నానం చేసి ఆ పాపాలు పోగొట్టుకోవలసిన ఖర్మ నాకు లేదు.అంతకంటే గొప్పవీ, పాపాలను నిజంగా పోగొట్టే ప్రభావవంతమైన సాధనా విధానాలు నాకు తెలుసు.కనుక నేను రాను.'

కానీ చివరిరోజున కృష్ణానదిలో స్నానం చేద్దామని నాకూ అనిపించింది.ఇదే విషయం మా అమ్మాయితో ఫోన్ లో చెబితే ఇలా అంది.

'లక్షలాది మంది స్నానాలు చెయ్యడం వల్ల ఆ పాపాలు తీసుకుని కృష్ణానది అపవిత్రం అయిపోయింది కదా.నువ్వెళ్ళి స్నానం చెయ్యి తను రిలీఫ్ గా ఫీలౌతుంది.'

ఇద్దరం నవ్వుకున్నాం.

చివరి రోజు గనుక విజయవాడకు లక్షలాది జనం వస్తారని తెలుసు. అందుకని అటువైపు వెళ్ళకుండా అమరావతి వైపు వెళదామని నిశ్చయించాను.

అమరావతి రోడ్డులో తాడికొండ సెంటర్ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే, వైకుంఠపురం, తుళ్ళూరు, రాయపూడి, తాళ్లాయ పాలెం మొదలైన కృష్ణాతీర గ్రామాలు వస్తాయి.అక్కడ ఘాట్స్ చాలా బాగున్నాయనీ,జనం చాలా తక్కువగా ఉన్నారనీ అక్కడకు పోయొచ్చినవారు చెప్పారు.

ఎక్కడికి పోవాలి అనేదానిమీద క్లారిటీ లేదు. అందుకని ఏదో ఒక సూచన వస్తుందని వేచి చూస్తూ ఉన్నాను. 22 తేదీ సాయంత్రం ఒకాయన వచ్చి - రాయపూడి ఘాట్ చాలా బాగుంది.మేం వెళ్లి వచ్చాం. మీరూ అక్కడకు వెళ్ళండి - అని చెప్పాడు.

మర్నాడు ఉదయమే 5.30 కు కారులో నేనూ శ్రీమతీ బయలుదేరాం.బహుశా రాజధాని ఎఫెక్ట్ కావడం వల్లేమో రోడ్డు చాలా బాగుంది.6.30 కల్లా రాయపూడి గ్రామంలోని కృష్ణాతీరానికి చేరుకున్నాం.అక్కడకు చాలా దగ్గరలోనే కొత్తగా కడుతున్న 'అమరావతి' రాజధాని సచివాలయం భవనాలున్నాయి.

ఇది చాలా చిన్న ఊరు.కృష్ణానదికి చాలా దగ్గరగా ఉన్నది. మంచి పంట భూములు,పచ్చని చేలు,చెట్లు,తోటలతో చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. ఘాట్లో ఒక 40 మంది ఉన్నారు అంతే. స్నానాలు కానిచ్చి, పిండప్రదానం చేసి ఇవతలకు వచ్చాం.

అక్కడ ఒడ్డున నిలబడి మౌనంగా లోతుగా పారుతున్న కృష్ణా నదినీ, పచ్చని చేలనూ, తోటలనూ, ఉదయిస్తున్న సూర్యుడినీ చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉంటే మనస్సు ఏమై పోయిందో,అసలెక్కడున్నానో,అసలు నేనెవరో - కాసేపు ఏమీ తెలీలేదు. ఇలాంటి ప్రదేశాలలో నాకు ఇలాంటి 'సటోరి' రావడం మామూలే గనుక శ్రీమతి కూడా మౌనంగా ఉండి నన్ను గమనిస్తున్నది.

ధ్యాన తన్మయత్వానికి గుడులూ గోపురాలూ ఎందుకు? మనచుట్టూ ఉన్న సజీవ ప్రకృతి చాలదా? ధ్యానంలో గనుక మాస్టరీ ఉంటే, ప్రకృతిలో కలిగే తన్మయత్వం ఇంకెక్కడా కలగదు.అంత అద్భుతమైన ఫీల్ ను అది అందివ్వగలదు.

ఆ స్థితినుంచి బయటకు వచ్చాక నాకు ఒక హిందీ పాట గుర్తొచ్చింది.అదే ఈ పాట. అందుకే ఈ పాటను పాడి మీకు ప్రెసెంట్ చేస్తున్నాను.ట్రాక్ కొంచం గోలగా ఉన్నది. అదీగాక ఇలాంటి భావస్ఫోరకమైన పాటలు పాడుతుంటే గొంతు గాద్గదికమై పోయి పాడటం కష్టమౌతుంది.అలాగే ఈ పాటా చాలాసార్లు మధ్యలో ఆగిపోయింది.ఆ విధంగా ఒక పదిసార్లు పాడాక ఈ విధంగా వచ్చింది. భరించండి. తప్పదు మరి.

ఇలా అవస్థ పడుతూ (?) నేను పాడుతుంటే చూచిన మా శ్రీమతి ఈ విధంగా అడిగింది.

'ఎందుకంత ఎమోషనల్ అవుతారు? మామూలుగా పాడలేరా?'

తనతో ఇలా చెప్పాను.

'ప్రొఫెషనల్ సింగర్స్ కీ, ధ్యానులకూ ఉన్న తేడా అదే. వాళ్ళు నటిస్తూ కృత్రిమంగా పాడతారు.ధ్యానులు ఇన్వాల్వ్ అయి పాడతారు కనుక భావంతో తాదాత్మ్యం చెంది ఎమోషనల్ అవుతారు.అలాగే వారిని వదిలేస్తే సమాధిలోకి వెళ్ళిపోతారు. పాడుతూ పాడుతూ పాట ఆగిపోయి, ఇంక పాడలేని స్థితికి వచ్చి అందులోనుంచి ధ్యానస్థితిలోకి వెళ్ళిపోవడమే గానానికి గల ఏకైక పరమార్ధం.త్యాగరాజు మొదలైన వాగ్గేయకారులందరూ అలాంటి వారే.'

ఈ పాట వ్రాసిన భరత్ వ్యాస్ వేదోపనిషత్తుల నుంచి కొన్ని భావాలను స్వీకరించి ఈ పాట వ్రాశాడు.

ఉదాహరణకు --

"ఏ కిస్ కవీ కీ కల్పనా" -- అనే పాదంలో - వేదంలోని - 'ఈ విశ్వం అంతా బ్రహ్మము యొక్క స్వప్నం మాత్రమే' అన్న భావాన్ని పొందు పరచాడు.

అలాగే - 'అప్నే జో ఆఖ్ ఏక్ హై ఉస్కీ హజార్ హై" - అనే పదం వింటుంటే - "సహస్రశీర్షా పురుష: సహస్రాక్ష: సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళమ్" - అన్న మంత్రం స్ఫురిస్తున్నది.

అలాగే - "ఈ పర్వతాలు ధ్యానంలో ఉన్న యోగులవలె మౌనంగా నిలిచి ఉన్నాయి" - అన్న భావం చాన్దోగ్యోపనిషత్తు లోని - 

శ్లో|| ధ్యాయం వావ చిత్తాధ్బూయో ధ్యాయతీవ పృధివీ ధ్యాయతీవాంతరిక్షమ్ ధ్యాయతీవ ద్యౌ ర్ధ్యాయన్తీవాపో ధ్యాయన్తీవ పర్వతా...........||

అనే భావానికి యధాతధ రూపమే.

ఇటువంటి అత్యున్నతమైన భావాలు ఉన్నవి గనుకనే ఇలాంటి పాటలు పాడేటప్పుడు ఎమోషనల్ కాకుండా పాడాలంటే చాలా కష్టం.

ప్రకృతిని చూచినప్పుడు దానిని సృష్టించిన దైవం మనకు స్మృతిపధం లోకి రావాలి.ఇంత వైవిధ్యంతో కూడిన అనంతమైన సృష్టి యొక్క లీలావిలాసం మనకు స్ఫురించాలి. దైనందిన జీవితానికి అతీతంగా మన మనస్సు వెళ్లిపోవాలి. తనను తాను మరచి దైవ ధ్యానంలో అది లీనం అయిపోవాలి.

సృష్టికర్తను మన ఎదుట నిలపడమేగా సృష్టి పరమార్ధం !!

నా స్వరంలో కూడా ఈ అద్భుతమైన పాటను వినండి మరి.

Movie:--Boond Jo Ban Gayi Moti (1967)
Lyrics:-- Bharat Vyas
Music:--Satish Bhatia
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------
Hari hari vasundhara - Neela neela ye gagan
Neela neela ye gagan

Hari hari vasundhara Pe Neela neela ye gagan
Ki jiske badalon ki paalaki uda raha pawan
Dishaye dekho rang bharee - 2
Chamak rahi umang bhari
Ye kisne phool phool se - 2
Kiya singar hai
Ye kaun chitrakaar hai
Ye kaun chitrakaar
ye kau......n Chitrakaar hai

Tapaswiyon si hai atal - ye parvaton ki chotiyaa
Ye sarp si ghumerdaar gherdaar ghaatiyaa
Dhwaja se ye khade huye - 2
Hai vriksh devdaar ki
Galeeche ye gulaab ke - Bageeche ye bahaar ke
Ye kis kavee ki kalpanaa - 2
ka chamatkaar hai
Ye kaun chitrakaar hai
Ye kaun chitrakaar
Ye kau....n Chitrakaar hai

Kudrat ki is pavitrataa ko tum nihaar lo
Iske gunon ko apne man me tum utaar lo
Chamka lo aaj laalimaa - 2
Apne lalaat kee
Kan kan se jhankatee tumhe chavi viraat ki
Apni to aankh Ek hai - 2
Uski hazaar hai
Ye kaun chitrakaar hai
Ye kaun chitrakaar
Ye kau....n Chitrakaar hai

Meaning

The Earth - so green, so green
The sky above, blue,lovely blue
The wind gently moves the clouds above, like palanquins
Vibrant and joyful colors in all quarters
glittering with rapture
Who decorated all  the Nature, with beautiful flowers?
Who is the creator of this beautiful Nature?
Who is that artiste?
Who?

The mountains are still, like the ascetics in deep meditation
The valleys are deep and curvy, like serpents
The trees around are standing tall like flags
Look at the carpets of roses and gardens of spring
Which poet's beautiful imagination is all this creation?
Who is the creator of this beautiful Nature?
Who is that artiste?
Who?

Look at the purity of Mother Nature around you
Imbibe its great qualities into yourself
Let its liveliness brighten your forehead
Through every cell of your body, the Universe touches you
You have only one pair of eyes
The universe around you, has a thousand eyes
Who is the creator of this beautiful Nature?
Who is that artiste?
Who?

తెలుగు స్వేచ్చానువాదం

పచ్చదనంతో  నిండిన ఈ నేల - పైన విశాల నీలాకాశం
మేఘాలను సుతారంగా మోసుకుపోతున్న గాలి
నలుదిక్కులా నిండిన ఈ రంగుల కాంతులు
ఆనందం  పొంగి పొర్లుతున్న ఈ ప్రకృతి
ఎవరు దీన్నంతా ఈ అందమైన పూలతో అలంకరించారు?
వరు ఈ అద్భుతమైన ప్రకృతిని సృష్టించారు?
ఆ కళాకారుడెవరు?
ఎవరు?

ధ్యానంలో నిశ్చలంగా ఉన్న ధ్యానులలా ఈ పర్వతాలు
పాము మెలికలలా ఉన్న ఈ లోతైన లోయలు
ధ్వజ స్తంభాలలా ఎత్తుగా నిలిచి ఉన్న ఈ వృక్షాలు
ఈ పూల వనాలు - ఈ  వసంత శోభలు
ఇదంతా ఏ కవి యొక్క కల్పనో?
ఎవరు ఈ అద్భుతమైన ప్రకృతిని సృష్టించారు?
ఆ కళాకారుడెవరు?
ఎవరు?

ప్రకృతి లోని ఈ పవిత్రతను నువ్వు గ్రహించు
దానిలోని సద్గుణాలను నీలోనికి స్వీకరించు
దానిలోని తేజస్సు నీ లలాటానికి కాంతిని చేకూర్చనీ
నీలోని  ప్రతి కణాన్నీ ప్రకృతి స్పర్శిస్తున్నది చూడు
నీకున్నది రెండు కన్నులే 
నీ చుట్టూ ఉన్న ప్రకృతికి వెయ్యి కన్నులున్నాయి
ఎవరు ఈ అద్భుతమైన ప్రకృతిని సృష్టించారు?
ఆ కళాకారుడెవరు?
ఎవరు?
read more " Ye Kaun Chitrakaar Hai - Mukesh "

జ్యోతిశ్శాస్త్రం సత్యమే - ఇవిగో ఋజువులు - 2

నిన్న ఈ పోస్ట్ మొదటిభాగం వ్రాసిన కాసేపటికి ఇటలీలో భూకంపం వచ్చి వందలాది ఇళ్ళు నేలమట్టం అయిపోయాయి. యధావిధిగా జనం చనిపోవడమూ, గాయాల పాలు కావడమూ షరా మామూలుగా జరిగిపోయింది.ఆ తర్వాత కొద్ది గంటలలో మళ్ళీ వచ్చిన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వల్ల ఇంకా కొన్ని ఇళ్ళు మళ్ళీ నేలమట్టం అయిపోయాయి.

మీలో చాలామంది పోయినేడాది నేను వ్రాసిన 'రోహిణీ శకట భేదనం' అనే సీరీస్ చదివి ఉంటారు. రెండువేల సంవత్సరాల క్రితం వరాహ మిహిరుడు వ్రాసిన ఒక సూత్రం నేటికీ ఎంత ఖచ్చితంగా పనిచేస్తున్నదో అందులో వివరించాను. దానిననుసరించి వచ్చే ఏడాదిలో, అంటే 2016 లో, ఇదే యోగం వస్తున్నదనీ, అప్పుడు చాలా ఘోరాలు తప్పకుండా జరుగుతాయనీ చెప్పాను.అవి జరిగినప్పుడు గుర్తు చేస్తానని కూడా చెప్పాను.

వరాహ మిహిరుడు చెప్పిన వాటిల్లో - భూకంపాలు, వరదలు, కరువు, తెగుళ్ళు ముఖ్యమైనవి.

ప్రస్తుతం ఈ నెల 20 నుంచీ 26 వరకూ (అంటే ఇంకో రెండు రోజుల వరకూ) శని కుజ సంయోగం ఖగోళంలో జరుగుతున్నది. ఇది రోహిణీ నక్షత్రం ఉన్న వృషభ రాశిని సప్తమదృష్టితో బలంగా వీక్షిస్తున్నది.అంటే - ఈ దుర్యోగం కళ్ళు తెరవడానికి, ప్రజల పాపం పండటానికీ ఇది సరియైన సమయం అన్నమాట.

ఈ వారంలో - మన దేశంలోని ఉత్తరప్రదేశ్,బీహార్,వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలో భీభత్సమైన వరదలు వచ్చాయి. ప్రస్తుతం అలహాబాద్ పట్టణం మొత్తం వరద నీటిలో మునిగి ఉన్నది.

బీహార్ లో ఉన్న 24 జిల్లాలలో వస్తున్న ఈ వరదలకు దాదాపు 30 లక్షల మంది ప్రజలు దెబ్బ తిన్నారు.ఇది చిన్నా చితకా ఉపద్రవం కాదు.ఒక జలప్రళయం అనే చెప్పాలి.

ఈ జలప్రళయం వరాహ మిహిరుడు వాడిన మాటలకు ఖచ్చితంగా సరిపోతున్నది.

రాయిటర్స్ వార్తా సంస్థ ఏం వ్రాస్తున్నదో చూడండి.

Heavy monsoon rains have caused rivers, including the mighty Ganges and its tributaries, to burst their banks forcing people into relief camps in the states of Madhya Pradesh, Bihar, Uttar Pradesh, Rajasthan and Uttarakhand.
Government officials in Bihar, which has seen some of the worst flooding this year with almost 120 dead and more than five million affected, said the situation was serious.
"The flood waters have engulfed low-lying areas, homes and fields of crops," said Zafar Rakib, a district magistrate of Katihar, one of 24 districts out of Bihar's 38 districts which have been hit by the deluge.
"We have shifted people to higher ground and they are being provided with cooked rice, clean drinking water, polythene sheets," he told the Thomson Reuters Foundation.
In neighbouring Uttar Pradesh, where 43 people have died and over one million are affected, schools were closed in the cities of Varanasi and Allahabad as both the Ganges and Yamuna rivers crossed danger levels and flood waters continued to rise.
The holy city of Varanasi, where thousands of Hindus flock daily, was also forced to halt cremations along the banks of sacred Ganges river -- forcing families to cremate their relatives on the terrace roofs of nearby houses, officials said.
Television pictures showed villagers wading waist deep in floodwaters with their livestock, mud-and-brick homes collapsing and people climbing into wooden boats to get to relief camps.
"We are all worried about what we should do. For the last four days we have living like this. We don't even have any food to eat," 42-year-old villager Doda Yadav told the NDTV news station from Ballia district in Uttar Pradesh.
In the central state of Madhya Pradesh, where at least 70 have died since the onset of the monsoons in June and more than 40,000 homes partially or fully destroyed, almost 20,000 people have been evacuated to relief camps.
Officials said villagers would return home when water levels receded, although the Indian Meteorological Department has forecast more rains for central India over the next two days.
ఇది చాలదన్నట్లుగా, నిన్న ఇటలీలో వచ్చిన భూకంపం మన దేశంలోని బీహార్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్,త్రిపురా లలో కూడా 6-7 స్థాయిలో కనిపించింది.
PTI వార్తా సంస్థ ఏమంటున్నదో చూడండి.
A powerful 6.7 magnitude earthquake struck several parts of Bihar, Odisha, Assam, West Bengal and Tripura on Wednesday. There were, however, no immediate reports of human casualties or damage to property.

The epicentre was 58 km deep below the earth’s surface at Chauk, a small town in north-central Myanmar, according to the National Centre for Seismology, a unit of Ministry of Earth Sciences. The U.S. Geological Survey put the intensity of the quake at 6.8 on the Richter scale.

Tremors were felt in several parts of north India, including Gurgaon, Manesar and Bhondsi in Haryana, authorities said.
People in Kolkata, Patna and Guwahati were seen rushing out of their homes and offices into the streets in panic immediately after the quake struck at 4:04 p.m.

The Director of Bihar’s Met office A.K. Sen said the quake caused some old buildings to develop cracks.
(Courtesy:--The Hindu)
Amatrice in rubble

The birthplace of the famed spaghetti all’amatriciana bacon and tomato sauce, the city was full for this weekend’s planned festival honoring its native dish. Some 70 guests filled its top Hotel Roma, famed for its amatriciana, and a rescue worker said at least five bodies were pulled from the hotel’s rubble. The fate of the dozens of other guests wasn’t immediately known.

 Amatrice is made up of 69 hamlets that teams from around Italy were working to reach with sniffer dogs, earth movers and other heavy equipment to reach residents. In the city center, rocks and metal tumbled onto the streets and dazed residents huddled in piazzas as more than 200 aftershocks jolted the region throughout the day, some as strong as magnitude 5.1.

“The whole ceiling fell but did not hit me,” marveled resident Maria Gianni. “I just managed to put a pillow on my head and I wasn’t hit, luckily, just slightly injured my leg.”

Another woman, sitting in front of her destroyed home with a blanket over her shoulders, said she didn’t know what had become of her loved ones.

“It was one of the most beautiful towns of Italy and now there’s nothing left,” she said, too distraught to give her name. “I don’t know what we’ll do.”

As the August sun turned into a nighttime chill, residents, civil protection workers and even priests dug with shovels, bulldozers and their bare hands to reach survivors. A steady column of dump trucks brought tons of twisted metal, rock and cement down the hill and onto the highway toward Rome, along with a handful of ambulances bringing the injured to Rome hospitals.

“We need chain saws, shears to cut iron bars and jacks to remove beams. Everything, we need everything,” civil protection worker Andrea Gentili told The Associated Press in the early hours of the recovery. Italy’s national blood drive association appealed for donations to Rieti’s hospital.
Residents in a central Italian region devastated by an earthquake have been jolted awake by a strong aftershock.
The U.S. Geological Survey put its magnitude at 4.7 with the epicentre about 7 kilometres east of Norcia, with a relatively shallow depth of 10 kilometres (6 miles). The latest temblor struck at about 5-40 a.m. on Thursday.
Norcia, which is about 170 kilometres (105 miles) northwest of Rome, was the epicentre of Wednesday morning’s 6.2 earthquake that leveled the central Italian towns of Amatrice, Accumoli and Pescara del Tronto, and killed at least 159 .
















(Courtesy :--The Hindu)
కరెక్టుగా ఒక వారం టైం స్లాట్ లో ఈ ప్రకృతి వైపరీత్యాలను ఇంత ఖచ్చితంగా ఊహించి చెప్పగలిగే సైన్స్ ఇంకేదైనా ఉన్నదా? మీరే ఆలోచించండి.

2000 సంవత్సరాల క్రితం వరాహ మిహిరుడు చెప్పిన "ఒక" సూత్రం ఇంత ఖచ్చితంగా రుజువైన తర్వాత కూడా,ఇంకా ఇలాంటి సూత్రాలు అనేకం ఉన్న జ్యోతిశ్శాస్త్రం అబద్దమని మీరు అనుకునే పనైతే, మీకు మతి భ్రమించిందనీ, మీ లాజికల్ రీజనింగ్ సరిగ్గా పనిచెయ్యడం లేదనీ, నేనూ అనుకోక తప్పదు మరి.

ప్రకృతి అనేది కొన్ని సూత్రాల అనుగుణంగా పనిచేస్తున్నది.ఆ సూత్రాలను అర్ధం చేసుకోవడమే మనిషి చెయ్యవలసిన పని.దానినే సైన్స్ అంటున్నాం.ప్రస్తుత సైన్స్ కు అందని ఇంకా ఎంతో సైన్స్ ప్రకృతిలో దాగి ఉన్నది.దానిలో ఒక భాగమే జ్యోతిష్య శాస్త్రం.

జ్యోతిశ్శాస్త్రం అనేది దేవుడు మనిషికి ఇచ్చిన అద్భుతమైన వరం.దానిని సరిగ్గా ఉపయోగించుకోవడం తెలిస్తే మనిషి జీవితం ఇంకా ఎంతో బాగుంటుంది.కానీ మన వక్రబుద్ధి అనేది ఒకటుంది కదా !  అది ఇలాంటి శాస్త్రాలను మూడనమ్మకాలుగా అనుకునేటట్లు మనల్ని ప్రేరేపిస్తుంది.

నమ్మి సక్రమంగా వాడుకునేవారు బాగు పడతారు.లేనివారు వాళ్ళ ఖర్మను వాళ్ళు అనుభవిస్తుంటారు.

ఈ ప్రపంచం ఒక విచిత్రమైన నాటక రంగం.

ఏం చేస్తాం !! ఎవరి ఖర్మ వారిది.
read more " జ్యోతిశ్శాస్త్రం సత్యమే - ఇవిగో ఋజువులు - 2 "

24, ఆగస్టు 2016, బుధవారం

జ్యోతిశ్శాస్త్రం సత్యమే - ఇవిగో మరిన్ని ఋజువులు

జ్యోతిశ్శాస్త్రం సత్యమే అనడానికి నిత్యజీవితం లోనుంచి ఎన్ని కావాలంటే అన్ని ఋజువులు నేను చూపించగలను.కానీ దీనిని ఒప్పుకోవాలంటే మీకు ఓపన్ మైండ్ ఉండాలి. ప్రిజుడిస్ తో కూడిన మైండ్ ఉంటే, మీరు ఈ విషయాలు ఒప్పుకోలేరు.మీ మైండ్ మీ ఇష్టం గనుక మీ ఖర్మకు మిమ్మల్ని వదిలేస్తూ, కొన్ని విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నాను.

ప్రస్తుతం ఖగోళంలో ఒక ముఖ్యమైన గ్రహయోగం నడుస్తున్నది. దాని ఫలితాలు స్పష్టంగా భూమిమీద కనిపిస్తున్నాయి.కొంత వివరణతో నేను చెబుతున్నది నిజమేనని మీకు అర్ధమౌతుంది.

మొన్న 20 తేదీ నుంచీ రేపు 26 వరకూ ఒక వారం పాటు ఈ యోగం నడుస్తుంది.అదేంటంటే - శని కుజుల డిగ్రీ సంయోగం, మరియు గురు బుధుల డిగ్రీ సంయోగం.ఈ వారం వరకూ వీళ్ళు ఒకే నక్షత్ర పాదంలో ఉంటున్నారు.అంటే నవాంశలో కూడా ఒకే రాశిలో వీరు ఉంటారు.ఈ సంయోగం భూమిమీదా మనుషుల జీవితాల లోనూ స్పష్టమైన ఫలితాలను ఖచ్చితంగా చూపిస్తుంది.

శనికుజుల కలయిక భయంకరమైన ప్రమాదాలను యాక్సిడెంట్ లను ఇస్తుందని గతంలో లెక్కలేనన్ని సార్లు నేను చెప్పాను. ఉదాహరణలతో సహా రుజువు చేశాను.ప్రస్తుతం ఏం జరుగుతున్నదో చూద్దామా?

>> బార్డర్లో పాకిస్తాన్ ఆగడాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్ బార్డర్లో చైనా ఆగడాలు కూడా శృతి మించుతున్నాయి.

>>మహారాష్ట్రాలో రోగులను చంపుతున్న 'సంతోష్ పోల్' అనే డాక్టర్ ఇదే సమయంలో పట్టుబడ్డాడు.

>> కేరళలో ఇద్దరు మహిళలు వీధి కుక్కల దాడిలో గాయపడి మరణించారు.ఇది బీచ్ పక్కన ఉన్న పార్కులో జరిగింది. వీధి కుక్కలు దేశ పౌరులను ఎటాక్ చేసి చంపడం మన దేశంలోనే చూడగలం !!

>> మద్యప్రదేష్, రాజస్థాన్, ఉత్తరాఖండ్  రాష్ట్రాలలో తీవ్రమైన వర్షాలు కురిసి జనజీవనం అతలాకుతలం అయ్యింది.కనీసం 50 మంది చనిపోయారు. 'రోహిణీ శకట భేదనం' గురించి రెండు వేల ఏళ్ళక్రితం వరాహ మిహిరుడు ఏమన్నాడో అది మళ్ళీ ఇప్పుడు జరగడం కళ్ళారా చూస్తున్నారు కదా !!

>>జమ్మూ కాశ్మీర్ లో అల్లర్లు హింసా తీవ్ర రూపం దాల్చి, ప్రతిపక్షాలు దేశాధ్యక్షుడిని జోక్యం చేసుకొమ్మని అడిగేంత వరకూ వెళ్ళాయి.

>>ఖమ్మం దగ్గర హైవే మీద నుంచి కింద నున్న NSP canal లోకి బస్సు పడిపోయి 10 మంది చనిపోయారు.

>> ధార్వాడ్ జిల్లాలో బస్సు కారు గుద్దుకుని బస్సు తిరగబడి అందులో ఉన్న 33 మంది తీవ్రగాయాల పాలయ్యారు.

అంతర్జాతీయం

>> రోమ్ లో భూకంపం వచ్చి కనీసం పదిమంది చనిపోయారు.అనేక ఇళ్ళు కూలిపోయాయి.వరాహ మిహిరుని వ్యాఖ్య మళ్ళీ నిజం అయింది.

>> తాయిలాండ్ లో బాంబు పేలుళ్లు జరిగి అనేకమంది చనిపోయారు.

>> ఫిలిప్పీన్స్ లో జరిగిన యాంటి-డ్రగ్ డ్రైవ్ లో ఒక్క వారంలో 2,000 మంది చంపబడ్డారు.

>>గాజా స్ట్రిప్ లో ఇజ్రాయెల్ విమాన దాడులు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి.

>>టర్కీలో IS దాడిలో 51 మంది మరణించారు.

>>ఇరాక్ 36 మంది జిహాదీలను ఉరితీసింది.

>> నైజీరియాలో బోకో హరాం ఇస్లామిక్ తీవ్రవాదులు కనీసం 13 మందిని చంపేశారు.ఇంకో 15 మందికి కిడ్నాప్ చేసి పట్టుకుపోయారు.

>>పాకిస్తాన్ లో MQM తీవ్రవాదులు టీవీ స్టేషన్ ను ఎటాక్ చేసి ఒకరిని చంపేశారు.

ఉచ్చ స్థితిలో ఉన్న బుధుడిని, గురువు చేరడం అనే యోగం వల్ల క్రీడాకారులకు కళాకారులకు సన్మానాలు, సంబరాలు, పెద్ద ఎత్తున ఉత్సవాలు, ఇంటలెక్చువల్ వ్యాసంగాలు,వ్యాపార ఒప్పందాలు జరుగుతాయి.

>>ఇదే సమయంలో - ఒలింపిక్స్ లో - మన తెలుగమ్మాయి అయిన సింధు సిల్వర్ మెడల్ గెలిచింది.అదే విధంగా దీపా కర్మాకర్ కూడా ఒలింపిక్ జిమ్నాస్టిక్స్ లో ప్రతిభను కనబరిచింది.

>>ఇదే సమయంలో బలూచిస్తాన్ మీద మన ప్రధాని మోడీ ఒక వ్యూహాత్మకమైన ఇంటలెక్చువల్ ప్రకటన చేశాడు.దీనివల్ల అంతర్జాతీయ వేదికలమీద పాకిస్తాన్ మన దేశంపైన కక్కుతున్న విషానికి చెక్ పడుతుంది.

>>ఇదే సమయంలో ఒలింపిక్స్ ముగింపు సంబరాలు జరిగాయి.అదే విధంగా మన ఆంధ్రాలో కృష్ణా పుష్కర ముగింపు సంబరాలు పెద్ద ఎత్తున జరిగాయి.

ఇలాంటి వన్నీ ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయని అనేవారు అనవచ్చు.అన్నీ ప్రతిరోజూ జరగవు. కొన్ని కొన్ని సమయాలలోనే కొన్ని కొన్ని సంఘటనల ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది.అలాంటి సమయంలో ఖగోళంలో దానికి సరిపోయే గ్రహస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. స్టాటిస్టికల్ గా కూడా ఈ విచిత్రం చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది.

ఉదాహరణకు మొన్న, నిన్నలలో గమనించండి. మనుషులలో మానసిక అలజడి, రెస్ట్ లెస్ అవ్వడం,ఇంటలెక్చువల్ యాక్టివిటీలు చాలా ఎక్కువగా ఉంటాయి.చాలామంది కుటుంబాలలో ఇదే సమయంలో గొడవలు జరిగి ఉంటాయి. చాలామందికి ప్రమాదాలు జరిగి చిన్నవో పెద్దవో దెబ్బలు తగిలి ఉంటాయి.మనుషులు డిప్రెషన్ లోకి వెళ్ళడం, కొందరి జీవితాలలో ఊహించని మార్పులు జరగడం జరుగుతుంది.

మీ జీవితాన్నీ మీ చుట్టుపక్కల వారి జీవితాలనూ నిశితంగా గమనించండి, విషయాలు మీకే అర్ధమౌతాయి.

ఇదంతా చూస్తున్న తర్వాత కూడా, గ్రహ సంచారానికీ భూమి మీద సంఘటనలకూ సంబంధం ఉండదని ఇంకా మీరు భావిస్తున్నారా? అలా భావిస్తుంటే, మీ అజ్ఞానానికి నేనేం చెయ్యగలను చెప్పండి??
read more " జ్యోతిశ్శాస్త్రం సత్యమే - ఇవిగో మరిన్ని ఋజువులు "

23, ఆగస్టు 2016, మంగళవారం

మా అమెరికా యాత్ర - 40 (గాంగెస్ ఆశ్రమం - అతీతానుభవాలు)




















గాంగెస్ లో మేమున్న అయిదురోజులలో నా శిష్యులలో చాలామందికి ఎన్నో అతీతానుభవాలు కలిగాయి.నిజాయితీగా సక్రమమైన మార్గంలో సాధన చేసేవారికి ఇంద్రియాలకు అతీతమైన అద్భుతానుభవాలు కలగడం వింతేమీ కాదు.అది చాలా సహజంగా జరుగుతుంది.

ఈ పోస్ట్ లో అలాంటి అనుభవాలను కొన్నింటిని ప్రస్తావిస్తాను (కొన్నింటిని,అందులోనూ వ్రాయదగినవాటిని మాత్రమే).

గాంగెస్ లో ఉన్నన్ని రోజులూ, నావరకూ నేను, నాకలవాటైన అంతరిక స్థితులలో నిరంతరం ఉన్నాను.కానీ అవి బయటి వారికి ఏమాత్రం కనపడవు. అర్ధం కావు.నలభై ఏళ్ళ సాధనతో ఆ విధంగా ఉండగల కంట్రోల్ ను నేను సాధించాను.

నా సంగతి అలా ఉంచితే - మిగతావారి అనుభవాలు కొన్ని వినండి.

మొదటి రోజున మేము అక్కడకు వెళ్ళేసరికి - మాకంటే ముందు అక్కడకు చేరుకున్న మాధవ్, రాజూ రిట్రీట్ హోం వెనుక ఉన్న ఫైర్ ప్లేస్ దగ్గర చెట్లక్రింద కూచుని ధ్యానంలో మాకు కనిపించారు.ఆ తర్వాత - ఆ ప్రదేశంలో ఆధ్యాత్మిక తరంగాలు చాలా బలంగా ఉన్నాయనీ వాటి ప్రభావంతో ధ్యానస్థితి దానంతట అదే వస్తున్నదనీ మా అబ్బాయి మాధవ్ నాతో అన్నాడు.

నాలుగేళ్ల క్రితం మేమందరం కలకత్తా వెళ్ళినపుడు అక్కడ దక్షిణేశ్వర్ కాళికాలయ ప్రాంగణంలో మా అబ్బాయికీ అమ్మాయికీ దీక్షలిచ్చాను.నా నుంచి మొదటగా దీక్షలు తీసుకున్నది వాళ్ళే.అప్పటినుంచీ వాళ్ళు సాధన చేస్తున్నారు. అమెరికా వెళ్ళి, చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, మా వాడు క్రమం తప్పకుండా సాధన చేస్తూనే ఉన్నాడు.ఈ నాలుగేళ్ళలో తను ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయిలను క్రమంగా అందుకుంటున్నాడు.ఎప్పటికప్పుడు తన అనుభవాలను నాకు చెప్పి నా సలహాలు తీసుకుంటూ ఉంటాడు.కనుకనే గాంగెస్ లో అడుగు పెట్టడంతోనే అక్కడి ఆధ్యాత్మిక తరంగాలను ఫీల్ అవగలిగాడు.

అక్కడ ఉన్న అయిదు రోజులలో తను చాలా సమయం ట్రాన్స్ లో ఉన్నాడు.కానీ అన్ని పనులూ చేస్తూనే ఉన్నాడు.ఎయిర్ పోర్ట్ నుంచి వచ్చేవారిని రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ వారిని దింపడం, షాపింగ్ మాల్ కు వెళ్లి వస్తువులు కొనడం వగైరా అన్ని పనులూ చేస్తూనే, లోపల్లోపల ట్రాన్స్ లో ఉండగలుగుతున్నాడు.ఇది గమనించి నేను చాలా సంతోషించాను.

ఈ నాలుగేళ్ళలో తనకు చాలా అనుభవాలు కలిగాయి. వాటినన్నిటినీ ఇక్కడ వ్రాయను గాని, తనకు గాంగెస్ లో కలిగిన ఒక్క అనుభవాన్ని మాత్రం ఇక్కడ అక్షరబద్ధం చెయ్యదలచుకున్నాను.ఎందుకంటే ఇది అద్భుతమైన Out Of The Body Experience కనుక.

Para Normal ప్రపంచంలో దీనినే క్లుప్తంగా OBE అంటారు.

చీకటి పడిన తర్వాత రిట్రీట్ హోం వెనుక ఉన్న ఓపెన్ ఫైర్ ప్లేస్ చుట్టూ పాతి ఉన్న చెట్ల మొద్దుల మీద కూచుని అందరం ధ్యానం చేసేవాళ్ళం.అలా రెండు మూడు సార్లు చేశాం.

ఒకరోజున సాయంత్రం నుంచీ తను ట్రాన్స్ లో ఉండటం నేను గమనించాను.ఆ రోజున చీకటి పడిన తర్వాత అందరం ఫైర్ ప్లేస్ దగ్గర మౌనంగా ధ్యానం చేస్తున్నాం.

అక్కడున్న అందరినీ నేను గమనిస్తూనే ఉన్నాను.ఎవరెవరి ఆలోచనలు ఎలా ఉన్నాయో నాకు తెలుస్తూనే ఉన్నది.ఊరకే కళ్ళు మూసుకుని ఆలోచనల సుడిలో కొట్టుకుపోతున్న వాళ్ళు కొందరు, ఏవేవో ప్లాన్స్ వేస్తున్న వాళ్ళు కొందరు,చెదిరిపోతున్న ఆలోచనలను కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు కొందరు,నిద్రమత్తులో ఉంటూ అదే ధ్యానం అనుకుంటున్న వారు కొందరు,కలల్లో తేలిపోతూ అవే అనుభవాలని అనుకుంటున్నవారు కొందరు,ఊరకే చలికాచుకుంటున్న వారు కొందరు - ఇలా ఉన్న రకరకాలైన వారిమధ్య ఒకరిద్దరు మాత్రమే ధ్యాన స్థితి నిజంగా కుదిరిన వారు కనిపించారు.వారిలో మాధవ్ ఒకడు.

ఇలా ధ్యానం చేస్తున్న తనకు అకస్మాత్తుగా ఒక అనుభవం కలిగింది.మా చుట్టూ చాలా పొడవైన చెట్లు ఉన్నాయి.అవి పైన్ వృక్షాలో లేక మరే చెట్లో నాకైతే తెలీదు. మాతోనే కూర్చుని ధ్యానిస్తున్న తను, అకస్మాత్తుగా చెట్ల పైన ఆకాశంలో తేలుతూ ఉన్నట్లుగా ఫీల్ అయ్యాడు.అక్కడ తేలుతూ, క్రింద ఉన్న మంటనూ,దాని చుట్టూ కూచుని ఉన్న మమ్మల్నందరినీ, మాతోబాటు "తనను" కూడా bird's eye view లో చూస్తున్నాడు.ఆ సమయంలో చాలా తేలికగా, చాలా సంతోషంగా, దూదిలా గాలిలో తేలుతున్నట్లు ఫీలింగ్ తనకు కలిగిందని నాకు తర్వాత చెప్పాడు.ఆ సమయంలో ప్రపంచమూ,జీవితమూ,దాని బాధలూ సమస్యలూ ఏవీ తనకు గుర్తు రాలేదట.

సరిగ్గా అప్పుడే, మా గ్రూప్ లో ఉన్న కొందరికి మెంటల్ పట్టింది. వాళ్ళేదో పిచ్చి చేష్టలు చెయ్యబోవడమూ, నేను వారిని గదమడమూ జరిగాయి.అప్పటివరకూ గాలిలో చెట్లపైన తేలుతున్న తను, నా గద్దింపుతో, ఒకే ఒక్క సెకండ్లో శరీరంలోకి వచ్చేశాడు.తన OBE state ఆ విధంగా చెదిరిపోయింది.

అందుకే - ధ్యానుల చుట్టు పక్కల, మామూలు మనుషులు ఉండకూడదు.తెలిసీ తెలియక వాళ్ళు ఆలోచించే పిచ్చి ఆలోచనలతో, వాళ్ళు చేసే పిచ్చి చేష్టలతో ధ్యానులకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది.వారి ధ్యానం పాడైపోతుంది.ఇలాంటి వాటిని ఎవాయిడ్ చెయ్యడానికే ధ్యానులు మౌనులు కొండల్లో అడవుల్లో జనసంచారానికి దూరంగా ఉంటూ ఉంటారు. మామూలు మనుషులకూ ధ్యానులకూ అందుకే - ఎప్పుడూ పడదు.వీరిని వారూ భరించలేరు.వారిని వీరూ భరించలేరు.

ఆ తర్వాత అందరం లేచి రిట్రీట్ హోం లోకి వచ్చాం.తను కూడా మాతోబాటు నిదానంగా నడుచుకుంటూ వచ్చి క్రింద హాల్లో ఉన్న సోఫాలో కళ్ళు మూసుకుని మత్తుగా పడుకున్నాడు. ఆ అనుభవం సడన్ గా పోయినా, అది కలిగించే మత్తు అంత త్వరగా పోదని నాకు తెలుసు,ఆ స్థితిలో చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది. అందుకని నేనూ తనని డిస్టర్బ్ చెయ్యకుండా ఊరుకున్నాను.ఆ రాత్రంతా తను అదే స్థితిలో ఉన్నాడు.

ఆ తర్వాత - ఈ స్థితి కలిగినప్పుడు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో,ఎలా దానిని నిలుపుకోవాలో - ఈ రహస్యాలన్నీ తనకు వివరించి చెప్పాను.

ఇకపోతే - ఉదయం పూట ధ్యాన సమయంలో నాతో ఉన్న చాలామందికి చాలా అనుభవాలు కలిగాయి.

కొందరికి కనులముందు వెలుగు కనిపించింది.కొందరికి రకరకాలైన రంగులు కనిపించాయి.ఇంకొందరికి చెవులలో నిరంతరం మ్రోగుతున్న హమ్మింగ్ సౌండ్ వినిపించింది. ఒకరిద్దరికి మాత్రం దేవతా స్వరూపాలు దర్శనం ఇచ్చాయి.మొత్తం మీద అందరికీ ఏదో తెలియని ఆనందం కలిగింది.ఆ కొద్ది రోజులపాటు - ఇంటి గొడవలు, నిత్యజీవితపు సమస్యలు ఏవీ ఎవరికీ గుర్తు రాలేదు.అందరం కలసిపోయి ఒకే కుటుంబంలా సరదాగా ఆనందంగా ఆ రిట్రీట్ హోం లో గడిపాము.

మాధవ్ కు కలిగిన OBE హటాత్తుగా చెడిపోయిన సందర్భంగా నేనూ ఒక గుణపాఠం నేర్చుకున్నాను.నాతో రిట్రీట్ కు ఇకమీదట ఎవరిని బడితే వారిని పిలవకూడదని, నాతో పూర్తిగా సింక్ అయ్యి,మౌనంగా ఉంటూ,తూచా తప్పకుండా నేను చెప్పినట్లు ఆచరించే,అతి కొద్దిమందిని మాత్రమే నాతో స్పిరిచ్యువల్ రిట్రీట్లకు ఇకమీదట పిలవాలనేదే నేను నేర్చుకున్న ఆ పాఠం. 

ఈ క్రమంలో - ఇప్పటివరకూ నాతో ఎంత సన్నిహితంగా ఉన్నవారినైనా సరే - వారు ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉండే పనైతే - అలాంటి వారిని దూరంగా ఉంచాలన్న నిశ్చయానికి నేను వచ్చేశాను.

లౌకిక జీవితంలో కూడా - నానుంచి ఎవరికీ ఏ విధమైన ఇబ్బందీ కలగకూడదని భావించేవాడిని నేను.ఇక - మనవల్ల మన ఆప్తులకు ఆధ్యాత్మికంగా హాని జరుగుతూ ఉంటే దానిని ఎలా సహించగలం?

మనోనిగ్రహమూ ఆత్మనిగ్రహమూ లేకుండా,ఇలా అర్ధం పర్ధం లేని ఆవేశ కావేషాలకు లోనైపోతూ, లోపల్లోపల ఏవేవో ఊహించుకుంటూ,మనం అక్కడకు ఎందుకొచ్చాం అన్న స్పృహకూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే వారు,వారివారి భావనా పరంపర వల్లా,నా మాట వినని ప్రవర్తన వల్లా,తమతో ఉన్న ఇతర ధ్యానుల నిష్ఠకు భంగం కలిగించిన వారౌతారు.వీరు ఇటువంటి రిట్రీట్లకు ఎంతమాత్రం పనికిరారు.

కనుక ఇకమీద అందరినీ నాతో స్పిరిచ్యువల్ రిట్రీట్లకు పిలవకూడదని నిర్ణయం తీసుకున్నాను.

ఎందుకంటే నాకు క్వాంటిటీ ముఖ్యం కాదు.క్వాలిటీయే ముఖ్యం.నాకు నూరుమందో వెయ్యిమందో శిష్యులు అక్కర్లేదు. నాతోబాటు నా దారిలో త్రికరణ శుద్ధిగా నడవగలిగే ఒక్కరో ఇద్దరో నాకు చాలు.

(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర - 40 (గాంగెస్ ఆశ్రమం - అతీతానుభవాలు) "