“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, జనవరి 2016, ఆదివారం

ఈరోజు వివేకానందస్వామి జన్మదినం

ఈరోజు పుష్య బహుళ సప్తమి.అంటే ఈరోజు వివేకానంద స్వామి జన్మదినం. నేటికి ఆయన జన్మించి 153 సంవత్సరాలు గడిచాయి.ఈ సందర్భంగా ఆ మహనీయుని స్మరించడం మన కర్తవ్యం.

స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన్ను స్మరిస్తే చాలు నా హృదయం ఉప్పొంగిపోతుంది. ప్రపంచాన్నీ అందులోని మనుషులనూ ఏమాత్రం లెక్కచెయ్యని దివ్యాత్ముడైన శ్రీరామకృష్ణుడు,నరేన్ కనిపించకపోతే మాత్రం తల్లడిల్లి పోయేవాడు.అమ్మదగ్గర ఏడ్చేవాడు.నరేన్ కనిపిస్తే తన దగ్గరగా కూచోబెట్టుకుని తనచేతితో నరేన్ కు ముద్దుగా తినుబండారాలు తినిపించేవాడు.శ్రీరామక్రిష్ణుని దివ్యస్పర్శకు, ఆయన కరుణకు నోచుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలో ఆలోచిస్తే వివేకానందస్వామి ఎంతటి మహనీయుడో మనం తేలికగా అర్ధం చేసుకోవచ్చు.

ఆయన లక్షణాలను,ఆయన చేసిన పనులను, చెప్పిన బోధనలను ఒక్కసారి మననం చేసుకుందాం.

పోల్చలేని ధీశక్తి

అసాధారణమైన ధీశక్తి ఆయన సొంతం.చిన్నవయస్సులోనే భారతీయ వేదాంతాన్ని ఔపోసన పట్టాడు.అంతేగాక పాశ్చాత్య దార్శనికులనూ ఆయన క్షుణ్ణంగా చదివాడు.ఒక్కసారి విన్నా చూచినా చదివినా ఇక ఎప్పటికీ మరువని ఫొటోగ్రాఫిక్ మెమరీ ఆయనకు ఉండేది.వాదాలలో ఆయనను ఓడించినవారు లేరు. నిశితమైన పరిశీలనా,తర్కబద్ధమైన ఆలోచనా, వాదనాపటిమా ఆయనలో ఉండేవి.అటువంటి మేధస్సును ఆదిశంకరులలో మాత్రమే మనం మళ్ళీ గమనిస్తాం. 

ఆశ్చర్యపరిచే ధ్యానశక్తి

అతి చిన్నతనం నుంచే స్వామికి ధ్యానం సహజంగా అలవడింది.రెండు మూడేళ్ళ వయస్సునుంచే స్వామి అచంచలమైన ధ్యానంలో ఉండేవాడు. తన గదిలోకి పాము వచ్చినా, పక్కవాళ్ళు గోలగోలగా అరుస్తున్నా కూడా వినిపించనంత గాఢమైన ధ్యానంలో ఆయన అంత చిన్నవయస్సులోనే ఉండగలిగేవాడు.అది ఆయనకు సహజంగా పుట్టుకతో వచ్చింది.

అబ్బురపరిచే దయాస్వభావం

చిన్నతనంలో తన పుట్టినరోజున తల్లిదండ్రులు కొనిచ్చిన కొత్త బట్టలను ఏమాత్రం ఆలోచించకుండా పేదవారికి ఇచ్చేసేవాడు.ఇతరుల బాధలు చూచి చలించి వాటితో మమేకం చెంది బాధపడే గుణం ఆయనకు పుట్టుకతోనే వచ్చింది.

బహురంగాలలో ప్రావీణ్యం

స్వామికి అనేక రంగాలలో సహజమైన ప్రావీణ్యం ఉండేది.ఆయన అద్భుతంగా గానం చేసేవాడు.శ్రీరామకృష్ణుల మధురస్వరం తర్వాత అంతటి మధురమైన స్వరం స్వామిదే అని,వాటిని ఏ గాయకులతోనూ పోల్చలేమని,అవి ఈ లోకానికి చెందిన స్వరాలు కావని, రెండూ విన్నవారు వ్రాశారు.అంతేగాక ఆయన డోలక్,తబలా, వీణ మొదలైన సంగీత వాయిద్యాలను చక్కగా వాయించేవాడు. మల్లయుద్ధంలో మెళకువలు ఆయనకు తెలుసు.పెయింటింగ్స్ చక్కగా వెయ్యగలిగేవాడు.ఆయన మంచి వక్త మాత్రమె గాక మంచి కవి కూడా.అనేక కవితలను ఆయన చిన్నతనంలోనే వ్రాశాడు.

నిశిత పరిశీలనా శక్తి

జీవితాన్ని చాలా నిశితంగా ఆయన చిన్నతనంలోనే పరిశీలించాడు.జీవితం అందరూ గడుపుతున్నట్లు డబ్బుకోసం, తిండి కోసం,విలాసాలకోసం కాదనీ, దానికి ఒక ఉన్నతమైన అర్ధమూ గమ్యమూ ఉన్నాయన్న విషయాన్ని ఆయన అతిచిన్న వయస్సులోనే గ్రహించాడు.జీవితం అంటే ఒక గమ్యం లేకుండా భోగాల కోసం,సరదాలకోసం,డబ్బుకోసం వృధా చేసుకునేది కాదని ఆయనకు అతి చిన్నప్పుడే స్పృహ ఉండేది.

ఆశ్చర్యపరచే వైరాగ్యం

అందరినీ రకరకాలైన వ్యామోహాలకు గురిచేసే యవ్వనప్రాయంలో స్వామి అమితమైన వైరాగ్యసంపన్నుడై మండుతున్న అగ్నిలాగా ఉండేవాడు.ఆయన చుట్టూ ఉన్న ఆరా ఎంత బలంగా ఉండేదంటే,ఆయన సమక్షంలో ఉన్నవారుకూడా అనవసరమైన చెత్త సంభాషణలను ఏమాత్రం చెయ్యలేకపోయేవారు.వారి మనస్సులు కూడా అసంకల్పితంగా ఉన్నతములైన విషయాలవైపు మళ్లేవి.

అద్భుతమైన సాధనాబలం

శ్రీరామకృష్ణులను స్వామి దర్శించేనాటికి స్వామికి 19 ఏళ్ళు. గురుదేవుని మార్గదర్శనంలో నాలుగేళ్ళు గడిచేసరికి తన 23 వ ఏట,యోగంలో అత్యంత ఉన్నతస్థితి అయిన నిర్వికల్ప సమాధిని స్వామి చేరుకోగలిగాడు.వెనక్కు తిరిగి చూడనటువంటి అలాంటి గొప్ప సాధనాబలం ఆయనకుండేది.

భారతీయ వేదాంతానికి కొత్త గమనం

అప్పటివరకూ కొండల్లో గుహలలో అడవుల్లో ఉన్న వేదాంతాన్ని స్వామి సమాజంలోకి తెచ్చాడు.సాధువులకు ఉన్న సంఘబాధ్యతలను ఆయన గుర్తుచేశాడు.కర్మకు యోగస్థాయిని కట్టబెట్టి కర్మయోగానికి పూర్వవైభవాన్ని తెచ్చాడు. తన మోక్షం ఒక్కటే ప్రధానం కాదు, నలుగురికీ కూడా ఆధ్యాత్మికంగా సాయపడాలన్న ఉన్నతమైన సాంప్రదాయానికి మళ్ళీ ఊపిరి పోశాడు.సన్యాస సాంప్రదాయానికి కొత్త భాష్యం చెప్పాడు.

మూడు మతాల సమన్వయం

అప్పటివరకూ మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప అని కొట్టుకు చస్తున్న ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతాల గొడవకు తన గురుదేవులైన శ్రీరామకృష్ణుల బోధనల మార్గంలో చక్కగా సులువుగా పరిష్కారం చూపించాడు. "మనిషి దైవాన్ని చేరుకునే మార్గంలో ఈ మూడూ మూడు మెట్లు మాత్రమే, అనవసరంగా కొట్టుకోవద్దని" చెప్పి మధ్వ,శంకర,రామానుజ సాంప్రదాయాల మధ్యన ఎప్పటినుంచో ఉన్న ఈ వైరుధ్యాన్ని ఎంతో చక్కగా సమన్వయం చేశాడు.

అన్ని మతాల సారం హిందూమతం

ప్రపంచంలోని అన్ని మతాల భావాలూ హిందూమతంలో ఉన్నాయి.నిజానికి ఈ మతాలన్నీ ఒకే దైవాన్ని చేరుకునే రకరకాలైన దారులన్న తన గురుదేవుల బోధనను విశ్వవ్యాప్తం గావించి మనుషుల మధ్యా మతాల మధ్యా ఉన్న ద్వేషాలను పోగొట్టే ప్రయత్నం చేశాడు.

జాతికి శక్తిపాతం

అప్పట్లో బ్రిటిష్ పాలనలో బానిసత్వంతో కృంగిపోతున్న మన దేశానికి అమృతం లాంటి తన బోధల ద్వారా తిరిగి జీవాన్ని ప్రసాదించాడు.నిరాశనూ, నిరుత్సాహాన్నీ, దైన్యాన్నీ వీడమనీ, స్వశక్తిని ఆత్మశక్తిని గ్రహించమనీ ఉద్బోధించాడు.మనలో ప్రవహిస్తున్న ఋషి రక్తం యొక్క శక్తిని తెలుసుకొమ్మని మేల్కొలిపాడు.

మహత్తరమైన యోగశక్తి

చాలామంది యోగశక్తిని గురించి మాటలు మాత్రమే చెబుతారు.కానీ స్వామి మాత్రం, లోకంలో తను వచ్చిన పని అయిపోయిందని అనుకున్న మరుక్షణం స్వచ్చందంగా ప్రాణం వదిలేసి యోగమార్గంలో తనలోకానికి వెళ్ళిపోయాడు. అప్పటికి ఆయనకు 39 ఏళ్ళు మాత్రమే.ఇటువంటి యోగశక్తిని మనం చాలా తక్కువమంది ప్రవక్తలలో మాత్రమే గమనిస్తాం.

తను శరీరాన్ని వదిలేసే కొద్ది నెలల ముందు తన సోదర శిష్యుడైన అభేదానంద స్వామితో ఆయన ఇలా అన్నారు.(సన్యాసం స్వీకరించడానికి ముందు అభేదానంద స్వామి పేరు కాళీప్రసాద్ చంద్ర.వాళ్ళు మాట్లాడుకునే సమయంలో పాత పేర్లతోనే పిలుచుకునే వారు) 

'కాళీ ! నేను ఇంకా కొద్ది నెలలు మాత్రమే ఈ శరీరంలో ఉంటాను.'

దానికి అభేదానంద స్వామి ఇలా అన్నారు.

'అదేంటి నరేన్? ఇప్పుడు నీ వయసెంత? నీవు మాట్లాడే మాటలేమిటి?అప్పుడే ఏమైంది? నువ్వు చెయ్యాల్సింది ఇంకా ఎంతో ఉంది?'

దానికి వివేకానంద స్వామి ఇలా అన్నారు.

'అదికాదు కాళీ! నీకు తెలీదు.నా ఆత్మ బాగా ఎక్కువగా వికాసం చెందుతున్నది.అది ఎంతగా వికసిస్తోందంటే ఈ శరీరాన్ని దాటి విశ్వం మొత్తాన్నీ అది నిండిపోతున్న ఫీలింగ్ నాకు చాలా ఎక్కువగా కలుగుతున్నది.ఈ చిన్నశరీరం ఇక ఎంతమాత్రం నన్ను భరించలేదు.కనుక త్వరలో నేను శరీరాన్ని వదలక తప్పదు.'

ఆ తర్వాత మూడు నాలుగు నెలలకే ఆయన శరీరాన్ని వదిలేశారు.

ఈ సంభాషణ వినడానికే మనకు భయం వేస్తున్నది కదూ? అలాంటిది స్వామి యొక్క ఆధ్యాత్మిక స్థాయి !!

నవీనకాలపు మహా ప్రవక్త

భారతదేశానికే కాదు, ప్రపంచానికి కూడా ఎప్పటికీ కావలసిన మహత్తరమైన దివ్యమార్గాన్ని తన బోధలద్వారా సూచించి ప్రపంచానికి మార్గనిర్దేశం గావించాడు.

ఇప్పటి వరకూ వచ్చిన అనేకమంది ప్రవక్తలు -బుద్ధుడు,మహావీరుడు, జీసస్, మహమ్మద్, జోరాస్టర్ - వీరందరి కంటే వివేకానందస్వామి ఉత్తమమైన ప్రవక్త అని నేను విశ్వసిస్తాను. నా దృష్టిలో వీరందరికంటే ఉన్నతమైన స్థానం వివేకానంద స్వామిది.

దీనికి కారణాలు కొన్ని చెప్తాను.

మహమ్మద్ బోధలవల్ల ఈనాటికీ ప్రపంచంలో ఎంతో రక్తపాతం జరుగుతున్నది.అమాయకులు వేలాదిమంది ఈయన బోధల కారణంగా చంపబడుతున్నారు.మతహింస అనేది ఇస్లాంలో అతిపెద్ద లోపం.

క్రీస్తు బోధలవల్ల ప్రపంచంలో ఈనాటికీ ఎంతో ద్వేషం ప్రచారం కాబడుతున్నది.మతమార్పిడి జరుగుతున్నది.ఇది క్రైస్తవంలోని అతి పెద్ద లోపం.

ఇస్లాం ద్వారా భౌతిక హింస జరుగుతుంటే క్రైస్తవం ద్వారా మానసిక హింస జరుగుతున్నది.

శాంతిని బోధిస్తున్నామని చెప్పుకునే ఈ రెండు మతాలవల్లా భూమిమీద ప్రవహించినంత మానవరక్తం ఇంకే మతం వల్లా ఇప్పటివరకూ ప్రవహించలేదు.ఇది చరిత్ర చెబుతున్న నిజం మాత్రమే కాదు నేటికీ కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవం.

కానీ వివేకానందస్వామి విశ్వజనీనమైన, హింసకు అతీతమైన, వేదాంత మార్గాన్ని బోధించాడు.అందరిలో ఉన్న ఆత్మ నిజానికి ఒక్కటే అనీ, ఆ ఆత్మకు మూలమైన పరమాత్మ కూడా ఒక్కటే అనీ,ఎవరూ ఎవర్నీ ద్వేషించనవసరం లేదనీ, మతాలు మారవలసిన అవసరం కూడా లేదనీ ఆయన బోధించాడు.దీనికి మూలాలను మన వేదాలనుంచి ఉపనిషత్తుల నుంచి ఆయన ఉటంకించాడు.

బుద్ధుడు అనాత్మవాది.బౌద్ధంలో మిగతా అన్ని లక్షణాలూ మంచివే అయినప్పటికీ ఈ అనాత్మవాదం వల్లనే ఈ మతం మన దేశం నుంచి అదృశ్యం అయిపోయింది.కానీ వివేకానందస్వామి బుద్ధుని బోధలకు సరియైన అర్ధాన్ని వివరించాడు.ఆత్మవాదం ద్వారా కూడా బుద్ధుడు సూచించిన నిర్వాణస్థితిని పొందవచ్చని స్వానుభవంతో ఆయన అన్నాడు.కనుక బుద్ధుని కంటే వివేకానందుని స్థాయి ఉన్నతమైనదని నేను విశ్వసిస్తాను.

జీసస్,మొహమ్మద్ వంటి ప్రవక్తల కంటే బుద్ధుడు ఎంతో ఉన్నతమైన వాడు.ఎందుకంటే బుద్ధుని బోధనలలో హింసకు తావు లేదు.కాకపోతే బుద్ధుని మార్గంలో కొన్ని మౌలిక లోపాలున్నాయి.వివేకానందస్వామి వాటిని కూడా అధిగమించాడు.కనుక బుద్ధుని కంటే కూడా వివేకానందస్వామి ఇంకా ఉన్నతమైన ప్రవక్త అని నా భావన.

మరి ఇన్ని ఉత్తమ లక్షణాలున్న వివేకానందుని వంటి మహాప్రవక్త మన దేశంలో జన్మిస్తే ఆయన జన్మదినం ఈరోజు అయితే ఆయన్ను స్మరించకుండా ఉండటం ఎంత ఘోరమైన పాపమో ఆలోచించండి.

విచిత్రమేమంటే అలాంటి గొప్ప ప్రవక్త పుట్టి నేటికి 153 సంవత్సరాలు అయినప్పటికీ, ఈరోజుకి కూడా మన దేశంలో ఆయన బోధనలను సరిగ్గా అర్ధం చేసుకున్న వారూ ఆచరిస్తున్న వారూ అతి తక్కువమందే ఉన్నారు.గారడీవిద్యలు ప్రదర్శిస్తూ,నల్లధనమూ బంగారమూ పోగేసుకుంటూ,కుహనా వేదాంతం చెప్తూ కోరికలు తీరుస్తామంటూ పిచ్చిపిచ్చి దీక్షలిస్తున్న నకిలీ స్వాములకూ, నకిలీ బాబాలకూ నేడుకూడా మన దేశంలో కొదవ లేదు.అలాంటి వారి వెంట వేలంవెర్రిగా పరుగులు తీసే వెర్రిగొర్రెలకూ కొదవ లేదు.అదే మన దేశ ప్రజల ఆధ్యాత్మిక దౌర్భాగ్యం, కలిప్రభావం.

అసలుని వదిలేసి నకిలీల వెంట పరిగెత్తడమే మన దేశ ప్రజల దురదృష్టం.శుద్ధమైన వేదాంత బోధలను వదిలేసి గారడీ విద్యల వెంటపడి పరుగులు తియ్యడమే నేటి ప్రజల చవకబారు మనస్తత్వాలకు నిదర్శనం.

శ్రీరామకృష్ణ వివేకానందుల బోధనలను అనుసరించడం ద్వారా మాత్రమే మానవజాతి సరియైన మార్గంలో దైవం వైపు ప్రయాణం చెయ్యగలుగుతుంది.వీరిద్దరి బోధనలకు అనుగుణంగా ఇంకెవరైనా బోధిస్తే అంతవరకూ మాత్రమే ఆ బోధకులుగాని ఆ ప్రవక్తలుగాని సరియైన మార్గంలో ఉన్నట్లు లెక్క. అలా లేనప్పుడు, వారు కూడా కుహనా బోధకులే. అలాంటి వారిని అనుసరించినంత వరకూ మానవజాతికి, అజ్ఞానం నుంచీ, ద్వేషం నుంచీ, హింస నుంచీ,ఆధ్యాత్మిక దరిద్రం నుంచీ నిష్కృతి లేదు. రాదు.

కనీసం ఈరోజైనా ఆ మహనీయుని స్మరిద్దాం.ఆయన బోధనలను నిత్యజీవితంలో ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలా చెయ్యడం ద్వారా మాత్రమే మనం కూడా దివ్యత్వం వైపు శరవేగంతో పయనించగలుగుతాం.సత్యమైన వేదధర్మానికీ సనాతనధర్మానికీ వారసులం కాగలుగుతాం. అప్పుడే మనం నిజమైన భారతీయులమని అనిపించుకో గలుగుతాం.
read more " ఈరోజు వివేకానందస్వామి జన్మదినం "

30, జనవరి 2016, శనివారం

Amay Proshno Kore Neel Dhrubo Taara - Hemanta Mukherjee


అమాయ్ ప్రోశ్నో కోరే నీల్ ధ్రుబో తారా...

హేమంత ముఖోపాధ్యాయ మధురగళంలోనుంచి మధుర గంభీరంగా జాలువారిన ఈ బెంగాలీ భావగీతం రబీంద్ర సంగీత్ కు చెందినది.దీని సృష్టికర్త ప్రఖ్యాత సుమధుర సంగీత దర్శకుడు సలీల్ చౌధురీ.

రాజేష్ ఖన్నా నటించిన హిందీ సినిమా 'ఆనంద్' లో ఇదే రాగాన్ని ఆధారంగా చేసుకుని 'కహీ దూర్ జబ్ దిన్ ఢల్ జాయే' అనే ప్రఖ్యాత గీతం వచ్చింది.ఆ పాటను కూడా నా స్వరంలో త్వరలో వింటారు.

హిందీ బెంగాలీ గీతాలు రెండూ హిట్ సాంగ్సే అయినప్పటికీ బెంగాలీ గీతమే మొదటిది.దానినుంచే హిందీ పాట పుట్టింది.బెంగాలీ పాటను హేమంత ముఖర్జీ పాడితే హిందీ పాటను ముకేష్ పాడాడు.ముకేష్ గాత్రం కంటే హేమంత్ కుమార్ గాత్రం చాలా రిచ్ గా ఉంటుంది.లిరిక్స్ లో కూడా బెంగాలీలో ఉండే భావుకతా లోతూ హిందీలో రాలేదు.కనుక హిందీ పాట కంటే నాకు బెంగాలీ పాట అంటేనే ఎక్కువ ఇష్టం.

ఈ పాటను వ్రాసింది కూడా సలీల్ చౌధురీనే.ఒక సంగీత దర్శకునికి ఇంత భావుకత ఉందంటే అది ఎంతో అద్భుతం కదూ !!

ప్రస్తుతానికి ఈ బెంగాలీ గీతం వినండి.

Song:--Amay Proshno Kore Neel Dhrubo Taara
Lyrics:--Salil Choudhury
Music:--Salil Choudhury
Singer:--Hemant Mukherjee
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
--------------------------------------
Amay proshno kore neel dhrubo taara
aar koto kaal aami r
abo dishahara
r
abo dishahara

Jobaab kichui taar - deete pari nai shudhu
poth
khuje kete gelo e jeebono shaara
e jeebono shaara

Amay proshno kore neel dhrubo taara
aar koto kaal aami r
abo dishahara
r
abo dishahara

[Kara jeno bhaalobeshe aalo jilechilo
shurjer aalo tai
- nibe giyechilo]-2
nijer chay
er peeche ghure ghure mori meeche

Yak deen cheye dekhi ami tumi haara
ami tumi haara

Ama
y proshno kore neel dhrubo taara
aar koto kaal aami r
abo dishahara
r
abo dishahara

[Ami poth khuji naako potho morey khoje
mono jaabo
jhenaa bhojhe - na bojhe taa bojhe]-2
amaar chotur paashe shob kichu jaae aashe
ami shudhu
tusharitho - goti heeno dhaara
goti heeno dhaara

Amay proshno kore neel dhrubo taara
aar koto kaal aami r
abo dishahara
r
abo dishahara

Joboaab kichui taar - deete pari nai shudhu
poth
khuje kete gelo e jeebono shaara
e jeebono shaara

Amay proshno kore neel dhrubo taara
aar koto kaal aami r
abo dishahara
r
abo dishahara


Meaning:--

The blue pole star yonder
is questioning me
How long I have to remain like this
direction less

How can I give it a satisfactory answer?
Because I myself am searching 
for a right direction , my whole life
and still not got it

Some people did love me very much
and illuminated my path brightly
that is why the sun's light is dimmer
behind my own shadow
I wander and wander fruitless
and one day I realize that
I miss you, I miss you

If I don't search for the path
the path is searching for me
My mind never understands what the path needs
and the path cannot come down to suit my mind
Around me everything is moving fast
But I am an icy immobile stream
immobile stream

The blue pole star yonder
is questioning me
How long I have to remain like this
direction less

How can I give it a satisfactory answer?
Because I myself am searching 
for a right direction , my whole life

and still not got it

The blue pole star yonder
is questioning me
How long I have to remain like this
direction less

How long I have to remain like this
direction less......

తెలుగు స్వేచ్చానువాదం

నీలపు రంగులో దూరంగా మెరుస్తున్న
ధ్రువ నక్షత్రం
నన్ను ప్రశ్నించింది
ఎంతకాలం నేనిలా దిశాహీనంగా ఉండాలని

దానికి నేనేం జవాబివ్వగలను?
సరియైన దారికోసం నా జీవితమంతా
నేనే ఇంకా వెదుకుతున్నాను

కొంతమంది నన్ను ఎంతో ప్రేమించారు
నా దారిని వెలుగుతో నింపారు
అందుకే నా నీడ వెనుక సూర్యకాంతి
అంత లేతగా ఉంది
అయినా సరే వృధాగా ఈ జీవితంలో
నేనెంతో తిరుగుతున్నాను
చివరకు నాకర్ధమౌతోంది
నువ్వు నా తోడుగా లేవని
అదే అసలైన లోపమని

దారికోసం నేను వెదుకకపోతే
అదే నాకోసం వెదుకుతోంది
మనసేమో దారిని అర్ధం చేసుకోలేకపోతోంది
దారేమో మనసు కోసం దిగి రాలేకుంది
నా చుట్టూ అంతా వేగంగా చలిస్తోంది
నేను మాత్రం శీతాకాలంలో గడ్డకట్టిన
నదిలా ఉన్నాను

నీలపు రంగులో మెరుస్తున్న ధ్రువ నక్షత్రం
నన్ను ప్రశ్నించింది
ఎంతకాలం నేనిలా దిశాహీనంగా ఉండాలని

దానికి నేనేం జవాబివ్వగలను?
సరియైన దారికోసం నా జీవితమంతా
నేనే ఇంకా వెదుకుతున్నాను...
read more " Amay Proshno Kore Neel Dhrubo Taara - Hemanta Mukherjee "

29, జనవరి 2016, శుక్రవారం

రాహుకేతువుల ప్రభావానికి తిరుగులేని సాక్ష్యం - జికా వైరస్

రేపు రాహుకేతువులు రాశులు మారబోతున్నారు.వారి ప్రభావాల గురించి నిన్న వ్రాశాను.ఈ రోజు వార్తల్లో అంతా ' జికా ' వైరస్ గురించే చర్చ జరుగుతున్నది.

ప్రపంచాన్ని కొత్తగా భయపెడుతున్న వైరస్ ' జికా ' రాహుకేతువులు రాశులు మారుతున్న ఇదే సమయంలో హటాత్తుగా తెరమీదకు వచ్చింది. మామూలుగా చూచేవారికి ఈ సంబంధం అర్ధం కాకపోవచ్చు.కాకతాళీయంగా అనిపించవచ్చు.కానీ మానవజీవితం పైన గ్రహప్రభావాలను నిశితంగా గమనించేవారికి మాత్రం హటాత్తుగా విజ్రుంభిస్తున్న ఈ వైరస్ వెనుక ఉన్న రాహుకేతువులు తప్పకుండా దర్శనం ఇస్తారు.

రాహుకేతువులనే వాళ్ళు భూమిచుట్టూ ఆవరించి ఉన్న అయస్కాంత శక్తులు.సూర్యుని చుట్టూ తిరిగే భూకక్ష్యా చంద్రుని కక్ష్యా పరస్పరం ఖండించుకునే ఖగోళస్థానాలనే మన ప్రాచీనులు రాహువు కేతువు అని పిలిచారు.ఇవి అయస్కాంత శక్తి గలిగిన రోదసీ బిందువులు.వీటి ప్రభావం భూమిమీద ఖచ్చితంగా ఉంటుంది.అలాగే భూమ్మీద నివసిస్తున్న మనమీద కూడా ఖచ్చితంగా ఉంటుంది.ఈ కక్ష్యలలో మార్పులు వచ్చిన ప్రతిసారీ భూమి మీద కొన్ని కొన్ని మార్పులు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి.ఇది తిరుగులేని నిజం.

ఈ ఖగోళ సత్యాలు తెలియని అజ్ఞానులు 'రాహుకేతువులు అనేవాళ్ళు ఆకాశంలో అసలు లేనే లేరు.లేనివాళ్ళు గ్రహాలెలా అవుతారు?అంతా మూఢనమ్మకాలు' అని గుడ్డిగా వాదిస్తూ మనల్ని నవ్విస్తూ ఉంటారు.వారి అజ్ఞానానికి వారిని అలా వదిలేద్దాం.

ప్రస్తుతం మానవాళిని భయపెడుతున్న ' జికా ' వైరస్ రాహుకేతువులు రాశులు మారుతున్న ఇదే తేదీలలో ఖచ్చితంగా ప్రత్యక్షం కావడం వింతగా లేదూ? అర్ధం చేసుకోనంత వరకూ వింతగానే ఉంటుంది.సరిగా అర్ధం చేసుకుంటే అందులో వింత కనిపించదు.విశ్వనాటకంలోని ఒక అంకంలో విశ్వశక్తులు ఎలా పనిచేస్తున్నాయో అప్పుడు అర్ధం అవుతుంది. 

ఈ వైరస్ బ్రెజిల్ లో ఎక్కువగా కనిపిస్తోంది.అక్కడనుంచి మిగతా దేశాలకు ప్రాకుతున్నది.లక్షలాది మంది దీని బారిన బడుతున్నారని అంచనాలు చెబుతున్నాయి.ఇది 'ఏడిస్' జాతికి చెందిన దోమద్వారా ఒకరినుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది. దోమలు మొదలైన ఎగిరే కీటకాలు రాహుకేతువుల అధీనంలో ఉంటాయని జ్యోతిశ్శాస్త్రంలో ఓనమాలు వచ్చిన ప్రతివారికీ తెలిసిన విషయమే.

రాహుకేతువులు రాశిచక్రాన్ని చుట్టి రావడానికి 18 ఏళ్ళు పడుతుంది. సరిగ్గా 18 ఏళ్ళ క్రితం 1997 లో రాహుకేతువులు ఇదే స్థానాలలో ఉన్నారు.

అప్పుడేమైందో చూద్దామా?

ఆ సమయంలో హాంక్ కాంగ్ చైనాలలో 'ఏవియన్ ఫ్లూ' అనబడే బర్డ్ ఫ్లూ వ్యాధి విజ్రుంభించి లక్షలాది కోళ్ళను బలితీసుకుంది.కోళ్ళనుంచి మనుషులకు కూడా ఇది పాకింది.దీనివల్ల అప్పట్లో అంతర్జాతీయ రవాణారంగమూ, ఆర్దికరంగమూ తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.దేశాలకు దేశాలే హడలెత్తి పోయాయి.ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళుతున్న మనుషులను ఎయిర్ పోర్టులలో ఆపి మెడికల్ చెకప్స్ చేసే పరిస్థితులు అప్పుడు తలెత్తాయి.

ఎగిరే పక్షులకు కారకుడు రాహువన్న సంగతి తెలిసిన విషయమే.అలాగే ఇప్పుడు ఎగిరే దోమలు రంగంలోకి వచ్చాయి.జాగ్రత్తగా గమనిస్తే నేటి జికా వైరస్ కూ, 18 ఏళ్ళ నాటి బర్డ్ ఫ్లూ వ్యాధికీ వెనుక ఉన్న శక్తులెవరో జ్యోతిశ్శాస్త్ర విద్యార్ధులకు తేలికగా అర్ధమౌతుంది.

మానవ జీవితం మీద ఉన్న రాహుకేతువుల ప్రభావానికి ఇలాంటి సంఘటనలే తిరుగులేని సాక్ష్యాలు.స్టాటిస్టికల్ గా ఇలాంటి రుజువులు కళ్ళ ఎదురుగా కనిపిస్తున్నా కూడా జ్యోతిశ్శాస్త్రం అబద్దం అని వాదించే వారిది అజ్ఞానం కాకపోతే ఇంకేమనుకోవాలి?
read more " రాహుకేతువుల ప్రభావానికి తిరుగులేని సాక్ష్యం - జికా వైరస్ "

27, జనవరి 2016, బుధవారం

2016 లో రాహుకేతువుల రాశిమార్పు - ఫలితాలు

భూమిమీది మనుషుల జీవితాలను శాసించడంలో రాహుకేతువుల పాత్ర ఎంతో ఉంటుంది.మానవుడనేవాడు ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ వీరి ప్రభావాన్ని ఎన్నటికీ తప్పుకోలేడు. ఆ రాహుకేతువులు జనవరి 30 న రాశులు మారుతున్నారు. ఏడాదిన్నర నుంచీ వారున్న స్థానాలు మారి - రాహువు సింహరాశి లోకీ,కేతువు కుంభరాశి లోకీ వస్తున్నారు.ఈ స్థానాలలో వారు ఒకటిన్నర ఏడాది పాటు ఉంటారు.స్థూలంగా చూచినప్పుడు ఈ మార్పు యొక్క ఫలితాలు మానవాళి మీద ఎలా ఉండబోతున్నాయో గమనిద్దాం.

సామూహిక ఫలితాలు
  • ప్రపంచ రాజకీయ చిత్రపటంలో మార్పులు వస్తాయి.
  • ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెరుగుతుంది.దీనివల్ల కొన్ని దేశాలమధ్య యుద్ధవాతావరణం ఏర్పడుతుంది.
  • దేశాలమధ్య అణుబాంబుల సమీకరణం మారిపోతుంది.ఇప్పుడున్న వాటికంటే ఇంకా ప్రమాదకరమైన ఆయుధాలు కొత్తగా కనుక్కోబడతాయి.
  • అనేక కొత్త ఉద్యోగాలు సృష్టింపబడతాయి. దీనివల్ల అనేకమందికి కొత్త ఉద్యోగాలు వస్తాయి.ముఖ్యంగా రవాణా,టెలికాం,కంప్యూటర్ రంగాలలో ఈ మార్పులు ఉంటాయి. 
  • రకరకాలైన మోసాలు కుంభకోణాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి.
  • అంతుబట్టని కొత్తరోగాలు మానవాళిని పీడిస్తాయి.సామూహిక మరణాలు జరుగుతాయి.
  • అగ్నిప్రమాదాలు, రవాణా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి.
  • ప్రమాదాలలో గాని, ఉగ్రవాద దాడులలో గాని ప్రముఖులు మరణిస్తారు.
  • మనుషులలో నక్కజిత్తులు మోసపు తెలివితేటలు బాగా ఎక్కువౌతాయి.
  • వాతావరణంలో మార్పులవల్ల మానవాళికి చేటు వాటిల్లుతుంది.

ఈ నేపధ్యంలో పన్నెండు రాశులవారికి ఈ గ్రహస్థితి ఏయే ఫలితాలనిస్తుందో చూద్దాం.

మేషరాశి
తెలివితేటలు వికసిస్తాయి.చొరవ పెరుగుతుంది.విదేశీ అవకాశాలు కలిసొస్తాయి.పిల్లలు విదేశాలకు వెళ్లి స్థిరపడతారు.మంత్రతంత్రాది సాధనలలో శ్రద్ద్ద పెరుగుతుంది.ప్రేమ వ్యవహారాలు ఎక్కువౌతాయి. అనుకోకుండా లాభాలు వస్తాయి.సోదరులు దెబ్బతింటారు.

వృషభరాశి
మానసిక చింత ఎక్కువగా ఉంటుంది.కొంత సేపు ఆశ కొంతసేపు నిరాశ వెంటాడతాయి.ఇంటిలో పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. తల్లిదండ్రులకు ప్రమాదకాలం.చదువులో ఆటంకాలు ఎదురౌతాయి.వృత్తిలో అనుకోని హటాత్తు మార్పులు కలుగుతాయి. 

మిధునరాశి
ధైర్యం చొరవ కలుపుగోలుతనం పెరుగుతాయి.ఆధ్యాత్మిక చింతన ఎక్కువౌతుంది.తీర్ధయాత్రలు చేస్తారు.దేవాలయాలు సందర్శిస్తారు. ఇంటిలో పుణ్యకార్యాలు జరుగుతాయి.సోదరులకు కష్టకాలం.

కర్కాటకరాశి
కళ్ళకు జబ్బులోస్తాయి.చదువులో ఆటంకాలు కలుగుతాయి.ఇంటిలో అశాంతి పెరుగుతుంది.మాటలో దురుసుతనం పెరగడం వల్ల హటాత్తుగా గొడవలు జరిగి నష్టపోతూ ఉంటారు.తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది.రహస్యాలు దాస్తూ ఉంటారు.

సింహరాశి
ఆరోగ్యం దెబ్బతింటుంది.మోసపోతారు.సాహసకార్యాలు చేసి నష్టాలు చవిచూస్తారు.త్రిప్పట ఎక్కువౌతుంది. రకరకాలుగా మనసు చెదిరిపోతూ ఉంటుంది.తనవల్ల జీవితభాగస్వామికి కష్టాలు కలుగుతాయి.

కన్యారాశి
రహస్య ఒప్పందాలు, రహస్య కార్యకలాపాలు ఎక్కువౌతాయి.ఆస్పత్రిని దర్శించవలసి వస్తుంది.అవినీతి డబ్బు అనవసర ఖర్చులకు ఆవిరై పోతుంది.అనారోగ్యభయం పీడిస్తుంది.దీర్ఘరోగాలు తలెత్తుతాయి.అనుకోని శత్రుత్వాలు కలుగుతాయి.

తులారాశి
జీవితం లాభదాయకంగా ఉంటుంది.వ్యాపారంలో నల్లధనం కూడబెడతారు. సోదరులకు ప్రమాదం కలుగుతుంది.గుడులూ గోపురాలూ సందర్శిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృశ్చికరాశి
విద్యా,ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.తీరిక కరువౌతుంది.త్రిప్పట విసుగు ఎక్కువౌతాయి.గృహసౌఖ్యం లోపిస్తుంది. మానసిక చింత పీడిస్తుంది.

ధనూరాశి
ఆధ్యాత్మిక చింతన ఎక్కువౌతుంది.దూరపు పుణ్యక్షేత్రాలు తిరుగుతారు. మానసికంగా మొండితనం పెరుగుతుంది. తండ్రికి కష్టకాలం.ఇతర మతాల గురించి అధ్యయనం చేస్తారు.మతాలు మారుతారు.

మకరరాశి
కుటుంబ సౌఖ్యం కరువౌతుంది.మాట దురుసుగా వస్తుంది.తద్వారా శత్రువులు పెరుగుతారు.దీర్ఘరోగాలు పీడిస్తాయి.రహస్య వ్యవహారాలు ఎక్కువౌతాయి.అధికారులతో అవినీతి ఒప్పందాలు కలుగుతాయి.

కుంభరాశి
జీవిత భాగస్వామి నుంచి,వ్యాపార భాగస్తుల నుంచి కష్టాలు ఎదుర్కొంటారు. కొందరికి వివాహ జీవితం విచ్చిన్నం అవుతుంది.వివాహేతర సంబంధాలు కలుగుతాయి.ఆరోగ్యం దెబ్బతింటుంది.మానసిక చింత వెంటాడుతుంది.

మీనరాశి
శత్రువులపైన విజయం సాధిస్తారు.మాట దురుసు అవుతుంది.మనసులో ఉద్రేకం పెరుగుతుంది.పనులలో దూకుడు ఎక్కువౌతుంది.మొండిధైర్యం పుట్టుకొస్తుంది.అనుకోనివిధంగా పెద్ద పెద్ద ఖర్చులు చెయ్యవలసి వస్తుంది.

ఇవి రాహుకేతువుల గోచార ఫలితాలు మాత్రమే.వ్యక్తిగత జాతకాలను బట్టి ఈ ఫలితాలలో మార్పులు ఉంటాయి.వ్యక్తిగత జాతకాన్నీ గోచార ఫలితాలనూ కలిపి చూచుకుంటే ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు అర్ధమౌతాయి.దాని ప్రకారం సరియైన రెమెడీలు చేసుకుని జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు.
read more " 2016 లో రాహుకేతువుల రాశిమార్పు - ఫలితాలు "

26, జనవరి 2016, మంగళవారం

Yogasanas - Sports and Cultural Meet 2016

Sports and Cultural Meet లో ఈ ఏడాది నుంచీ యోగాసన పోటీలు కూడా పెట్టారు.ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇలా చెయ్యడం వల్ల ఇప్పటికే యోగా చేస్తున్న వాళ్ళకే గాక కొత్తగా చెయ్యాలని అనుకుంటున్న వారికి కూడా శ్రద్ధ కలుగుతుంది.మోటివేషన్ వస్తుంది.

బద్దకాన్ని వదలించుకుని ప్రతిరోజూ యోగా చెయ్యడం చాలా మంచిది.దీనివల్ల అనేక రోగాలు రాకుండా ఉంటాయి.షుగరూ బీపీ మన దరిదాపులకు కూడా రావు.బాడీ ఫిట్నెస్ బ్రహ్మాండంగా ఉంటుంది.మన పిల్లలకు ఏది నేర్పినా నేర్పకపోయినా యోగా చెయ్యడం నేర్పితే చాలు.మిగతా క్రమశిక్షణ దానంతట అదే వస్తుంది.

మొత్తం మీద యోగా పోటీలలో ఒక 25 మంది దాకా పోటీ పడ్డారు. 50+ కేటగరీ లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకు ఈ ప్రైజులు ఇష్టం ఉండదు.నేను వాటికోసం చెయ్యను.చెయ్యడాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తాను.ఫలితాన్ని ఏమాత్రం ఆశించకుండా నా మనస్సును కట్టుదిట్టం చేస్తాను.చెయ్యడంలో కలిగే ఆనందం నాకు చాలు.అలాగే ఈ ఆసనాలు చేశాను."నమస్తే స్కూల్ ఆఫ్ యోగా" నుంచి ముగ్గురు జడ్జీలు వచ్చారు.చివరలో చూస్తే నాకు ప్రైజు వచ్చింది.

ఈ పోటీలలో నేను చేసిన ఆసనాలు ఏవంటే --

వీరభద్రాసనం
పాదహస్తాసనం
సేతుబంధాసనం
మస్త్యాసనం
చక్రాసనం
సర్వాంగాసనం
శీర్షాసనం
ధనురాసనం
భద్రాసనం
ఉష్ట్రాసనం.

వచ్చే ఏడాది పోటీలలో బాగా కష్టమైన ఆసనాలను - అంటే - 

నటరాజాసనం
త్రిభువనాసనం
మయూరాసనం
గర్భాసనం
పూర్ణ చక్రాసనం
పూర్ణ మస్త్యెంద్రాసనం
నిరాలంబ శీర్షాసనం
వృశ్చికాసనం,
కౌండిన్యాసనం
వ్యాఘ్రాసనం
కుక్కుటాసనం

మొదలైన కష్టమైన ఆసనాలు వేసి చూపిస్తానని ఆర్గనైజర్ మూర్తిగారికి చెప్పాను. ఆ దిశగా ప్రయత్నాలను ఈరోజునుంచే మొదలు పెట్టాను.

మొన్న వేసిన ఆసనాల ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.

భద్రాసనం

చక్రాసనం

ధనురాసనం

మస్త్యాసనం

పాదహస్తాసనం

సర్వాంగాసనం

సేతుబందాసనం

శీర్షాసనం

ఉష్ట్రాసనం

వీరభద్రాసనం


బహుమతి అందుకుంటూ...




read more " Yogasanas - Sports and Cultural Meet 2016 "

Bheegi Bheegi Raat Me - Mehdi Hasan




పాటను పాడుతూ...
సికింద్రాబాద్ లో మూడు రోజులు జరిగిన Sports and Cultural Meet - 2016 సందర్భంగా మొదటి రోజున నేను ఆలపించిన పాట ఇది. అక్కడున్న ఎవ్వరూ ఈ పాటను ఇంతకు ముందు వినలేదన్నారు. అది
బహుమతి అందుకుంటూ...
నిజమే.ఎందుకంటే ఇది మన సినిమా పాట కాదు. పాకిస్తానీ ఫిలిం గీతం. ఈ పాట 'వాదా' అనే పాకిస్తానీ సినిమాలోది. ఈ సినిమా 1957 లో వచ్చింది. అప్పట్లో ఇదొక పెద్ద మ్యూజికల్ హిట్ మూవీ. మీలో కూడా చాలామంది ఈ పాటను ఇప్పటి వరకూ విని ఉండకపోవచ్చు.

గాయకులలో మెహదీ హసన్ కు ఒక ప్రాముఖ్యత ఉన్నది.ఎన్నో తరాలుగా వారి పూర్వీకులు రాజాస్థానంలో గాయకులూ.మంచి సంగీత విద్వాంసులూనూ.సరస్వతీ కటాక్షం ఆయన రక్తంలోనే ఉన్నది.కానీ ఆయన పాతకాలపు గాయకుడు.ఆయన పాటలన్నీ హిందూస్తానీ శాస్త్రీయ రాగాల ఆధారంగానే ఉండేవి. ఆయన పాడిన ఘజల్స్ ను పక్కన ఉంచితే,లలిత సంగీత ఛాయలున్న ఆయన పాటలు మాత్రం సినిమాలలో మాత్రమె మనకు కనిపిస్తాయి.

మెహదీ హసన్ పాడిన రొమాంటిక్ సాంగ్స్ అరుదుగా ఉన్నాయి. నా వరకూ నాకు లలిత భావగీతాలూ, లలిత శృంగారగీతాలే నచ్చుతాయన్న సంగతి మీకందరికీ తెలిసిందే.పైగా ఇది వానపాట.ట్రాక్ కూడా చాలా మంచిది.వానలో తడుస్తున్న ప్రేమికులను వానజల్లు చెళ్ళున కొట్టిన ధ్వని కూడా ఈ ట్రాక్ లో రప్పించారు.

ఉర్దూ అనేది చాలా స్వీట్ లాంగ్వేజ్. అందులోని పదాలు చాలా మధురంగా ఉంటాయి.ఇది ఉర్దూ పాట గనుక భావసౌందర్యానికి శబ్దసౌందర్యం కూడా తోడై అద్భుతమైన ఫీల్ వస్తుంది.ఈ రెంటికీ మధురమైన రాగం కలిస్తే ఇక ఆ పాట ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేం.ఈ పాట అలాంటి మరపురాని మధురగీతం. అయితే దీనిని ఆస్వాదించాలంటే భావుకత ఉండాలి.

భావాలలో,మధుర శృంగారభావాన్ని మించినది సృష్టిలో ఇంతవరకూ ఎక్కడా లేదు.ఉపాసనా మార్గాలలో కూడా మధురభావానికే ఎప్పుడూ పెద్దపీట వెయ్యబడుతుంది.

ఎందుకంటే దీనిలో యోగమూ, జ్ఞానమూ, భక్తీ, త్యాగమూ, ప్రేమా, వైరాగ్యమూ,ఆత్మసమర్పణా భావమూ అన్నీ కలసిమెలసి అత్యున్నతమైన స్థాయిలో విహరిస్తూ ఉంటాయి.మధురభావ సాధకుల మదిలో దైవం ఎంతో మనోహరంగా విరాజిల్లుతూ ఎల్లప్పుడూ నెలకొని ఉంటుంది.నేనెప్పుడూ నా శిష్యులతో చెబుతూ ఉంటాను - ప్రేయసీ ప్రియుల మధ్యన ఉన్న మధురమైన భావానికీ భక్తునికీ భగవంతునికీ మధ్య ఉన్న మధురభావానికీ స్థాయిలోనే భేదం తప్ప గుణంలో కాదని.ఒకటి తెలియని వాడు రెండవదానినీ తెలుసుకోలేడు.

అద్భుతమైన ప్రేమను హృదయంలో ఫీల్ అవలేనివాడు ప్రేమస్వరూపుడైన భగవంతుని ఎన్నటికీ చేరుకోలేడు.ఇది సత్యం.

నేనెన్నో పాటలను పాడుతున్నప్పటికీ వాటిలో నా హృదయానికి దగ్గరగా వచ్చే పాటలు చాలా కొన్నే ఉంటాయి.అలాంటి కొన్ని పాటల్లో ఇది నాకు చాలాచాలా ఇష్టమైన మధురగీతం. అందుకే మెహదీ హసన్ పాడిన ఈ మధుర శృంగార భావగీతాన్ని ఈ  Sports and Cultural Meet - 2016 లో నేను పాడాను.

శ్రోతల్లో ఉన్న సంగీతాభిమానులను ఈ పాత పాట చాలా అలరించిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీరూ ఈ గీతాన్ని నా గళంలో ఒకసారి కాదు - మీకిష్టమైనన్ని సార్లు వినండి మరి.

Movie :-- Waada (1957)
Lyrics:--Saifuddin Saif
Music:--Rashid Attre
Singer:--Mehdi Hasan
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------
Bheegi bheegi raat me..

Bheegi bheegi raat me - Rimjim kee barsat me
aajaa mere saathi aa -- Pyaar ham kare
Bheegi raat me

Khuda kare ye ghataa - Aur too fikar barse - 2
Me dekhta hi rahoo - Aaj tujhko jee bharke
Dil ka rishta jodke - saari duniya chodke
Aaja mere saathi aa - Pyaar ham kare
Bheegi bheegi raat me

Nazar se choomne do aaj in sitaron ko - 2
Badan se lipte huye shabnam -E-Sharaaron ko
Rimjim ke is raag me - Thandi thandi aag me
Aaja mere saathi aa - Pyaar ham kare
Bheegi bheegi raat me

Hazaar raaton pe bhaaree ye raat ho jaaye - 2
Ke lab khile bhi nahi - Aur baat ho jaaye
Halchal ke armaan me - Masti ke toofaan me
Aaja mere saathi aa - Pyaar ham kare

Bheegi bheegi raat me - Rimjim kee barsat me
aajaa mere saathi aa -- Pyaar ham kare
Bheegi bheegi raat me....

Meaning:--

In this wet night,In this drizzling rain
come to me, my love !
Let us love each other
In this wet night,In this drizzling rain
come to me, my love !

These rainy clouds, made by God
are drenching us profusely
(His grace is descending on us in the form of rain)
I will remain like this till the end of time
watching your beautiful body
Joining your heart to mine
Leaving all your world of worries behind
come to me, my love, in this rainy night !
Let us love each other

These stars, these rain drops
that are sliding down your face
Let me kiss them with my eyes
and feel their softness and hardness
at the same time
In this melody of drizzle
in this cold fire of passion
come to me, my love, in this rainy night !
Let us love each other

Among a thousand nights
tonight will be the grandest one
though our lips may not blossom
Yet,most intimate conversation
will take place between us
In a stir of deepest passion
In a cyclone of intoxication
come to me, my love, in this rainy night !
Let us love each other

In this wet night,In this drizzling rain
come to me, my love !
Let us love each other
In this wet night,In this drizzling rain
come to me, my love !

తెలుగు స్వేచ్చానువాదం

ఈ తడుస్తున్న రాత్రిలో
జల్లుగా పడుతున్న వానలో
నా దగ్గరకు రా ప్రియా !
ప్రేమలో మనం మునిగిపోదాం

దైవం సృష్టించిన ఈ మేఘాలు
మనపైన ఈ వర్షం ద్వారా
తమ అనుగ్రహాన్ని కురిపిస్తున్నాయి
తడిసిన నీ సౌందర్యాన్ని చూస్తూ
ఒక జీవితకాలం ఇలాగే ఉండగలను నేను
ఈ తడుస్తున్న రాత్రిలో
జల్లుగా పడుతున్న వానలో
నా దగ్గరకు రా ప్రియా !
ప్రేమలో మనం మునిగిపోదాం

నీ మోము నుంచి జాలువారుతున్న
ఆ నీటి నక్షత్రాలనూ
వాటి సున్నితత్వాన్నీ
చల్లగా బాధిస్తున్న వాటి కఠోరత్వాన్నీ
నా చూపులతో చుంబించనీ
ఈ వాననీటి సంగీతాన్ని వింటూ
చలచల్లని ఈ అగ్నిలో కాలుతూ
నా దగ్గరకు రా ప్రియా !
ప్రేమలో మనం మునిగిపోదాం

ఈ తడుస్తున్న రాత్రిలో
జల్లుగా పడుతున్న వానలో
నా దగ్గరకు రా ప్రియా !

అనేక వేల రాత్రుల కంటే
నేటి ఈ రాత్రి మరపురానిదిగా మిగలాలి
మనం పెదవులు విప్పి మాట్లాడుకోక పోవచ్చు
కానీ ఎంతో సంభాషణ మన మధ్య జరుగుతుంది
కోరిక చేస్తున్న ఈ అలజడిలో
మత్తుతో నిండిన ఈ జడివానలో
నా దగ్గరకు రా ప్రియా !
ప్రేమలో మనం మునిగిపోదాం

ఈ తడుస్తున్న రాత్రిలో
జల్లుగా పడుతున్న వానలో
నా దగ్గరకు రా ప్రియా !
ప్రేమలో మనం మునిగిపోదాం

ఈ తడుస్తున్న రాత్రిలో
జల్లుగా పడుతున్న ఈ వానలో....
read more " Bheegi Bheegi Raat Me - Mehdi Hasan "