“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, నవంబర్ 2021, ఆదివారం

ఓ మైగాడ్ - ఓమైక్రాన్ రంగప్రవేశం

ప్రస్తుతం, గురువు కుంభరాశిలో సున్నా డిగ్రీల మీదున్నాడు. ప్లూటో మకరరాశి సున్నా డిగ్రీలమీదున్నాడు. ఇద్దరికీ ఆచ్చాదనా యోగం ఏర్పడింది. గురువు జీవకారకుడు, ప్లూటో యముడు, ఫలితం? జీవశక్తిని మరణం కమ్మేస్తుందని అర్ధం. జ్యోతిష్యశాస్త్రపరంగా దీనిని 'మరణయోగం' అనవచ్చు.  అంటే, లోకానికి మళ్ళీ మూడిందని అర్ధం. అందుకే, ఇప్పటివరకూ వచ్చిన అన్ని రకాల కోవిడ్ వైరస్ ల కంటే ఎన్నోరెట్లు భయంకరమైన 'ఓమైక్రాన్' వేరియంట్ హఠాత్తుగా తలెత్తింది.

ఇప్పటివరకూ పెద్దగా కోవిడ్ న్యూస్ అంటూ లేని ఆఫ్రికాలో, మొట్టమొదటి ఓమైక్రాన్ వేరియంట్ కనిపించింది. కనిపించీ కనిపించగానే, యూరప్ లో అడుగుపెట్టింది. యూకే, జర్మనీ, ఇటలీలు ఇప్పటికే వణికిపోతున్నాయి. ఇజ్రాయెల్ తన బార్డర్స్ ను మూసేసింది. యూరప్ లో కనీసం 7 లక్షలమంది చావబోతున్నారని WHO అంటోంది. అంటే ఏమిటి? మళ్ళీ  ప్రపంచానికి మూడిన సంకేతాలు వెలువడుతున్నాయి.

గతంలో చాలామంది, 'కరోనా పని అయిపోయింది. ఇదుగో పోయింది, అదుగో పోయింది, మార్చి తర్వాత పోతుంది, ఏప్రిల్ తర్వాత పోతుంది', అని వ్రాశారు. ఇదిప్పుడే పోదని, గ్లోబల్ కర్మ లెవల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని, స్వార్ధమూ, లెక్కలేనితనమూ జనాలలో ముదిరిపోయాయని, మనుషులకి గట్టిగా బుద్ధి చెప్పనిదే ప్రకృతి ఊరుకోదని, నేనన్నాను. చూడండి ఏం జరుగుతోందో మరి?

ఓమైక్రాన్ కు ఎదురులేదని, వాక్సిన్లేవీ దానిని అడ్డుకోలేవనీ, అది వ్వాపించే వేగం చాలా ఎక్కువగా ఉంటుందని, దాని విధ్వంసం కూడా ఎక్కువేననీ, నిపుణులు అంటున్నారు. కనుక, ఇప్పటిదాకా వాక్సిన్  వేసుకున్నవారైనా, వేసుకోనివారైనా, ప్రస్తుతం అందరూ ఒకటే అయిపోయారు. ఒక ఆర్నెల్లలో దీనికి కూడా వాక్సిన్ తయారు చేస్తామని కంపెనీలు అంటున్నాయి.  మళ్ళీ 'రెడ్డొచ్చె మొదలాడు' అన్నట్లు, ఈ క్రొత్త వాక్సిన్ కోసం మళ్ళీ క్యూలు మొదలవబోతున్నాయి.  ఇంతా చేస్తే, ఆ క్రొత్త వాక్సిన్ ఎంతవరకూ పనిచేస్తుందో దేవుడికే ఎరుక ! భలే ఉంది కదూ మనుషులతో వారి కర్మ ఆడుతున్న ఆట !

గురువు - ప్లుటోల మరణయోగం మానవాళికి డేంజర్ సిగ్నల్స్ ను మ్రోగిస్తోంది. విమాన సంస్థలు, తమ సర్వీసుల గురించి ఆలోచిస్తున్నాయి. జాతీయ అంతర్జాతీయ ప్రయాణ రంగం మళ్ళీ కుదుపులకు లోనవబోతోంది. అంతేకాదు, దేశదేశాలన్నీ మళ్ళీ లాక్ డౌన్ దిశగా చూస్తున్నాయి.

ఇంకొక్క నెలలో శని యురేనస్ ల మధ్యన ఖచ్చితమైన కేంద్రదృష్టి ఏర్పడబోతున్నది. అప్పుడుంటుంది అసలు  విలయం ! ఈలోపల యూరోప్ అట్టుడుకుతుంది. అప్పటినుంచీ, ఇండియా, పాకిస్తాన్, యూకే లలో అసలైన డ్రామా మొదలౌతుంది. జనమంతా తట్టా బుట్టా సర్దుకోవడం మొదలుపెట్టాలి. 'మేం రెండు వాక్సిన్లూ వేయించుకున్నాం, మాకేమీ కాదు' అంటూ మాస్కులు తీసేసి మోర విరుచుకుని తిరుగుతున్నవారందరూ మళ్ళీ మాస్కులు బయటకు తియ్యండి మరి !  

సరే, 'ఓ మైగాడ్' అనుకుంటూ ఓమైక్రాన్ విధ్వంస న్యూస్ కోసం ఎదురుచూద్దాం !

read more " ఓ మైగాడ్ - ఓమైక్రాన్ రంగప్రవేశం "

21, నవంబర్ 2021, ఆదివారం

నవంబర్ 2021 పౌర్ణమి ప్రభావం - పెనువర్షాలు

ఈ సృష్టిలో మనం అదుపు చెయ్యలేనివి పంచభూతాలూ, నవగ్రహాలే. అందుకే మనమెంతగా విర్రవీగినా, మన జీవితాలు మన చేతులలో ఉండవు.  

మొన్న పౌర్ణమి. రాహుకేతువుల ఇరుసుతో చంద్ర సూర్యుల ఇరుసు ఒకటైంది. చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు, సూర్యుడిప్పుడే నీచస్థితినుంచి బయటపడ్డాడు.

జలతత్వరాశైన వృశ్చికానికి అర్గళం పట్టింది.లాల్ కితాబ్ సిద్ధాంతం ప్రకారం కుజబుధులు కలిస్తే శుక్రుడౌతాడు. కనుక వృశ్చికరాశికి రెండుప్రక్కలా శుక్రునితో అర్గళం పట్టింది. శుక్రుడు జలతత్వ గ్రహం. వృశ్చికం జలతత్వ రాశి. రాహుచంద్రుల కోణదృష్టి భారతదేశానికి సూచికైన మకరం మీదుంది. ఇక ఫలితాలను చూడండి.

అన్నమయ్య జలాశయం, పోచి జలాశయాల గట్లు తెగి, కడపజిల్లాలోని నందలూరు - రాజంపేటల మధ్యన రైల్వే ట్రాక్ ఒక కిలోమీటరు పొడుగునా కొట్టుకుపోయింది. పనిలో పనిగా ఒక రైల్వే బ్రిడ్జి కూడా కొట్టుకుపోయింది. ముంబాయి చెన్నై రూట్లో రైళ్లు స్తంభించాయి. వర్షంలో తడుస్తూ, భయంకరంగా ఉన్న బురదలో 500 మంది స్టాఫ్ రాత్రింబగళ్ళూ పనిచేస్తూ ట్రాక్ ను వేసే పనిలో, బ్రిడ్జిని మళ్ళీ కట్టే పనిలో ఉన్నారు.

కడపజిల్లా గందరగోళమైంది. వరదలలో 40 మంది గల్లంతయ్యారు. వరదమధ్యలో ఇరుక్కుపోయిన బస్సు మీదనున్న జనాన్ని IAF హెలికాఫ్టర్ ఎయిర్ లిఫ్ట్ చేసింది.

చెన్నైలో, తిరుపతిలో కుండపోత వర్షాలతో రోడ్లు జలమయాలయ్యాయి. తిరుమలలో కురిసిన వర్షాలకు , కపిలతీర్థం మునిగింది. తూర్పు కోస్తా అంతటా వర్షాలు పడుతున్నాయి. సౌత్ మొత్తం గందరగోళమైంది. మకరం దక్షిణదిక్కును సూచిస్తుందని మర్చిపోకండి.

ఒక్క మనదేశమేనా దెబ్బతినేది? అన్న చొప్పదంటు అనుమానాన్ని రానివ్వకండి.

కెనడాలో బ్రిటిష్ కొలంబియా గుర్తుందా? వందలాది మంది పిల్లల సమాధులు ఒక చర్చి స్కూల్ ఆవరణలో  బయటపడ్డాయి కొంతకాలం క్రితం ! అదే ప్రావిన్స్ లో ఇప్పుడు భయంకరమైన వరదలు ముంచెత్తుతున్నాయి. వృషభరాశి కెనడాను సూచిస్తుందని గతంలో వ్రాశాను గమనించండి. వేలాదిగా పశువులు చనిపోయాయి. కనీసం 18000 మంది వరదలలో చిక్కుకుని అల్లాడుతున్నారు. బ్రిటిష్ కొలంబియా ఎమర్జెన్సీని ప్రకటించింది. అక్కడ జలగ్రహమైన చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటూ, రాహుగ్రస్తుడైన ఈ సమయంలోనే అక్కడ వరదలెందుకొచ్చాయో అర్థమైందా మరి? 

తిరుమలలో ఇలాంటి వర్షాలు గత 500 ఏళ్లలో లేవని అంటున్నారు. ఈ గ్రహణం కూడా దాదాపు  7 గంటలపాటు ఉంది. గత 600 ఏళ్లలో ఇలాంటి చంద్రగ్రహణమూ రాలేదని అంటున్నారు.  కనుక లెక్క సరిపోయిందా మరి?

గ్రహణాలూ, అమావాస్యా పౌర్ణములూ ఇలా భూమిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. గత పదేళ్లుగా నా పోస్టులు చూడండి. ఎన్ని సార్లు రుజువైందో గమనించారా?

మనపైన గ్రహప్రభావం లేదని  ఎలా అనగలం చెప్పండి?
read more " నవంబర్ 2021 పౌర్ణమి ప్రభావం - పెనువర్షాలు "

18, నవంబర్ 2021, గురువారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 45 (మహనీయుల మాటలలోని గూఢార్ధాలు - కర్మనియమం)

వెనుకకు తిరిగి వస్తుండగా మూర్తి ఇలా అన్నాడు.

'మీరు ఆయనతో అలా మాట్లాడుతుంటే చాలా సంతోషం వేసింది గురువుగారు. ఊరకే అలా మీ ఇద్దరినీ చూస్తూ ఉండాలనిపించింది. ఇలాంటి సన్నివేశాలలో పాత్రధారులమైనందుకు మేం అదృష్టవంతులం'

'అది నిజమే. జరుగుతూ ఉన్నపుడే, వారి అదృష్టాన్ని అర్ధం చేసుకునేవారు చాలా తక్కువమంది ఉంటారు. చాలామంది, జరిగిపోయిన తర్వాత ఎప్పుడో వెనక్కు తిరిగి చూచుకొని, 'ఆ సమయంలో మేమూ ఉన్నాం' అని సంతోషపడేవాళ్ళుంటారు. చాలామందికి ఇదే జరుగుతుంది. కానీ అతి కొద్దిమంది మాత్రమే, జీవితం జరుగుతున్నప్పుడే దాని విలువను తెలుసుకుని ఆనందించే వాళ్ళుంటారు. వారి సంఖ్య ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. మొదటివారు గుర్తించలేకపోవడానికి కారణం వారి అహంకారం. అది వాళ్ళ కళ్ళకు పొరలను కమ్మిస్తుంది. జరుగుతున్న దానిని సకాలంలో గుర్తించి, దానిని నిలుపుకోగలిగినవాడే లౌకికంలోనైనా, ఆధ్యాత్మికంలోనైనా అసలైన అదృష్టవంతుడు' అన్నాను. 

సంభాషణను కొనసాగిస్తూ, 'ఇందాక దినకర్ గారు అన్నారు చూడు, 'అమ్మ నాతోనే ఇలా అన్నది "డబ్బు వచ్చేసరికి నేనుండను నాన్నా" అని. ఎందుకలా జరుగుతుందో తెలుసా? ఈ లోకంలో, విత్తనం వేసేవాడొకడు, పంటను తినేవాడొకడు, విత్తేవాడు తినడు, తినేవాడు విత్తడు. ఇదింతే, కర్మనియమం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది' అని అంటుండగా ఈ క్రింది పద్యం ఆశువుగా మనసులో ఉద్భవించింది.


ఆ || విత్తువారలొకరు వినియోగమొకరికౌ

పంట నేర్పుగాదె పరమబోధ

కర్మనియమమిద్ది; కనరాదు వినరాదు 

చూచి; తెలియువాఁడె సూక్ష్మజ్ఞాని


అయితే, ఈ పద్యాన్ని బయటకు చెప్పకుండా మనసులోనే ఒక మూలన నిక్షిప్తం చేసి, మాటలను కొనసాగించాను.

'మహనీయులు, వారి కాలానికి చాలా ముందుంటారు. వారు చెప్పేవాటిని సరిగ్గా అర్ధం చేసుకోవడమే వారి కాలపు మనుషులకు వీలు కాదు. ఇక ఆచరించడం మాట దేవుడెరుగు. వాటిని అర్ధం చేసుకునే లోపు, ఆ మహనీయులు మాయమైపోతారు. తరువాతి తరంవారు, వారి ఫోటోలు పెట్టుకుని పూజలు చేస్తూ ఉంటారు. లోకం తీరింతే. ఇదెప్పటికీ మారదు. అందుకే అమ్మగారు ఆ మాటన్నారు.  నిజానికి, అమ్మ ఉన్న కాలంలో డబ్బున్నవాళ్ళు లేరా? బ్లాక్ మనీ కుప్పలు తెప్పలు గా ఉంది. కానీ, ఎవడూ ఇవ్వలేదు. వివేకానందస్వామి ఒక బిచ్చగాడిగా మన దేశంలో పదేళ్లు తిరిగారు. అప్పట్లో 500 పైగా రాజ్యాలున్నాయి, సంస్థానాలున్నాయి. రాజులున్నారు. డబ్బు కోసం ఆయన అమెరికా వెళ్లి వేదాంత ప్రచారం చేయవలసిన ఖర్మ ఏముంది? ఎన్ని కష్టాలు పడ్డారాయన? ఆ విధంగా సంపాదించిన డబ్బుతో బేలూర్ మఠం స్థలాన్ని కొని, మఠాన్ని స్థాపించారాయన. దాని నీడన ఎన్ని లక్షలమంది  సేద తీరుతున్నారిప్పుడు? ఆయన పడిన కష్టమే ఇప్పటివారికి సుఖమైంది. 

అదే విధంగా, జిల్లెళ్ళమూడి అమ్మగారు పోయినప్పుడు, అందరూ ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు.  భక్తులందరూ స్వార్ధపరులే కదా ! వేరే వేరే గురువుల పంచన చేరారు. ఎవడి పబ్బం ఎక్కడ గడుస్తుందనుకుంటే అక్కడకు చేరారు. ఇరవై ఏళ్ల పాటు జిల్లెళ్ళమూడి నిర్మానుష్యమైపోయింది. ఆ ఎడారి సమయంలో ఇక్కడే అంటిపెట్టుకుని దినకర్ గారు, వసుంధర గారు మొదలైనవాళ్ళు కొంతమంది ఉన్నారు చూడు. వాళ్ళు, అసలైన భక్తులు. అలాంటి పరిస్థితిలో కూడా, అమ్మ మీద వాళ్ళ విశ్వాసం ఏమాత్రమూ సడలలేదు. అదీ అసలైన విశ్వాసమంటే ! అదీ అసలైన భక్తంటే ! ఈ ఒక్క కారణం వల్లనే నేను వీరిని గౌరవిస్తాను. వీళ్ళు అమ్మతో కలసి జీవించారని నేను వీళ్ళను గౌరవించను. వీళ్ళ అచంచలమైన విశ్వాసం, నమ్మకం నన్ను కదిలిస్తాయి'

దినకర్ గారు ఇందాక మాట్లాడుతూ ఇంకొక మాటన్నారు. 'అమ్మ ఉన్నపుడు మా దగ్గర డబ్బుల్లేవు. అమ్మ, తన నగలు అమ్మి, అన్నపూర్ణాలయంలో అన్నదానం నడిపింది' అని. అలాంటి తల్లులు ఇప్పుడెవరున్నారు? తన నగలు అమ్మి లోకులకు అన్నం పెట్టింది అమ్మ. ఎంతటి నిస్వార్ధపూరితమైన, ప్రేమమయమైన హృదయం అమ్మది !  అలాంటి మనుషులు అసలుంటారా ఎక్కడైనా? అమ్మ పోయిన తర్వాత ఎన్నో ఏళ్ళు జిల్లెళ్ళమూడి ఆశ్రమం అప్పులలో ఉన్నది. అప్పులు చేసి ఆశ్రమాన్ని నడిపిస్తూ వచ్చారు. తర్వాత దాదాపుగా 36 ఏళ్లకు, ఇప్పుటికి, కొద్దిగా నిలకడ వచ్చింది. ఎందుకలా జరుగుతుంది? నిజంగా మన దగ్గర డబ్బుల్లేవా? ఇండియన్స్ కున్న స్విస్ బ్యాంక్ ఎకౌంట్ల మీద వికీలీక్స్ లిస్టు చూచావా? ఆ లక్షలాది కోట్ల రూపాయల డబ్బంతా ఎవరిదీ? ఎక్కడిదీ? ఎవడి దగ్గర దోచుకున్నదా సొమ్ము? మానవజాతి ఖర్మ ఇంతే. ఇదెప్పటికీ మారేది కాదు.'

'మహనీయులకు మన డబ్బులెందుకు? వారు మనకు వెలుగును చూపడం కోసం వస్తారు. వెళతారు. మన డబ్బులను మనమే తింటాం. వారికక్కర్లేదు. వారి మాటలను తేలికగా తీసుకోకూడదు. వారు చాలా మామూలు మాటలనే  మాట్లాడినట్లు ఉంటారు గాని, వాటిలో చాలా లోతైన గూఢార్ధాలుంటాయి. అమ్మ చెప్పిన మాటకు ఇంకొక అర్ధం కూడా ఉంది. 'డబ్బు' అంటే జ్ఞానం అని అర్ధం. 'ఇక్కడ డబ్బు చేరేసరికి నేనుండను నాన్నా' అంటే, 'మీకందరికీ జ్ఞానం వచ్చేసరికి నేనుండను' అని అసలైన అర్ధం, ఎందుకలా? అమ్మ చెప్పిన అత్యున్నత సత్యాలను, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే ఎన్నో ఏళ్ళు పడుతుంది, ఎన్నో జన్మలే పట్టవచ్చు.  అది అంతరిక సాధనామార్గం. ఊరకే బుర్రతో అర్ధం చేసుకునే విషయాలు కావివి.  సాధనామార్గంలో నడచి, నలిగి, పరిణతి చెంది, వాటిని అనుభవంలో తెలుసుకోవాలి. దానినే సాక్షాత్కారం అంటారు. ఆధ్యాత్మిక మార్గంలో కావలసింది 'అర్ధం చేసుకోవడం' కాదు, 'సాక్షాత్కారాన్ని పొందటం'. కొద్దిగా తెలివి తేటలున్నవాడికి కూడా తత్త్వం అర్ధమౌతుంది, విషయం అర్ధమౌతుంది. కానీ అది ఏమూలకూ సరిపోదు. కావలసింది 'సాక్షాత్కారం'.

'ఎప్పుడైనా, ఏ మహనీయుడి భక్తులకైనా ఇదే జరుగుతుంది. ఇది కర్మనియమం. నక్షత్రాల లోకం నుండి  కొందరు ఇక్కడికి వస్తారు. 'అవిగో నక్షత్రాలు' అని మనకు చూపిస్తారు. మనం వాటిని చూస్తూ, 'ఇవేనా నక్షత్రాలు' అని అర్ధం చేసుకునే లోపే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తరువాత, మనం వాటిని చేరుకునే ప్రయత్నం మొదలు పెట్టాలి. అప్పటికి వాళ్ళు మనతో ఉండరు. వాళ్ళ జ్ఞాపకాలు మాత్రమే మనతో మిగులుతాయి. భూమి పుట్టిన నాటినుండీ ఇది ఇలాగే జరుగుతూ వస్తున్నది.  రేపు మీకైనా ఇదే జరుగుతుంది. ఇదే కర్మనియమం' అన్నాను.

మాటల్లోనే ఇంటి దగ్గరకు చేరుకున్నాం.

అదే రోజు రాత్రికి అక్కడనుంచి బయల్దేరి మర్నాడు పొద్దున్నకి హైద్రాబాద్ వచ్చేశాను.

(ఇంకా ఉంది)

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 45 (మహనీయుల మాటలలోని గూఢార్ధాలు - కర్మనియమం) "

17, నవంబర్ 2021, బుధవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 44 (సివిల్ సర్వీస్ - ఆధ్యాత్మిక చర్చ)

దినకర్ గారు కొనసాగించారు.

'అమ్మ 1923 లో పుట్టారు. 2023 కి నూరేళ్లవుతున్నాయి. అందుకని 2023 లో అమ్మ శతజయంతి ఉత్సవాలు జరపాలని అనుకుంటున్నాం. దానికి అందరు స్వామీజీలను, పీఠాధిపతులను ఆహ్వానించి వారిచేత ఒకే వేదికపైనుంచి మాట్లాడించాలని మా సంకల్పం. మీ 'పంచవటి' నుండి మిమ్మల్ని కూడా వేదికమీదకు ఆహ్వానిస్తాం. మీరు కూడా అమ్మ గురించి మాట్లాడాలి' అన్నారాయన.

నేనిలా అన్నాను. 

'మంచి ఆలోచనే. 2022 లో నేను పదవీ విరమణ చేస్తున్నాను. 2023 కి మా ఆశ్రమంలోనే ఉంటాను. మా 'పంచవటి' తరఫున మాట్లాడమంటే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ, ఒక మాట. నన్ను మాట్లాడమంటే మాత్రం, ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెబుతాను. వేదికమీదున్న స్వామీజీలను కూడా నిర్మొహమాటంగా విమర్శిస్తాను. మరి వాళ్ళు తట్టుకోగలరో లేదో, ఆలోచించండి. అయితే నా విమర్శ అసభ్యంగా ఏమీ ఉండదు. తార్కికంగా, శాస్త్రప్రమాణాలను చూపిస్తూనే విమర్శిస్తాను. వారు అమ్మను అర్ధం చేసుకోవడంలో ఎక్కడ తప్పు దోవ పడుతున్నారో, సమాజానికి సరియైన దిశానిర్దేశాన్ని చేయడంలో ఎక్కడ విఫలమౌతున్నారో స్పష్టంగా చెబుతాను. మీకభ్యంతరం లేకుంటే, నన్నూ వేదికనెక్కించండి. నాకేమీ అభ్యంతరం లేదు.

మరొక్క విన్నపం ! ఆ స్వామీజీలకు ముందుగానే మీరు సూచన చేయండి. అతిశయోక్తులతో కూడిన సోది మాట్లాడకుండా, వారి వారి మహిమలు, గొప్పలు, మంత్రాలు, శక్తులు, పూర్వజన్మలు, లోకాలు ఇలాంటి చెత్త మాట్లాడకుండా, అమ్మ తత్వాన్ని ఉన్నదున్నట్లుగా చెప్పమని స్టేజి ఎక్కబోయేముందే వారికి స్పష్టంగా చెప్పండి. మీకు వారందరూ గత 50 ఏళ్లుగా తెలుసు గనుక, వారికి చెప్పే చనువు మీకుంటుంది. అందుకని నా సూచనను స్వీకరించండి' అన్నాను.

'అవును. నేను జిల్లెళ్ళమూడికి వచ్చి, వచ్చే ఏడాదికి 50 ఏళ్ళు అవుతున్నాయి. నిజమే. కానీ నాలో ఇంకా రేషనల్ థింకింగ్ పోలేదు' అన్నారాయన.

నేనిలా అన్నాను.

'రేషనల్ థింకింగ్ అవసరమే. అది ఉండాలి. అది ఆధ్యాత్మికానికి సహాయకారే గాని అడ్డు కాదు. వివేకానందస్వామి లండన్లో ఒక ఉపన్యాసాన్నిచ్చారు. దానిపేరు Reason and Religion. అందులో ఆయనంటారు, ఇంద్రియాల పరిధిలో మనకు తెలిసిన రేషనల్ థింకింగూ, లాజిక్కూ, రీజనూ అవసరములే. అవి లేకుంటే మనం బ్రతకలేం. కానీ, ఇంద్రియాల పరిధిని దాటిన చోట, అవి పనిచేయవు. వాటికక్కడ మనుగడలేదు. వాటి అవసరం కూడా అప్పుడు లేదు' అని.

'అవును, కానీ అక్కడ పనిచేసే రీజనూ లాజిక్కూ అక్కడుంటాయి' అన్నారు దినకర్ గారు.

'అదే అన్నయ్యా. ఇందాక మీరన్నారే Law of Karma అని. అదే ఇంద్రియాల పరిధిలో పనిచేసే లాజిక్. ఇంద్రియాలను దాటిన పరిధిలో ఉండేది Grace. దీనినే కరుణ లేదా అనుగ్రహం అంటాం. మొదటిది కర్మనియమం, రెండవది అనుగ్రహం. కర్మను దాటించేది అనుగ్రహమే' అన్నాను నేను.

'అవును. ప్రెంచి రచయిత్రి ఒకామె ఒక పుస్తకాన్ని వ్రాసింది. అందులో తను, గ్రేస్ ని గ్రావిటీతో పోల్చింది' అన్నారాయన.

'కావచ్చు. సరియైన పరితాపం మనలో ఉన్నపుడు గ్రేస్ అనేది దానంతట అదే మనవైపు ఆకర్షింపబడుతుంది. నిజమే, అది గ్రావిటీ లాంటిదే. ఆమె ఆ కోణంలో చెప్పి ఉండవచ్చు' అన్నాను.

దినకర్ గారు చెప్పడాన్ని కొనసాగించారు.       

'1967 లో నేను సివిల్ సర్వీస్ పరీక్షను 68 శాతం మార్కులతో పాసయ్యాను. IAS ఖచ్చితంగా రావలసింది. కానీ ఆరోగ్య కారణాల వల్ల నేను ఇంటర్వ్యూ కు హాజరు కాలేకపోయాను. శీత్కారీ ప్రాణాయామాన్ని ఎక్కువగా చేయడం వలన అనారోగ్యం పాలయ్యాను. అందుకని ఇంటర్వ్యూ చేయలేదు. తరువాత నాకు జీవితం మీద ఇంటరెస్ట్ పోయి, అదొక రకమైన నిరాసక్తతలో పడి, అప్పీల్ కూడా చేయలేదు. అమెరికా వెళ్ళిపోయాను. తర్వాత టీచింగ్ ప్రొఫెషన్ లో చేరాను. అప్పట్లో మా జీతాలు వందలలో ఉండేవి. లోన్లు తీసుకుని పిల్లల్ని చదివించుకున్నాము. We never touched a foul penny. అయితే పిల్లలు బాగా చదువుకున్నారు. అమెరికాలో సెటిలయ్యారు' అన్నారాయన.

'అందుకే మీలో ఆ ఇంటలెక్చువల్ ఫ్లేవర్ ఉన్నది. మనిద్దరం ఒకే పడవలో ఉన్నాం. నేనూ 1988 లో సివిల్స్ ఇంటర్వ్యూ కెళ్ళాను. ఎలాంటి కోచింగు తీసుకోకుండానే, మొదటి అటెంప్ట్ లోనే ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేశాను. అయితే నేను త్రూ కాలేదు. అప్పట్లో 132 పోస్టులు పడ్డాయి. అదికూడా ఒక కారణం కావచ్చు. ఇప్పుడు వెయ్యి పోస్టులు కూడా ఒక్కోసారి పడుతున్నాయి. నిరాశపడకుండా రైల్వేలో చేరాను. ఇక్కడ IRTS వచ్చింది. IAS చేజారినా, IRTS ఆఫీసర్ నయ్యాను. సివిల్స్ క్లియర్ చెయ్యాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసు. ఆ కష్టం ఊరికే పోదు. అది మీకు టీచింగ్ ఫీల్డ్ లో ఉపయోగపడింది. నాకు ఇంకెన్నో రకాలుగా ఉపయోగపడింది. రేషనల్ థింకింగ్ ని అది పెంచుతుంది. కాన్సెప్చువల్ గా ఆలోచించడాన్ని పెంచుతుంది. ఇవి రెండూ ఆధ్యాత్మికంలో చాలా అవసరమైనవే' అన్నాను.

'ఆధ్యాత్మికంగా మీరు ఎవరిని ఫాలో అవుతారు?' అడిగారాయన.

'ప్రాధమికంగా నేను శ్రీ రామకృష్ణులవారి భక్తుడిని. ఆయనే నా దైవం. అయితే, రమణులనూ, (జిల్లెళ్ళమూడి) అమ్మగారి బోధలనూ ఇష్టపడతాను. మెహర్ బాబా గారినీ, అరవిందులనూ కూడా ఇష్టపడతాను. శ్రీ రామకృష్ణులవారు బోధించిన - కులమతాలకు, ప్రాంతీయ భేదాలకు , అన్ని విభేదాలకు అతీతమైన విశ్వజనీన మౌలిక సత్యాలంటే నాకిష్టం.  వాటినే వీరు కూడా చెప్పారు గనుక, వీరిని కూడా ఆరాధిస్తాను' అని చెప్పాను.

'ఊరకే ఆయన భక్తులా లేక వారి మార్గంలో ఇనీషియేటెడా?' అడిగారు అన్నయ్య.

'1987 లో ఇనీషియేషన్ తీసుకున్నాను. స్వామీ గంభీరానంద గారు మా గురువుగారు' అన్నాను.

'ఓ ! ఆదిశంకరుల బ్రహ్మసూత్ర భాష్యాన్ని ఇంగిలీషులో వ్రాశారు. ఆయనేగా? చాలా స్టాన్దర్డ్ బుక్ అది' అన్నారాయన.

'అవునన్నయ్యా ! దానినాయన 1965 లో వ్రాశారు. ఆయన సంస్కృతం, బెంగాలీ, ఇంగిలీషులలో మహా పండితుడు. ఆయన వ్రాసిన పుస్తకాలన్నీ ఉద్గ్రంధాలే. The Eight Upanishads అనే వారి గ్రంధాన్ని మీరు చూచారా? అదికూడా చాలా స్టాన్దర్డ్ కలిగినది. గంభీరానంద గారు, శివానందస్వామివారి శిష్యులు. శివానందస్వామి శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష భక్తులు' అన్నాను.

'స్వామి శివానంద గారి పుస్తకం చదివే నేను శీత్కారీ ప్రాణాయామాన్ని ఎక్కువగా చేసి దెబ్బ తిన్నాను. సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరు కాలేకపోయాను, అయితే, ఆ ప్రాణాయామ ఫలితంగా కుండలిని హృదయస్థానం నుండి క్రిందకు పడిపోవడం నాకు స్పష్టంగా తెలిసింది' అన్నారాయన.

'శివానందగారు The Science of Pranayama అనే పుస్తకాన్ని వ్రాశారు. అదేనా మీరు చదివింది?' అడిగాను.

అవునన్నారాయన.

'మా పరమగురువులైన శివానందస్వాములవారు వేరు, మీరు చెబుతున్నాయన వేరు. మీరు చెబుతున్నది  Divine Life Society స్వామి శివానందగారి గురించి. మా పరమగురువులు అలాంటి పుస్తకాలను వ్రాయలేదు. ఆయనకలాంటి  ప్రాణాయామాల అవసరం లేదు. ఆయన శ్రీ రామకృష్ణుల వారిని దర్శించి సాక్షాత్తూ ఆయన కరుణను పొందిన వ్యక్తి' అన్నాను.

'రామకృష్ణా మిషన్ వారి పుస్తకాలు చాలా స్టాన్దర్డ్ గా ఉంటాయి. ఉపనిషత్తులు 18 అని కొందరంటారు. వాటిల్లో పదే స్టాన్దర్డ్ అయినవని కొందరంటారు. అమ్మ మాటలను  ఉపనిషత్ వాక్యాలతో పోల్చి చూచినవాళ్లున్నారు. వాటిల్లో ఉన్నవాటినే అమ్మ చాలా తేలిక మాటలలో చెప్పిందని చాలామంది అన్నారు. ఉదాహరణకు,  అమ్మ మాటైన ' అంతా అదే' అనే దానికి, ఈశావాశ్యోపనిషత్ లో చెప్పబడిన మంత్రం సరిపోతుందని కొందరన్నారు' అని ఆయనంటుంటే, 'ఈశావాస్యమిదం సర్వం యత్కిఞ్చ జగత్యాం జగత్ ...' అనే మంత్రం నా మనస్సులో మెదిలింది.

'అదే విధంగా, 'అదికానిదేదీ లేదు నాన్నా' అన్న అమ్మ వాక్యాన్ని కేనోపనిషత్ లోని ఒక మంత్రంలో పోలుస్తారు కొందరు' అని ఆయనంటుండగా 'శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచో హ వాచమ్...' అనే కేనోపనిషత్తు మంత్రం మెరుపులా స్పురించింది.    

'కానీ, అమ్మ బోధలను చాలామంది సరిగ్గా అర్ధం చేసుకోలేదు' అని ఆయన ఏదో అనబోతుండగా నేను  అడ్డుకుని 'అవును. అతి సింపుల్ గా ఉండేవాటినే అందరూ మిస్సవుతారు. అది సహజమే. ఉదాహరణకు, అమ్మ 'పునర్జన్మ లేదన్నారు కదా' అన్నాను.

ఆయన అందుకుని 'అవును. కానీ అమ్మ ఆ మాటను ఏ సందర్భంలో ఎవరితో అన్నారో వదిలేసి దానిని జెనెరలైజ్ చేశారు. అది సరికాదు. అమ్మ ఉద్దేశమేమంటే... ' అని ఇంకా చెప్పబోతున్నారు.

నేను మధ్యలోనే అందుకుని 'ఎందుకంటే, సముద్రంలో ఒకే అల రెండుసార్లు ఎప్పుడూ రాదు. అలాగే ఈ జన్మలు కూడా, అనే అర్ధంలో అమ్మ ఆ మాటన్నారు' అన్నాను.

'కరెక్ట్. జన్మల విషయంలో శ్రీ రామకృష్ణులు కూడా చెప్పారు. వివేకానందుడు కాయస్థుడు. శ్రీ రామకృష్ణుల మిగతా భక్తులు చాలామంది బ్రాహ్మణులు. కానీ వారికి లేని వెసులుబాట్లు నరేంద్రుడికి ఇచ్చేవారాయన. ఉదాహరణకు, తిండి విషయంలో వివేకానందునికి ఏ విధమైన కట్టుబాట్లూ ఉండేవి కాదు.  అదే, మిగతా శిష్యులు బయట హోటల్లో ఒక్క పూట తింటే ఆయన  ఊరుకునేవారు కారు. ముఖం వాచేటట్లు తిట్టేవారు. మరి, వివేకానందునికి ఈ నియమాలు వర్తించవా అని వారు ప్రశ్నిస్తే, 'అతను అగ్నివంటివాడు. అగ్నిలో పడినదేదైనా సరే దగ్దమైపోతుంది' అనేవారాయన. వివేకానందుడు, సప్తఋషుల లోకం నుండి తన పని కోసం దిగి వచ్చిన మహర్షి అని  ఆయన అనేవారు.  అంటే, జన్మ ఉన్నదని ఆయనన్నారు.' అన్నారు దినకర్ గారు.

'అవును. బుద్ధునికి తనయొక్క గత 500 జన్మలు గుర్తొచ్చాయి. అక్కడిదాకా ఎందుకు 1950 లలో నార్త్ ఇండియాలో గగ్గోలు పుట్టించిన శాంతిదేవి కేస్ చూడండి. ఆ పిల్లకు  పదేళ్లు వచ్చేదాకా, తన పూర్వజన్మ చక్కగా గుర్తుంది. తన పాత ఫెమిలీలో అందరినీ ఆ అమ్మాయి గుర్తు పట్టింది. గత జన్మలో తన భర్తకు ఇప్పుడు 70 ఏళ్ళు, అతనికి కొన్ని ఇంటిమేట్ విషయాలను గుర్తు చేసింది. ఇంటిలో తన గదిని, తన వస్తువులను గుర్తు పట్టింది. ఇది రికార్డ్ అయిన కేస్. అయితే ఆ తర్వాత ఆ జ్ఞాపకాలు అతివేగంగా ఆమెలోనుండి మాసిపోయాయి.  ముందు గుర్తుపట్టిన అందరినీ మర్చిపోయింది' అన్నాను.

'అలా మర్చిపోకపోతే ఆమె జీవనం దుర్భరం అవుతుంది కదా' అన్నారన్నయ్య.

'మనం కూడా అంతేగా. మన గతజన్మలన్నీ గుర్తుంటే మనకు పిచ్చెక్కుతుంది. అందుకే, ప్రకృతి మనకు మరపు అనేదానిని ఇచ్చింది, మనిషికి మరపే అసలైన వరం. పోతే, జన్మల గురించి చెప్పాలంటే, విశ్వచైతన్యపు స్థాయి నుంచి చూచినా జన్మ లేదు, పూర్తి భౌతికస్థాయి నుంచి చూచినా అదే జన్మ మళ్ళీ రాదు. జన్మ లేదని అమ్మగారనడంలోని మర్మం ఇంతే. కానీ జన్మలున్నాయి. పునర్జన్మ సత్యమే' అన్నాను.

'చాలా బాగుంది మీతో సంభాషణ. ఉంటారా కొన్నాళ్ళు?' అన్నారాయన.

'లేదు, రాత్రికి హైదరాబాద్ వెళుతున్నాను. మళ్ళీ ఎప్పుడో ఇలాగే కలుస్తాను. వచ్చే ఏడాది నుంచీ, రెండు మూడు నెలలు ఇక్కడే మనింట్లో తపస్సులో ఉంటాను. కొన్ని నెలలు అమెరికా వెళ్తాను. అక్కడి ఆశ్రమాన్నీ శిష్యులనీ చూచుకోవాలి. కొన్నాళ్లపాటు ఇండియాలోని మా ఆశ్రమంలో ఉంటాను. మిగతా సమయమంతా, కొన్ని క్షేత్రాలలో ఉంటూ తపస్సు చెయ్యాలి. ఇదీ నా ప్లాన్' అంటూ లేచి, 'నమస్తే, మళ్ళీ కలుద్దాం' అంటూ సెలవు తీసుకున్నాను.

బయటకొస్తుండగా భాస్కర్ కన్పించాడు.

'అయితే, మార్షల్ ఆర్ట్ షార్ట్ ఫిలిం చూచారన్నమాట' అన్నాను.

'అవును. చాలా  బాగుంది' అన్నాడు.

'అందులో మీరు చూచినది ఒక శాతం మాత్రమే. అందులో నావి చాలా షాట్స్ కట్ అయిపోయాయి. అసలైన నా టెక్నిక్స్ ని 2022 తర్వాత రాబోయే ఫిలిమ్స్ లో చూద్దురుగాని' అన్నాను.

'ఎదురుచూస్తుంటాము' అన్నాడు భాస్కర్.

చిరునవ్వుతో మా ఇంటివైపు దారితీశాను. మూర్తీ, సురేషూ మౌనంగా అనుసరించారు.

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 44 (సివిల్ సర్వీస్ - ఆధ్యాత్మిక చర్చ) "

16, నవంబర్ 2021, మంగళవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 43 (మా భవిష్యత్ ప్రణాళిక)

'మొదటగా, స్వాములు సర్వసంగ పరిత్యాగులై ఉండాలి. నేటి స్వాములు దేనిని పరిత్యజించారో మీరు చెప్పండి. రెండవదిగా, వారికి తపశ్శక్తీ, అనుభవ జ్ఞానమూ ఉండాలి. నేటి స్వాములలో ఎవరికీ ఇవి రెండూ సరిగ్గా ఉన్నాయో చెప్పండి. మూడవది, సరియైన మార్గనిర్దేశనం చేసేవారై వారుండాలి. నేటి స్వాములలో దీనినెవరు చేస్తున్నారో చెప్పండి. కనుకనే నేటి గురువులన్నా స్వామీజీలన్నా నాకు గౌరవం ఏమాత్రమూ లేదు. నేటి స్వామీజీలలో ఎవరూ సత్యాన్ని చెప్పడం లేదు. ఒక్కొక్కరూ ఒక్కొక్క కుంపటి పెట్టుకుని, లోకాన్ని జనాన్ని తమ పాక్షిక సత్యాలతో వంచిస్తున్నారు. సత్యమైన జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా బోధించే గురువులు అరుదయ్యారు' అంటూ మొదలు పెట్టా నేను.

నన్ను మధ్యలోనే ఆపుతూ దినకరన్నయ్య, 'అవును. నువ్వు ఎలాగైనా బ్రతుకు, ఏమైనా చెయ్యి, గుడికెళ్ళు అన్నీ సర్దుకుంటాయి' అనే ధోరణి ఈ మధ్యన బాగా ఎక్కువైంది. ఇది మంచి పధ్ధతి కాదు' అన్నాడు.

'సరిగ్గా అదే నా పాయింట్ కూడా. రకరకాల కొత్తకొత్త గుళ్ళు కట్టి, వాటిమీద సోమరిపోతులలాగా బ్రతుకుతున్న దొంగగురువులే ఇలాంటి కుహనా బోధలను చేస్తున్నారు. నువ్వెలా బ్రతికినా సరే, గుడికెళ్ళి దైవదర్శనం చేసుకుంటే నీ పాపాలన్నీ పోతాయని మన హిందూమతం ఏనాడూ చెప్పలేదు. కానీ, హిందూమతం చెప్పని విషయాలను నేడు స్వామీజీలందరూ బోధిస్తున్నారు. సామాన్యజనమేమో వారికి తోచిన పిచ్చి పనులను చేసుకుంటూ, అదే అసలైన హిందూమతమని భ్రమిస్తున్నారు. వారికి సరియైన మార్గాన్ని చూపేవారు లేరు. మరికొందరు గురువులేమో, శాస్త్రాలను బట్టీ పట్టిస్తున్నారు, బౌద్ధికంగా వేదాంతాన్ని నేర్పి, అది కూడా వారికర్ధమైన సగం సగం రీతిలో నేర్పి, మెట్ట వేదాంతులను తయారు చేస్తున్నారు. ఆ  మెట్టలేమో, మరి కొందరికి వారి పుస్తకజ్ఞానాన్ని నూరిపోసి మరికొందరు మెట్టలను తయారు చేస్తున్నారు.  అందరూ కలసి అదే పెద్ద జ్ఞానమని అనుకుంటూ చీకటిలో అఘోరిస్తున్నారు. మరి కొందరు గురువులేమో, వీరిలో అమ్మ కాళ్లదగ్గర కూర్చున్నామని చెప్పుకునే  కొందరు స్వాములు కూడా ఉన్నారు, మంత్రతంత్రాలని, భూత ప్రేతాలని,  చేతబడులని, పూర్వజన్మలని నానా చెత్తనూ మాట్లాడుతూ అసలైన వేదాంత, యోగసత్యాలను మరుగున పడేస్తున్నారు. వీరెవరికీ అనుభవజ్ఞానం లేదు.

నీతిగా నిక్కచ్చిగా ఎలా బ్రతకాలో చెప్పేవారు ఎవరూ లేరు. షాపులో వస్తువులను అమ్మినట్లు, 'ఈ పూజ చెయ్యి, ఈ ఫలం దక్కుతుంది' అంటూ వ్యాపారస్తులు సరుకులను అమ్మినట్లు అమ్ముతున్నారు. మరోప్రక్కన సమాజంలో, పిచ్చి దీక్షలూ వెర్రిదీక్షలూ  వెల్లువలెత్తుతున్నాయి. ఇది అసలైన హిందూమతం కాదు. సరియైన దారిని చూపించవలసిన గురువులు లేకపోవడంతో నేటి యువత ఘోరంగా పాడై పోతున్నది. మితిమీరిన డబ్బుతో, యూ ట్యూబ్ ఎఫెక్ట్ తో, సడలిన నీతినియమాలతో సమాజం భ్రష్టు పడుతున్నది. ఏ గురువూ దీనిని తప్పు పట్టడం లేదు. వాళ్ళ వ్యాపారాలను వాళ్ళు చేసుకుంటున్నారు. అనుచరుల్ని పోగేసుకుంటున్నారు, అందరూ కలసి తోడుదొంగలై కూచున్నారు. సమాజంలో అసలైన ఆధ్యాత్మికత లేనేలేదు. నైతికజీవితమూ లేదు. ఈ లోటును నేను పూరించాలని అనుకుంటున్నాను' అన్నాను.

ఇలా మాట్లాడుతున్న నాలో ఈ క్రింది పద్యాలు ఆశువుగా తలలెత్తాయి. అయితే, వాటిని బయటకు చెప్పకుండా, మనసులోనే ఒక మూలన వాటిని నిక్షిప్తం చేసి, నా మాటల్ని కొనసాగించాను.


కం || కొందరు ప్రభువుల తొత్తుల్

కొందరు తమ కాకిగూళ్ళ గోర్వంకలురా

కొందరు మాషా బత్తుల్

కొందరు తమ కొట్లనున్న కోమటివారల్


నేటి గురువులలో కొందరేమో రాజకీయ నాయకుల తొత్తులు, మరి కొందరు తమ తమ గూళ్ళలో కూచుని, ప్రాచీనులు పెట్టిన ఆశ్రమాలను ఆక్రమించి, తమ పబ్బాలు గడుపుకుంటున్న గోరింకలు. మరికొందరు గురువులు మాయలమరాఠీలు. వెరసి అందరూ, వారి వారి కొట్లలో సరుకులను అమ్ముకుంటున్న వ్యాపారస్తులే.


ఆ || నీతిలేని జనులు; నిజమెన్న కరువాయె

సత్యవాక్కు జూడ సాగదాయె

పూటకూళ్ళ ఇళ్ళు పుణ్యాశ్రమములెల్ల

నిక్కమైన బోధ నిలువదాయె


జనంలో నీతి ఘోరంగా లోపించింది. అవినీతి జనజీవన విధానమై కూచుంది. సత్యమైన మాట ఎక్కడా కనిపించడం లేదు. ఆశ్రమాలన్నీ ఫైవ్ స్తారు హోటళ్లయి పోయాయి. నిత్యమైన, సత్యమైన, ఆచరణాత్మకమైన జ్ఞానబోధ ఎక్కడా లేదు.


కం || వ్యాపారంబుల దేలుచు

సాపాటుల చింతలందు సాగిలబడుచున్

కాపాలిక గురువులెల్ల

పాపాత్ముల పంచలందు పందలు గారే !


గురువులందరూ ఎవరి వ్యాపారాలను వారు చేసుకుంటూ, పొట్టకూటి చింతలో మునిగితేలుతూ, మాయమంత్రాలను జనాలకు నేర్పిస్తూ, పాపాత్ములైన అవినీతిపరుల నల్లధనాన్ని స్వీకరిస్తూ వారూ నల్లటి మసిబొగ్గులౌతున్నారు.


ఆ || మతపు పంచలందు మాయావులే జేరి

తమకు దోచినట్టి తర్కమెల్ల

ఇదియె ధర్మమంచు నిట్టట్టుగా జెప్పి

జనుల మాయబుచ్చి జెల్లుచుంద్రు


మతాల లోగిళ్ళలో మాయగాళ్లందరూ చేరి, తమకు తోచిన వితండవాదాలను 'ఇదే సత్యం' అంటూ నీతిలేని జనాలకు బోధిస్తూ, వారిని మాయజేసి తమ పబ్బం గడుపుకుంటున్నారు.


ఈ పద్యాలను మనసులో నిక్షిప్తం చేస్తున్న నన్ను ఆపుతూ, 'అవును. మీరు చెబుతున్నది నిజమే.  Our society is suffering from a peculiar kind of moral depravity. నేను అమెరికాలో యూరప్ లో గమనించాను. Even though they are licentious and promiscuous by and large, their social life is governed by a strong sense of justice and obedience to law. అది మనలో తీవ్రంగా లోపించింది. దానికి అనేక కారణాలున్నాయనుకోండి' అన్నాడాయన.

'అవును. దీనిని సరిదిద్దడం ఎలా? ఎవరు పూనుకోవాలి ఈ పనికి? నాయకులకు పట్టదు. తల్లిదండ్రులు నేర్పడం లేదు. చెప్పవలసిన గురువులకే సత్యాలు తెలీవు. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మరెవరు చెప్పాలి?' అడిగాను.

'నాకొకటి అనిపిస్తోంది. స్వామీజీలు బోధిస్తున్న పనికిరాని బోధలకంటే, ముందుగా Law of Karma and Law of Dharma ఈ రెంటినీ మనస్సులలో నాటుకునేలా చెప్పవలసిన అవసరం ఉన్నది. అప్పుడే మొరాలిటీ అనేది మళ్ళీ సమాజంలో వస్తుంది. అయితే, దీనిగురించి ఆలోచిస్తున్న మేధావులు కూడా చాలామంది మనమధ్యనే ఉన్నారు. ఒకాయన గౌహతి IIT లో పనిచేసి బయటకొచ్చి మన హైదరాబాద్ లోనే ఉంటున్నాడు.  ఆయన Law of Karma మీద ఒక మంచి పుస్తకం వ్రాశాడు.  దానిలో ఆయనంటాడు, The Law of Karma is not always linear in its operation  అని. చాలా బాగా వ్రాశాడు' అన్నారు దినకర్ గారు.

'అవును. కర్మనియమం అన్నిసార్లూ లీనియర్ గా పనిచేయదు. అది multi dimensional గా పనిచేస్తుంది. సాధనామార్గంలో నడిచే వారికే దాని లోతుపాతులు అర్ధమౌతాయి. Law of Karma అనేది సరిగ్గా అర్ధమైతే, నీతి అనేది దానంతట అదే మనిషి జీవితంలో ప్రవేశిస్తుంది. దీనిని చెప్పకుండా, నేటి గురువులందరూ, మంత్రాలు, సాధనలు, యోగక్రియలు అంటూ ఏదేదో చెత్తను చెబుతున్నారు. నీరసించి పడిపోతున్న వాడికి ముందుగా సెలైన్ పెట్టి, వాడిని లేపి కూచోబెట్టాలి, అంతేగాని వాడికి వెంటనే హైదరాబాద్ బిర్యానీ పెట్టకూడదు. కానీ నేటి గురువులందరూ ఇదే చేస్తున్నారు. అసలైన సాధనామార్గం ఎవరికీ తెలియదు. ఎవరికి తెలిసినదాన్ని వారు పరమసత్యం అనుకుంటున్నారు. There is a yawning chasm of spiritual paucity in today's religious world. ఈ లోటుని నేను పూడ్చబోతున్నాను. మన హిందూమతం యొక్క అసలైన స్వరూపాన్ని, సారాన్ని, తత్వాన్ని మా ఛానల్ ద్వారా బోధించడమే గాక, అర్హులైనవారికి నా సాధనామార్గాన్ని బోధించి, దానిలో ఆచరణాత్మకంగా వారిని నడిపిస్తాను' అన్నాను.

దినకర్ గారి ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. 

'మీ ఆలోచనను నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఇదే నేటి సమాజానికి చాలా అవసరం' అన్నాడాయన.

'మనిద్దరి ఆలోచనలూ ఒకే పంధాలో ఉన్నాయన్నయ్యా ! మా ఆశ్రమం వచ్చాక, మీలాంటి మేధావులు కూడా మా చానల్స్ లో మాట్లాడాలి. సమాజానికి సరియైన మార్గనిర్దేశం చెయ్యాలి. మీ దగ్గరకు మళ్ళీ వస్తాం మేము' అన్నాను నేను.

(ఇంకా ఉంది)

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 43 (మా భవిష్యత్ ప్రణాళిక) "

జిల్లెళ్ళమూడి స్మృతులు - 42 ( మీరు ఆశ్రమాన్ని ఎందుకు పెట్టాలనుకుంటున్నారు?)

ఉదయాన్నే నిద్ర లేచాం. డాబామీద కాసేపు నడుస్తూ అమెరికా శిష్యులతో ఫోన్లో మాట్లాడిన తర్వాత, క్రిందకు దిగి వచ్చాను. పల్లెటూరు, చుట్టూ మంచు దుప్పటి, పొలాలు, ఆ వాతావరణంలో చన్నీళ్ళు స్నానం చేయాలనిపించలేదు. అందుకని స్నానాన్ని వాయిదా వేసి, సరాసరి టిఫిన్ కానిచ్చి, దేవాలయానికి వెళ్లి అమ్మ దర్శనం చేసుకున్నాం. ప్రత్యేకంగా ఒకచోట కూర్చోకుండా, నడుస్తూ తిరుగుతూనే, లోలోపల మహామంత్ర జపం, ధ్యానం, ఇతర ప్రక్రియలన్నింటినీ ముగించాను.

వసుంధరక్కయ్య దగ్గర కాసేపు కూర్చున్నాము. కరోనా సమయంలో తానెలా ఇబ్బంది పడిందీ, గుంటూరులో కొన్నాళ్ళు ఉండి చికిత్స తీసుకుని ఎలా బయటపడింది, ఆ సమయంలో అమ్మ హస్తం తననెలా కాపాడిందీ, ఆ వివరమంతా చెప్పుకొచ్చింది అక్కయ్య. ఆమె దగ్గర సెలవు తీసుకుని, ఆఫీసులో దినకర్ గారిని కలిశాము. తన గదిలో ఆలోచనా ముద్రలో కూర్చుని ఉన్నాడాయన. మమ్మల్ని చూస్తూనే గుర్తుపట్టి నవ్వుతూ ఆహ్వానించారు.

'దాదాపు ఏడాది దాటినట్లుంది మిమ్మల్ని చూచి' అన్నారు నవ్వుతూ.

కుశలప్రశ్నలయ్యాక, 'కందుకూరు ప్రాంతాలలో ఆశ్రమ స్థలాల కోసం వెదుకుతూ నిన్న రాత్రి ఆశ్రమానికి వచ్చామని, ఈ రోజు రాత్రికి మళ్ళీ హైదరాబాద్ వెళ్లిపోవా'లని చెప్పాను.

ఆయన ప్రశ్నార్థకంగా చూచారు.

'రిటైర్ అయ్యాక ఆశ్రమంలో ఉండాలని ఒక ఊహ. అందుకే, స్థలం కోసం చూస్తున్నాం' అన్నాను.

'ఆశ్రమ కార్యక్రమాలేముంటాయి?' అన్నాడాయన.

'ఏమీ ఉండవు. మేముంటాం అక్కడ. అంతే' అన్నా నవ్వుతూ.

మళ్ళీ ప్రశార్ధకంగా చూచారాయన.

కొంచం వివరిద్దామని ఏదో చెప్పబోతుండగా, అక్కడ ఆఫీస్ లో పనిచేసే భాస్కర్ అనే అబ్బాయి హఠాత్తుగా లోపలకు వచ్చాడు. నన్ను దినకరన్నయ్యకు చూపిస్తూ, 'వీరిని మీకు పరిచయం చేద్దామని వచ్చాను' అన్నాడు.

'ఆయన నాకు తెలుసు. ఇప్పటినుంచీ కాదు. చాలా ఏళ్ల నుంచీ తెలుసు' అన్నారు దినకరన్నయ్య.

'ఆయన మనకందరికీ తెలిసినవారే. అయినా, ఆయన్ను నేనర్ధం చేసుకున్నట్లుగా, మీకు పరిచయం చేద్దామని వచ్చా' అన్నాడు భాస్కర్.

నేనూ, మూర్తీ మౌనంగా చూస్తున్నాం.

ఇక చెప్పడం మొదలుపెట్టాడు భాస్కర్.

'నేను వీరి బ్లాగ్ ని గత పదేళ్ల నుంచీ అనుసరిస్తూ ఉంటాను. అదొక ఎన్ సైక్లోపీడియా. గత మూడు దశాబ్దాల ప్రపంచచరిత్రకు అదొక దర్పణమని చెప్పవచ్చు. అందులో లేని విషయం లేదు.  ఆధ్యాత్మికం, జ్యోతిషం, వీరవిద్యలు, హోమియోపతి  ఇలా ఎన్నో. మెహర్ బాబా, రమణమహర్షి  వంటి మహనీయుల జాతకాలను వీరు విశ్లేషణ చేయడం నన్నాకర్షించి చదవడం మొదలుపెట్టాను.  అప్పటివరకూ జ్యోతిష్యమంటే, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, డబ్బు మొదలైనవాటి గురించే అందరూ వ్రాసేవారు. కానీ దానిని ఆధ్యాత్మిక కోణంలో ఎలా అర్ధం చేసుకోవాలి? అన్న విషయాన్నీ మొదటగా వీరి బ్లాగులో చూచాను. అప్పటినుంచీ అన్నింటినీ  చదవడం మొదలుపెట్టాను. మీరు తీసిన మార్షల్ ఆర్ట్స్ మీద షార్ట్ ఫిలిం కూడా నేను చూచాను. ఇంకా అలాంటివి రావాలని ఎదురుచూచేవాళ్లలో నేనొకడ్ని. తరువాత వీరిని జిల్లెళ్ళమూడిలో చూచి పరిచయం చేసుకున్నాను. మీకు కూడా వీరి  వ్రాతలను కొన్నింటిని ప్రింట్ తీసి చూపించాను గతంలో. అంతేకాదు, చల్లపల్లిలో ఉన్న అచలాచల మార్గపు గురువులకు కూడా వీరి బ్లాగును, వ్రాతలను చూపించాను' అన్నాడు భాస్కర్.

దినకర్ గారు కల్పించుకుని, 'భాస్కర్ ఇక్కడకు రాకముందు అచలాచల సాంప్రదాయంలో ఉన్నాడు. అందుకని వారితో సంబంధాలున్నాయి' అని చెప్పారు.

ఇలా అంటూ, 'ఆ పుస్తకాలు తెచ్చివ్వు వీరికి' అన్నారు.

ఒక పుస్తకాన్ని తెచ్చి నాకిచ్చారు.

'దీనిని అచలాచల మార్గపు రెండో గురువైన ఫలానాగారు వ్రాశారు. దీనికి 'అనసూయోపనిషత్' అని పేరు పెట్టారు.  అమ్మ మీద చాలా బాగా వ్రాశారు. అమ్మ తత్త్వం మాటలకు అతీతమైనది. దానిని వర్ణించడం చాలా కష్టం. దానిపైన , ఎంతో రీసెర్చి చేసి వ్రాయబడిన గ్రంధం ఇది. ఆయన చేసిన రీసెర్చికి నాకు ముచ్చటేసింది' అన్నారు దినకర్ అన్నయ్య.

పైపైన పేజీలను త్రిప్పుతూ ఆ పుస్తకాన్ని చూచాను. విషయం అర్ధమైంది. ఇప్పటికి కొన్ని వేల పుస్తకాలను చదివిన అనుభవంతో, ఎలాంటి పుస్తకాన్నైనా సరే, కొద్ది నిముషాలలో, పైపైన త్రిప్పుతూనే నేను చదువగలను.  నూరు పేజీల లోపు పుస్తకాలనైతే కొన్ని సెకన్లలో చదువగలను.

'విజ్ఞాన ప్రదర్శన బాగుంది' అన్నాఆ పుస్తకాన్ని టేబుల్ పైన పెడుతూ.

ప్రశ్నార్థకంగా చూచారు దినకరన్నయ్య.

'మాటలకతీతమైన అమ్మ తత్వాన్ని మాటలలోకి తేవడానికి ఎలా కుదురుతుంది? కనుక అమ్మ గురించి మనం చెప్పేదంతా మన విజ్ఞాన ప్రదర్శన కాకుంటే మరేమిటి? అందుకని అలా అన్నాను. వీరి ప్రయత్నం బాగుంది. కానీ సరళమైన అమ్మ తత్వాన్ని అర్ధం చేసుకోవడంలో ఈ రచయిత దారుణంగా విఫలమయ్యారు.' అన్నా నవ్వుతూ.

ఆ మాటను పట్టించుకోకుండా, 'ముందుముందు ఈ ప్రదేశం తపస్సాధకులకు నిలయమౌతుంది' అని 40 ఏళ్ల క్రితమే అమ్మన్నారు' అన్నారు దినకరన్నయ్య.

'అందుకే వస్తున్నాం కదా ఒక్కొక్కరుగా' అన్నా చిరునవ్వుతో.

'అవును. రకరకాల సాంప్రదాయాలకు చెందిన వారందరూ ఇప్పుడు అమ్మను గుర్తిస్తున్నారు.  అమ్మలాగా, అత్యున్నతమైన తత్వాన్ని మామూలు మాటల్లో చెప్పినవారు లేరని ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు. నేను, ఎందరో స్వామీజీల బోధలను ఆకళింపు చేసుకున్నాను.  కానీ వారెవరూ అమ్మ దరిదాపులలోకి కూడా రాలేరు. వారిలో చాలామంది  గతంలో అమ్మ పాదాల దగ్గర కూర్చున్నవారే' అంటూ ఒక అరడజను మంది స్వామీజీల పేర్లను ఉటంకించారాయన.

(పాతకులను నొప్పించడం ఇష్టం లేక ఆయా స్వామీజీల పేర్లను ఇక్కడ వ్రాయడం లేదు)

ఇక సీరియస్ చర్చ మొదలుపెట్టాలని భావించిన నేను, హాస్యాన్ని ప్రక్కనపెట్టి, 'అన్నయ్యా! మీరేమనుకోకండి. మీరు చెప్పినవాళ్ళందరూ సమాజపు దృష్టిలో గొప్ప గొప్ప స్వామీజీలు కావచ్చు.  కానీ నేను మాత్రం వీళ్ళనసలు సన్యాసులుగానే గుర్తించను' అన్నాను.

సంభాషణ సీరియస్ గా మారుతోందని గ్రహించాడో ఏమో, తను చెప్పవలసింది చెప్పి,, భాస్కర్ ఆ గదినుండి నిష్క్రమించాడు.

'ఎందుకలా? అన్నట్లు దినకరన్నయ్య నావైపు కొంచం ఉత్సుకతతో కూడిన ప్రశ్నదృష్టితో చూచారు.

'ఏం చెబుతానా?' అన్న ఉత్సుకతతో మూర్తి కూడా మమ్మల్ని మౌనంగా చూస్తున్నాడు.

నేను చెప్పడం మొదలుపెట్టాను.

(ఇంకా ఉంది)

read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 42 ( మీరు ఆశ్రమాన్ని ఎందుకు పెట్టాలనుకుంటున్నారు?) "

15, నవంబర్ 2021, సోమవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 41 (ఆశ్రమస్థలం)

హైదరాబాద్ లో మా ఇంటిని కట్టిన బిల్డర్ స్వగ్రామం కందుకూరు దగ్గర్లోని వర్ధినేనివారిపాలెం. ఆ చుట్టుప్రక్కలలో మా ఆశ్రమానికి మంచి స్థలాలున్నాయని చాలా రోజులనుంచీ అతను పోరు పెడుతుంటే, చూద్దామని కందుకూరు ప్రాంతాలకు మొన్న వెళ్లడం జరిగింది. రాత్రి పదకొండుకు హైద్రాబాద్ లో సింహపురి ఎక్స్ ప్రెస్ ఎక్కి, ఉదయం ఏడింటికి సింగరాయకొండలో దిగాను. అప్పటికే అక్కడ కారుతో సిద్ధంగా ఉన్న మూర్తి స్టేషన్ కు వచ్చి నన్ను కలుసుకున్నాడు. గత వారం రోజులుగా మద్రాస్ లో పడుతున్న భారీవర్షాల ప్రభావంతో ఆ ప్రాంతం కూడా చిత్తడిగా ఉంది. చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. గతంలో ఇంతకంటే ఇంకా భారీవర్షాలతో తడుస్తూ రైల్ ట్రాక్ మీద రోజుల తరబడి పనిచేసి ఉండటంతో, ఇదేమీ పెద్ద వర్షం లాగా నాకనిపించలేదు.

ఒక అరగంట ప్రయాణంతో కందుకూరు చేరుకున్నాం. ముందుగానే బుక్ చేసిన హోటల్లో దిగి స్నానం కానిచ్చి, టిఫిన్ కోసం వెతుకుతుంటే ఎక్కడా ఒక వెజ్ హోటల్ కనిపించడం లేదు. ఉన్న కొన్ని చోట్లా ఎగ్ ఉంది. ఇక తిరిగీ తిరిగీ ఒక హోటల్ ని పట్టుకున్నాం. ఈ తిరుగుడు, ముప్పై ఏళ్ల క్రితం కేరళలోని 'తలిపరంబా 'అనే ఊరిలో ఉదయం టిఫిన్ కోసం, ఒక వెజ్ హోటల్ కోసం, నేను తిరిగిన తిరుగుడును గుర్తుకు తెచ్చింది. ఆ ఊరి మొత్తం మీద ఒక్కటంటే ఒక్క వెజ్ హోటల్ దొరకలేదు.  పొద్దున్నే చక్కగా చికెన్, ఫిష్ తింటున్నారక్కడ. ఆ సంఘటన మళ్ళీ గుర్తుకొచ్చింది. సరే చివరకు ఒక మంచి హోటల్ దొరికింది.

కందుకూరనేది ఒక శుచీ శుభ్రతా లేని చిన్న టౌన్. దాదాపుగా ముప్పై ఏళ్ల క్రితం నుంచీ నాకీ ఊరు తెలుసు. అక్కడ మా బంధువులుండేవారు. ప్రస్తుతం ఆ ఊరినొదిలేసి కావలిలో ఉంటున్నారు.  వాళ్ళున్నపుడు కొన్నిసార్లు అక్కడకొచ్చాను. చిత్తడిగా ఉన్న ఇరుకు బజార్లతో, రోడ్డు మీదే జరుగుతున్న అనేక వ్యాపారాలతో ఊరంతా చిరాకుగా ఉంది. హోటల్ కూడా అలాగే ఉందిగాని, టిఫిన్ రుచిగా ఉంది. తలా ఒక ఉల్లి పెసరట్టు తినేసరికి ఇక మధ్యాన్నం భోజనం కూడా చెయ్యలేమేమో అనిపించేంత బరువుగా తయారైంది పొట్ట. అలాంటి పెసరట్టును గత మూడు దశాబ్దాలలో తిన్న గుర్తు రాలేదు. అంత భారీగా ఉంది.

సరే, టిఫిన్ అయిందనిపించి, పంచదార పానకం లాంటి టీ త్రాగి, సర్వే మొదలుపెట్టాం. ఏంటో ఈ ఖర్మ  ! టీని టీలాగా చెయ్యడం ఎవడికీ రాదు. వేడిగా ఉన్న చక్కెర పానకాన్ని త్రాగుతూ టీ అని భ్రమపడుతున్నారు పిచ్చిజనం !

సాయంత్రం వరకూ చాలా స్థలాలు, పొలాలు చూస్తూ గడిపాము. కానీ ఏవీ మాకు నచ్చలేదు. మాకు కావలసిన లక్షణాలు అక్కడ లేవు. పైగా, ఆ ప్రదేశాల 'ఆరా' నాకు నచ్చలేదు. అందుకని దాదాపు ఒక 60 కిమీ పరిధిలో తిరిగి తిరిగి, సాయంత్రానికి మళ్ళీ హోటల్ కు చేరుకున్నాం. మనలో కావలసినంత సెన్సిటివిటీ ఉంటే, ఊర్లవి, స్థలాలవి, ఇళ్ళవి, మనుషులవి 'ఆరా'లను మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ విషయం మీద గతంలో వ్రాశాను కూడా. 

అక్కడిదాకా వెళ్లాం కదా అని, దారిలోనే ఉన్న సంగమేశ్వర ఆలయాన్ని దర్శించాం. అది చాలా పాతకాలపు శివాలయమని చాలా కధలు చెప్పారు. కానీ, 'పేరు గొప్ప ఊరు దిబ్బ' అన్నట్లుంది ఆ గుడి. మూడు ఏరులు అక్కడ కలుస్తున్నాయి గనుక సంగమేశ్వర ఆలయమైంది. పూజారులేమో చాలా లేజీగా, మొబైల్లో యూట్యూబ్ చూసుకుంటున్నారు. ఒక పూజారేమో, పంచాయితీలు చేసే ఫెక్షన్ లీడర్ లాగా ఫోన్లో ఎవరితోనో అరుస్తూ తెగ మాట్లాడుతున్నాడు. ప్రధాన ముసలిపూజారికేమో మంత్రాలు రావు. 'కార్తీక మాసం' అంటూ ఏదో వచ్చీరాని మంత్రాలు గొణిగాడు. నాకు భలే నవ్వొచ్చింది. చాలా నిరాశగా వెనక్కు వచ్చేశాం అక్కడనుంచి.  

ఈ ప్రదేశంలో మా ఆశ్రమాన్ని కడితే చాలా బాగుంటుందని మా బిల్డర్ అన్నాడు.

అతనిలా అన్నాడు, 'మీరు ఇక్కడ ఆశ్రమాన్ని కట్టండి సార్. మిగతాది నేను చూచుకుంటాను. అక్కడంతా మాకు పెద్ద సర్కిల్ ఉంది. డొనేషన్లు కుప్పలుగా వచ్చేటట్లు నేను చూస్తాను.  ఈ మధ్యనే భైరవస్వామి అని మా గురువు గారి ఆశ్రమంలో కాలభైరవ హోమం జరిగింది.  ఆ హోమం అయిపోయిన తర్వాత, వచ్చినవాళ్ళందరూ తలా ఒక డొనేషన్ ఇచ్చారు.  కొందరు కాంపౌండ్ వాల్ కట్టించడానికి, కొందరు గోశాలకు, మరి కొందరు బిల్డింగ్ పెంచడానికి ఇలా రకరకాలుగా ముందుకొచ్చారు. ఆయా పనులన్నీ మొదలౌతున్నాయి.  మన ఆశ్రమానికి క్కూడా ఫండ్స్ కొరత ఉండనే ఉండదు. మీరు మొదలు పెట్టండి. మిగతాది మేము చూచుకుంటాము'

నేను నవ్వి ఇలా చెప్పాను.

'మా ఆశ్రమం మిగతా ఆశ్రమాల వంటిది కాదు. దీనిలో హోమాలుండవు. గుళ్లుండవు. పూజలుండవు.  గోశాలలు, సోషల్ సర్వీసులు ఉండవు. సెల్ఫ్ సర్వీస్ మాత్రమే ఉంటుంది. పైగా, డొనేషన్లు తీసుకోవడం మీద నాకస్సలు నమ్మకం లేదు. ఒకరి దగ్గర రూపాయి తీసుకుంటే, వారి కర్మ కూడా దానితో మనవెంట వస్తుందని నమ్మేవాడిని నేను. మేం డొనేషన్లు తీసుకోము. జనాన్ని పోగు చేసుకోము. మందితో పెట్టుకుంటే మంటేనని నాకు బాగా తెలుసు.  ఎవరిని బడితే వారిని మా ఆశ్రమంలోకి రానివ్వం కూడా. డబ్బులిస్తామనే వారికి  మా తలుపులు తెరుచుకోవు. మా ఆశ్రమంలో ప్రవేశానికి వేరే అర్హతలుంటాయి. అవి అందరికీ ఉండవు. కనుక  మా ఆశ్రమం అందరికోసం కాదు. మా కోసం మాత్రమే, మాకు డబ్బులొద్దు, నిజమైన మనుషులు కావాలి'.

అతనికి అర్ధమైందో లేదో నాకు తెలీదు. మౌనంగా ఉండిపోయాడు.

'ఇలా అయితే, ఇక మీరు ఎదిగినట్లే' అని లోలోపల అనుకోని ఉంటాడు. కానీ, నేను కోరుతున్న ఎదుగుదల ఏంటో అతనికి గాని, ఈ పిచ్చి లోకానికి గాని ఎలా అర్ధమౌతుంది?

ఉల్లిపాయ పెసరట్టు దెబ్బకి మధ్యాహ్న భోజనం ఎగిరిపోయింది.

సాయంత్రం నాలుగు ప్రాంతంలో కావలి నుంచి వచ్చిన మా తమ్ముడితో కాసేపు మాట్లాడి, హోటల్ ఖాళీ చేసి, ఒంగోలు దారి పట్టాము. అప్పుడుగానీ ఉదయం నుంచీ మమ్మల్ని చంపుతున్న తలనొప్పి మాయం కాలేదు.  ఆ ఊర్లో అడుగుపెట్టిన దగ్గరనుంచీ మా ఇద్దరికీ తలనొప్పి మొదలైంది.  ఆ ఊరిని వదలిన తర్వాత దానంతట అదే మాయమైంది. మమ్మల్ని వెంటాడుతున్న ఏదో దుష్టశక్తి వదలిపోయినట్లు రిలీఫ్ గా అనిపించింది.

కారు ఒంగోలు దాటుతూ ఉండగా, 'జిల్లెళ్ళమూడికి పోనివ్వు సురేష్', రాత్రికి అక్కడ మనింట్లో ఉందాం' అన్నాను. తనూ ఈ మధ్య నా ఆరాలో ఉంటున్నాడు గనుక, పొద్దుటినుంచీ కందుకూరు వాతావరణమంతా తనకూ ఉక్కిరిబిక్కిరిగానే ఉందని అన్నాడు. తను నెలకు నాలుగైదు సార్లు ఆ ఊరికి వస్తూ ఉంటాడు. కానీ ఈ సారి ఏదో తేడాగా అనిపించిందని అన్నాడు. కారు జిల్లెళ్ళమూడి వైపు తిరిగింది. ఏడు గంటల ప్రాంతంలో చీరాల, బాపట్లల మీదుగా ప్రయాణించి జిల్లెళ్ళమూడి చేరుకున్నాం. అమ్మ దర్శనం చేసుకుని, భోజనం కానిచ్చి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాం. రోజంతా తెగ తిరిగి, పైగా తిండి లేకుండా ఉన్నామేమో, ఒళ్ళు తెలీకుండా నిద్ర పట్టేసింది.

(ఇంకా ఉంది)
read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 41 (ఆశ్రమస్థలం) "

3, నవంబర్ 2021, బుధవారం

సోమనాధ్ శాపం

డబ్బులకోసం ఆఫ్ఘనిస్తాన్ లో అమ్మాయిల్ని తల్లిదండ్రులే అమ్ముకుంటున్నారన్నది నేటి న్యూస్. అమెరికా, యూరోప్, ఇండియాలు సాయం ఆపేస్తే ఆఫ్ఘనిస్తాన్ లో అడుక్కుతినడం, అమ్మాయిలని అమ్ముకోవడం తప్ప ఇంకేముంటుంది? ఈ విషయం విన్నప్పుడు జాలేసినప్పటికీ, కర్మ ఫలితం ఎలా కట్టి కుడుపుతుందో అర్ధమై, ఇస్లామిక్ దౌర్జన్యాలమీదా, వాళ్ళ ఆటవిక ఐడియాలజీ మీదా చెప్పలేనంత జాలి కలిగింది.  ఈ కర్మకు కారణమేంటి?

ఆఫ్ఘనిస్తాన్ నేడు అనుభవిస్తున్న ఈ ఖర్మకు కారణం - సోమనాథ్ శాపం. సోమనాధ్ ఆలయాన్ని అన్నిసార్లు కూలగొట్టి, శివలింగాన్ని ధ్వంసం చేసి, బ్రాహ్మణ పూజారులను నిష్కారణంగా చంపేసిన పాపమే వందలాది ఏళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ ను వెంటాడుతోంది. అయినా వాళ్లకు బుద్ధి రావడం లేదు. అర్ధం కావడం లేదు. అర్ధమైతే, మొన్నీమధ్యన గజనీ మొహమ్మద్ సమాధికి వెళ్లి 'సోమనాధ్ ఆలయాన్ని కూలగొట్టిన ఈయనే మా హీరో' అని తాలిబాన్ నాయకులెందుకు పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తారు? అంటే, వాళ్ళు చేసినదీ చేస్తున్నదీ వాళ్లకు ఏమాత్రమూ అర్ధం కావడం లేదన్నమాట ! అలా అర్ధం కాకుండా వాళ్ళ కళ్ళకు పొరలు కమ్మిస్తున్నది ఖురాన్ బోధనలు.

నువ్వు పూజిస్తున్నట్లుగా కాకుండా ఎవడైనా ఇంకో రకంగా దేవుడిని పూజిస్తే వాడిని చంపేసెయ్, తప్పులేదని బోధించిన రాక్షసమతం, ప్రపంచం మొత్తం మీద ఇస్లాం ఒక్కటే. ఇదసలు మానవత్వం ఉన్న బోధనేనా? అలా బోధించిన వాడికసలు బుద్దుందా? ఇదేనా మానవత్వం, శాంతి అంటే?

శివునికి అపచారం చేస్తే ఆ పాపం తరతరాలుగా వెంటాడుతుంది. ఆ కుటుంబం  చివరకు దిక్కులేకుండా అంతమౌతుంది. ఇది వేలాది ఏళ్లుగా రుజువౌతున్న సత్యం. ఎన్నో పల్లెల్లో శివుడి మాన్యాలు తిన్న కుటుంబాలు దిక్కులేకుండా అంతమయ్యాయి. శివద్రోహం వందలాది ఏళ్లపాటు ఆ కుటుంబాలను వెంటాడుతూనే ఉంటుంది. ఇది నిజం.

1300 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ పాలకులు సోమనాధ్ ఆలయాన్ని ఎన్నోసార్లు కూలగొట్టారు. దోచుకున్నారు.  ఆడవాళ్లను రేపులు చేశారు. మగవాళ్ళను చంపేశారు. అడ్డొచ్చిన బ్రాహ్మణ అర్చకులను నరికేశారు.  అద్భుతమైన శిల్పసంపదను ధ్వంసం చేశారు. ఆ పాపం ఊరకే ఎలా పోతుంది? అందుకే ఇన్ని వందల ఏళ్లుగా శివుని ఆగ్రహం ఆఫ్ఘనిస్తాన్ ను వెంటాడుతోంది. అప్పటినుంచీ ఆ దేశంలో శాంతి అన్నది లేదు. నేడు ఆఫ్గనిస్తాన్ పడుతున్న పాట్లకు కారణం ఇదే. ఆఫ్ఘనిస్తాన్ కే కాదు, పాకిస్తాన్ కు కూడా ఇదే గతి పట్టబోతున్నది. ఇంకా ఘోరమైన గతి పట్టబోతున్నది. కారణం? నేడు ప్రపంచ విలన్ పాకిస్తాన్ దేశమే కాబట్టి.

అంతేకాదు, ఏ ఇండియానైతే అన్నిసార్లు ఎటాక్ చేసి, ఆలయాలను ధ్వంసం చేశారో, దోచుకున్నారో, అరాచకాలు చేశారో, అదే ఇండియా పంపిస్తున్న లక్షలాది టన్నుల గోధుమల కోసం ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఆకలితో ఎదురుచూస్తోంది. అదే ఇండియాను 'దేహీ' అంటూ అడుక్కుంటోంది. వయసుకొచ్చిన కూతుళ్లను అమ్ముకుంటూ, ఆ డబ్బులతో తిండి తిని బ్రతికే హీనాతిహీనమైన పరిస్థితి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది. ఇంతకంటే ఋజువేం కావాలి, సోమనాధ్ శాపం నిజమే అని చెప్పడానికి?

మరొక్క మాట ! అలాంటి ఆఫ్ఘనిస్తాన్ కు కూడా సాయం  చెయ్యడానికి మానవత్వంతో మన దేశం  స్పందించి, ముందుకొచ్చింది చూడండి. ఇదే హిందూమతం యొక్క ఔన్నత్యం ! ఇదే భారతదేశపు ఔన్నత్యం ! శత్రువునైనా సరే, చావుబ్రతుకుల్లో ఉంటే, సాయం చేసి మానవత్వంతో బ్రతికించడం హిందూమతం యొక్క గొప్పదనం !

దేవుణ్ణి ఇంకోరకంగా పూజించినందుకు చంపమని చెబుతుంది ఇస్లాం. ఆకలితో ఉన్న శత్రువుకైనా అన్నంపెట్టి ఆదరించమని చెబుతుంది హిందూమతం. ఏది మానవత్వపు మతం? ఏది రాక్షస మతం? మీరే చెప్పండి.

మతం పేరుతో సాటి మనిషిని చంపడం ఆపనంతవరకూ ఇస్లామిక్ దేశాలకు పట్టిన శాపం వదలదు. ఖురాన్ ను గుడ్డిగా అనుసరిస్తూ, సాటి మనుషులను చంపుతున్నంతవరకూ, ముస్లిం టెర్రరిస్టు దేశాలు ఎదగవు. బాగుపడవు. ఇది తిరుగులేని నిజం.

ఈ విషయాన్ని ఆయా దేశాలు ఎంత త్వరగా అర్ధం చేసుకుంటే వాటికంత మంచిది. ఊరకే మాటల్లో శాంతి శాంతి అని చెప్పడం కాదు. ఇస్లాం అనేది హింసను, కుట్రలను, దౌర్జన్యాలను మానేసి, నిజమైన శాంతిమతంగా మారినప్పుడే దానికి విలువ కలుగుతుంది. లేకపోతే, ప్రపంచంలో అదొక రాక్షస మతంగా మిగిలిపోక తప్పదు.

read more " సోమనాధ్ శాపం "

2, నవంబర్ 2021, మంగళవారం

రాజ్ కుమార్ - పునీత్ ల జాతకాలలో న్యూమరాలజీ పాత్ర

నేను భారతీయ సంఖ్యాశాస్త్రాన్ని (ఇండియన్ న్యూమరాలజీ) ని అనుసరిస్తాను. ABCD లకు అంకెలకూ ముడిపెట్టే పాశ్చాత్య న్యూమరాలజీని నేను ఒప్పుకోను. అది పూర్తిగా తర్కవిరుద్ధమైన పద్ధతి. దానిని బట్టి పేర్లు మార్చుకుని కొన్ని ఎక్కువ అక్షరాలు కలిపేవారిని చూస్తే నాకు భలే నవ్వొస్తూ ఉంటుంది. అలా మార్చుకొమ్మని ఉపాయాలు చెప్పే న్యూమరాలజిస్ట్ లను చూస్తే జాలి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే, అసలైన భారతీయ విజ్ఞానాన్ని వదిలేసి కుహనా పద్ధతులను వారు అనుసరిస్తున్నారు గనుక !

జాతకాన్ని బట్టి ఒక వంశపు జాతకాలలో పోలికలను, జీన్ కోడ్ ను, కర్మ మ్యాప్ ను కనుక్కున్నట్లే, సంఖ్యాశాస్త్రాన్ని బట్టి కూడా కనుక్కోవచ్చు. ఉదాహరణకు, రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ ల జననతేదీలు గమనిద్దాం.

రాజ్ కుమార్

24-04-1929

2, 4 అంకెలు మళ్ళీ మళ్ళీ రావడాన్ని గమనించండి. ఇవి రాహు, కేతువులకు సూచికలు. ఆ తరువాత 1,9 వచ్చాయి. ఇవి సూర్య చంద్రులకు సూచికలు. ఇప్పుడు ఈయన జాతకాన్ని గమనించండి. సూర్యుడు రాహువుతోనూ, చంద్రుడు కేతువుతోనూ కలిసి ఉన్నారు. లెక్క సరిపోయిందా మరి? ఇది గ్రహణయోగం.

ఈ అంకెలను ఒక మెట్టు క్రిందకు కుదించుదాం.

6-4-3

ఇవి, కుజుడు, కేతువు, గురువులకు సూచికలు. ఈయన జాతకంలో, కుజ కేతువులకు పరస్పర దృష్టి ఉన్నది. కేతు, గురువులకు పరస్పర దృష్టి ఉన్నది. వీటి అర్ధాలను ప్రస్తుతం వివరించబోవడం లేదు. కొన్ని క్రమబద్ధమైన అమరికలను స్పష్టంగా మీకు అర్ధమయ్యేలా చెయ్యడమే ప్రస్తుతం నా ఉద్దేశ్యం.

ఇప్పుడు ఇంకొక మెట్టు క్రిందకు కుదిద్దాం.

4

ఇది కేతువుకు సూచిక. ఆ కేతువు చంద్రునితో కలసి ఉంటూ గుండెకు రక్తప్రసరణ ఆగిపోవడాన్ని, దానిద్వారా మరణాన్ని సూచిస్తున్నాడు.

ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ జనన తేదీని గమనిద్దాం.

17-03-1975

దీనిలో 1, 7 అంకెలు రెండుసార్లు వచ్చాయి. అంటే, సూర్యుడు, శుక్రులకు ఈ జాతకంలో ప్రాముఖ్యత ఉన్నది. 3, 9 ఒకదానికొకటి శ్రుతిలో ఉన్న అంకెలు (3 X 3 =9). అంటే, ఈ జాతకంలో గురువు, శుక్రుడు శ్రుతిలో ఉన్నారు.  జాతకాన్ని గమనించండి. గురువు సూర్యునితోనూ, శుక్రుడు చంద్రునితోనూ కలసి ఉన్నారు. సూర్యచంద్రులిద్దరూ జాతకానికి వెలుగునిచ్చే గ్రహాలూ. వీరు తండ్రి, తల్లిని సూచిస్తారు.  పోతే, జననతేదీలో విడిగా ఉన్న అంకె 5 ఒక్కటే. ఇది బుధునికి సూచిక. జాతకంలో, బుధుడు శనిక్షేత్రంలో ఉంటూ డిప్రెషన్ ను, కుంభంలో ఉంటూ సోషల్ సర్వీస్ మైండ్ ను సూచిస్తున్నాడు. ఇతని కళ్ళను దానం చేయడం వలన, ప్రస్తుతం నలుగురికి చూపు వచ్చిందని చెబుతున్నారు. లెక్క సరిపోయిందా మరి?

మరొక్క మెట్టు క్రిందకు వెళదాం.

8-3-4

శని - గురువు - కేతువు. 4, 8 ఒకదానితో ఒకటి శ్రుతిలో ఉన్నాయి (4x 2=8). ఇది మంచి సూచన కాదు. అర్ధాంతర మరణానికి సూచన.

మరొక్క మెట్టు క్రిందకు వెళదాం.

6

ఇది కుజునికి సూచిక. గుండెను సూచించే చతుర్దంలో మారకుడైన కుజుడు ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల గుండెపోటుతో చనిపోతాడని జననతేదీ మూలసంఖ్యని బట్టి స్పష్టంగా తెలుస్తున్నది.

రెండు జాతకాలలోనూ కేతువు పాత్ర స్పష్టంగా ఉంది. అదే విధంగా ఇద్దరి జననతేదీలలోనూ 4 అంకె మళ్ళీ మళ్ళీ వచ్చింది. సరిపోయిందా లేదా?

ఇప్పుడు మీకొక అనుమానం రావాలి. అదేంటండి? ఇంగిలీషు జననతేదీలు తీసుకుని భారతీయ సంఖ్యాశాస్త్రాన్ని వివరిస్తున్నారు అని. ఇది సరియైన సందేహం ! అసలూ, భారతీయ సంఖ్యాశాస్త్రం ఇది కాదు. ఇది సంకరవిధానం. ఇప్పుడు అసలైన విధానాన్ని వివరిస్తాను వినండి.

మన హిందూ సంఖ్యాశాస్త్రం ప్రకారం సంవత్సరం, నెల, తిధి, వారాలను తీసుకుంటే అది అసలైన జననతేదీ అవుతుంది. దానిప్రకారం చూద్దాం.

రాజ్ కుమార్

24 - 4 - 1929

శుక్ల - చైత్ర - కృష్ణ పాడ్యమి - బుధవారం

3 - 1 - 7 - 4

గురువు - సూర్యుడు - శుక్రుడు - కేతువు

ఉచ్ఛసూర్యునితో కలసిన గురువు వల్ల గొప్ప పేరు ప్రఖ్యాతులు, డబ్బు, అధికారం కలిగాయి. శుక్రుని ఉచ్ఛస్థితివల్ల విలాసజీవితం, కేతువు వల్ల జీవితంలో అకస్మాత్హు మార్పులు కలిగాయి.

ఈ నాలుగంకెలనూ కలుపుదాం.

6

6 అంటే కుజుడు. శని కుజుల దృష్టివల్లా, వారి షష్టాష్టక స్థితివల్లా, అతిశ్రమ (వ్యాయామం) అనేది మరణానికి దారి అవుతుందని సూచన ఉన్నది.

పునీత్ రాజ్ కుమార్

17-03-1975

ఆనంద - ఫాల్గుణ - శుక్ల చతుర్థి - సోమవారం

48 - 12 - 4 - 2

3- 3 - 4 - 2

గురువు - గురువు - కేతువు - రాహువు

సూర్యునితో స్వస్థానంలో ఉన్న గురువు వల్ల తండ్రిలాగానే ప్రజాదరణ, గొప్పపేరు, సంపదలు కలిగాయి. అయితే, గురువు నుంచి తృతీయ (ఆయుష్షు), నవమ (భాగ్య) స్థానాలలో నీచస్థితులలో ఉన్న కేతు రాహువుల వల్ల, గురువు ఇస్తున్న యోగం భంగమైపోయి, అర్ధాయుష్కునిగా మరణించాడు.

మరొక్క మెట్టు క్రిందకు వెళదాం.

3

గురువుకు పైన చెప్పిన ఫలితమే వర్తిస్తుంది.

ఈ విధంగా, భారతీయ విధానంలో సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దీనిని బట్టి కూడా, స్థూలంగా జాతకుని జీవనశైలిని, అదృష్టాన్ని, మంచీ చెడులను, మరణాన్ని అంచనా వేయవచ్చు.

ఈ జాతకాలలో చూస్తే, తండ్రీ కొడుకుల ఇద్దరి జాతకాలలోనూ, అదృష్టం, సంపద, కీర్తి అన్నీ ఒకే రకంగా ఉన్నప్పటికీ, మరణ కారణం కూడా ఒక్కటే అయి ఉండటం కనిపిస్తుంది. ఈ విధంగా, జీన్ కోడ్ అనేది, కర్మ అనేది, జాతకాలలోనూ, జనన తేదీలలోనూ ఒక వంశంలోని అన్ని జాతకాలలో  తరతరాలుగా నడుస్తూ ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్ధిగా బ్రతికితే ఇది  బాగవుతుంది, అహంకారంతో చెడగొట్టుకుంటే తరం నుంచి మరొక తరానికి దిగజారిపోతుంది. ఈ విధంగా కర్మచక్రం నడుస్తూ మనిషి జీవితాన్ని నడుపుతూ ఉంటుంది.
read more " రాజ్ కుమార్ - పునీత్ ల జాతకాలలో న్యూమరాలజీ పాత్ర "

1, నవంబర్ 2021, సోమవారం

జాతకంలో జీన్ కోడ్ ఎలా దాగి ఉంటుంది? రాజ్ కుమార్, పునీత్ ల జాతకాలు

21 సంవత్సరాల క్రితం జ్యోతిష్య శాస్త్రంలో నేను MA చేశాను. తెలుగు యూనివర్సిటీ నుండి మాది మొదటి బ్యాచ్. అప్పట్లో నా అభిమాన అంశం - జాతకచక్రంలో జీన్ కోడ్ ఎలా దాగి ఉంటుంది? తల్లిదం డ్రులనుండి వారసత్వ లక్షణాలు పిల్లలకెలా సంక్రమిస్తాయి? కర్మలు, శాపాలు ఎలా ఒక తరం నుంచి మరొక తరానికి సరఫరా అవుతాయి? అనే అంశమే. గుంటూరుకు చెందిన ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త BJ రావుగారు కూడా, ఇదే అంశం మీద రీసెర్చి చెయ్యమని తాను చనిపోయేముందు నాతో చెప్పారు. ఆ తరువాత ఈ విషయం మీద చాలా రీసెర్చి చేశాను. ఎన్నో సూత్రాలను కనుక్కున్నాను.

"మెడికల్ ఆస్ట్రాలజీ - పార్టీ 2" లో ఆ అంశాలను అనేక జాతకాల ఆధారంగా విశ్లేషించి లోకానికి అందించబోతున్నాను. ఈ పుస్తకం 2022 లో విడుదలౌతుంది.

ప్రస్తుతానికి ఇదే అంశాన్ని 29  చనిపోయిన పునీత్ రాజ్ కుమార్, అతని తండ్రి రాజ్ కుమార్ ల జాతకాల పరంగా వివరిస్తున్నాను. అయితే, ఒకే ఒక్క సంఘటనను మాత్రమే ఇప్పుడు చెబుతాను. మొత్తం జాతకాలను వివరించను.

వీళ్ళిద్దరూ ఒకే విధంగా చనిపోయారు. ఇద్దరి మరణాలకూ, వ్యాయామం చేసిన తర్వాత వచ్చిన కార్డియాక్ అరెస్ట్ మాత్రమే కారణం అయింది. ఇప్పుడు వీళ్ళ జాతకాలను పరిశీలిద్దాం.

ముందుగా, ఒక చిన్న విచిత్రాన్ని గమనించండి. రాజ్ కుమార్ 46 వ ఏట పునీత్ రాజ్ కుమార్ పుట్టాడు.  మళ్ళీ తన 46 వ ఏట పునీత్ చనిపోయాడు. కనుక 46 అంకెకు వీళ్ళ జాతకాలతో సంబంధం ఉందా లేదా? నా విధానం ప్రకారం 4 కేతువు, 6 కుజుడు, 1 సూర్యుడు. కనుక వీళ్ళ జాతకాలలో ఈ గ్రహాలు ప్రధానపాత్రలు పోషిస్తాయి. మరి ముందుకు పదండి !

రాజ్ కుమార్ జాతకం (24 ఏప్రిల్ 1929)

మేషంలో రవిరాహుయోగం ఉంది చూడండి. ఇది, ఆ జాతకుడు హార్ట్ ఎటాక్ తో పోవడాన్ని సూచిస్తున్నది  అంతిమయాత్రకు శని సూచిస్తాడు. ఈ జాతకంలో, కుజశనుల షష్టాష్టకస్థితి అమితశ్రమయే ఈ జాతకుని అంతిమయాత్రకు కారణమౌతుందన్న సత్యాన్ని చెబుతున్నది. కేతు చంద్రులు కలసి ఉండటం వల్ల గుండెకు రక్తప్రసరణ ఆగడం ఈ మొత్తానికీ దోహదమౌతుందని సూచన ఉన్నది. కేతువు శుక్రుడిని సూచిస్తున్నాడని గమనించండి.

పునీత్ రాజ్ కుమార్ జాతకం (17 మార్చ్ 1975)

ఈ జాతకంలో చంద్రుడు శుక్రుడితో కలసి ఉండటం, ఇద్దరూ కేతువుతో మ్రింగబడటం చూడవచ్చు. ఇదే జెనెటిక్ ఆస్ట్రాలజీ మహాత్యం. మరొక్క విచిత్రం - శని కుజులిద్దరూ ఈ చార్ట్ లో కూడా షష్టాష్టక స్థితిలోనే ఉన్నారు. అంటే, అతిశ్రమ వల్లనే అంతిమయాత్రకు దారి ఏర్పడుతుందని సూచన ఈ జాతకంలో కూడా ఉంది. సూర్యుడు పాపార్గళంలో బందీ అయ్యాడు. రాహుశనులచేత చూడబడుతున్నాడు. కనుక కార్డియాక్ అరెస్ట్ జరిగింది.

ఈ విధంగా 46 ఏళ్ల తేడాతో పుట్టిన తండ్రీ కొడుకుల జాతకాలలో ఒకే విధమైన గ్రహస్థితులుండటం వింతగా లేదూ? అయితే, ఇందులో వింతేమీ లేదు. జీన్ కోడ్ ఇలాగే ఒక తరం నుంచి మరొక తరానికి సరఫరా అవుతుంది.  కర్మ కూడా ఇదే విధంగా సరఫరా అవుతుంది. ఒక వంశంలో ఒక విధమైన కర్మ ప్లాన్ నడుస్తూ ఉంటుంది. దానిని ఆ కుటుంబసభ్యుల జాతకాలు పరిశీలించడం ద్వారా  స్పష్టంగా తెలుసుకోవచ్చు.

అయితే, దీనిని ఎలా మార్చాలన్నదే అసలైన ప్రశ్న. చెప్పమంటారా? అబ్బా ! అదే రహస్యం మరి ! అవన్నీ తెలిస్తే ఇంకేం? అందరూ అన్నీ మార్చేసుకోరూ? కనుక దానిని మాత్రం చెప్పను. జెనెటిక్ ఆస్ట్రాలజీ నిజమే  అన్నది  అర్ధమైంది కదా? అంతవరకూ అర్ధమైతే చాల్లే ప్రస్తుతానికి !

read more " జాతకంలో జీన్ కోడ్ ఎలా దాగి ఉంటుంది? రాజ్ కుమార్, పునీత్ ల జాతకాలు "

యురేనస్ సూర్యుల సమసప్తక యోగం - ప్రభావాలు


యురేనస్ - సూర్యుల మధ్యన ఏర్పడుతున్న సమసప్తకదృష్టి వల్ల ప్రస్తుతం అనేక మార్పులు ప్రపంచవ్యాప్తంగా జనజీవనంలో చోటు చేసుకుంటున్నాయి. వాటిలో కొన్నింటిని గమనిద్దాం.


జపాన్ మెట్రో రైల్లో కత్తిపోట్లు


పాశ్చాత్యసంస్కృతిలో ఉన్న దరిద్రపు పండగలు ఆసియాలో కూడా ప్రవేశించి జరుపుకోబడుతున్నాయి. మితిమీరిన డబ్బే దీనికి కారణం. అలాంటి ఒకానొక పండుగైన, హాలోవీన్ అనే దరిద్రపు పాశ్చాత్య పండుగ సందర్భంగా, జపాన్ లో మెట్రో రైల్లో, జోకర్ లాగా వేషం వేసుకున్న ఒకడు 17 మందిని కత్తితో పొడిచిపారేశాడు. 'ఎందుకురా ఇలా చేశావ్?' అంటే, 'నాకు చచ్చిపోవాలనుంది. ఇలా చేస్తే, పట్టుకుని చంపేస్తారని ఇలా చేశాన' ని చల్లగా సమాధానం చెబుతున్నాడు.

మనుషుల తలకాయలలో యురేనస్ పుట్టించే పెడబుద్ధులు ఇలా ఉంటాయి. తులారాశి చరరాశి కావడమూ, అక్కడే హింసకు కారకుడైన కుజుడు ఉండటం వల్ల, నడుస్తున్న రైల్లో ఈ హింసాత్మక సంఘటన జరిగింది.


బ్రిటన్ లో గుద్దుకున్న రైళ్లు


నైరృతి బ్రిటన్ లోని శాలిస్ బరీ టౌన్ లోని సొరంగంలో రెండు రైళ్లు గుద్దుకుని చాలామంది గాయపడ్డారు. అయితే, ఎవరూ చనిపోలేదని అంటున్నారు. బహుశా, ACD వంటి నవీన బోగీ టెక్నాలజీ దీనికి కారణం కావచ్చు. హఠాత్ ప్రమాదాలకు యురేనస్ కారకుడనీ, ఆయన ప్రస్తుతం, బ్రిటన్ ను సూచించే మేషరాశిలో ఉన్నాడనీ గుర్తుంటే, ఇదెందుకు జరిగిందో తెలుస్తుంది.

ఇప్పుడు ఇండియావైపు దృష్టి సారిద్దాం.

పునీత్ రాజకుమార్ మరణం

కన్నడ నటుడు రాజ్ కుమార్ తనయుడైన పునీత్ 46 ఏళ్లకే కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూశాడు. యురేనస్ హఠాత్ సంఘటనలకు కారకుడు. సూర్యుడు తులారాశిలో నీచస్థితిలో ఉంటూ, ప్రముఖులకు పడుతున్న నీచస్థితిని సూచిస్తున్నాడు. సూర్యుడు గుండె పనితీరుకు, సెలబ్రిటీలకు సూచకుడు. సెలబ్రిటీలను, ముఖ్యంగా సినిమా నటులను సూచించే తులా రాశిలో ప్రస్తుతం ఉన్నాడు. ఇవన్నీ కలుపుకుని చూడండి, అతిగా చేసిన వ్యాయామాల ఫలితంగా పునీత్ ఎందుకు చనిపోయాడో అర్ధమౌతుంది.

ఆఫ్కోర్స్. తల్లిదండ్రులు చనిపోయినట్లే వారి పిల్లలు కూడా చాలావరకూ చనిపోతూ ఉంటారు. ఇది జీన్ కోడ్ ప్రకారం జరిగే ఒక విచిత్రం. రాజ్ కుమార్ కూడా ఇదే విధంగా వ్యాయామం చేసిన రెండు గంటలకు, ఊరకే సోఫాలో కూచున్నవాడు కూచున్నట్లే హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. ఇప్పుడు, పునీత్ కూడా అదే విధంగా చనిపోయాడు. ఈ విషయాన్ని వాళ్ళ ఫెమిలీ డాక్టర్ స్వయంగా చెప్పాడు.

ఈ సందర్భంగా కొన్ని విషయాలను చెప్పదలచుకున్నాను.

గత 40 ఏళ్లుగా నేను రకరకాల మార్షల్ ఆర్ట్స్ అభ్యాసం చేస్తున్నాను. 35 ఏళ్ల క్రితమే నేను కరాటే స్కూల్స్ నడిపాను. చిన్నప్పటినుంచీ యోగాభ్యాసం నాకు అలవాటుంది.  అందుకని, ఈ విషయాలమీద అధికారికంగా నేను మాట్లాడగలను.

సరిగ్గా చెయ్యకపోతే, వ్యాయామం కూడా ప్రాణం తీస్తుంది. అందులోనూ 40 దాటాక అందరూ అన్ని రకాల వ్యాయామాలూ చెయ్యకూడదు.  జిమ్ వ్యాయామాలు అస్సలు మంచివి కావు. మన యోగాభ్యాసం మరియు గ్రౌండ్ ఎక్సర్ సైజులే మంచివి. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ లు మంచివి కావు.  అవి ఖచ్చితంగా గుండెను దెబ్బతీస్తాయి. ఇలా దెబ్బతిన్నవాళ్లను గత 40 ఏళ్లలో ఎంతో మందిని నేను చూచాను. 1990 లలో నా ఫ్రెండ్స్ లోనే కొందరు బాడీ బిల్డర్లు, బాక్సర్లు హార్ట్ సమస్యలకు గురయ్యారు. వారిలో ఒకరికి హార్ట్ ఎన్లార్జ్ అయింది. ఇంకొకరికి హార్ట్ వాల్వులు దెబ్బతిన్నాయి. ఈ విషయాలు నేటి జిమ్ ట్రెయినర్లకు ఎంతమాత్రం తెలీవు. డబ్బుకోసం వాళ్ళు నానామాటలు చెబుతారు. నానా మాంసాలు తినమంటారు. ఎక్కడలేని వ్యాయామాలు చెయ్యమంటారు. ఏమీ పరవాలేదంటారు. వాటిని విని సెలబ్రిటీలు, సినిమానటులు దెబ్బ తింటున్నారు. దురదృష్టవశాత్తూ, నేటి యువతలో కండలమీద మోజు చాలా ఎక్కువగా ఉంది. ఇది చాలా పొరపాటు. ఈ చెడు సంస్కృతిని సినిమాలు పెంచి పోషిస్తున్నాయి. అమ్మాయిలముందు కండలు ప్రదర్శించడం పెద్ద గొప్ప విషయం కాదు. అలాంటి చీప్ ట్రిక్స్ వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. పైగా, ఆ కండల కోసం నానా చెత్తా తింటారు. అవి రక్తనాళాలలో అడ్డుగా ఏర్పడి  హార్ట్ ఎటాక్స్ కు కారణమౌతాయి.

జిమ్ అనేది వెస్ట్రన్ విధానం. దానికి మూలాలు గ్రీకు - రోమన్ కల్చర్ లో ఉన్నాయి. లాంగ్ రన్ లో అది మంచిది కాదు. యోగాభ్యాసం, వీరవిద్యలు  మన భారతీయ విధానాలు.  వీటిని పాటిస్తే నూరేళ్లయినా ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండవచ్చు. నేటి యువత ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మాంసాలు తింటూ, జిమ్ చేస్తూ కండలు పెంచితే చాలన్న భ్రమనుండి ఎంత త్వరగా బయటపడితే యువతకు అంత మంచిది.

ఆరోగ్యానికీ కండలకూ ఎలాంటి సంబంధమూ లేదని గ్రహించండి. జిమ్ములు చెయ్యకండి. ఒళ్ళు గుల్లచేసుకోకండి. గుండెజబ్బులకు గురికాకండి. అదే విధంగా, జీరో సైజు అంటూ, అమ్మాయిలు రోజుల తరబడి ఉపవాసాలు చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. వారి ఆరోగ్యాలు కోలుకోలేని విధంగా దెబ్బతింటాయి. మితిమీరిన వ్యాయామాలు ఎంత ప్రమాదమో, మితిమీరిన ఉపవాసాలూ అంతే ప్రమాదం. ఈ మాటను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.

కేరళ అందగత్తెల మరణం

2019 మిస్ కేరళ అంసి కబీర్, రన్నరప్ అంజనాలు నిన్న రాత్రి ఎర్నాకులం లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ హఠాత్ సంఘటన కూడా యురేనస్ - సూర్యుల సమసప్తక ప్రభావమే. జపాన్లో, డుస్తున్న రైల్లో దుర్ఘటన జరిగితే, వీరి కేసులో, వేగంగా నడుస్తున్న కారు బోల్తా కొట్టి, వీరిద్దరూ స్పాట్లో చనిపోయారు. రెండూ, రవాణా వాహనాలు కావడం తులారాశి యొక్క చరకారకత్వపు ప్రభావం.

ఇలా వ్రాస్తూ పోతే, అంతర్జాతీయ, జాతీయ, వ్యక్తిగతరంగాలలో లెక్కలేనన్ని సంఘటనలున్నాయి. మచ్చుకి ఈ నాలుగింటిని వ్రాస్తున్నాను. ఈ గ్రహయోగం ఇంకొక వారంపాటు ఉంటుంది. కనుక, ఈ లోపల ప్రముఖులకు, సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో ఇలాంటి సంఘటనలు జరుగబోతున్నాయి. వేచి చూడండి. 

read more " యురేనస్ సూర్యుల సమసప్తక యోగం - ప్రభావాలు "