“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, సెప్టెంబర్ 2009, మంగళవారం

విశిష్ట సాత్విక ఉపాసన


భక్తిమార్గంలో భగవంతుని పంచవిధమైన భావాలతో సమీపించటం ఆరాధించటం ఉంటుంది. ఇవి శాంతభావము,దాస్య భావము,సఖ్యభావము,వాత్సల్యభావము, మధుర భావము. ఈ పంచవిధ భావముల గురించి మరొకసారి తెలుసుకుందాం. 

వాత్సల్య భావములోని ఒక శాఖ భగవంతుని తల్లిగా ఆరాధించటం. ఇది అతి ఉత్తమమార్గం. మన హైందవమతానికి ప్రత్యేకమైన అనేక మార్గాలలో ఇదీ ఒకటి. ఈ విధానంలో భగవంతుని శక్తిగా ఉపాసించటం ఉంటుంది. సమస్త జగత్తుకూ భగవంతుని త్రిగుణాత్మిక అయిన శక్తి స్వరూపమే తల్లి. 

లలితా సహస్రనామస్తోత్రం అని చాలామందికి తెలుసు. కాని దాని అసలు పేరు లలితా రహస్యనామస్తోత్రం. ఎందుకనగా జగన్మాత యొక్క ఈ వెయ్యి నామములకు రహస్యమైన అర్థములు ఉన్నాయి. ఈ నామములు మానవ కల్పితములు కావు,కవి విరచితములు కావు.ఇవి స్వయానా జగన్మాత యొక్క పరివారశక్తులైన వశిన్యాది వాగ్దేవతలచే చెప్పబడినట్టి దివ్య నామములు మరియు మంత్రములు.



లలితా సహస్రనామ పారాయణ మహాత్యం ఇంతా అంతా కాదు.భక్తితో పారాయణ చేస్తే సద్యోఫలితం ప్రాప్తించటం మనం నిదర్శనంగా చూడవచ్చు. సాక్షాత్తూ జగన్మాత అనుగ్రహం పొందగలిగితే ఇక మానవజన్మకు అంతకు మించిన పరమప్రయోజనం ఉండదు.ఈ సహస్రనామములలో ఎన్నో ఆరాధనావిధానాలు,ఉపాసనాపద్దతులు,యోగతంత్ర రహస్యాలు సూక్ష్మంగా ఇమిడి ఉన్నాయి.


ఏ శక్తి చరాచర ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములను చేస్తూ ఉన్నదో ఆ శక్తియే జగన్మాత అనగా పరాశక్తి. ఈ ప్రక్రియతో సంబందంలేని నిశ్చల మైన స్థితిలో ఉన్న అదే శక్తిని పరమశివుడు అని తంత్రములు పిలిచాయి. కనుక శివుడు శక్తి అభేదములు. రక రకాలయిన మతాలు రక రకాలయిన పేర్లతో పిలుస్తున్నది ఈ శక్తినే గాని వేరొకటి కాదు.

ఆ జగన్మాత యొక్క వెయ్యి దివ్య నామములే లలితా సహస్ర నామములు. 'లలితా' అనే నామమే అత్యంత మనోహరమైనట్టిది.సమస్త చరాచర సృష్టికి ఆధారమైనట్టి శక్తి 'లలిత'.అనగా లలితమైన స్వరూపం కలిగినట్టిది. ఆర్ద్రమైనట్టి తత్వము కలిగినట్టిది.భయంకరమైన శక్తి కాదు.శరత్కాల చంద్రుని వలె లలితమైనట్టి శక్తి. చల్లని చూపులతో తన బిడ్డలను కాపాడుతూ ఉండే ఆధారశక్తి. భగవంతుని తల్లిగా భావించటం భారతీయ మతంలోని విశిష్టత.

ఈ రహస్య నామములలోని రహస్య ప్రక్రియలను తెలుసుకోలేక పోయినా ఆచరించలేక పోయినా, కనీసం సాత్వికమైన భక్తితో పారాయణ చేసి ఆ జగన్మాతను ప్రార్ధిస్తే తప్పక మన గమ్యాన్ని చేరగలం. ఇక ఆ రహస్యములు తెలిసి ఆచరించే వారి పని వేరే చెప్ప వలసిన పని లేదు. ఈ భూమిపైన వారే నడిచే దేవతలని చెప్ప వచ్చు.


శక్తి ఆరాధన మనదేశంలో అతి ప్రాచీనకాలం నుంచి ఉన్నది. తల్లిని దేవతగా ఆరాధించే "మాతృదేవో భవ" మొదలైన వేదవాక్యాల ఆచరణ శక్తి ఆరాధన గా మన దేశమంతటా వ్యాపించి ఉంది. మన దేశంలో తల్లికి దేవతా స్థానాన్ని ఇచ్చి గౌరవించడం అతి ప్రాచీనకాలము నుంచి ఉన్న అద్భుత మైన విశిష్టత. అవతారమూర్తులైన రాముడు,కృష్ణుడు,మొదలైనవారు కూడా శక్తిని పూజించారు.సామాన్యజీవి నుండి అవతారమూర్తి వరకు ఆ జగన్మాత యొక్క బిడ్డలే.


శ్రీ రామకృష్ణుడు వివేకానందునికి ఒక కధ చెప్పాడు.

అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూచి న తదుపరి ఆయనను ఎక్కువగా పొగిడేవాడట. అర్జునునికి సరియైన అవగాహన కలిగించదలచి కృష్ణుడు ఒకనాడు వ్యాహ్యాళికి పోతూ అర్జునుని తనతో రమ్మని పిలిచాడు.వారిద్దరూ ఒక మహావృక్షం దగ్గరకు చేరుకున్నారు. ఆ వృక్షానికి గుత్తులు గుత్తులుగా నేరేడుపండ్ల వంటి పండ్లు వేలాడుతున్నాయి.

శ్రీకృష్ణుని ఆదేశం ప్రకారం అర్జునుడు ఒక కొమ్మకు ఉన్న అనేక గుత్తులలో ఒక గుత్తి వద్దకు పోయి చూడగా ఒక్కొక్క పండులో ఒక్కొక్క కృష్ణరూపం కనిపించిందట. అపుడు విస్మయం చెందిన అర్జునునితో శ్రీ కృష్ణుడు " అర్జునా చూచావు కదా.కాలమనే మహాశక్తిలో నా వంటి అవతారమూర్తులు ఎందఱో ఉంటారు.జగన్మాత అనబడే కాళికాశక్తి లీలావిలాసంలో అవతారమూర్తులు ఎందఱో పుట్టి వారివారి పని పూర్తిచేసి మళ్ళీ ఆ శక్తిలోనే లయం అవుతుంటారు.ఇది సత్యం.దీన్ని బాగా తెలుసుకో "అని చెప్పాడట.

నిన్నటితో ముగిసిన నవరాత్రులలో భగవంతుని తల్లిగా జగన్మాతగా ఆరాధించాము.ఎవరో కొందరు ఉత్తమ సాధకులు, సాత్విక ఉపాసకులు అక్కడక్కడా ఉన్నారు.కాని చాలా ప్రదేశాలలో బలులు,వృధాపూజలు మొదలైన నిమ్న స్థాయికి చెందిన ఆరాధనలు ఇంకా కొనసాగుతున్నాయి. కోరికలతో చేసే పూజలు,అర్చనలు ఎక్కువగా సాగుతున్నాయి.

పూజలు మంచివే. కాని ఉత్తమమైన పూజ, ఆరాధన, ఉపాసన కావాలి. జగన్మాతకు మనము ఇచ్చే జంతుబలులు,కుంకుమపూజలు అవసరంలేదు.మనలోని పశుత్వాన్ని బలి ఇవ్వగలిగితే అది అత్యున్నతమైన పూజ అవుతుంది. మనలోని రాక్షసుణ్ణి చంపగలిగితే అది ఉత్తమమైన ఆరాధన అవుతుంది.అహంకార రూపుడైన దున్నపోతును( మహిషాసురుణ్ణి) సంహరించకుండా ఆ తల్లికి తృప్తి కలుగదు.

మనమిచ్చే కొబ్బరికాయలు, నైవేద్యాలు, బలులు ఆ తల్లికి అవసరం లేదు. ఆ అసురుడు అహంకారరూపంలో మన అందరిలో ఉన్నాడు.అతన్ని బలి ఇవ్వాలి.అది చెయ్యకుండా ఎన్ని పారాయణాలు,పూజలు చేసినా మన స్వభావం యధాప్రకారం కొనసాగుతూ ఉంటుంది తప్ప ప్రయోజనం శూన్యం. ఇటువంటి పూజల వల్ల ఏవో కొన్ని లౌకిక ప్రయోజనాలు పొందవచ్చు అంతే కాని అసలైన ప్రయోజనం అయిన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేము.అది పొందాలంటే రహస్యమైన సాత్విక ఉపాసన ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఆచరించాలి. ఫలితాన్ని పొందాలి.

ఉపాసన అనేది పార్ట్ టైం దీక్షల వంటిది కాదు. మనిషి జన్మ మొత్తం ఒక దీక్షగా సాగాలి.ఆత్మజ్ఞానం అనబడే గమ్యాన్ని చేరినపుడే దీక్షావిరమణ. అట్టి దీక్షను మనిషి ఆచరించాలి. దానికి మన మతం ఎన్నో మహత్తరములైన మార్గాలను, ఉపాసనా విధానాలను అందించింది. ఏ ఒక్కదాన్ని చక్కగా ఆచరించిన గమ్యాన్ని చేరగలం. కాని ఆచరించే వారేరీ?అనుష్టించేవారేరీ? మొక్కవోని ఋషిరక్తం ఈనాడు మూగబోయిందా?ప్రపంచాన్ని ఒక్క చూపుతో శాసించగలిగే బ్రహ్మతేజం ఈనాడు ఏదీ?ఏ విలాసాలు సుఖాల కోసమైతే ప్రపంచ ప్రజలు అర్రులు చాస్తూ నానా రకాల ఊడిగాలు చేస్తున్నారో ఆ సమస్తసుఖాలనూ,గడ్డిపోచలాగా తిరస్కరించి,ఒక్క బ్రహ్మజ్ఞానమే వాంచనీయం,జీవిత పరమగమ్యం అది ఒక్కటి మాత్రమె అని ఆచరించి చూపగలిగిన వైరాగ్యపూరిత బ్రహ్మ తేజస్సు ఎక్కడా కనపడదే?

ప్రజలు అజ్ఞానంలో తెలియనితనంలో కొట్టుమిట్టాడుతూ అమితమైన జ్ఞాన సంపదను తమ చుట్టూ పెట్టుకొని కూడా చూడలేని వారై, నిమ్న తరగతికి చెందిన పూజలలో ఆరాధనలలో సమయాన్ని గడుపుతుంటే,వారికి నిజమైన ఉపాసనా మార్గాలను అందించి జాతిని జాగృత పరచవలసిన ఆచార్యులేరీ?ఆచరించే సాధకులేరీ?మనకెంతటి దుర్గతి పట్టింది? మహోత్తమమైన మతాన్ని,జ్ఞానసంపదను మన వారసత్వంగా పొందికూడా గుడ్డివాళ్ల వలె ప్రవర్తిస్తున్నాము.

వేదోపనిషత్తులు ప్రతిపాదించిన అత్యుత్తమ జ్ఞానాన్ని తెలుసుకోండి. ఆచరించండి.నిజమైన ఋషిసంతతి వారమని మనం ప్రపంచానికి నిరూపించాలి.

"శ్రుణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః ఆయే ధామాని తవాని తస్యుః వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే తమేవ జ్ఞాత్వా అతిమృత్యు మేతి నాన్యపంధా విద్యతే అయనాయ"--అన్న దివ్యమైన వేదవాణి వినండి.నిద్ర లేవండి. కార్యోన్ముఖులు కండి. జీవితం స్వల్పం. ఆత్మజ్ఞానం పొందలేకపొతే జన్మ వృధా అవుతుంది.ఈ సత్యాన్ని విస్మరించకండి.

విశిష్ట సాత్విక ఉపాసనను ఆచరించి మహోన్నతమైన ఫలితాన్ని పొందండి.
read more " విశిష్ట సాత్విక ఉపాసన "

22, సెప్టెంబర్ 2009, మంగళవారం

ఖేచరీ ముద్ర

కుండలినీ యోగం లో ఖేచరీ ముద్రకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వ్యుత్పత్తి అర్థాన్ని బట్టి "ఖే" అనగా ఆకాశమున "చరి" అనగా చరించునది, ఆనగా ఆకాశమున చరించునది ఖేచరి.

హటయోగ ప్రదీపిక ప్రకారం ఖేచరీ ముద్రావిధానం ఎట్లనగా,

శ్లో కపాల కుహరే జిహ్వా ప్రవృష్టా విపరీతగా
భ్రువోరంతర్గతా దృష్టి ర్ముద్రా భవతి ఖేచరీ

కపాల కుహరమున , అనగా పుర్రె లోనికి నాలుక వెనుకకు తిరిగి ప్రవేశించగా, భ్రూ మధ్యమున దృష్టి ఎకాగ్రముగా నిలిపినచో అది ఖేచరీ ముద్ర అనబడును.

అనగా నాలుకను వెనుకకు మడచి కొండనాలుకకు వెనుక భాగమున కల రంధ్రము గుండా తలలోకి పోనిచ్చి దృష్టి ని నొసటి యందు రెండు కను బొమల మధ్యన నిలిపి యుంచి తదేక దృష్టి తో నిలిచి యుండుటే ఖేచరీ ముద్ర.

దీనినే లంబికా యోగము అని కూడా యోగ గ్రంధములలో చెప్పారు. వేమనకు ఉపదేశము చేసిన గురువు పేరు లంబికా శివ యోగి అని ఒక గాధ కలదు. బహుశా ఆయన ఇటువంటి ఒక పద్ధతిలో నిష్ణాతుడై ఉండవచ్చు.

సామాన్యముగా ఇటువంటి ముద్రలు క్రియలు శైవ సాంప్రదాయం లోనూ, శాక్త సాంప్రదాయం లోనూ కనిపిస్తుంటాయి. నవీన కాలంలో క్రియా యోగాన్ని ప్రచారం లోకి తెచ్చిన లాహిరీ మహాశయులు కూడా ఈ ఖేచరీ ముద్రలో నిష్ణాతులే.

యోగ గ్రంధాల ప్రకారం ఈ క్రియ చెయ్యటం వలన తలలోనుంచి అమృతము అనబడే ఒకానొక ద్రవము జారి అంగిలి లో పడుతుంది. దానిని సరాసరి మింగటం వలన ఆకలి దప్పిక లు తగ్గిపోతాయి. కాని మనిషికి నీరసం అలసట ఉండదు. ముఖంలో ఒక విధమైన తేజస్సు ఎప్పుడూ ఉంటుంది. నిత్య ఉత్సాహంగా, చురుకుగా మనిషి ఉండగలదు. వార్ధక్యం వాయిదా వెయ్య బడుతుంది. దేహ పుష్టి స్థిరంగా ఉంటుంది. రోగాలు దగ్గరకు రావు. ఇదే కాక అతీత యోగ సిద్దులు కాల క్రమేణా కలుగుతాయి.

కాని ఈ క్రియ చెయ్యటానికి పెద్ద ప్రతిబంధకం నాలుకను కిందకు పట్టి ఉంచే ఫ్రెన్యులం అనబడే ఒక చర్మపు అతుకు. దీనిని తొలగించటానికి అనేక క్రియలు యోగంలో ఉన్నాయి. చేదనము దోహనము అనే క్రియలు యోగులకు తెలుసు. ఈ అతుకును శుభ్రమైన పదునైన కత్తితో రోజుకు వెంట్రుక వాసి అంత కోస్తూ దానికి ప్రత్యేకం గా తయారు చేసిన మూలికా మిశ్రమం అద్దుతూ ఉంటే కొద్ది నెలలలో అది మొత్తం తొలగించ బడి నాలుక పూర్తిగా వెనుకకు తిరిగి కపాల కుహరం లోకి ప్రవేశించ గలుగుతుంది.

కాని ఈ క్రియను చాలా జాగ్రత్తగా చెయ్యాలి. తేడా వస్తే మాట పడి పోయి మూగ తనం వస్తుంది. దీనికి తోడుగా రోజూ వెన్న రాస్తూ పాలను పితికి నట్లు నాలుకను ఒక ప్రత్యెక పద్దతిలో సాగతియ్యాలి. దీన్ని దోహన క్రియ అంటారు. (దయ చేసి దీనిని ఎవరికీ వారే పొరపాటున కూడా ప్రయత్నం చెయ్యవద్దని ప్రార్ధన. ఒకవేళ చేస్తే వచ్చే ఫలితాలకు నేను బాధ్యున్ని కాను).

ఇదికాక మండూక క్రియ అని ఇంకొక క్రియ కూడా ఉన్నది. ఇది అంతగా ప్రమాద కారి కాదు. ఇది క్రమేణా ఫ్రెన్యులం అనబడే పొరను సాగదీస్తూ నాలుక సులభంగా వెనుకకు తిరిగి కపాల కుహరం లోకి ప్రవేశించి కనుబొమల మధ్య వరకూ లోపలనుంచి వెళ్ళేటట్లు చేస్తుంది.

ఈ క్రియను కొన్నేళ్ళు అభ్యాసం చెయ్యటం వల్ల మనిషి పక్షి వలె ఆకాశంలో సంచారం చెయ్యగలుగు తాడు. అటువంటి సిద్ధులు యోగికి ఇవ్వగల అద్భుత క్రియ ఇది. దీని వల్ల ఎం జరుగుతుందో చెప్తాను.

పుర్రె లోపలి భాగం లో నిద్రానం గా ఉన్నా పిట్యూటరీ, పినియాల్ గ్లాండ్స్ ఈ క్రియ వల్ల ఉత్తెజితాలు అవుతాయి. ఇవి మాస్టర్ గ్లాండ్స్. అనగా శరీరం లోని ఇతర ఎందోక్రిన్ గ్లాండ్స్ అయిన థైరాయిడ్, హైపోథాలమస్, ఎడ్రినల్ గ్లాండు లను ఇవి నియంత్రించగలవు. వీటికి నాలుకతో ఉత్తేజం ఇవ్వటం ద్వారా వాటి హార్మోన్ స్రావాలు సరాసరి నాలుక మీదుగా జారి గొంతులోకి పడి సరాసరి కడుపులోకి చేరుతాయి.

ఈ క్రియ వల్ల శరీరంలో అనూహ్య మార్పులు కలుగుతాయి. అయితే ఒక విషయం . దీనివల్ల హార్మోన్ సిస్టం అతలాకుతలమై బట్ట తల వచ్చే ప్రమాదం ఉంది. ఈ క్రియ టేస్తోస్తేరాన్ అనబడే మేల్ హార్మోన్ ను విపరీతం గా పెంచుతుంది. దానివల్ల బట్ట తల వస్తుంది. యోగులకు శరీరం మీద మోజు ఉండదు కనుక వారికి బాధ లేదు. కాని ఇతరులు ప్రయత్నం చేస్తే భంగ పాటు పడక తప్పదు.

ఈ క్రియ వల్ల కలిగే పరమ ప్రయోజనం ఏమనగా భ్రూ మధ్యంలో ఉన్నఆజ్ఞా చక్రం జాగృతం అవుతుంది. ఈ చక్రం జాగృతం కావటం వల్ల క్రమేణా క్రిందవైన మిగిలిన అయిదు యోగ చక్రాలూ జాగృతం అవుతాయి. తద్వారా పంచ భూతాల మీద అధికారం ప్రాప్తిస్తుంది. అతీత యోగ సిద్దులు కలుగుతాయి. అయితే ఇదంతా రాసినత తేలిక కాదు. ఓపికగా బ్రహ్మ చర్యాన్ని పాటిస్తూ శరీరంలో నిలవ అవుతున్న శక్తిని భరిస్తూ మానసిక మార్పులకు తట్టుకుంటూ కొన్నేళ్ళు సాధన చేస్తే ఇవన్నీ సాధ్య పడుతాయి.

మన యోగంలో ఉన్న రహస్య క్రియలకు ఇదొక ఉదాహరణ మాత్రమె. ఈ క్రియ అన్ని క్రియలకు ముద్రలకు తలమానికం అని యోగ గ్రంధాలు కొనియాడాయి. లాహిరీ మహాశయులు ఈ క్రియను సాధించటం వల్లనే యోగిరాజు అన్న బిరుదును పొందగలిగాడు.

కాని ఇది ప్రమాదకరమైన క్రియ. సమర్ధుడైన గురువు లేనిదే స్వయంగా దీనికి పూనుకుంటే దుష్పరిణామాలు కలుగుతాయి. శాశ్వతంగా మాట పోయి మూగ తనం రావచ్చు. లేదా ఒకవేళ సాధించినా శరీరంలో కలిగే హార్మోన్ మార్పులకు తట్టుకోలేక పిచ్చెక్క వచ్చు. ఇది ఎకాడమిక్ ఇంటరెస్టు తో చదవండి. కాని ప్రయోగం చెయ్యకండి. ఒకవేళ చేస్తే వచ్చే ఫలితాలకు నేను బాధ్యున్ని కాను.
read more " ఖేచరీ ముద్ర "

20, సెప్టెంబర్ 2009, ఆదివారం

నవాంశ ప్రాముఖ్యత


జ్యోతిర్విజ్ఞానంలో నవాంశకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. జాతకచక్రం అంటే రాశిచక్రం పక్కనే నవాంశచక్రం కూడా ఉండటం చాలామంది చూచే ఉంటారు. నవమాంశ చక్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే, రాశిచక్రాన్ని కూడా అధిగమించి ఇది ఫలితాలను చూపగలదు.

నవాంశ అనే పేరులోనే ఉంది. ఇది ఒక్కొక్క రాశిని తొమ్మిది సూక్ష్మభాగాలు చేస్తే వచ్చే వర్గచక్రం అని తెలుస్తూంది. నవాంశలో గ్రహస్థితి బాగా లేకపొతే రాశిచక్రంలో ఎన్ని యోగాలు ఉన్నా ఫలితాన్ని ఇవ్వవు.చిరంజీవి జాతకంలోజరిగింది అదే.

జ్యోతిష్య గ్రంథాలలో ఉన్న సూచనలను బట్టి రాశిచక్రం చెట్టు అయితే, నవాంశచక్రం ఫలం. రాశిచక్రంలో ఉన్నసూచనలు నవాంశచక్రంలో ఉన్న సూచనలను అనుసరించి ఫలితాన్ని ఇస్తాయి. కాలం గడిచి మనిషి పెద్దవాడు అయ్యేకొద్దీ నవమాంశ చక్రంలో ఉన్న గ్రహస్థితులకు అనుగుణంగా మారటం మనం అనేక జాతకాలలో చూడవచ్చు.

ఉత్తారాదిన, ముఖ్యంగా కాశీలో ఒక శాఖవారు ఉత్త నవమాంశ చక్రాన్నే పరిగణనలోకి తీసుకొని ఫలితాలు చెప్తారు.వారు చెప్పే విషయాలు చాలా ఆశ్చర్యజనకములుగా ఉండి నాడీ జ్యోతిష్యఫలితాలను పోలి ఉంటాయి. ఖచ్చితంగా ఫలానా సంవత్సరంలో ఫలానా సంఘటన జరుగుతుంది అని బల్లగుద్ది మరీ వారు చెప్పగలరు.

హుబ్లీలో కూడా ఇటువంటి ఒక జ్యోతిష్యవిజ్ఞాని ఉండేవాడు.కాని ప్రస్తుతం ఆయన ఉన్నాడో లేడో పరిస్తితి తెలియదు.మామూలు జ్యోతిష్కులలో చాలా మందికి నవాంశ ఎలా విశ్లేషణ చెయ్యాలో తెలియదు.అది రహస్యవిజ్ఞానం. కొన్నికొన్ని కుటుంబాలలో మాత్రమే తరతరాలుగా వస్తూ ఉన్నది.

రాశిచక్రంలో ఫలితాలు బాగా లేకున్నా,నవాంశచక్రంలో మంచి యోగాలు ఉంటే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది.అలాగే రాశిచక్రంలో ఫలితాలు బాగుండి,నవాంశలో బాగా లేకపోతే జీవితం బాగుండదు.చాలామందికి చెప్పిన ఫలితాలు తప్పటానికి ఒక కారణం నవమాంశ చక్రాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉత్త రాశిచక్రాన్ని బట్టి ఫలితాలు చెప్పటమే.

ఒక్కొక్క రాశిలో తొమ్మిది నవమాంశలు చొప్పున మొత్తం రాశిచక్రానికి 108 నవమాంశలు వస్తాయి.ఈ సంఖ్యకు మన వైదికసాంప్రదాయంలో ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసినదే.ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున ఇరవైఏడు నక్షత్రాలకు కలిపి నూట ఎనిమిది నక్షత్ర పాదాలు వస్తాయి.అలాగే నవాంశలు కూడా నూట ఎనిమిది ఉంటాయి. మనిషి జీవితం సుమారుగా 108 ఏళ్ళని అని ఒక సాంప్రదాయం ఉంది.

"గ్రహానాం అంశకం బలం" అనే సూతాన్ని బట్టి అంశచక్రాలలో గ్రహాలున్న స్థితి అత్యంత ముఖ్యమైనది.రాశి అనగా ఒక గుట్ట.రాశిచక్రంలో అన్ని కారకత్వాలు గుట్టగా కలిసి ఉంటాయి. వర్గ చక్రాలలో చూస్తె ఒక్కొక్క చక్రం ఒక్కొక్క విషయాన్నిముఖ్యంగా చూపిస్తుంది.కనుక స్పష్టత వస్తుంది. అందుకే గ్రహముల స్థితి అంశ చక్రములోనే ముఖ్యం గా చూడాలి.

ఇటువంటి వర్గచక్రాలలో అతి ముఖ్యమైనది నవమాంశ చక్రం.ఈ చక్రం నుంచి ముఖ్యంగా వివాహజీవిత వివరాలు, సమాజంలో తనపాత్ర,మనిషి ఎంతవరకు సంఘంలో విజయాన్ని పొందగలడు అనే విషయాలను చూడ వచ్చు.రాశిచక్రాన్ని నవమాంశ చక్రంతో పోల్చి చూచుకుంటూ విశ్లేషణ సాగిస్తే అది చక్కని ఫలితాలను ఇస్తుంది.తప్పు పోవటానికి ఆస్కారం తక్కువ అవుతుంది. 

ఈ నవాంశ గణన ఎట్లనగా- మేష,సింహ, ధనుస్సులకు మేషాదిగానూ, వృష,కన్యా,మకరాలకు మకరాది గానూ, మిథున,తులా, కుంభాలకు తులాది గానూ,కటక,వృశ్చిక,మీనాలకు కటకాదిగానూ నవాంశాలను లెక్కించాలి. దానిని బట్టి నవాంశ చక్రం నిర్మాణం చెయ్యాలి.

నాడీ విధానంలో నవాంశ చక్రానికి, రాశి తుల్య నవాంశ పద్ధతికి, నవాంశల మీద గ్రహాల గోచారానికి, నవాంశ రాశ్యాధిపతికి, రాశి చక్రంలో అతని స్థితికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. నవాంశచక్రం వరకు గ్రహాల మధ్య దృష్టులు చూడవచ్చు అని కొందరంటారు.నేను కొంతవరకే నవాంశ రహస్యాలు చూచాయగా చెప్పాను. నాకూ తెలియని పద్దతులు ఇంకా చాలా ఉన్నాయి.

జ్యోతిర్విజ్ఞానంలో నవాంశచక్రం ఒక రహస్యం.అంతు బట్టని ఒక అద్భుతం. కాని దీనిని భేదించగలిగితే జీవితరహస్యాలు తేటతెల్లంగా కనిపిస్తాయి. బహుశా అందుకే ఈ చక్రానికి అత్యంత ప్రాముఖ్యత నిచ్చే నాడీవిధానంలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి.
read more " నవాంశ ప్రాముఖ్యత "

18, సెప్టెంబర్ 2009, శుక్రవారం

తిధులూ - తేదీలూ



నువ్వు రోజు పుట్టావురా అని స్నేహితున్నో ఇంకెవరినో అడిగితే ఫలానా తేదీన అని టక్కున చెప్తారు. కాని తిధిన పుట్టావు అని అడిగితే అర్థం కానట్టు చూడటమో, లేక గుర్తు లేదు అని చెప్పటమో చేస్తారు. మన సాంప్రదాయాలను మనం ఎంత గౌరవిస్తున్నామో తెలుసుకోటానికి ఇది ఒక చిన్న ఉదాహరణ.

అసలు తిథులకు, తేదీలకు(తారీఖులకు) ఏమిటి తేడా? ఇదేమన్నా అంత బుర్ర బద్దలు కొట్టుకోవలసినంత విషయమా. ఏదో ఒక రోజు పుట్టాను.అసలు పుట్టిన రోజేంటి? ఎందుకు చేసుకోవాలి? ఇదంతా నాన్సెన్స్ అనే వారికి ఒక నమస్కారం. కాని అలా విమర్శించే వారు కూడా, వారు పుట్టిన రోజున పార్టీలు ఫంక్షన్లు అంటూ తిరిగి జల్సా చేసే వారు చాలా మంది ఉన్నారు. ఇది వారి కుహనా మనస్తత్వానికి తార్కాణం. పుట్టిన రోజున ప్రత్యేకతా లేక పొతే పార్టీలు, జల్సాలు ఎందుకు? అనడిగితే దానికి సమాధానం ఉండదు.

మనం అనుసరిస్తున్న ఇంగ్లీషు తేదీలు మన సౌలభ్యం కోసం, దేశాలమధ్య వ్యాపార లావాదేవీలకు ఒక సమన్వయం కోసం మనం పరస్పర ఒప్పందాల ద్వారా కుదుర్చుకున్న ఒడంబడిక మాత్రమె. దీనికి శాస్త్రీయ ఋజువులు లేవు. ఏదో ఒక రోజునించి ఒక శకం అని అనుకోని రోజునుంచి లెక్కలు మొదలు పెట్టాము. కాని అంతకుముందే ఎన్ని యుగాలు గడిచాయో? సమయమంతా ఏమైందో? అది లెక్క లోకి రాదా? విషయాలు కూడా మనం ఆలోచించాలి.

ఒక్క భారతీయులు మాత్రమె దీనిని గురించి ఆలోచించటమే కాక మహా సంకల్పం అనే ప్రక్రియలో సృష్టి మొదలైన రోజునుంచి రోజుకు ఎన్ని రోజులు గడిచాయో స్మరించి తరువాత ఏదైనా పనిని మొదలు పెడతారు. ఎందుకంటే సృష్టి అనేది బ్రహ్మ దేవుని సంకల్పం నుంచి ఉద్భవించింది. కనుక మనం చెయ్యబోయే పని కూడా మన సంకల్ప ఫలితమే కాబట్టి ప్రక్రియను గౌరవిస్తూ సృష్టికర్తను స్మరించి సంకల్పిస్తారు. కాని నేడు పద్దతులు అన్నీ పోతున్నాయి.

భారతీయ(వైదిక) సాంప్రదాయం లో తిథులకున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. తిథులకు తేదీలకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే తేదీలు మానవ కల్పితాలు, తిథులు ప్రకృతి సిద్ధమైనవి. ప్రకృతి లో బతికే మనం ప్రకృతి ని అనుసరించటమే శ్రేయస్కరం.

మన భూమికి జీవ ప్రదాతలు సూర్య చంద్రులు. వీటి మధ్య గల దూరాన్ని బట్టి వాటి మధ్యన గల శక్తి స్థాయిలు (energy levels) మారుతాయి. శుక్ల పక్షంలోనూ, కృష్ణ పక్షంలోనూ కూడా తేడాలు ఉంటాయి. కనుకనే కొన్ని కొన్ని తిథులు మంచివి అని కొన్ని చెడ్డవి అని చెప్పబడింది.

ఇది పుష్య మాసం అని చాంద్రమానాన్ని అనుసరించే మనం అంటే, దానికి రుజువుగా మాసం లో ఒచ్చే పౌర్ణమి రోజున చంద్రుడు ఆకాశంలో పుష్యమి నక్షత్ర మండలం లో ఉండటం మనం కళ్ళారా చూడవచ్చు. ఇదే దీనికి రుజువు. పోనీ సౌరమానాన్ని అనుసరించే వారి ప్రకారం ఇది కన్యా మాసం అంటే సూర్యుడు మాసమంతా కన్యా రాసి లో సంచారం చెయ్యటం చూడవచ్చు. కాని ఇది సెప్టెంబర్ మాసం అంటే దానికి ఏవో రోమన్ గ్రీక్ వ్యక్తిగత కారణాలు తప్ప ఖగోళ కారణాలు కనిపించవు.

అలాగే శుక్ల పక్షం కృష్ణ పక్షాలు మనకు కళ్ళకు కనిపించే నిజాలు. ఇక తిథులు సూర్యునికి చంద్రునికి మధ్యన 12 డిగ్రీల తేడాతో ఏర్పడే వివిధ విభాగాలు. ఇవీ మనకు ప్రత్యక్షంగా ఆకాశంలో కనిపించే విషయాలే.కనుక తిదులే శాస్త్రీయాలు మరియు సత్యాలు. తేదీలు కల్పితాలు. మనం కల్పిత విషయాలకు ప్రాముఖ్యత నిస్తూ సత్యమైన విషయాలను చక్కగా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇది కలిప్రభావాలలో ఒకటి అని చెప్పవచ్చు.

ఒక వ్యక్తి పలానా తేదీన పుట్టి ఉండవచ్చు. కాని ఒక ఇరవై ఏళ్ల తరువాత అదే తేదీన చూస్తె, అదే తిథి ఉండదు. కారణం? సూర్య చంద్రుల గమనంలోని తేడాలవల్ల అలా జరుగుతుంది. కనుక మనం తేదీల ప్రకారం పుట్టిన రోజు జరుపుకుంటే అది సరియైన రోజున మనం జరుపుకున్నట్లు కాదు. ప్రకృతి పరంగా అదే స్పందనలు ఉన్న రోజున మనం పుట్టిన రోజును జరుపుకున్నట్లు కాదు.

ఒక మనిషి జననం జరగాలంటే గ్రహాల మధ్య, ముఖ్యంగా సూర్యుడు చంద్రుల మధ్య ఒక పరస్పర సంబంధం ఉండాలి. సంబంధాన్ని చక్కగా చూపేదే తిథి. కనుక మళ్ళీ కాల చక్రంలో తిథి వచ్చినపుడు సూర్య చంద్రుల మధ్యన అదే సంబంధం ఉంటుంది. ప్రకృతిలో అదే స్పందన ఉంటుంది. కనుక అదే తిథి వచ్చినపుడు పుట్టిన రోజును జరుపుకోవటం తార్కికం.

రోజున ఉన్న ప్రకృతి పరమైన ప్రాణిక స్పందనలను వృద్ధి చేసేవి ఆయుష్య హోమం, నక్షత్ర హోమం, నవగ్రహ హోమం మొదలైన వైదిక క్రియలు. ఇవి చేయటం ద్వారా అప్పటి ప్రకృతి స్పందనలోని అసమతుల్యత తొలగించబడి తద్వారా జాతకునికి మంచి జరుగుతుంది. ఆయుర్ వృద్ధి కలుగుతుంది. కనీసం ఆరోజు పెద్దవారు, సదాచార సంపన్నులైన వారి ఆశీర్వచనం తీసుకుంటే మంచి జరుగుతుంది. అలాగే దేవతా సందర్శనం, పూజాదికాలు చేస్తే మంచి జరుగుతుంది.

వీటికి భిన్నంగా రోజున విచ్చల విడిగా తాగటం, తినటం, సినిమాలు చూడటం, షికార్లు చేయటం, షాపుల వెంటబడి వస్తువులు కొని, హోటళ్ళలో తిని, తాగి, ఇంటికి చేరి మళ్ళీ పార్టీలు, జల్సాలలో కాలం గడిపితే ఏమి ప్రయోజనం సిద్ధిస్తుందో వాటిని చేసేవారికి, చేయించే కలి కి మాత్రమె తెలియాలి. ఎం జరుగుతుందో మనకు తెలియక పోయినా, మంచిని కోరే మన సాంప్రదాయాలు అడుగంటటం, ఇంద్రియ వ్యామోహాలు పెరగటం, ఆయుస్సు క్షీణించటం మాత్రం జరుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

యోగ ధ్యానాభ్యాస పరులకు, ఉపాసనా పరులకు పుట్టిన రోజు ఒక అద్భుతమైన మార్పుకు నాంది పలుకుతుంది. రోజున వారికి ఒక నూతన స్ఫురణ కలుగుతుంది. ఒక కొత్త భూమికకు దారి తీసే మెట్లు కనిపిస్తాయి. ఒక అతీత శక్తితో పరిచయం కలుగుతుంది. ఇంతకు ముందు తెలియని ఒక కొత్త లోకం వారి ముందు కనిపిస్తుంది. ఇదంతా రోజును సక్రమంగా ఉపయోగించుకుంటే జరుగుతుంది.

ఎందుకంటే రోజు వారికే ప్రత్యేకమైన స్పందనలు ప్రకృతిలో ఉంటాయి. ప్రకృతి రోజున మనిషిని లోకంలోకి ప్రవేశపెట్టింది. కనుక ప్రకృతి రోజున వారికి అనుకూలంగా ఉంటుంది. అది వారి ఆంతరిక అభివృద్ధికి చాలా సులువుగా సహకరిస్తుంది. ప్రకృతి పరమ ఉద్దేశ్యం మనిషి దైవం గా మారటమే కనుక, అట్టి ప్రయత్నం చేసేవారికి ఆరోజున ప్రకృతి సహాయం బాగా ఉంటుంది. కనుకనే పైన చెప్పిన వన్నీ జరుగుతాయి. కాని రోజును ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి.

>>మనలోని జీవ పరిణామాన్ని వేగవంతం చేసి కొన్ని వేల లక్షల సంవత్సరాల పరిణామ ప్రగతిని కొన్ని నెలలలో లేక సంవత్సరాలలో కలిగించే ఆంతరిక సిద్ధ యోగ, ధ్యానాది అభ్యాసాలలో రోజంతా గడపటం ఉత్తమోత్తమం.
>>అది చెయ్యలేకపోతే, ఆయుష్య హోమం, నవగ్రహ హోమం మొదలైన హోమాలు సదాచార సంపన్నులైన బ్రాహ్మణుల చేత చేయించుకోవటం, ఆరోజు పెద్దల,గురువుల ఆశీర్వచనం తీసుకోవటం ఉత్తమం.
>> అదీ చెయ్యలేకపోతే, దేవాలయ సందర్శనం, ఇష్ట దైవాన్ని ప్రార్థించటం, ఆకలితో ఉన్నవారికి దానం చెయ్యటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చెయ్యటం, కనీసం ఒక్క రోజన్నా సంకుచిత భావాలు వదిలి విశ్వ మానవునిగా ఉండటం మంచిది.
>>ఇవి గాక, పైన ముందే చెప్పినట్లు సినిమాలు షికార్లు జల్సాలు పార్టీలు చేసుకోవటం అధమాధమం.ఇటువంటి పనులు చెయ్యటం వల్ల వీడికి మానవ జన్మ ఎందుకు ఇచ్చానురా భగవంతుడా అని ప్రకృతి బాధ పడటం తప్ప వేరే ఉపయోగం లేదు.

వీటిలో రకం గా పుట్టిన రోజు జరుపుకోవాలో ఇక మన ఎంపిక మీద, విచక్షణ మీద, ఆధార పడి ఉంటుంది.
read more " తిధులూ - తేదీలూ "

14, సెప్టెంబర్ 2009, సోమవారం

ప్రశ్న శాస్త్రం


జ్యోతిర్విజ్ఞానం లో ప్రశ్నశాస్త్రం ఒక విడదీయలేని భాగం.జాతకాన్ని బట్టి జాతకుని జీవనగతి,ఒడిదుడుకులు,మంచిచెడు దశలు,తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుస్తాయి.కాని రోజువారీ సందేహాలకు,ప్రశ్నలకు ఒకవ్యక్తి జాతకం ఉపయోగపడదు.అటువంటి సమయంలో దైనందిన విషయాలలో ఉపయోగ పడేది ప్రశ్నశాస్త్రం.

మనిషి జీవితం సంక్లిష్టం.ఎన్నో సందేహాలు,అనుమానాలు మనిషికి ఎదురౌతూ ఉంటాయి.అడుగడుగునా విభిన్నదారులు ఎదురౌతాయి.ఏ దారిని ఎంచుకోవాలో తెలియదు.అటువంటి పరిస్థితిలో ప్రశ్నశాస్త్రం ఉపయోగం అమూల్యం. చేతులో ఉన్న దీపంలా ప్రశ్నశాస్త్రం మనిషికి దారి చూపగలదు.

మనిషి పుట్టినపుడు ఉన్న గ్రహస్థితిని బట్టి ఆమనిషి జీవితం ఎలా ఉంటుందో తెలుస్తూంది. అలాగే ఒక సందేహం మనసులో కలిగినపుడు ఉన్న గ్రహస్థితిని బట్టి ఆసందేహం పుట్టుపూర్వోత్తరాలు,అది జరుగుతుందా లేదా మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు.

ప్రశ్నశాస్త్రం మన గురించేకాక మన చుట్టూ జరగుతున్న అనేక విషయాల గురించి కూడా సమాధానం చెప్పగలదు.కాని దీనికి కొన్ని పరిమితులున్నాయి.సరదాకు,పరీక్షించటానికి,ఎగతాళికి అడిగే ప్రశ్నలకు జవాబులు రావు.దీనిలోఉన్న ప్రత్యేకత ఏమిటంటే అడగబడిన ప్రశ్న నిజంగా అవసరం ఉండి అడిగిందా లేక సరదాకు/ఎగతాళికి అడిగిందా వెంటనే తెలుసుకొనే సౌలభ్యంకూడా ఇందులో ఉంది.నిజానికి ప్రశ్నలో మొదట చూడవలసింది ఇదే.ఈప్రశ్న సీరియస్గా అడిగినదా లేక సరదాగా అడిగినదా అనే విషయమే ముందుగా చూడాలి.కొన్ని గ్రహస్థితులను బట్టి ఈ విషయం తేలికగా తెలుస్తూంది.

ప్రశ్నవిధానంలో అనేక పద్ధతులున్నాయి. చప్పన్న ప్రశ్నశాస్త్రం పూర్తిగా భారతీయ జ్యోతిష్యవిధానం పైన ఆధారపడినట్టిది.వరాహమిహిరుని పుత్రుడైన పృధుయశస్సు ఇది వ్రాశాడని అంటారు.'తాజికనీలకంఠీ' అనే గ్రంధం నీలకంఠదైవజ్ఞుడు వ్రాసినది.ఇది ప్రస్తుత తజికిస్తాన్లో పుట్టిన తాజిక విధానం ఆధారంగా పనిచేస్తుంది.ఇది పాశ్చాత్యవిధానానికి దగ్గరగా ఉంటుంది.ఇవికాక కేరళ జ్యోతిష్కులు ప్రశ్నశాస్త్రంలో అందేవేసిన దిట్టలు. వారు చెప్పే ఫలితాలు చాలా ఆశ్చర్యజనకములుగా ఉంటాయి.వారికి వచ్చిన సరైన ఫలితాలు మిగిలిన వారికి రాకపోవటానికి ఒక కారణం ఉంది.

కేరళలో ప్రశ్నశాస్త్రం పరిశోధనాస్థాయిని దాటి ఇంకా ముందుకు పోయింది. ప్రశ్నమార్గం అనే గ్రంధం వారికి ప్రామాణిక గ్రంధం.వేరే ఇతర విధానాలలో లేని ప్రత్యేకతలు వారి పద్దతులలో ఉన్నాయి.మాంది,గుళికలను ముఖ్యం గా చూచుట,అష్టమంగళప్రశ్న,ఇంకా అనేక విభిన్నపద్దతులు కేరళప్రశ్న శాస్త్రప్రత్యేకతలు.మనం ఏనాడో మరచి పోయిన విషయాలు,కుటుంబంలో తరతరాలుగా వస్తున్న విషయాలు వారు వివరిస్తుంటే నోరు వెళ్ళబెట్టి వినటం తప్ప మనం ఏమీ చెయ్యలేము.

కేరళప్రశ్నకు కల ఇంకొక ప్రత్యేకత- పెద్దదైన క్రియాకలాపంతో కూడిన పూజా విధానం.వారు ప్రశ్నను ఆషామాషీగాతీసుకోరు.ప్రశ్నచక్రం వేసేముందు చాలా తతంగం ఉంటుంది.విఘ్నేశ్వరపూజ,నవగ్రహపూజ,క్షేత్రపాలక  పూజఇత్యాది తతంగం చాలా వివరంగా ఉంటుంది.ప్రశ్న చెప్పే జ్యోతిష్కుడు ముందురోజు ఉపవాసం ఉండి,నియమసహితంగా ప్రశ్నతతంగాన్ని జరుపుతాడు.ఇది దాదాపు ఒకరోజు పడుతుంది.అందుకే వారివిధానంలో అద్భుతమైన ఫలితాలువస్తాయి.మనం టీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కంప్యూటర్లో వేసే ప్రశ్నచక్రానికి సరైన జవాబులు రావు. ఇదే వారికీ మనకూ తేడా.

కృష్ణమూర్తి పధ్ధతిని స్మరించకుండా ప్రశ్నశాస్త్రం పరిపూర్ణం కాదు.ప్రొఫెసర్ కృష్ణమూర్తిగారి KPSystem ఒకఅద్భుతమైన విధానం.సామాన్య విధానాలలో pinpointedness ఉండదు. దీనిని అధిగమించటానికి ఆయన సబ్ మరియు సబ్సబ్ అనే సూక్ష్మవిభాగాలను కనిపెట్టి ఫలితాలలో సూక్ష్మీకరణ విధానాన్ని స్పష్టతను తెగలిగాడు. కాని ఇందులోకూడా చెప్పేవాని స్ఫురణ శక్తి యొక్క పాత్ర చాలా ఉంటుంది.అంతేగాని ఉత్తగణితంవల్ల ఎక్కువగా ప్రయోజనం ఉండదు.

ఏ విధానాన్ని పాటించినా దానిలో పరిపూర్ణత రావాలంటే శాస్త్రాన్ని చాలా అధ్యయనం చెయ్యాలి. దానికితొడు నియమయుతమైన జీవితం గడపాలి. అప్పుడే త్రికాలజ్ఞానం,వాక్శుద్ధి కలుగుతాయి.మన మహర్షులు ఇటువంటి త్రికాలజ్ఞానం కలిగినవారే.వారు మనకు అందించిన శాస్త్రమే ప్రశ్నశాస్త్రం.రోజువారీ సందేహాలలో దీని పాత్ర అమోఘం అనిచెప్పవచ్చు.
read more " ప్రశ్న శాస్త్రం "

12, సెప్టెంబర్ 2009, శనివారం

నిశ్శబ్దం లోని మాధుర్యం

నవీన జీవితాలు మనకు నేర్పించిన జబ్బులు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి నిశ్శబ్దాన్ని భరించలేక పోవటం. నేనుచాలా మందిని గమనిస్తూ ఉంటాను. ఎక్కడికన్నా బయటకు పోయి వచ్చి ఇల్లు తాళం తీస్తూనే కాళ్ళన్నాకడుక్కోకుండా టీవీ పెట్టటం, లేదా నెట్ ఆన్ చెయ్యటం చేస్తుంటారు. వ్యాపకం లేకుండా ప్రశాంతంగా మౌనంగాఉండగలిగే స్థితి ఉన్నవారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు.

రైలు ప్రయాణాలలో కూడా ఏదో సంగీతం వినటమో, పెకాడటమో, లేక లాప్ టాప్ లో సినిమా చూడటమో లేక నెట్చూడటమో- ఇలా ఏదో ఒక వ్యాపకంలో మనిషి ఎప్పుడూ మునిగి ఉండాలి. ఏమీ తోచటం లేదు అనే మాట కూడాఎక్కువగా వినిపిస్తున్నది. నాకు తెలిసిన ఒక అమ్మాయి సెలవలలో పల్లెటూరికి పోయి అక్కడి జీవితం భరించలేక, వాళ్లబంధువులు ఎంత బతిమిలాడుతున్న వినకుండా రెండురోజుల్లో మళ్ళీ సిటీకి చేరుకుంది. ప్రశాంతతను భరించలేనిస్థితికి మనం చేరుతున్నాం అంటే వినటానికి వింతగా ఉంటుంది. కాని ఇది నిజం.

సెల్ ఫోన్ అనేది సమాచారం తెలుసుకోటానికి సాధనం. కాని దాన్ని బోరును తప్పించుకోటానికి చాలామందివాడుతున్నారు. ఏమీ తోచకపోతే సెల్ ఫోన్ తియ్యటం, ఎవరో ఒకరికి ఫోన్ చెయ్యటం " ఎంటీ సంగతులు? భోజనంచేసావా? నిద్ర లేచావా? ఇంకా నిద్ర పోతున్నావా? నేనా ప్రస్తుతం సినిమా హాలు బయట ఉన్నాను. సినిమా ఇంకామొదలు కాలేదు. కాసేపట్లో మొదలు పెడతారు. అన్నట్లు మీ ఊళ్ళో వర్షం పడిందా? ఇక్కడ ఎండలుమండిపోతున్నాయి. సరే ఉంటా. ఇలాంటి చొప్ప దంటు కబుర్లతో కాలక్షేపం చేసేవారు చాలామంది కనిపిస్తారు.

ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తున్నది. మనిషి తనలో తాను ప్రశాంతంగా ఉండటం అనే చక్కని కళనుమరచిపోతున్నాడు. ఎంత సేపూ ఏదో కావాలి. ఎవరి తోనో మాట్లాడాలి. ఏదో చెయ్యాలి. ఎం చెయ్యాలో తెలియదు. ఏదోఒకటి చెయ్యాలి. ప్రశాంతంగా పది నిమిషాలు కూచోలేడు. ఏదో తెలియని ఒక రకమైన విసుగు, అసహనం, చంచలత్వంమనుషుల్లో ఎక్కువౌతున్నాయి. దానికి తగినట్లే నవీన సాధనాలు, గాడ్జేట్లూ బాగా ఉపయోగ పడుతున్నాయి. మనిషిలోని అసహనాన్ని బాగా గమనించి విదేశీ కంపెనీలు చక్కగా దీన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. మనిషి మాత్రంరోజురోజుకీ తనకు తాను దూరం గా పోతూ ఏదో తెలియని సుడిగుండంలో చిక్కుకుంటూ ఉన్నాడు.

మనిషి నిశ్శబ్దాన్ని
భరించలేని స్థితికి చేరాడు. నిశ్శబ్దం గా ఉంటే ఏదో విసుగు. దాన్ని చెదించటానికి టీ వీనో ఇంకేదోకావాలి. ఏమీ లేకపోతె ఇంటికి తాళం వేసి బజారుకు పోయి జన సమ్మర్దం గా ఉండే సెంటర్లో నిలబడి టీ తాగి కనిపించినవారితో పనికి రాని కబుర్లు చెప్పి ఇంటికి చేరుతాడు. కాని ప్రశాంతంగా కూర్చుని తనను తాను గమనించే పరిస్తితిచాలామందిలో లేదు.

నవీన సాధనాలు అన్నీ అవసరమే. కావచ్చు. కాని అవి లేకపోతె భరించలేని స్థితికి మనిషి రాకూడదు. మానసికఅసహన రోగిగా మారకూడదు. తన చుట్టూ ఏమీ లేక పోయినా, ఎవరూ లేకపోయినా ప్రశాంతంగా చెక్కు చెదరని స్థితిలోమనిషి ఉండగలగాలి. నిర్ద్వన్ద్వో నిత్య సత్వస్థొ నిర్యోగ క్షేమ ఆత్మవాన్... అంటూ భగవత్ గీత ఇటువంటి స్థితినేవర్ణించింది.

ఇందులో చెప్పబడిన మొదటి నాలుగు స్థితులు మన ప్రస్తుత స్థితికి చాలా దూరం అనుకున్నా కనీసంతానంటే తనకు విసుగు లేని స్థితి కన్నా మనిషి చేరుకోవాలి. అటువంటి స్థితికి రావాలంటే నేటి నవీన జీవిత వేగాన్నికొంచం తగ్గించుకొని ధ్యానాన్ని మనిషి అభ్యాసం చెయ్యాలి. అప్పుడే పిచ్చి పరుగులు కొంత వరకన్నా తగ్గుతాయి. అప్పుడే మనిషికి ఆంతరిక శాంతి అనుభవం లోకి వస్తుంది. తద్వారా బాహ్య వస్తువుల మీద విషయాల మీదఆధారపడటం తగ్గుతుంది.

ఎప్పుడన్నా కనీసం ఒకరోజన్నా జన సముద్రానికి దూరంగా పోయి టీవీలు, సెల్ ఫోన్లు, నెట్ లు లేకుండా ఇతర ఆలోచనలు లేకుండా ఒక్కడే ప్రశాంత ప్రకృతిలో ఉండి చూడండి. నిశ్శబ్దం ఎంత మధురమో తెలుస్తుంది.
read more " నిశ్శబ్దం లోని మాధుర్యం "

9, సెప్టెంబర్ 2009, బుధవారం

నేటి రాజకీయాలు-సమాజం-వేమన పద్యం

మధ్యలో జరుగుతున్నరాజకీయ పరిస్థితిని చూస్తుంటే నాకు వేమన పద్యం ఒకటి గుర్తుకొచ్చింది.

అంతరంగమందు అపరాధములు చేసి
మంచివాని వలెనె మనుజుడుండ
ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడా
విశ్వదాభిరామ వినుర వెమ.

నేటి సమాజంలో విచిత్ర పోకడలు ఎక్కువ అవుతున్నాయి. భక్తులమని చెప్పుకునేవారు, మతాలు మార్చేవారుఘోరమైన పాపాలు చేస్తున్నారు. ప్రజలందరూ ఏదో ఒక దేవుణ్ణి నమ్మేవారే. కాని తప్పులు పాపాలు కూడా విచ్చలవిడిగా చేస్తున్నారు. వారానికొకసారి చర్చికో, గుడికో, మసీదుకో ఇవి కాకపోతే ఇంకెక్కడికో పోయి నమస్కారం పడేసివస్తే అన్నీ ప్రక్షాళన అయిపోయి మళ్ళీ clean slate మిగులుతుంది. అనుకోడం పెద్ద భ్రమ. ఇలా జరుగుతుంది అనిచెప్పే మత గ్రంథాలు కూడా తప్పుల తడికలే. వాటిని నమ్మటమే ప్రజలు చేస్తున్న పెద్ద తప్పు.

మనం చేసిన పాపాలు ఎక్కడికీ పోవు. దేవుడూ వాటిని క్షమించడు. అలా క్షమిస్తూ పొతే ఇక సృష్టికే అర్థం లేదు. ఒకరాజ్యంలో రాజుగారు- మీరేం తప్పులు చేసినా నేను క్షమిస్తూ ఉంటాను. ఏమీ పరవాలేదు అని చెబితే రాజ్యంలోఎంతమంది పాపాలు చెయ్యకుండా ఉంటారో మనం తేలికగా ఊహించవచ్చు. మనం ఒక దేవుణ్ణి నమ్మినంత మాత్రానమనం చేసిన పాపాలు పోతాయనుకోవటం పెద్ద భ్రమ. మళ్ళీ అవే పాపాలు చేస్తూ పోవటం ఇంకో ఘోరమైన తప్పిదం.

నీ దేవుడు వేరు నా దేవుడు వేరు అనేది కూడా ఒక పెద్ద భ్రమ, దీర్ఘ రోగం. దీనివల్ల మనుషుల్లో తగాదాలు గొడవలు, ప్రేమ తత్త్వం లేకపోవటం, ఒకరిని చూస్తె ఒకరికి పడక పోవటం జరుగుతున్నాయి. దీన్నలా ఉంచితే, తాను చేస్తున్నదితప్పు అని తెలిసినా ఏదో కారణం చూపి సమర్థించుకునే పోకడలు, ఏదో ఒక దేవుని నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని తనపాపాలు క్షమించబడతాయని గుడ్డిగా నమ్మటం ఒక పెద్ద బలహీనత. అలా ఎన్నటికీ జరుగదు. జరిగినట్లు దాఖలాలులేవు. అమాయకులైన వారినే ఇలాంటి పిచ్చి నమ్మకాలతో వంచించి మతాలు మార్చగలరు. మాత్రం తెలివి ఉన్నామనిషి ఇలాంటి ఎత్తులకు లొంగ కూడదు.

మనుషులలో reason అనేది ఉంది. దానిని ఎందుకు ఉపయోగించరో అర్థం కాదు. లౌకిక జీవితంలో ఎంతో తర్కాన్ని, తెలివిని ఉపయోగించే మనుషులు, మతం దగ్గరికి వచ్చేసరికి దాన్ని పెట్టెలో పెట్టి తాళం వేస్తారు. ఏదో ఒక చెదలు పట్టినమత గ్రంధం చెబుతున్నది కనుక మనం నమ్మాలి. నమ్మకాన్ని ప్రశ్నిస్తే blasphemy దైవద్రోహం చేసినట్టుఅవుతుంది అన్న కాకమ్మ కబుర్లు చెప్పి ఇతర మతాలలో జనానికి నరక భయం బూచిలా చూపి అణగదొక్కి ఉంచారు. ఒక్క సనాతన ధర్మం అనబడే హిందూ మతం మాత్రమె ఎల్లలు లేకుండా ప్రశ్నించటాన్ని ఆమోదించింది. ఇది నమ్మకంమీద ఆధారపడినట్టి మతం కాదు. తన సిద్ధాంతాలను కూడా ప్రశ్నించిన తదుపరి మాత్రమె ఆచరించు అనిఘంటాపధంగా చెప్పిన మతం ఇదొక్కటే. వేదాలలోంచి ప్రమాణం చూపటం ఎందుకు? భగవద గీత లోనుంచి ఇదుగోప్రమాణం--త్రైగుణ్యా విషయా వేదా నిస్త్రై గుణ్యో భవార్జున--

ఏదో ఒక మతం ప్రచారం చేస్తున్న దేవుణ్ణి నమ్మనంత మాత్రాన నరకం వస్తుంది అని హిందూ మతం ఎక్కడా చెప్పలేదు. సనాతన ధర్మం వంటి ఉదాత్త మతానికి, అసలు అటువంటి ఆలోచనే హాస్యాస్పదం గా కనిపిస్తుంది. నువ్వు పాపాలుచేస్తే దానికి శిక్ష అనుభవించాలి కనుక మంచిగా పవిత్రంగా జీవించు అని మాత్రమె మహోన్నతమైన మతంచెప్పింది. idea అమలులో ఉంది గనుకనే ప్రాచీన భారతీయులలో అబద్దాలు చెప్పటం,దొంగతనం, వ్యభిచారంమొదలైన పాపాలు లేవు. విషయాన్ని మధ్య యుగాలలో మన దేశాన్ని దర్శించిన విదేశీ యాత్రికులు ఎందఱోవ్రాసారు. అదే మధ్య యుగాలలో- నేడు ప్రపంచ మతాలుగా ప్రచారం చేసుకుంటూ జనాన్ని మోసం చేస్తున్న మతాలుపుట్టిన దేశాలు- దారి దోపిడీలు, దురాక్రమణలు, హత్యలు, సమస్త పాపాల పుట్టలుగా ఉన్నాయి. దురదృష్ట వశాత్తూకలి ప్రభావం ఎక్కువై కుక్క మూతి పిందేల్లాంటి ఇతర దేశాల మతాలు మన దేశంలోకి చోచుకు వచ్చి "ఎన్ని తప్పులుపాపాలు చేసినా పరవాలేదు, క్షమించబడతాయి. మా దేవుణ్ణి నమ్మండి చాలు" అనే అసంబద్ద అహేతుక వాదనలతోపాపాలు చెయ్యటానికి లైసెన్సు ఇచ్చాయి. ఇటువంటి మతాలవల్లనే నేడు సమాజంలో పాపాలు మోసాలు ఎక్కువఅయ్యాయి. శిక్షలు కూడా వాటికి తగినట్టే పడుతున్నాయి. కళ్లు తెరిచి చూస్తె అన్నీ కనిపిస్తాయి. నమ్మకం విశ్వాసంచాటున దాక్కుంటే ఏవీ కనిపించవు.

బెర్ట్రాండ్ రస్సెల్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు.
I would never die for my beliefs because I might be wrong.
నమ్మకం కోసం నా ప్రాణాలు ఎన్నటికీ అర్పించను. ఎందుకంటే నా నమ్మకం తప్పు కావచ్చు. అంటాడు. నమ్మకం వల్లనేమనిషి తప్పులు చేస్తున్నాడు. దాని బదులు reason ఉపయోగిస్తే మనిషి తప్పులు పాపాలు చెయ్యడు. తిరిగి తిరిగి అవేపాపాలు చేస్తూ దేవుని మీద నమ్మకం అనే ముసుగు చాటున దాక్కునే పనీ చెయ్యడు. రీజన్ అన్న దాన్ని ఒక్కహిందూ మతమే గొప్పగా పెంచి పోషించింది. ఇతర మతాలలో రీజన్ అణగదొక్కబడి దాని స్థానంలో గుడ్డి నమ్మకంవేళ్ళూనుకుంది. పెంచి పోషించబడింది. అందుకే హిందువుగా పుట్టిన వానికి పరమత సహనం ప్రత్యేకంగానేర్పనక్కరలేదు. అలాగే ఇతర మతాల వారికి హింస, ద్వేషం ప్రత్యేకంగా నేర్పనక్కరలేదు.

కాని ప్రక్రుతి కళ్లు మూసుకొని ఊరుకోదు. ప్రకృతికి మన మత గ్రంధాలు, పిచ్చి నమ్మకాలతో పని లేదు. ప్రక్రుతి లోనేభగవంతుడు నిండి ఉన్నాడు అని భారతీయ సనాతన ధర్మం చెబుతుంది. ఆరు రోజులు సృష్టి చేసి తరువాత రెస్టుతీసుకుంటున్నాడు. అని ఎక్కడా చెప్పలేదు. ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యా జగత్... అంటూ విశ్వమంతానిండి నిబిడీకృతమై భగవంతుడు ఉన్నాడు అని చెప్పింది.

భగవంతుడు మనం చేస్తున్న తప్పులు, ఆడుతున్న నాటకాలు చూస్తూ, మన దొంగ ప్రార్ధనలకు కరిగిపోతూ మనపాపాలను క్షమిస్తూ ఊరుకొడు. ఎక్కడికక్కడ ఎవరికీ తగిన శిక్షలు వారికి పడుతూనే ఉంటాయి. స్వర్గం నరకం ఎక్కడోలేవు. చూడగలిగితే ఇక్కడే ఉన్నాయి.ఇతరులెరుగకున్న ఈశ్వరుండు ఎరుగడా అని వేమన ప్రశ్నించింది ఇటువంటిడంబాచార పరాయణులనే.

read more " నేటి రాజకీయాలు-సమాజం-వేమన పద్యం "

7, సెప్టెంబర్ 2009, సోమవారం

YSR జాతకం-ఒక పరిశీలన


YSR జాతకం చూద్దామని వెతుకుతుంటే జననసమయం ఎక్కడా దొరకటంలేదు. 

చాలాప్రయత్నం మీద రాత్రి 8.01 అని ఒకచోట దొరికింది. సమయానికి వేసిన జాతకంతో జరిగిన సంఘటనలు పోల్చి చూచాను. మొదటగా జనన సమయాన్ని కుందస్ఫుట విధానంతో సరిచేయగా అది రాత్రి 8.00 అని తేలింది. సమయానికి వేశిన జాతకం ప్రక్కన ఇస్తున్నాను.

మనిషి ఆకారం, మనస్తత్వం పోల్చి చూడగా:
>>ఈ సమయానికి లగ్నం నాలుగో నవాంశలో పడుతుంది.అనగా మకరలగ్నం-మేష నవాంశ అవుతుంది. ఈ యోగానికి కళ్యాణవర్మ తన "సారావళి" లో ఇచ్చిన ఫలితం ఏమనగా-ఈ వ్యక్తి ఎరుపుజీరలు కలిగిన పెద్ద కళ్లు, పెద్దనుదురు,కృశించిన శరీరం, చేతులు,మధ్యలో ఖాళీలు ఉన్న పండ్లు,అస్తవ్యస్తమైన జుట్టు,ఆగిఆగి మాట్లాడే వాక్కు కలిగి ఉండును.వీటిలో మొదటి లక్షణం కోపానికి సూచనగా తీసుకోవాలేమో.ఏదేమైనా ఇందులో కొన్నికొన్ని లక్షణాలు - ముఖ్యంగా-పెద్ద నుదురు(బట్టతలవల్ల అలా కనిపించవచ్చు),ఆగిఆగి మాట్లాడే మాటలు బాగానే కలిశాయి.
>>తరువాత- ఈ జాతకానికి కుజుడు ఆత్మ కారకుడయ్యాడు. కనుక కుజుని లక్షణాలైన మొండిపట్టు, తాననుకున్న పని సాధించే పట్టుదల,ఘర్షణకు భయపడని మనస్తత్వం,ఫేక్షనిజం వగైరాలు బాగానే సరిపోయాయి.

ఇదే సమయం సరియైనది అనుకోని-మిగిలిన జాతకాన్ని కూడా పరిశీలించగా:

>>గురువు వక్రస్థితి వల్ల ఈయనకు గురువులు, మహనీయులకు సంబంధించిన దోషం లేదా శాపం ఉంది అని చెప్పవచ్చు.సామాన్యంగా గురువు వక్రించిన జాతకాలలో ప్రతి 12 సంవత్సరాలకు పూర్తయ్యే ఒక ఆవ్రుత్తితో ఏదో ఒక చెడుసంఘటన జరగటం చూడవచ్చు. 60 ఏళ్ళకు గురువు 5 ఆవృత్తులు పూర్తీ చేసి మళ్ళీ జనన సమయానికి ఉన్న స్థితికి వస్తాడు. ప్రస్తుతం దుర్మరణం జరిగినపుడు కూడా గురువు మళ్ళీ వక్రస్థితిలో ఉన్న విషయం గమనించవచ్చు. ఇటువంటి జాతకాలలో ఉన్న రహస్యం ఏమనగా- ఈ గురుదోషాన్ని క్రమేణా పరిహారం చేసుకుంటూ గురువులకు,దైవానికి,ధర్మానికి వినమ్ర భావంతో ఉంటూ, అధర్మ ఆర్జనకు పోకుండా, పవిత్ర జీవితం గడుపుతూ,జాగ్రత్తగా ఉంటే,గురువు సంతుష్టుడై ఆ దోషాన్ని తొలగిస్తాడు. కాని తెలిసో తెలియకో దాన్ని ఎక్కువ చేసుకుంటే, జన్మతా ఉన్న దోషం క్రమేణా ఎక్కువై, గోచార రీత్యా గురువు వక్రించినస్థితికి వచ్చినపుడు గురువు ఆగ్రహం వల్ల తీవ్రపరిణామాలు కలుగుతాయి. ప్రస్తుతం జరిగింది అదే అని అనిపిస్తున్నది. కర్నూలులో కంచి శంకరాచార్యస్వామిని అరెస్టు చెయ్యటం(మరణం కూడా కర్నూలు దగ్గరలోనే జరగటం దీని ఫలితమేనా?), తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్వహణలో ఎక్కువగా జోక్యం చేసుకోవటం మొదలైన పనుల వల్ల జన్మతా వచ్చిన గురుదోషం అనేక రెట్లు ఎక్కువ అయ్యింది. గురు గ్రహం పంచతత్వాలలో ఆకాశతత్వానికి అధిపతి. మరణానికి కారణం కూడా ఆకాశ ప్రయాణం అయింది చూచారా?
>>పంచమంలో కుజస్థితి, శనిదృష్టి తో ఒక కొడుకు ఒక కూతురు కలిగారు. కనుక ఇది కూడా సరిపోయింది.
>>లగ్నం మకరం కావటంతో, కష్టపడి పని చేసే తత్త్వం, పట్టుదల కలుగుతాయి. ఇవి కూడా సరిపోయాయి.
>>జైమినివిధానంలో-ఆత్మకారక నవామ్శకు దశమంలో శనిస్థితితో ప్రజాదరణ, సామాన్య జనంలో అభిమానం కలుగుతాయి. ఇది కూడా సరిపోయింది.

ఇప్పుడు జాతకంలో కొన్ని ముఖ్యసంఘటనలు- దశలతో సరిపోతాయో లేదో చూద్దాం.
>>వివాహం 1971 లో జరిగింది. అప్పుడు శుక్ర/శని దశ జరుగుతున్నది. శని లగ్నాధిపతి గా తనను, శుక్రుడు సప్తమంలో ఉండి వివాహాన్ని సూచిస్తున్నారు. సరిపోయింది.
>>1973 లో పులివెందులలో ఆస్పత్రి నిర్మాణం చేసి వైద్య సేవలు అందించటం జరిగింది. అప్పుడు జాతకంలో శుక్ర/బుధ దశ జరుగుతున్నది. శుక్రుడు దశమాదిపతిగా సప్తమంలో ఉంటూ పబ్లిక్ రిలేషన్ను+బుధుడు ఆస్పత్రులను సూచించే షష్టమాధిపతిగా వైద్యగ్రహమైన రవితో కూడి ఉండటం చూడవచ్చు.
>>1978 లో MLA అయినపుడు రవి/గురు దశ జరిగింది. రవి నవాంశలో ఉచ్ఛ స్థితి. కనుక పదవీ యోగం పట్ట్టింది.
>>1980,1983 లలో మంత్రిగా చేసినపుడు రవి దశ చివర, చంద్రదశ మొదలు జరిగాయి. నవాంశలో చంద్రుడు రవితో కలిసి ఉండటంవల్ల అదే ఫలితాలు కొనసాగాయి.
>>2003 వేసవిలో పాదయాత్ర చేసినపుడు రాహు/గురుదశ జరుగుతున్నది.రాహువు సహజ కారకత్వమైన తిప్పటతో దేశమంతా తిప్పటం జరిగింది. కాని ఇది గురుచండాల యోగదశ కావటంతో ఉద్దేశాలు అనుమానాస్పదాలు కావచ్చు.మరియు అంతిమంగా చెడుకు దారి తియ్యవచ్చు.
>>చివరిగా దుర్మరణం రాహు/ కేతు/ కుజ/ శని/ రాహుదశలలో జరిగింది. మరణసమయంలో గురు హోర జరుగుతున్నది గమనించండి. రాహుకేతువులు మంచి స్థానాలలో ఉన్నారు గనుక ప్రమాదం జరుగలేదు అని కొందరు జ్యోతిష్కులు పత్రికలలో వ్రాశారట. నేను చూడలేదు.

పైపైన చూస్తె అలా అనిపించటం సబబే. కాని వీరు ఒక్క విషయం గమనించాలి. రాహువు,గుళికతో కూడి మీన రాశిలో 28 డిగ్రీలలో ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్లో ఉన్నాడు. రాహువు గురువు గారి రాశిలో ఉండి పరోక్షంగా గురువును సూచిస్తున్నాడు.గురువు మకర లగ్నానికి మంచివాడు కాదు. ప్రస్తుతం గురువు గోచారంలో మళ్ళీ నీచలో ఉన్నాడు. ప్రత్యన్తర్దశా,సూక్ష్మదశా,ప్రాణదశా నాథులైన కుజ/శని/రాహువుల కలయిక భయంకర అగ్ని ప్రమాదంకు (explosive blast) సూచన అని జ్యోతిశ్శాస్త్రం తెలిసిన వారు చెప్పగలరు. ఈ కోణంలో నుంచి చూచి ఉంటే జరుగబోయే సంఘటన బాగా అర్థమై ఉండేదేమో.కాని దృఢ కర్మను, అదీకాక గురుగ్రహ ఆగ్రహానికి గురైన ఫలితాన్ని ఎవరు ఆపగలరు?

జనన సమయం ఖచ్చితమైనది లేకపోవటంతో కొందరు ఔత్సాహిక జ్యోతిష్కులు ప్రశ్న విధానంలో జాతకం చూచి తిరిగి రావటం అనుమానమే,దుర్ఘటన జరిగింది అని చెప్పారు.ఈలింకుచూడండి.

http://www.astrocamp.com/vedicastrology/2009/09/ysr-reddy-missing-dead-or-alive.html
read more " YSR జాతకం-ఒక పరిశీలన "

6, సెప్టెంబర్ 2009, ఆదివారం

కడప ప్రజల స్పందన

నిన్న, మొన్న ఉద్యోగ రీత్యా ప్రత్యెక బాధ్యతలతో కడపలో ఉన్నాను. కడపలో అధికారులు, అనధికారులు, మిత్రులు, అభిమానులతో సంభాషణలలో నివ్వేరపరిచే అనేక విషయాలు తెలిసాయి.

సంభాషణ కడప జిల్లా ప్రాచీన చరిత్ర, దానికి కలెక్టర్లుగా పని చేసిన ఇంగ్లీషు దొరలు,YSR కుటుంబం, వారి తాతముత్తాతల వద్దనుంచి నేటి వరకు విషయాలు, సమకాలీన రాజకీయాలు,YSR దుర్మరణం ఇత్యాది అనేక విషయాలమీద సాగింది.

వీటిలో అనేకం నేను బయటకు చెప్పలేని,
బ్లాగులో వ్రాయటానికి అసలు వీలుకాని విషయాలున్నాయి. నాకున్నపరిమితుల దృష్ట్యా వీటిని పక్కన పెడితే కడప జిల్లా ప్రజల నోటివెంట నేను విన్న కొన్ని మాటలు ఇవి :-

>>కడప జిల్లాలో చరిత్రను చూస్తె, అకస్మాత్తుగా లేచి ఎదిగిన అనేకులు నాయకులు హటాతు గానే కనుమరుగుఅయ్యారు. లేచిన కెరటం పడక తప్పదు.
>> CM తదితరులు తమ fuel తామే మోసుకొని పోయి(Aviation fuel రూపంలో ) ఎక్కడో కొండల్లో చెట్ల మధ్యనతమ అంత్య క్రియలు తామే జరుపుకున్నారు. ఇప్పుడు జరుగుతున్నవి బంధువుల తృప్తి కోసం వీరు చేస్తున్నఅంత్యక్రియలు మాత్రమె.
>>కులం మతం దేవుడు అనేవి అంత ముఖ్యమైన విషయాలు కావు. ఉన్నదల్లా డబ్బు ఒక్కటే. డబ్బే కులం, డబ్బేమతం, డబ్బే దేవుడు.
>>అవసరం ఒక్కటే ముఖ్యమైనది. మన పని కావటం ఒక్కటే ప్రధానం. దానికి అవసరమైతే అన్నీ మార్చుకోవచ్చు. కులం, మతం, ఏదీ అడ్డు కాదు. అవసరం వస్తే ఎందరినైనా అంతం చెయ్యొచ్చు.
>>హెలికాప్టర్ ఎక్కిన సూరీడు దిగి చావు తప్పించుకున్నాడు. కింద ఉన్న వెస్లీ ఎక్కి ప్రమాదం లో చిక్కుకున్నాడు.
>>CM కనిపించక పొతే 24 గంటలు కనుక్కోలేక పోవటం అధికార యంత్రాంగం ఎంతగా దారి తప్పిందో తెలుస్తున్నది. నాయకుల ఆజ్ఞలు పాలించటం, protocol డ్యూటీలు చెయ్యటం తప్ప అసలు Administration అనేది లేదు. ప్రజలసొమ్ము తినటానికే అధికారులున్నారు గాని పని చేయటానికి కాదు.
>> లక్షలాది పిచ్చి జనం ఎవరి మత ప్రార్థనలు వారు చేసారు. దేవుడు వీళ్ళ ప్రార్తనలు వినే పనైతే ప్రమాదం ఎందుకునివారించలేదు? ఇన్ని మహిమలు చేస్తున్న దేవుడు, కనీసం ప్రమాద స్థలాన్ని మహా భక్తుడికో ఎందుకుచూపలేదు? ఇరవై నాలుగ్గంటలు కాలుతూ, వానలో తడుస్తూ అడివిలో చెట్ల మధ్య ఎందుకు అవస్థ పట్టింది? కాబట్టి, ఎవడి కర్మ వాడనుభవించక తప్పదు. కాలం మూడినపుడు దేవుడూ అడ్డు రాడు. అసలు దేవుడనేది ఒక భ్రమ.
>> మానవ మాత్రుడు ఏమీ చెయ్యలేని స్థాయికి ఎదిగిన వాణ్ని, ప్రకృతే ఏదో ఒకటి చేస్తుంది.
>> రెండురోజుల్లో ఎవరు కారణంతో పోయినా, దుఖం భరించలేక పోయారు అని మీడియా ప్రచారం చెయ్యటం, ప్రజలను గొర్రెల్ని చెయ్యటమే.
>>రాష్ట్ర రాజకీయాలు భయంకర స్థితికి చేరుకున్నాయి. ఒక ప్లాన్ అనేది లేకుండా రాష్ట్రాన్ని ఏదో కొండ కొమ్ముకుతీసుకుపోతున్నారు. Welfare measures పూర్తిగా పక్కన బెట్టి శాస్త్రీయంగా ప్లాన్ ప్రకారం నడపకపోతే ముందుముందు రాష్ట్రం ఘోర విపత్తులో పడబోతున్నది. ఇప్పటికే సామాన్యుడు బ్రతకలేని పరిస్తితి ఉంది. ముందు ముందుఇంకేం జరుగుతుందో.

ఇవీ నేను కడప జిల్లాలో కొందరు ప్రజల నోటి వెంట విన్న- బ్లాగులో వ్రాయదగ్గ- కొన్ని విషయాలు.
read more " కడప ప్రజల స్పందన "