“The gates of the winehouse are wide open. Come ye all who want to enjoy a good drink”

10, సెప్టెంబర్ 2014, బుధవారం

కాశ్మీర్ వరదలు-రాబోతున్న దుర్ఘటనలకు చిన్న సూచిక మాత్రమే








































ఒక వారం క్రితమే,త్వరలో జరుగబోతున్న శనీశ్వరుని వృశ్చికరాశి ప్రవేశం గురించీ తద్వారా మానవులకు రాబోతున్న ఘోర విపత్తుల గురించీ వ్రాశాను.

రెండురోజులు కూడా గడవకముందే కాశ్మీర్లో గత ఏభై ఏళ్ళలో కనీవినీ ఎరుగనంత తీవ్రస్థాయిలో వరదలు మొదలయ్యాయి.జనజీవనం అత్యంత ఘోరంగా దెబ్బ తిన్నది.

ఇప్పటికే దాదాపు 200 పైబడి జనం చచ్చారని అంటున్నారు.ఇది ప్రభుత్వ అంచనా మాత్రమే.వాస్తవం దీనికి ఇంకా కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది.

ఇప్పటికే మన ప్రభుత్వం వెయ్యి కోట్ల సహాయాన్ని ప్రకటించింది.ఇంకొక వెయ్యి కోట్లు ఇస్తామని అంటున్నది.

అమాయకులైన కాశ్మీరీ పండిట్లను అనేక వేలమందిని నిర్దాక్షిణ్యంగా దారుణంగా చంపి,వారి రక్తాన్ని నేలపైన చిందించి,లక్షలాది కుటుంబాలను దిక్కులేనివారుగా డిల్లీ పేవ్ మెంట్ల మీద బ్రతకమని కాశ్మీరు నుంచి పారద్రోలినందుకూ,అయిదు దశాబ్దాలుగా కాశ్మీర్లో మారణ హోమాన్ని సృష్టిస్తున్నందుకూ ప్రకృతి ఈరకంగా కాశ్మీరీలకు శిక్ష విధిస్తున్నదా?

నిజమే కావచ్చు.

ప్రకృతి విధించే శిక్షలు చాలా విచిత్రంగా దారుణంగా కనిపించినా,అవి చాలా కరెక్ట్ గా పొల్లుపోకుండా ఉంటాయి.ప్రకృతి న్యాయస్థానంలో జాలి అన్నపదానికి తావు లేదు.కత్తితో ఎదుటి మనిషిని చంపినవాడు అదే కత్తితో ఒకనాటికి చావక తప్పదు.ఇది తిరుగులేని దైవన్యాయం.

ఇతరుల పట్ల జాలి లేనివారికి,తమకు ఆపద వచ్చిన సమయంలో 'భగవంతుడా జాలి చూపించు' అని అడిగే హక్కు లేదు.అప్పుడు అరిచి 'గీ' పెట్టినా భగవంతుడు పట్టించుకోడు.దారుణం అని మనకు అనిపించినా, దైవన్యాయం ఇలాగే ఉంటుంది.

అదలా ఉంచితే ఇంకొక్క నెలలో శనీశ్వరుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించ బోతున్నాడు.ముందు ముందు ప్రపంచవ్యాప్తంగా జరుగనున్న ఘోరాలకు ఈ వరదలు మచ్చుకు సూచనలా?

ఆలోచిస్తే ఇది కూడా నిజమే అని అనిపించక మానదు.

మానవులారా!! మీమీ అహంకారపూరిత ప్రవర్తనలకు తగిన శిక్షలు త్వరలో అనుభవించడానికి సిద్ధపడండి.