20, మే 2009, బుధవారం

టైగర్ స్టైల్ కుంగ్ ఫూ

టైగర్ స్టైల్ చైనీస్ కుంగ్ ఫూ లో ఒక సామెత ఉంది. రెండు పులులు యుద్ధం చేస్తే ఒకటి చనిపోతుంది. రెండవది కుంటిదౌతుంది. ఇది టైగర్ స్టైల్ కుంగ్ ఫూ లోని భయంకరమైన టెక్నిక్స్ కు చక్కని ఉదాహరణ. దక్షిణ చైనాలో పుట్టిన కుంగ్ ఫూ శాఖలలో టైగర్ స్టైల్ ఒకటి. దీనినే టైగర్ క్రేన్ స్టైల్ అని కూడా అంటారు. ప్రస్తుతానికి క్రేన్ స్టైల్ ను ప్రక్కన ఉంచి టైగర్ స్టైల్ ఏమిటో చూద్దాము.

దీని మూలాలు చరిత్రకు అందని చీకటిలో ఒదిగి ఉన్నాయి. కాని షావోలిన్ జెన్ మాస్టర్ అయిన గీ-సిం-సిం-సి దీనిని తన నలుగురు శిష్యులకు నేర్పినట్లు ఆధారాలు దొరుకుతున్నాయి. షావోలిన్ ఆలయం ప్రసిద్ధి చెందిన ఫైవ్ ఏనిమల్ స్టైల్స్ కు మూల మైన ప్రధాన గురుకులం.

టైగర్ స్టైల్ లో ప్రధాన అంశం బలం మరియు శక్తి. దీని కదలికలు చాలా బలంగా, శక్తి వంతం గా ఉంటాయి. భంగిమలు స్థిరంగా, దృడం గా ఉంటాయి. లో హార్స్ భంగిమ ఎక్కువగా వాడబడుతుంది. భయం అనేది పులికి తెలియదు. అలాగే టైగర్ స్టైల్ సాధకుడికి భయం అనే మాట ఆమడ దూరం లో ఉంటుంది. మంచి ఆరోగ్య వంతుడై, ఏళ్ల తరబడి సాధన చేసిన టైగర్ స్టైల్ వీరుడు ఒక గుంపును ఉత్త చేతులతో తేలికగా ఎదిరించి చెల్లా చెదురు చేసి ఓడించగలడు. విజయమో వీర స్వర్గమో అనేది ఇతని విధానం గా ఉంటుంది.

టైగర్ స్టైల్ దెబ్బలు బలంగా దారుణంగా ఉంటాయి. వీటిని కాచుకోవటం ఎదురు నిలవటం కష్టం. దెబ్బ తగిలిన చోట ముక్కలుగా పగిలి పోతుంది. స్టైల్ లో కాళ్ళు చేతుల జాయింట్లు విరిచి పారేయటం ఉంటుంది. కుంగ్ ఫూ సామెత ప్రకారం వీరుడు నిలబడితే ఒక పర్వతంలా ఉంటాడు, ఎటాక్ చేస్తే ఒక మంచు తుఫాను లా ఉంటాడు. తన దారిలో ఎదురైన వారిని తునా తునకలు చేస్తూ విజ్రుంభిం గలడు. దెబ్బలు తగిలితే తక్షణ మరణం (death on the spot) కలుగుతుంది. లేదా నెలల తరబడి మంచం పట్టక తప్పదు.

స్టైల్ లో కనీస స్థాయి పొందటానికి ఐదేళ్ళ కఠిన సాధన అవసరం. కఠిన బ్రహ్మ చర్యాన్ని పాలిస్తూ శరీరాన్ని, మనసును రాటు దేలుస్తూ వ్యాయామ సాధన, ధ్యాన సాధన కోనసాగించాలి. అప్పుడే దీనిలో ఉన్నత స్థాయిలు అందుకొనగలరు. దీనిలో గొప్ప పేరు గాంచిన వాడు మాస్టర్ వోంగ్ ఫే హంగ్. ఈయన ప్రఖ్యాతి గాంచిన "షాడో లెస్ కిక్" ను కనిపెట్టాడు. ఈయన జీవితం మీద "Once upon a time in China" అనే పేరుతో మూడు నాలుగు సినిమాలు వచ్చాయి. వాటిలో జెట్ లీ హీరో గా నటించాడు. కాని అందులో చూపినది టైగర్ స్టైల్ కుంగ్ ఫూ కాదు. పనికి మాలిన వూ-షూ ను కుంగ్ ఫూ గా భ్రమింప చేసి తాళ్ళ ఫైటింగులు కలిపి చూపించారు. కుంగ్ ఫూ శాఖలలో ఏదేదో తేడాలు తెలియని జనం నమ్మారు. టైగర్ స్టైల్ ను మధ్య కాలంలో బాగా చూపినది జాకీ చాన్ మరియు జెట్ లీ కలిసి నటించిన "The forbidden kingdom" సినిమా. అందులో జాకీ చాన్ డ్రంకెన్ మాస్టర్ గా చక్కని టైగర్ స్టైల్ కుంగ్ ఫూ ను చేసి చూపించాడు.

స్టైల్ ను వంశ పారంపర్యంగా సాధన చేస్తూ వస్తున్నది లియు కుటుంబం. గార్డన్ లియు ఇదే కుటుంబం లోని వాడు. ఇతడు ప్రఖ్యాతి గాంచిన "36 th chamber of shaolin" సినిమా లో హీరో గా నటించాడు. మధ్య మధ్యలో అక్కడక్కడా కనిపిస్తూ, మధ్యనే ఘోరంగా ప్లాపు అయిన "చాందిని చౌక్ టు చైనా "లో గుండు విలన్ గా నటించాడు. నిజానికి ఇతని ముందు సినిమా హీరోలు నిలబడలేరు. ఒక్కడే పది మంది అక్షయ కుమార్ లను ఎదుర్కొగలడు. కానీ సినిమా కదా. అలా నటించక తప్పదు మరి.

స్టైల్ లో ముఖ్యమైన ఫాం లు టేమింగ్ టైగర్ ఫాం, బ్లాక్ టైగర్ ఫిస్ట్, యాంగ్రీ టైగర్ ఫిస్ట్, టైగర్ క్రేన్ సెట్, ఐరన్ వైర్ సెట్ మొదలైనవి. వీటిని సాధన చెయ్యటం వలన శారీరక ద్రుడత్వం తో పాటు, ధైర్యం, సంకల్ప శక్తి వృద్ధి అవుతాయి. ప్రతికూల పరిస్థితులలో కూడా, కటిక చీకటిలో కూడా ఒంటరిగా ధైర్యంగా ముందుకు పోగలిగిన ధీరత్వం కలుగుతుంది.

స్టైల్ లో ధ్యాన విధానాలు అద్భుత మైనవి. విశ్వం లో నిండి ఉన్న శక్తిని తనలోకి ఆవాహన చెయ్యటం, తనను రక్త మాంసాలతో నిండిన మనిషిగా కాక, ఉక్కుతో తయారైన శరీరం కలవానిగా గంటలకొలది ధ్యానం చెయ్యాలి. భూమిలో నిండి ఉన్న అచల దృఢ శక్తిని క్రింది నుంచి తనలోకి శ్వాస ఆధారంగా ఆవాహన చెయ్య వలసి ఉంటుంది. వీటికి తోడుగా టైగర్ యొక్క లక్షణాలైన నిర్భయత్వం, రాజసం, ఎటువంటి ప్రతికూల పరిస్థితులలోనూ వేనుతిరగని అచంచల సంకల్ప శక్తి పైన గంటల తరబడి ధ్యానం చేయాలి.

కాల క్రమేణా విధానాల వల్ల సాధకుని శరీరం మనస్సు చాలా అనూహ్య మార్పులకు లోనౌతాయి. వజ్ర శరీరం వజ్ర సంకల్పం కలుగుతాయి. మొక్కవోని దీక్షతో కనీసం అయిదేళ్ళు సాధన చేస్తే అద్భుతాలు చెయ్యటం స్టైల్ లో సాధ్యం అవుతుంది. అటువంటి యోధుని ఎదుర్కోవటం పది మంది మనుషులకు కూడా సాధ్యం కాదు.

టైగర్ స్టైల్ విధానాలు భిన్నమైనవి. వీటిలో తప్పించుకోవడం, ఎక్కువ సేపు ఫైటింగ్ చేయ్యటాలు ఉండవు. టెక్నిక్స్ సూటిగా, సరళంగా ఉంటాయి. వీరికి ఆటబొమ్మలే తప్ప ప్రత్యర్థులు ఉండరు. టైగర్ క్లా అనబడే పంజాను ఉక్కులా మార్చే అభ్యాసాలు ఉంటాయి. సూటిగా కొట్టే దెబ్బలే కాక చక్రాకారంగా విసిరే పంచేస్ ఉంటాయి. వేళ్ళతో శరీరాన్ని చీల్చటం, కండను పీకటం వంటి భయంకర టెక్నిక్స్ ఉంటాయి. విద్యలో డిఫెన్స్ అన్న మాటకు తావు లేదు. అంతా అఫెన్స్ మయంగా ఉంటుంది. డిఫెన్స్ ఎదుటి వ్యక్తి చేసుకోవలసి ఉంటుంది.

ఆజానుబాహులకు, పెద్ద శరీరం ఉన్నవారికి స్టైల్ బాగా పనికి వస్తుంది. కాని చిన్న శరీరాలు కలవారికి కూడా పనికొచ్చే స్మాల్ టైగర్ ఫాం ఇందులో ఉంది. బహుశా అది తరువాతి కాలంలో కనిపెట్టినది కావచ్చు. మొదట్లో విద్య షావోలిన్ కుంగ్ ఫూ లో అంతర్ భాగంగా ఉండేది. కాల క్రమేణా ప్రత్యెక శాఖ గా మారి తనవైన ప్రత్యెక టెక్నిక్స్ తో బాగా వృద్ధి పొందింది. దీనిలో అనేక ఫేమిలీ స్టైల్స్ కూడా ఉన్నాయి.

దీనిని సాధన చేసిన వారు ఎక్కువగా ఉద్రేకానికి లోను కారాదు. ఎందుకంటే తీవ్రమైన శక్తి వీరి అధీనంలో ఉంటుంది. అదుపు లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. అనుకోకుండా తేలికగా కొట్టిన దెబ్బలకు కూడా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కనుక ధ్యాన అభ్యాసం వీరికి తప్పనిసరి.
read more " టైగర్ స్టైల్ కుంగ్ ఫూ "

19, మే 2009, మంగళవారం

బుద్ధుని బోధనలు-2

అస్సజి బుద్దుని మొదటి అయిదుగురు శిష్యులలో ఒకడు. మిగిలిన నలుగురు భద్దియ, కొండన్న, మహానామ,వప్ప. వీరు బుద్ధుడు నిరాహారిగా ఉంటూ తీవ్ర సాధనాలు చేస్తున్న సమయంలో ఆయనను అనుసరించి ఉండేవారు. ఆహారంమానేసి శరీరాన్ని కృశింప చేసి ఇంద్రియ దాస్యం నుంచి ముక్తి పొందటమే మోక్షం అని ఒక భావన కాలంలో ఉండేది. కాని బుద్దుడు ఇది తప్పు అని స్వానుభవం ద్వారా తెలిసుకొని ఆహారాన్ని తీసుకోవటం ప్రారంభం చేస్తాడు. ఇది చూచి అయిదుగురు భిక్షువులూ ఆయన సాధనా మార్గంలో భ్రష్టుడై నాడని తలచి, విడచి తమ మార్గాన పోతారు.

తరువాత కొంత కాలానికి బుద్దుడు జ్ఞానోదయాన్ని పొంది, తానూ కనుగొన్న మార్గాన్ని లోకులలో ఎవరికీ బోధించాలిఅని దివ్య దృష్టి తో చూస్తాడు. తాను ఒకప్పుడు శిష్యరికం చేసిన గురువులైన అలార కలాముడు, ఉద్డక రామ పుత్రుడుఅనేవారు గతించారన్న విషయాన్ని దివ్య చక్షువుతో చూచి, తన అనుచరులైన అయిదుగురు భిక్షువులు కాశీసమీపంలోని సారనాథ్ వద్ద ఉన్నారని గ్రహిస్తాడు.

తరువాత వారికి చేసిన బోధనే ధర్మ చక్ర ప్రవర్తనం అంటారు. విధం గా బుద్ధ ధర్మం ప్రచారంలోకి వచ్చింది. అయిదుగురు శిష్యులలోని వాడే అస్సజి లేక అశ్వజిత్ అనే భిక్షువు. తరువాత వీరందరూ బుద్ధుడు చెప్పిన మార్గాన్నిసాధన చేసి బుద్ధత్వాన్ని పొందారు.

అస్సజి వద్దకు సారిపుత్రుడు వచ్చి బుద్ధుని బోధనలు ఏవి? ఆయన కనుగొన్న మార్గం యొక్క వివరాలు ఏమిటి ? అని ప్రశ్నిస్తాడు. దానికి అస్సజి " అయ్యా, నేను జ్ఞానములో అంత పండితుడను కాను. బుద్ధుడు కనుగొన్న మార్గంయొక్క వివరాలు నాకు పూర్తిగా తెలియవు. కాని స్థూలంగా చెప్పగలను. జీవులకు కలిగే దుఖం యొక్క కారణాలు, కారణాలను నిర్మూలించే మార్గం ఆయన కనుగొన్నాడు". అని చెబుతాడు. దానికి సారిపుత్రుడు ఆనంద భరితుడైమౌద్గాల్యాయనుని తో కలసి బుద్ధ ధర్మాన్ని స్వీకరిస్తాడు.

అస్సజి బుద్ధుని మార్గాన్ని చక్కగా నిర్వచించాడు. ఎవరైనా బుద్ధ ధర్మమును గురించి చెప్పవలెనంటే ఇంతకంటేక్లుప్తముగా చక్కగా చెప్పటం కష్టం. బుద్ధుని సమస్త బోధల సారాంశం ఇందులో ఇమిడి ఉన్నది.
read more " బుద్ధుని బోధనలు-2 "

17, మే 2009, ఆదివారం

భగవాన్ బుద్ధుని బోధనలు-1

గౌతమ బుద్దుడు అనుత్తర సమ్యక్ సంబోధిని పొందిన రోజు వైశాఖ పూర్ణిమ. రోజు బౌద్ధులకు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకనగా రోజున బుద్ధుని జననము, జ్ఞానోదయము, పరినిర్వాణము జరిగాయి. పున్నమి చంద్రుడు ఎలాగైతే తన చల్లని వెలుగును లోకానికి వేదజల్లాడో బుద్ధుడు తానూ కనుగొన్న దుఃఖ నాశన మార్గాన్ని లోకానికి దాదాపు 40 ఏళ్ళు బోధించి పరినిర్వాణం చెందాడు.

భగవాన్
బుద్ధుడు కనుగొని లోకానికి బోధించిన జ్ఞానం ఏమిటి? దీనిని క్లుప్తంగా రెండు మాటలలో చెప్ప వచ్చు.
1.
నాలుగు ఆర్య సత్యములు
2.
ఆర్య అష్టాంగ మార్గము

భగవాన్ బుద్ధుడు తాను పొందిన జ్ఞానాన్ని గురించి చాలా చోట్ల వివరించే టపుడు అది రెండు విధాలుగా ఉన్నదని చెప్పాడు.
ఒకటి- నాలుగు ఆర్య సత్యములను దర్శించుట.
రెండవది- ప్రతీత్య సముత్పాద నియమమును దర్శించుట.

నాలుగు
ఆర్య సత్యములు.
1.
దుఃఖము సత్యము
2.
దుఃఖ కారణము సత్యము
3.
దుఃఖ నాశనము సత్యము
4.
దుఃఖ నాశన మార్గము సత్యము.

ఆర్య అష్టాంగ మార్గము.
1.
సమ్యక్ దృష్టి
2.
సమ్యక్ సంకల్పం
3.
సమ్యక్ వాక్
4.
సమ్యక్ కర్మ
5.
సమ్యక్ ఆజీవం
6.
సమ్యక్ వ్యాయామం
7.
సమ్యక్ స్మృతి
8.
సమ్యక్ సమాధి

ఇవి తిరిగి శీల, సమాధి, ప్రజ్ఞలుగా విభజింప బడినవి. వీటిలో ఒక్కొక్కటి వివరంగా చూద్దాము. అపుడు బుద్ధుని దర్శనము, చింతన, బోధనలు స్పష్టంగా అర్థం చేసుకొనడానికి వీలవుతుంది.
read more " భగవాన్ బుద్ధుని బోధనలు-1 "

14, మే 2009, గురువారం

బుద్దుడు చూపిన మార్గం- ఉపోద్ఘాతం

రెండున్నర వేల సంవత్సరాల తరువాత తిరిగి భరతావనిలో బుద్దుని బోధనలు వెలుగు చూస్తున్నాయి. బౌద్ధ సంఘాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఇది ఆహ్వానించ దగ్గ పరిణామం. ఈ విషయం బుద్దుడే స్వయంగా చెప్పినట్లు బౌద్ధ త్రిపిటకములలో ఉన్నది. బుద్ధుని నేడు పశ్చిమ దేశాల వారు అనుసరిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ నటులు చాలామంది బుద్ధుని బోధనలు ఆచరిస్తునారు. దీనికి కారణం కొంత వరకూ దలైలామా కాగా కొంత వరకూ షావోలిన్ కుంగ్ ఫూ సినిమాల ద్వారా ప్రపంచానికి నలుమూలలా బుద్ధుడు పరిచయం కావటం జరిగింది. సిక్ మాన్ అఫ్ ఏషియా అని అపఖ్యాతిని మూట గట్టుకున్న చైనా సూపర్ పవర్ కావటం, ఆటంబాంబు దెబ్బను కోలుకోని జపాన్ ఆర్ధిక సూపర్ పవర్ గా ఎదగటం ఆ రెండు దేశాలూ బుద్దుని తో అవినాభావ సంబంధంకలిగి ఉండటం కూడా దీనికి కారణాలు కావచ్చు.

Rhys Davids వంటి వారు బుద్ధుని బోధనలను పాత కాలం లోనే పశ్చిమ దేశాలకు పరిచయం చేసారు. D.T.Suzuki వంటి వారు జెన్ సాంప్రదాయాన్ని అమెరికా యూరోపులో బాగా ప్రాచుర్యం లోకి తీసుకొచ్చారు. దీనితో పశ్చిమ దేశాలలోబుద్ధుని మీద ఆరాధనా భావం బాగా పెరిగింది. సైన్సు దృక్పథం పెరిగే కొద్దీ క్రైస్తవం లోని మూఢ నమ్మకాలు ( ఉదా: భూమి బల్ల పరుపుగా ఉంది అనేది, క్రీస్తు ఒక్కడే దేవుని సంతానం అనేది, సైతాను అనబడే కల్పిత వ్యక్తి మీద భ్రమ, మానవ సృష్టి ఆడం ఈవ్ నుంచి వచ్చిందనే మూఢ విశ్వాసం, వారి పాపానికి మానవాళి మొత్తం రాబోయే తర తరాలకూబాధ్యులు అనే పనికి మాలిన వాదన) పాశ్చాత్యులకు అతార్కికం గా, అశాస్త్రీయం గా కనిపించి ఏవగింపు కలిగించసాగాయి.

దీనికి విరుద్ధం గా బుద్ధుని సూటి యైన, మూఢ నమ్మకాలకు తావు లేని సరళ మార్గం (no-nonsense approach) వారికి ఎంతో ఉన్నతం గా కనిపించింది. కనుకనే నేడు పాశ్చాత్య దేశాలలో క్రైస్తవం ఆదరణ కోల్పోతున్నది. చర్చిలు గోదౌన్లు గా మారుతున్నాయి. మతం అనేది ఒకరోజు తతంగం (mere Sunday affair) గా తయారైంది. అక్కడ కోల్పోతున్న ఆదరణ తిరిగి పొందడానికి, పేద మరియు అభివృద్ది చెందుతున్న దేశాలలోని సామాజిక, ఆర్ధిక కారణాలను, నిరక్షరాస్యతను, పేదరికాన్ని ఆసరాగా తీసుకొని క్రైస్తవం వేల్లూనుతున్నది.

కాని ఆలోచనా పరులకు, జిజ్ఞాసువులకు బౌద్ధం మరియు అద్వైతం నచ్చినట్లు ఇంకేదీ నచ్చదు. కారణాలు ఏమిటి? వీటిలో విశ్వాసానికి తావులేదు. ముందే ఇది నమ్ము అని ఈ రెండూ చెప్పవు. మూర్ఖపు వాదనలు వీటిలో ఉండవు. కనిపించని దేవుళ్లను నమ్మమని పూజించమని ఇవి చెప్పవు. వీటిలో వ్యక్తి ఆరాధనకు తావు లేదు. మరణం తరువాతవచ్చే స్వర్గ నరకాల మీద ఇందులో ప్రాధాన్యత లేదు. ఇక్కడే బ్రతికి ఉండగానే నీవు సర్వ స్వతన్త్రుడవు కావచ్చు. పరమగమ్యాన్ని పొందవచ్చు అని రెండూ చెబుతాయి. అదృష్టం కన్నా స్వంత ప్రయత్నమే ముఖ్యం అని రెండూ చెబుతాయి. వ్యక్తి గత సాధనకు రెండూ పెద్ద పీట వేస్తాయి.

అన్నింటినీ మించి వీటి విధానం తార్కికమూ (logical), అనుసరనీయమూ(practical) మరియు పరీక్షకునిలబడగలది (verifiable). ముఖ్యం గా నేను పాపిని అనే ఆత్మ న్యూనతా భావాన్ని(self-pity) ని మనిషిలో చొప్పించేప్రయత్నం ఇవి చెయ్యవు. వీటిలో ఏ లక్షణమూ క్రైస్తవానికి లేదు. కనుకనే పాశ్చాత్యులకు బౌద్ధం, అద్వైతం నేడునచ్చుతున్నాయి. మతాలను తులనాత్మక అధ్యయనం చేసిన వారికి ఈ విషయాలు తెలుస్తాయి. గుడ్డిగా నమ్మే వారికిఅర్థం కావు. బహుశా ఇందుకేనేమో యూరోపు దేశాలు అంతగా తిరిగి క్రైస్తవం గురించి బాగా తెలిసిన అంబేద్కర్ కూడా బౌద్ధాన్ని స్వీకరించాడు.

ఎప్పుడైతే బుద్ధుని బోధనలు తిరిగి వెలుగు లోకి వస్తున్నాయో అప్పుడే పాశ్చాత్యులకు బౌద్ధం లోని వివిధ శాఖలలోజిజ్ఞాస కలగడం మొదలైంది. జెన్ మొదలైన సాంప్రదాయాలు, టిబెటన్ తాంత్రిక బౌద్ధం వంటి సాంప్రదాయాలూ ప్రపంచవ్యాప్తం గా ప్రజలకు తెలియటం మొదలైంది. బుద్ధ గయ ఒక ముఖ్యమైన యాత్రిక కేంద్రం అయింది.

ఇక మన సంగతి షరా మామూలే గదా. మనకు మన విలువ ఎవరో చెబితేనే గదా తెలిసేది. వివేకానందుడు అమెరికాలోజయభేరి మ్రోగించి తిరిగి వస్తే ఆయనకు మనం బ్రహ్మ రధం పట్టాము. అదే వివేకానందుడు అమెరికాకు పోక ముందుపన్నెండేళ్ళు బికారిగా దేశం అంతా తిరుగుతుంటే ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నో రోజులు తినటానికి నాలుగు మెతుకులు లేక ఆయన మన పవిత్ర భారతంలో పస్తులున్నాడు.

అప్పుడు ఆయన మహత్యం మనకు తెలియలేదు. అదే అమెరికా వాడు ఆయనపాదాలు పట్టుకుంటే అప్పుడు వివేకానందుడు మనకు ప్రవక్తగా తెలియ బడ్డాడు. ఇప్పటికీ ఆయన ఫోటో డ్రాయింగురూములో అలంకారప్రాయంగా పెట్టుకుంటాం గాని ఆయన చెప్పినవి ఆచరించము. ఈ వింత ప్రవర్తన మనకు యుగాలుగా అలవాటు కదా ఒక్క రోజులో ఎట్లా పోతుంది?

భారతీయ జ్యోతిషం గొప్పది అని ఒక డేవిడ్ ఫ్రాలే నో లేక ఒక డెన్నిస్ హార్నేస్సో లేక ఒక క్రిస్టినా కాలిన్స్ చెబితే మనంనమ్ముతాం. అలాగే భారతీయ వేదాంతము గొప్పది అని ఏ అమెరికానో చెబితెనెగదా మనకు తెలిసేది. అలాగే నేడుప్రపంచమంతా బుద్ధుని బోధనలు అధ్యయనం చేస్తుంటే మనకు గూడా ఇందులో ఏదో ప్రత్యేకత ఉన్నట్లుందే అనిఅనిపిస్తున్నది. ఇందులో వింత లేదు. ఇది భారతీయులు గా మనకు అలవాటైన సహజ నిర్లక్ష్య ధోరణి. ఈ నిర్లక్ష్య ధోరణితో ఎంతటి అమూల్య రత్నాలను విస్మరించామో ఎలాంటి నిధులను చేజేతులా పోగొట్టుకున్నామో ఏనాటికి మనకు తెలుస్తుందో ? కనీసం ప్రపంచం మనవైన విద్యలను జ్ఞానాన్ని గుర్తించి, నేర్చుకొని, మనలను మన అజ్ఞానాన్ని చూసి హేళనగా నవ్వుతుంటే అప్పుడన్నా మనం కళ్లు తెరిచి మన వారసత్వాన్ని అంది పుచ్చు కుంటామా?

బుద్ధుని అసలైన బోధనలు ఏమిటో ముందు ముందు చూద్దాము.
read more " బుద్దుడు చూపిన మార్గం- ఉపోద్ఘాతం "

13, మే 2009, బుధవారం

బుద్దుని మౌలిక బోధనలు

బుద్దుని లోకులు అహింసా మూర్తిగా భావిస్తున్నారు. కాని అది మౌలికంగా నిజం కాదు. బుద్ధుని ముఖ్య బోధన అహింస కాదు. బుద్ధుడు మానవుని దుఃఖ నాశన మార్గాన్ని బోధించాడు. మార్గంలో పయనించిన మానవుడు నిర్వాణము అనే గమ్యాన్ని చేరతాడు. నిర్వాణ సిద్ధి కలిగినపుడు అహింస మొదలైన గుణాలు వాటంతట అవే అనుసరించి వస్తాయి.

జీవిత రహస్యాన్ని చేదించిన వానికి అహింసాది గుణాలను ప్రత్యేకంగా అభ్యాసం చేయవలసిన అవసరం ఉండదు. అప్రయత్నంగానే అన్ని సద్గుణాలు వాని ఊపిరిగా మారుతాయి. బుద్ధుడు జ్ఞాన మూర్తి. మానవ ఊర్ధ్వ పరిణామంలో అత్యున్నత స్థాయికి చేరినవాడే బుద్ధుడు. దుఃఖ నాశన మార్గాన్నే బుద్ధుడు అనుసరించాడు. దానినే లోకానికి బోధించాడు.

కాని బౌద్ధం భారత దేశాన్ని విడచి ఇతర దేశాలకు వలస పోయింది. ఇది మన జాతి దౌర్భాగ్యం. పోయిన చోటల్లా సక్రమమైన రీతిలో ఉందా అంటే అదీ లేదు. అసలైన బౌద్ధం అనేక మార్పులకు లోనై దాదాపు అంతరించి పోయింది. హీన యానం, థేరావాదం మొదలైన పేర్లతో అక్కడక్కడా మిగిలి ఉంది.

దీనిని బట్టి ఒక విషయం తేట తెల్లం అవుతున్నది. జన సామాన్యం అందరూ అత్యున్నత జ్ఞాన భూమికను అందుకోలేరు. బుద్ధుని వంటి వారు దానిని విడమర్చి బోధించినా, అనుసరించగల సాహసులు అతి కొద్ది మందే ఉంటారు. జనులకు వారి స్థాయిలో మాయ మాటలు చెప్పేవారే నచ్చుతారు. అంతే కాని సత్యం ఉన్నది ఉన్నట్లు బోధిస్తే స్వీకరించే వారు ఎవరూ ఉండరు. అందుకనే మహనీయుల బోధనలు కాల గర్భం లో కలసిపోతాయి. నూతన బోధనలు అవసరం అవుతాయి. దీనికి కారణం మానవుల అనర్హత. మార్పును స్వాగతించే ధైర్యం లేకపోవటం,అత్యున్నత సత్యాలను ఆచరణలో పెట్టగలిగే సత్తా లేక పోవటం దీనికి కారణాలు.

కాల క్రమేణా మహనీయుల బోధనలు ఆచరించక పోవటం అట్లుంచి, వాటిని సరిగా అర్థం చేసుకునే వారు కూడా కరువు అవుతారు. బుద్ధుని అహింసా మూర్తిగా ముద్ర వెయ్యటం కూడా అటువంటిదే. జ్ఞానాన్ని పొందిన ప్రతి వాడూ అహింసా మూర్తిగానే అవుతాడు. అది ప్రత్యెక లక్షణం ఏమీ కాదు. వారిది నిజమైన జ్ఞానము, భక్తీ అయితే ప్రతి జ్ఞానీ, ప్రతి భక్తుడూ అహింసా వాదే.

బుద్ధుని మౌలిక బోధన జ్ఞానం. దుఃఖ నాశన మార్గం. నిర్వాణ పధం. పథాన నడిచే వానిని సద్గుణాలు అవే అనుసరిస్తాయి. ప్రత్యేకించి ఒక్కొక్క గుణాన్ని అభ్యాసం చేయవలసిన పని లేదు. బుద్ధుని మౌలిక జ్ఞాన బోధను వదలిపెట్టి ఆయనను ఉత్త అహింసా మూర్తిగా భావించటం సరి యైన భావన కాదు.
read more " బుద్దుని మౌలిక బోధనలు "

6, మే 2009, బుధవారం

డాక్టర్ హానెమాన్ జాతకం: శకట యోగం


డాక్టరు హాన్నేమాన్ అత్యంత మేధా సంపన్నుడూ, శాస్త్ర వేత్తా అయి కూడా జీవితమంతా నానా బాధలు పడ్డాడు. శాస్త్రీయస్పృహ ఉన్న పశ్చిమ దేశాలలోనే ఈయన వేధింపులకు గురి అయ్యాడంటే వారి శాస్త్రీయత నేతి బీరకాయ అని తోస్తుంది. దానికి అసలు కారణాలు ఆయన జాతకంలోని దుర్యోగాలు. ఈయన జాతకంలో చూడగానే కనిపించే దుష్ట యోగం శకటయోగం. గురువు నుంచి చంద్రుడు 6,8,12 స్థానములలో ఉంటే యోగం కలుగుతుంది. హానేమాన్న్ జాతకంలో చంద్రుడు మకరంలో మరియు గురువు సింహంలో ఉండుట తో యోగం ఏర్పడింది.

శకట యోగాన్ని గురించి ఫలదీపిక ఆరవ అధ్యాయం పదిహేడవ శ్లోకంలో విధం గా అంటుంది.

శకట యోగ జాతకుడు దురదృష్ట వంతుడు మరియు తాను కోలుపోయిన దానిని తిరిగి పొందువాడు అగును. అతడు ప్రపంచమున పేరు లేని వాడు, సాధారనుడు అగును. అనేక కష్టములను మానసిక వ్యధను పొందును.

శకటం అనగా బండి. అనగా బండి వలె దేశ దేశాలు తిరుగ వలసిన అగత్యం పడుతుంది. యోగం వల్లనే హనెమాన్ తనకు అసాధారణ మేధా సంపత్తి ఉండి కూడా ప్రపంచ నిరాదరణకు గురి అయ్యి, ప్రజలు ప్రభుత్వాల చేత వెంటాడబడి చివరకు జర్మనీని విడిచి పారిస్ లో తన చివరి దశను గడుప వలసి వచ్చింది.తాను కోలుపోయిన గుర్తింపును జీవిత చివరి దశలో తిరిగి పొందాడు. కాని జీవితమంతా కష్టాలను మానసిక వ్యదను అనుభవించాడు. ఆయన జీవితాన్ని పరిశీలిస్తే శకట యోగం ప్రభావం స్ఫుటం గా కనిపిస్తుంది.
read more " డాక్టర్ హానెమాన్ జాతకం: శకట యోగం "

5, మే 2009, మంగళవారం

డాక్టర్ సామ్యుల్ హానెమాన్ జాతకం


హోమియోపతి వైద్య పితామహుడైన డాక్టర్ సామ్యుఎల్ హానెమాన్ జాతకం చాలా ఆసక్తి కరం గా ఉంటుంది. 2000 సంవత్సరంలో నేను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి మొదటి బ్యాచ్ లో M.A (Astrology) చేసినపుడు " గ్రహాలు మరియు హోమియోపతి " అనే విషయంపైన పరిశోధనా వ్యాసం సమర్పించాను.

దానిలో దాదాపు ఇరవై అయిదు మంది హోమియో ఉద్దండుల జాతకాలను పరిశీలించి కొన్ని సూత్రాలను తయారుచేయటం జరిగింది. ఆయా గ్రహాల కలయికలు ఏదైనా జాతకంలో ఉంటే అది హోమియోపతి డాక్టరు జాతకం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఆ విషయం ప్రక్కన పెడితే, డాక్టర్ సామ్యయూల్ హన్నేమాన్ గారు 10.4.1755 న జెర్మనీ లో గల డ్రెస్దెన్ అనే నగరంలోజన్మించారు. జనన సమయం తెలియదు. ఆ రోజున గ్రహ స్థితి ఇలా ఉన్నది.

మేషంలో రవి, సింహంలో గురువు, కన్యలో రాహువు, మకరంలో చంద్రుడు శని, కుంభంలో కుజ శుక్రులు, మీనంలోబుధ కేతువులు ఉన్నారు.

జాతక విశ్లేషణ:
చంద్ర లగ్నాత్ రవి నాలుగింట ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కనుక ఆయన సాంప్రదాయ వైద్యంలో ఆ రోజులలోనే M.D చేసాడు. కాని అదే రవి లగ్న సంధిలో ఉండుట వల్ల ఆయన జీవితంలో నానా బాధలు పడ్డాడు. చివరి రోజులలో పారిస్ లో ఉన్నపుడు తప్ప, మిగిలిన జీవిత మంతా బాధలు, కష్టాలు, సమాజం నుండి వెలివేయ బడటం జరిగాయి. భూత వైద్యుడన్నఅపఖ్యాతిని మూట కట్టుకున్నాడు. రవి ఉచ్చలో ఉన్నప్పటికీ తను చదివిన అల్లోపతి వైద్యాన్ని ప్రాక్టీసు చేయలేకపోయాడు. కారణమేమిటంటే దానిలోని మౌలిక సిద్ధాంతాల మీద ఆయనకు తీవ్ర అనుమానాలు ఉండేవి. జాతక పరంగా దీనికి కారణం చతుర్థంలో రవి లగ్న సంధిలో ఉండటం మరియు చతుర్థాథి పతి కుజుడు రెండవ ఇంటిలో శత్రు క్షేత్రంలో ఉండటం. దీనివల్ల చదివిన చదువు పనికిరాకుండా పోయింది.

విద్యా కారకుడైన బుధుడు నీచ స్థితిలో ఉండి కేతువు తో కలిసి ఉన్నాడు. ఈయన అనేక రంగాలలో నిష్ణాతుడైనాడు. ఆ రోజులలో ప్రసిద్ధి గాంచిన రసాయన శాస్త్ర నిపుణులలో ఆయన ఒకడు. కానీ దేనిలోనూ ఈయనకు స్థిరమైన పేరు రాలేదు. కాని రవి మీద గురు దృష్టి
వల్ల చివరి రోజులలో ప్రపంచ ఖ్యాతి పొందాడు. రాహువు, రవి దైన ఉత్తరా నక్షత్రంలో స్థితి కలిగి బుధ రాశిలో ఉన్నాడు. కనుక సాంప్రదాయవిరుద్ధ మైన జ్ఞానాన్ని చూపుతున్నాడు. కనుకనే నూతన హోమియో విజ్ఞానాన్ని ఆవిష్కరించ గలిగాడు.

బుధ కేతువులపైన శని దృష్టి వల్ల లోతైన ఆలోచనా శక్తి, కష్ట పడి పని చేసే తత్త్వం, హఠాత్తుగా నూతన సత్యాలు స్ఫురించటం కలిగాయి. చతుర్తాదిపతి కుజుడు రెండవ ఇంటిలో కుంభంలో ఉండి రవి రాశి యగు సింహం నుండి గురువుచేత చూడ బడుతూ ఉన్నాడు. కనుక కుంభం ( అనగా రిసెర్చి) మరియు సింహం (అనగా వైద్యం ) కలిశి వైద్య శాస్త్రం లో కొత్త ఆవిష్కారానికి ఆద్యుడైనాడు.

ఓషధీ నాదుడగు చంద్రుడు తన సొంత నక్షత్రంలో ఉండి, రాహువు యొక్క పంచమ దృష్టి చేత చూడ బడుతూ ఉండటంవల్ల కొత్త మూలికలు, మందులు కని పెట్టటం జరిగింది. ఈయన దాదాపు 100 మందులను ప్రూవ్ చేసి లోకానికి అందించాడు. వీటిలో ఒక్క దానికి ఒక నోబుల్ ప్రైజు ఇవ్వవచ్చు. అంతటి లోతైన పరిపూర్ణమైన ప్రూవింగ్ చేసాడు. ఈనాటికీ ఆయన రాబట్టిన లక్షణాలను దాటి ఎవరు కూడా ఔషధ ప్రూవింగ్ చెయ్యలేక పోయారు. ఈ నూరు మందులతో ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎన్ని లక్షలాది మంది ఆరోగ్యాన్ని పొందారో లెక్క లేదు.

చంద్రుడు శనితో కలిసి ఉండుట వల్ల బాధామయ జీవితం వచ్చింది. కాని ఇదే కాంబినేషన్ ఈయనకు మొండిపట్టుదలను, తన రీసెర్చిలో ఎన్ని ఆటంకాలు ఎదురై
చివరకు ప్రాణాలకు ప్రమాదం వాటిల్లినా కూడా చలించని మనస్తత్వాన్నిఇచ్చింది. తనకు స్ఫురించి తన రీసెర్చిలో నిగ్గు తేలిన సత్యాలను లోకానికి చాటటానికి జీవితమంతా ఒక యోధుని వలె పోరాటం సాగించాడు. ఇదే కాంబినేషన్ వల్ల తాత్విక ధోరణి అలవాటు అయింది. ఈయన వ్రాశిన " ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ " చదివితే అనేక చోట్ల ఒక Philosophical treatise చదువుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ప్రభావం శని చంద్రుల కలయిక వల్ల కలిగింది.

దశమాదిపతి శుక్రుడు, చతుర్తాదిపతి కుజుడు కలసి రాహువు నక్షత్రంలో ఉన్నారు. దీనివల్ల వైద్య రంగంలో విప్లవాత్మకమైన ఆవిష్కారాలు చేయ గలిగాడు. కాని ప్రజల ప్రభుత్వాల వ్యతిరేకత వల్ల జీవితమంతా దేశ దిమ్మరిగా తిరుగవలసి వచ్చింది.

ఈయన సారూప్య ఔషధ సూత్రాన్ని రాహువు వృశ్చిక రాశిలో ఉన్నపుడు 1790 లో కనుక్కున్నాడు. ఈయనజాతకంలో వైద్య గ్రహాలైన రవి, చంద్రుడు మరియు సాంప్రదాయ విరోధి నూతన ఆవిష్కారాలకు కారకుడు అయిన రాహువు ల ప్రభావం స్పష్టం గా కనిపిస్తుంది.
ప్రపంచ ప్రఖ్యాతి శుక్రునివల్ల మరియు అసాధారణ మైన తెలివి తేటలు బుధుని స్థితి వల్ల కలిగాయి. కాని బుధుని కేతువు ఆక్రమించుట వల్ల ఈయనకు రావలసినంతగుర్తింపు తన జీవిత కాలం లో రాలేదనే చెప్పాలి.

ఈ నాటికీ హోమియోపతి మరియు ఆయుర్వేదం వైద్య శాస్త్రాలు కావు అని మొండిగా వాదించేవారు బోలెడంత మందికనిపిస్తారు. వారు జపనీస్ ఎన్కెఫలైటిస్ అనబడే బ్రెయిన్ ఫీవర్ కేసులలో బెల్లడోనా అనే హోమియో మందు ఎంతటిసమర్థ వంతం గా పని చేసిందో చూస్తె అటువంటి వాదనలు చెయ్యరు. హానేమాన్న్ బ్రతికి ఉన్న సమయంలో కూడాయూరోపులో కలరా ప్రబలినపుడు ఆయన సూచించిన కేంఫర్, కుప్రం మేటాలికం , విరేట్రం ఆల్బం అనే మందులు వేలాదిమందిని మృత్యు ముఖం నుంచి రక్షించాయి.

అలాగే కోరింత దగ్గు మహామ్మరిగా ప్రబలి అనేక మందిని పొట్టన పెట్టుకుంటున్న సమయంలో డాక్టర్ బోనింగ్ హాసేన్ వాడిన ఎకోనైట్, హేపార్ సల్ఫ్, స్పాన్జియా అనబడే మందులు వేలాది మందిని రక్షించాయి. ఇవి అన్నీ వైద్య చరిత్రలో రికార్డుచెయ్య బడిన కేసులు. రికార్డు చెయ్య బడని కేసులు, నిత్య జీవితంలో డాక్టర్ల ప్రాక్టీసులో రుజువు అవుతున్న కేసులు లెక్క లేనన్ని ఉన్నాయి. ప్రపంచం డాక్టర్ హానెమాన్ కు రుణ పడి ఉంది అనటంలో ఎంత మాత్రం సందేహం లేదు. డాక్టర్ హానెమాన్ జీవితాన్ని ఇంకోసారి వివరం గా చూద్దాము.
read more " డాక్టర్ సామ్యుల్ హానెమాన్ జాతకం "

4, మే 2009, సోమవారం

హోమియో కేస్ స్టడీస్


తరుణ వ్యాదులలో హోమియోపతి ఎంత అద్భుతం గా పని చేస్తుందో నా కేస్ ఫైల్స్ లోనుంచి ఒక ఉదాహరణ ఇస్తాను.

ఒక పదేళ్ళ అమ్మాయికి అమ్మవారు పోసింది. ముఖం మీద మరియు వంటి మీద పొక్కులుఉన్నాయి. ఇంట్లోని వారు మంచం మీద వేపాకులు పరచి పడుకోపెట్టారు. నేను వెళ్లి చూచే సరికి ఉన్న పరిస్థితి ఏమిటంటే అమ్మాయి చాలా చికాకుగా ఉన్నది. మంచం మీద పడుకొని ఉన్నప్పటికీ చాలా అస్థిమితంగా ఉన్నది. వదలకుండా దగ్గు వస్తున్నది. దగ్గిన ప్రతి సారీ తెల్లని కఫం పడుతున్నది. దానికోసం మంచం పక్కన ఒక ప్లాస్టిక్ మగ్గు పెట్టి కొన్ని నీళ్లు పోసి దానిలో ఉమ్మి వేస్తున్నది. నిముషానికి రెండు సార్లు ఇట్లా దగ్గుతూ ఉమ్మి వేస్తూ ఉంది. చల్లని నీరు త్రాగాలని కోరిక ఉంది. చల్లని గాలి కావాలని గొడవ చేస్తున్నది. తన రూములో ఎవరో ఒకరు ఎప్పుడూ తన ప్రక్కనే కూర్చొని ఉండాలి అని గొడవ చేస్తున్నది. ఒంటరిగా ఉండటానికి ఇష్ట పడటం లేదు.జ్వరం నూట మూడు డిగ్రీలు ఉన్నది.

లక్షణాలు పరిశీలించిన మీదట బొంగురు దగ్గు, చల్ల నీళ్ళను ఇష్టపడటం, ప్రక్కన ఎవరో ఒకరు ఉండాలని కోరటం, లక్షణాలు striking and peculiar symptoms గా కనిపించాయి. ఫాస్ఫరస్ 30 పోటేన్సీలో పావుగంటకు ఒక డోసు చొప్పున మూడు డోసులు వేసాను. గంటలో దగ్గు పూర్తిగా మాయం అయి, స్థిమితం గా పడుకుంది. అన్ని లక్షణాలు తగ్గు ముఖం పట్టాయి.

తరువాత ఫాస్ఫరస్ 200 పోటేన్సీలో ఉదయం సాయంత్రం ఇవ్వటంతో పూర్తిగా తగ్గి మూడు రోజులలో మామూలు మనిషి అయింది. ముఖం మీద గుంటలు పడలేదు. నీరసం లేదు. హోమియోపతి వైద్యం తో చక్కని క్యూర్ కు నా అనుభవంలో ఇది ఒక ఉదాహరణ.
read more " హోమియో కేస్ స్టడీస్ "