“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, సెప్టెంబర్ 2021, శనివారం

తమరు కాశ్మీర్ పండిట్ అని ఇప్పుడు గుర్తొచ్చిందా?

కాశ్మీర్లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ, 'నేను కాశ్మీర్ పండిట్ను, నాకు వాళ్ళ బాధలు తెలుసు' అని గొప్ప స్టేట్మెంటిచ్చాడు. కరెక్ట్ ! తమరిలో అన్ని రక్తాలూ కలిశాయి  గనుక, ఫార్సీ నని చెప్పుకోవచ్చు, కాశ్మీర్ పండిట్ నని చెప్పుకోవచ్చు, ఇంకొంచం ముందుకెళితే, కొంతమంది చెప్పేటట్లు ముస్లింనని కూడా చెప్పుకోవచ్చు, లేదా ఇటాలియన్నని చెప్పుకోవచ్చు. అయినా, ఉన్నట్టుండి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది సుమా తమరికి కాశ్మీర్ పండిట్ నని? వైష్ణోదేవి యాత్ర చేసే కాలినడకలో జ్ఞానోదయం అయిందేమో?

అదే నిజమైతే, గత 40 ఏళ్లుగా, లక్షలాది మంది కాశ్మీర్ బ్రాహ్మణ కుటుంబాలు, ఢిల్లీ రోడ్లమీద, ఫుట్ పాత్ ల మీద టెంట్లు వేసుకుని, ఓవర్ బ్రిడ్జిల క్రిందా, ఆరుబయట గుడారాలలోనూ ఉంటూ, కూలీ నాలీ చేసుకుంటూ, తమ దేశంలో తామే దిక్కులేకుండా బ్రతుకుతుంటే, అప్పుడంతా ఎందుకు గుర్తు రాలేదు తమరి కాశ్మీర్ పండిట్ మూలాలు? అసలు మీ కుటుంబం ఏం చేసింది కాశ్మీర్ పండితులకు?

అద్భుతమైన కాశ్మీర్ శైవ సంప్రదాయానికి వారసులు కాశ్మీర్ పండిట్స్. వేలాది సంవత్సరాలుగా ఆ సంప్రదాయాన్ని వాళ్ళు రక్షిస్తూ వస్తున్నారు. అలాంటి గొప్ప సంస్కృతి నాశనమైంది. వాళ్ళ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. అది వాళ్ళ ఒక్కరి సొమ్ము కాదు. ఈ దేశపు ఘనసంస్కృతి అది. దాన్ని ఒక ప్రధకం ప్రకారం ఏభై ఏళ్లుగా పాకిస్తాన్ నాశనం చేస్తుంటే గుర్తు రాలేదా తమరు కాశ్మీర్ పండిట్ అని? వాళ్ళ ఇళ్ళూ వాకిళ్ళూ ఆక్రమించుకుని, అందిన వారిని అందినట్లు, చిన్నపిల్లలని కూడా చూడకుండా, రాడికల్ పాకిస్తానీ ముస్లిములు కాల్చి చంపుతుంటే, వాళ్ళ ఆడవాళ్లను రేపులు చేస్తుంటే, అప్పుడు గుర్తు రాలేదా తమరు కాశ్మీర్ పండిట్ అని? అప్పుడెక్కడ దాక్కున్నారో తమరు?

అసలు, ఘనత వహించిన తమరి ముత్తాతగారి చలవేగా నేటి కాశ్మీర్ సమస్య? ఆయన కాశ్మీర్ పండిట్ కాదా? ఆయన కాకుండా మీరెలా అయ్యారు? మరి మీ ముత్తాతగారి కాలంనుంచీ ఈ సమస్యను పెంచి పోషించినదెవరు? గత 70 ఏళ్లుగా కాశ్మీర్ రణరంగంగా రగులుతుంటే, పాకిస్తాన్ మూకలు అక్కడ సందుసందుకీ ఆక్రమిస్తుంటే మీరేం చేస్తున్నారు? నిన్నటికి నిన్న చచ్చిన గిలానీ అనే వృద్ధశునకం లాంటి వాళ్ళు కాశ్మీర్లో పెట్రేగి పోవడానికి కారణం మీ కాంగ్రెస్ పార్టీ కాదా? కాదని గుండె మీద చెయ్యివేసుకుని నిజాయితీగా చెప్పండి ! అసలెందుకు మీకు పాకిస్తాన్  అంటే అంత భయం?  అది భయమా లేక ప్రేమా?

గిలానీగాడి శవానికి పాకిస్తాన్ జెండాను కప్పి భారత వ్యతిరేక నినాదాలు చేస్తుంటే, దానిని మెహబూబా లాంటి సిగ్గులేని మనుషులు సమర్దిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? మీరెందుకు కిమ్మనకుండా ఊరుకున్నారు? ఇదే పనిని, పాకిస్తాన్ లో ఎవరైనా హిందువులు చేస్తే ఊరుకుంటారా? ఇన్నేళ్ళుగా ఎవరి సొమ్ముతో, ఎవరు కట్టిన టాక్స్ డబ్బులతో, ఇండియాలో దర్జాగా బ్రతుకుతున్నారు వాళ్ళు? 'తినేది మొగుడి తిండి, పాడేది రంకుమొగుడి పాట' అన్నట్లుగా, భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ కు జై కొట్టే ఇలాంటివాళ్ళను ఇన్నేళ్ళుగా, భారతీయుల టాక్స్ సొమ్ముతో పెంచి పోషించింది ఎవరు? మీ కుటుంబం కాదా?

పాక్ ఆకుపైడ్ కాశ్మీర్ ఎవరి చలవ? శంకరాచార్యులవారు అధిరోహించిన శారదాపీఠం అక్కడే ఉంది. వేలాది ఏళ్ళనుంచీ అది వేదభూమి. ఈనాడది PoK అయ్యి కూచుంది. ఇస్లామిక్ దొంగలను, దోపిడీదార్లను, ఖూనీకోర్లను తయారు చేసి, మనదేశం మీదకు ఉసిగొలిపే ఫెక్టరీగా మారింది.  ఇదెవరి చలవ? మీ కుటుంబానిది కాదా?

అరుణాచలప్రదేశ్ అవతల వేలాది మైళ్ళ భారతభూమిని చైనా ఆక్రమిస్తే చూస్తూ ఊరుకున్నది తమరి ముత్తాత గారు కాదా? ఈ దేశం మీ సొంత జాగీరా అలా ఎవరికిపడితే వారికి వదిలెయ్యడానికి?

ఉన్నట్టుండి  తమరికి, తమ పార్టీ నేతలైన గులాం నబీ ఆజాద్  గారికీ, వారి మిత్రులైన మెహబూబా ముఫ్టీ లాంటి పాకిస్తాన్  తొత్తులకూ, కాశ్మీర్ పండిట్స్ మీద ఇంత ప్రేమ ఎందుకో? కాశ్మీర్లో ఎన్నికలు పెడితే, ఈ సెంటిమెంట్ తో ఓట్లు కొట్టేసి, అక్కడి ముస్లిం పార్టీలతో జతకట్టి, కాశ్మీర్లో ప్రభుతం స్థాపిద్దామనేగా? ఆ తర్వాత కాశ్మీర్ ను పాకిస్తాన్ కి అమ్మేద్దామనేగా? లోకం అంత పిచ్చిది కాదు ! రోజులు మారాయి !

కాశ్మీర్ ను రాష్ట్రం చేస్తే, అక్కడ ఎన్నికలు పెడితే, వస్తే గిస్తే బీజేపీ మాత్రమే అధికారం లోకి రావాలి. ఇంకే పార్టీ వచ్చినా, అక్కడ మళ్ళీ అరాచక ప్రళయమే ఉంటుంది. ఇస్లాం ముసుగులో ముందు పాకిస్తాన్, ఆ తర్వాత చైనాలు అక్కడ అడుగుపెడతాయి. అప్పుడు మళ్ళీ సివిల్ వార్ తప్పదు.

ఆ ప్రమాదం రాకుండా ఉండాలంటే, కాశ్మీర్ తో  సహా, మొత్తం ఇండియాను బీజేపీ మాత్రమే పాలించాలి. మిగిలిన ఏ పార్టీకీ ఆ హక్కు లేదు. ఎందుకంటే, దేశభక్తి అనేది వాటిల్లో ఘోరంగా లోపించింది కాబట్టి. ఇది నేను చెబుతున్నది కాదు. గత 80 ఏళ్లుగా కనిపిస్తున్న నిజం !

కాశ్మీర్ మన దేశానికి తలకాయ లాంటిది. గత 70 ఏళ్లుగా మన దేశం తలేని మొండెం లాగా బ్రతికింది. దానికి శిరస్సును పెట్టి, అది ప్రపంచదేశాలలో తలెత్తుకుని సగర్వంగా నిలబడేలా చేసింది ఒక్క నరేంద్రమోడీ గారు మాత్రమే. మిగతా ఎవ్వరూ ఆపనిని చేయలేకపోయారు. కనీసం చెయ్యడానికి సాహసించలేకపోయారు. కనీసం నోరెత్తి మాట్లాడలేకపోయారు.

నిన్నటికి నిన్న, రష్యా,  అమెరికా, ఆస్ట్రేలియా దేశాల భద్రతా సలహాదారులు ఢిల్లీకి వచ్చి, మన ప్రభుత్వంతో మాట్లాడి ఎందుకు వెళ్లారు? అంటే, ప్రపంచదేశాలలో మన గౌరవం పెరిగినట్లేనా కాదా? మన ప్రాముఖ్యతని వాళ్ళు గుర్తిస్తున్నట్లేనా కాదా? మనం, నిజాయితీపరులమని ఒప్పుకున్నట్లేనా కాదా? మీ కాంగ్రెస్ హయాంలో ఎప్పుడైనా మన దేశానికి ఇంతటి విలువా, గౌరవమూ దక్కాయా మరి?

అవకాశవాద రాజకీయాలతో పాకిస్తాన్ తొత్తులకు వంత పాడకండి. మీరు భరతమాత బిడ్డలన్నది మర్చిపోకండి. దేశాన్ని పాకిస్తాన్ కు తాకట్టు పెట్టకండి. కాశ్మీర్ పండిట్స్ అంటే మీకు నిజంగా అంత ప్రేముంటే, ఇది కాదు మీరు చెయ్యవలసిన పని !

మీ కుటుంబం చేసిన ఘోరమైన పొరపాట్లను, లక్షలాది కుటుంబాలు నాశనం కావడానికి కారణమైన పొరపాట్లను, బీజేపీ, ఆరెస్సెస్ లు నేడు సరిదిద్దుతున్నాయి. దానికోసం ఎంతో తంటాలు పడుతున్నాయి. ఆ శ్రమను గుర్తించండి. వాళ్ళను సపోర్ట్ చెయ్యండి. కులమతాలకు పార్టీలకు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఆలోచించండి. దేశభక్తిని గుండెల్లో నింపుకోండి.

మనది పవిత్ర వేదభూమి. ఇది ఇస్లాం కు అమ్ముడుపోయి, మరో ఆఫ్ఘనిస్తాన్ కావడానికి ఎంతమాత్రం వీల్లేదు !