Love the country you live in OR Live in the country you love

20, అక్టోబర్ 2018, శనివారం

నిజమౌతున్న జ్యోతిష్యం - కౌంట్ డౌన్ మొదలైంది

ఆగస్ట్ 26 న నేను ఒక పోస్ట్ వ్రాస్తూ, 'అక్టోబర్ 19 నుండి 26 వరకూ ప్రమాద సమయం - జాగ్రత్త వహించండి' అని హెచ్చరించాను. ఆ ప్రిడిక్షన్ నిజమౌతోంది.

నిన్న సాయంత్రం అమృత్ సర్ లో జరిగిన రైలు ప్రమాదంలో కనీసం 60 మంది చనిపోయారు. దాదాపు ఇంకో వందమంది గాయాల పాలయ్యారు. విచిత్రమేమంటే ఇది రైలు ప్రమాదం కాదు. రైలుపట్టాల మీద అడ్డదిడ్డంగా నిలబడి దసరా సందర్భంగా జరుగుతున్న రావణ దహనాన్ని వీడియోలు తీస్తూ రైలు వస్తున్న విషయాన్ని గమనించలేదట జనం ! వినడానికి కూడా విడ్డూరంగా ఉంది !!

It happens only in India అనే సీరీస్ లో దీన్ని కూడా తీసుకోవచ్చు.

ఇండియాలో ప్రజలకు డిసిప్లిన్ లేదని, సివిక్ సెన్స్ లేదని, కనీసం కామన్ సెన్స్ కూడా లేదని, నేను ఎప్పుడూ చెబుతున్నది అక్షరాలా నిజం అని ఈ సంఘటన కూడా రుజువు చేస్తున్నది.

ఇలాంటివి చెదురు మదురుగా అక్కడక్కడా జరిగితే సరిపోదు. ప్రతిచోటా జరగాలి. ప్రతిరోజూ జరగాలి. ఇంకా పెద్దపెద్ద ప్రమాదాలు జరగాలి. అప్పుడే ఇండియాకు పట్టిన పనికిమాలిన జనాభా దరిద్రం వదులుతుంది !