“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, జనవరి 2023, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 83 (అమెరికాలో కూడా ముసలం మొదలైంది)

అమెరికాలో షరియా మొదలైంది.

డెట్రాయిట్ దగ్గరలో హాంట్రామిక్ అనే ఒక సిటీ ఉంటుంది. ఇది డెట్రాయిట్ మెట్రో పరిధిలోకే వస్తుంది. కొన్నేళ్ల క్రితం వరకూ ఇక్కడ మొత్తం పోలిష్ జాతీయులు మాత్రమే ఉండేవారు. సెప్టెంబర్ 19, 1987 న ఈ సిటీకి పోప్ జాన్ పాల్ II కూడా వచ్చాడు. అంతగా క్రైస్తవుల ప్రాబల్యం ఉన్న సిటీ ఇది.

కానీ ఇప్పుడు, అంటే నిన్నటికి నిన్న, ఈ సిటీ కౌన్సిల్ లో ఒక కొత్త చట్టం పాస్ అయింది. అదేంటంటే, ఈద్ పండుగ సందర్భంగా ఎవరి ఇళ్లలో గాని, లేదా బ్యాక్ యార్డ్ లో గాని, గొర్రెలను, మేకలను చంపి వండుకొని తినవచ్చు. అనేదే ఈ చట్టం. దీనిని కౌన్సిల్ సభ్యులు మెజారిటీ ఓట్లతో ఆమోదించారు. కారణం? ప్రస్తుతం ఈ సిటీలో పోలిష్ జాతీయులు  చాలా తక్కువమంది ఉన్నారు.  ముస్లిం జనాభా ఏమో 62 శాతం అయి కూచుంది. ఆఫ్కోర్స్ ఇది కొన్నేళ్ల క్రితం పరిస్థితి, ఇప్పుడెంతో తెలీదు. ఇంకా పెరిగి ఉంటుంది. 

ప్రస్తుతం హాంట్రామిక్ అనే ఈ సిటీ, అమెరికా మొత్తం మీద ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నెంబర్ వన్ సిటీ అయి కూచుంది. ప్రస్తుతం ఈ సిటీ మేయర్ ఒక ముస్లిమ్. కౌన్సిల్ సభ్యులందరూ కూడా ముస్లిములే. కనుక ఈ విధమైన చట్టాన్ని వాళ్ళు పాస్ చేసుకున్నారు. పాపం అమెరికా రాజ్యాంగాన్ని వాళ్ళేమీ ధిక్కరించలేదు. సిటీ కౌన్సిల్ అధికారాలను ఉపయోగించుకుని, వాళ్ళ మెజారిటీ ప్రకారం, రాజ్యాంగపరిధిలోనే, వాళ్ళ చట్టం వాళ్ళు చేసుకున్నారు. అమెరికా కూడా నోర్మూసుకోవలసిందే. వీరిని ఏమీ చెయ్యలేని స్థితిలో ఉంది.

అంటే,  అమెరికాలో ఒక సిటీని ఆక్రమించి, మెజారిటీ పెంచుకుని, అక్కడ డైరెక్ట్ గా షరియాను అమలు చేయడం మొదలుపెట్టారన్నమాట. ప్రస్తుతం ఈ సిటీలో 24% బంగ్లాదేశీయులు, 38% యెమెన్ జాతీయులు ఉన్నారు. వీళ్ళందరూ ప్రస్తుతం అమెరికన్ సిటిజెన్సే. ఎప్పుడైతే వాళ్ళకు మెజారిటీ వచ్చిందో షరియా చట్టాలను పాస్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే వీళ్ళ జనాభా పెరగడం మొదలైందో, పోలిష్ జాతీయులు వాళ్ళ ఇళ్లను ఖాళీ చేసి అమెరికాలోని వేరే రాష్ట్రాలకు తరలిపోవడం మొదలైపోయింది. అంటే మన కాశ్మీర్లో లాగా అన్నమాట. అయితే కాశ్మీర్లో చేసినట్టు ఇక్కడ అరాచకాలు, దౌర్జన్యాలు, హత్యలు చేస్తే మర్నాడే సైన్యం దిగుతుంది. రెండో రోజు అందర్నీ కాల్చిపారేస్తారు.  ఆ భయంతో, అమెరికా రాజ్యాంగం ప్రకారం మెల్లిగా పోతూ, వాళ్లకు కావలసిన చట్టాలను వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే కాశ్మీర్ లాగా, లేకపోతే ఇలా అన్నమాట !

ఇప్పుడు అమెరికన్లకు భయం మొదలైంది. గగ్గోలు పెడుతున్నారు. 'ఇదేంటి? ఇన్నాళ్లూ మా సిటీ  చాలా ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు రోడ్లమీద మేకల్ని గొర్రెల్ని నరకడం మేము చూడాలా? హే జీసస్ ! వాట్ ఈస్ దిస్?' అని గోల పెడుతున్నారు.

Karma strikes back అంటే ఇదే మరి. ఈనాటికీ పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తోంది కదా అమెరికా? మరి దాని ఫలితం అనుభవించొద్దూ?

అంతే కాదు. PETA (People For Ethical Treatment of Animals) అనే సంస్థ గురించి అందరికీ తెలుసు కదా ! వీళ్ళు కూడా ఏమీ మాట్లాడలేక నోళ్లు మూసుకున్నారు. అంతా రాజ్యాంగపరంగానే జరుగుతోంది. కనుక వాళ్లకు కూడా వాయిస్ లేకుండా పోయింది.

ఇకపోతే, ఈ సిటీలో కొద్దిమంది తెల్ల అమెరికన్స్ మాత్రం పారిపోలేక ఇక్కడే మిగిలిపోయి ఉన్నారు. వాళ్లేమో LGBTQ వర్గానికి చెందినవారు.  అది వాళ్ళ మతం. వాళ్ళు తమ LGBTQ జెండాను కౌన్సిల్ సమావేశంలో ప్రదర్శిస్తే మిగతా కౌన్సిల్ సభ్యులంతా దాన్ని వ్యతిరేకించారు.

'ఇదేంటి? మీ విశ్వాసం ప్రకారం గొర్రెలని మేకల్ని మీ ఇంటి దొడ్లలో నరుక్కోవచ్చని మీరు రూల్ పాస్ చేసుకున్నారు సరే.  మరి మా విశ్వాసాన్ని ఎందుకు వద్దంటున్నారు?' అని LGBTQ అడిగితే,  'మీ దిక్కున్నచోట చెప్పుకోండి. ఇదింతే' అని మెజారిటీ కౌన్సిల్ సభ్యులన్నారు. ఇదంతా వార్తల్లో గుప్పుమంది.

నేను అబద్దాలు వ్రాయడం లేదు. కావాలంటే ఇక్కడ చూడండి.

https://www.freep.com/story/news/local/michigan/wayne/2023/01/11/hamtramck-city-council-approves-religious-animal-sacrifices-slaughter-home/69797191007/

అదృష్టవశాత్తూ, మన ఇండియాలో ఇలాంటి చట్టాలేమీ అవసరం లేదు. అక్కడ ఎవడికేమైనా ఎవడికీ పట్టదు. ఈద్ కి ఎన్ని కోట్ల మేకలు గొర్రెల తలలు తెగి పడతాయో ఎవడికీ పట్టదు. రెండ్రోజులనుకుంటారు, మూడోరోజు మర్చిపోతారు. హైదరాబాద్, కడప, కర్నూలు, గుంటూరు, ఆదోని, రాయచూర్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లలో అయితే రోడ్లమీదనే మేకల్ని గొర్రెల్ని పబ్లిగ్గా నరుకుతారు,  మామూలుగా అయితే, ప్రతిదానికీ గోలగోల చేసే PETA  వాళ్ళు కూడా అప్పుడెక్కడకు పోతారో కనిపించి చావరు. సడన్ గా మాయమై పోతారు. ఇదొక వింత !

జనాభాని పెంచు, మసీదు కట్టు, షరియా అమలు చెయ్, లోకల్స్ ని తరిమెయ్,  దేశం మాదే అను - భలే ఉంది కదూ ఈ సూత్రం! ఎన్ని జన్మలెత్తినా హిందువులు ఈ సూత్రాన్ని నేర్చుకోగలరా అసలు?

ఇండియా ఎలాగూ భ్రష్టు పట్టింది. త్వరలో అమెరికా కూడా పట్టబోతోంది.

శుభం !

NASA ఎలాగూ భూమిలాంటి కొత్త గ్రహాన్ని (Exo Planet) కనుక్కుంది. ఈ భూమిని ముస్లిమ్స్ కి వదిలేసి, మిగతావాళ్లందరూ ఆ భూమికి పారిపోతే బెటరేమో?

కానీ ఒక్క సలహా ! ఇండియా విభజన సమయంలో చేసినట్టు, మళ్ళీ కొంతమందిని దేశంలోనే ఉంచుకుని, కొంతమందికి మాత్రం మీ దేశంలో ఒక ముక్కను విడగొట్టి ఇవ్వకండి. కొంతకాలానికి ఈ ముక్కకూడా పోతుంది. అలాగే, భూమీ పోయి, ఆ ఎక్సో ప్లానెట్ కూడా పోతుంది.  అదీ పాయె ఇదీ పాయె అన్నట్టు అవుతుంది మీ బ్రతుకు !

తెలివితెచ్చుకోకపోతే మీ ఖర్మ ! అనుభవించేటప్పుడు అర్ధమౌతుంది !