“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, డిసెంబర్ 2022, గురువారం

మూడవ అమెరికా యాత్ర - 63 (ఇస్లాం చాలా సంస్కరింపబడాలి)

ముస్లిములలో కిరాతక మనస్తత్వాన్ని పెంచి పోషించడంలో ఖురాన్ పాత్ర ఎంతో ఉంది. ఎలాగంటారా?

తనను నమ్మి, తల్లిదండ్రులను ఎదిరించి, తనతో ఉంటూ, సంసారం చేసిన శ్రద్ధ అనే అమ్మాయిని 35 ముక్కలుగా నరికి నెలలపాటు ఫ్రిజ్ లో దాచిపెట్టి, రోజుకొక్క ముక్కగా ఎక్కడెక్కడో పారేస్తూ వచ్చిన, ఆఫ్తాబ్ పూనావాలా, పోలీసులు చేస్తున్న విచారణలోగాని, లై డిటెక్టర్ టెస్ట్ లో గాని, ఇతర టెస్టులలో గాని, ఎక్కడా పశ్చాత్తాపాన్ని చూపించలేదు. అతనికి తప్పు చేశానన్న స్పృహ కూడా లేదు. అంతటి రాక్షసుడుగా ఉన్నాడు. అంతేకాదు, శ్రద్ధను చంపి, ఆమె ఇంకా తన ఫ్రిజ్ లో ఉండగానే, ఇంకో అమ్మాయితో డేటింగ్ సైట్లో డేటింగ్ మొదలుపెట్టి,రూముకు పిలిపించుకుని, శ్రద్ధ బాడీ నుండి తీసిన ఉంగరాన్ని ఆ అమ్మాయికి గిఫ్ట్ గా ఇచ్చాడు. వీడి గురించి మాట్లాడటానికి, రాక్షసుడనే పదం చాలా చిన్నదేమో ! ఆ పదాన్ని వాడితే రాక్షసులే సిగ్గుతో సూయిసైడ్ చేసుకుంటారేమో?

నిన్నటికి నిన్న ఒక కొరియన్ వ్లాగర్ అమ్మాయి, బాంబే నడిరోడ్లమీద అల్లరికి గురయ్యింది. అదికూడా లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుండగా, ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని లాగి, బైక్ మీద ఎక్కమని అల్లరి చేసినది, మహమ్మద్ షేక్, మహమ్మద్ నకీబ్ అనే ఇద్దరు ముస్లిమ్స్. ఇద్దరినీ అరెస్టు చేశారు ముంబై పోలీసులు. వాళ్ళలోనూ పశ్చాత్తాపం లేదు.

మొన్నటికి మొన్న, "క్రిస్టియన్స్ ని అనుకరిస్తూ, పుట్టినరోజు పండుగలు జరుపుకోవడం ఇస్లాం పధ్ధతి కాదు, అలా జరుపుకోవద్దు" అంటూ ఒక ఫత్వాను జారీ చేశాడు ఒక  ఇండియా ఇమామ్. ఈ మోడ్రన్ కాలంలో అలా మాట్లాడుతున్నందుకు వాడికి సిగ్గు కూడా లేదు.

ఉదయపూర్లో కన్నయ్య లాల్ అనే టైలర్ని కొద్దీ నెలలక్రితం దారుణంగా చంపేశారు ఇద్దరు ముస్లిమ్స్. కారణం నూపుర్ శర్మను అతడు సపోర్ట్ చేశాడని. పోలీసులు ఇద్దరినీ పట్టుకున్నారు. వాళ్లలో కూడా పశ్చాత్తాపం లేదు.

ఎందుకిలా అవుతుంది?

అటువంటి పనులు చేసిన తర్వాత ఎలాంటి మనిషైనా సిగ్గుపడతాడు. పశ్చాత్తాపపడతాడు. ఏదో తెలియకో, వేడిలోనో అలాంటి తప్పులు చేసినా, ఆ తరువాత బాధతో కుమిలిపోతాడు. కొంతమంది నేరస్తులైతే, ఆ మానసికక్షోభను భరించలేక సూయిసైడ్ కూడా చేసుకుంటారు. కానీ, చాలామంది ముస్లిములలో ఆ పశ్చాత్తాపం కనిపించదు.

కారణమేంటి?

అది వాళ్ళ తప్పు కాదు. ఖురాన్ బోధలలోనే ఆ తప్పుంది.

ఇతరమతాల వాళ్ళు సైతాన్ భక్తులని అది బోధిస్తుంది. వాళ్ళను చంపినా, ఇంకేం చేసినా తప్పులేదని అది నొక్కి వక్కాణిస్తుంది. వాళ్ళ ఆస్తులను కాజేసినా, వాళ్ళ ఆడవాళ్లను ఎత్తుకుపోయినా, రేపులు చేసినా ఏమీ తప్పులేదని చెప్పడమే గాక, అలా చెయ్యమని,  అలా  చేస్తే స్వర్గంలో అల్లా పక్కన సీటు గ్యారంటీ అని, అది తాయిలాలు చూపిస్తూ బోధిస్తుంది. అవన్నీ సత్యాలని ఈనాటికీ ప్రతి శుక్రవారంనాడు, ముల్లాలు వీళ్లకు నూరిపోస్తూ ఉంటారు. అవి నిజాలేనని ప్రతి ముస్లిమూ నమ్ముతాడు. అందుకే అలాంటి పనులు చేసినప్పటికీ వాళ్లలో పశ్చాత్తాపం ఉండదు.

26/11 మారణకాండ ముంబాయిలో జరిగి ఇప్పటికి 14 ఏళ్లయింది. ఈ దాడిలో దొరికిన ఒకేఒక్క దోషి, అజ్మల్ కసబ్ లో ఏమాత్రమూ అపరాధభావన గాని, పశ్చాత్తాపం గాని కనిపించలేదు. కారణం వెరీ సింపుల్. నేను పైన చెప్పినదానిలోనే కారణం ఉంది. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళనలా రెచ్చగొడుతున్న ఖురాన్ బోధలదే అసలైన తప్పు.

ఇతర మతాల మనుషులు తమ బానిసలని, వాళ్ళను ఏమి చేసినా తప్పులేదని చెబుతున్న ఖురాన్ చీకటిబోధలను వాళ్ళు గుడ్డిగా నమ్మడము, ముల్లాలందరూ ప్రతిశుక్రవారం ప్రార్థనలలో వాళ్ళనలా నమ్మిస్తూ ఉండటమే దీనికంతా కారణం.

'అలా చెయ్యడం తప్పు,  అలాంటి నేరాలు మనం చెయ్యకూడదు. నీతిగా బ్రతకాలి. మతం ముఖ్యం కాదు, మానవత్వం ముఖ్యం' అని ఏ ముల్లా కూడా చెప్పడు. 'పుట్టినరోజులు జరుపుకోవద్దు, అది ఖురాన్ కు విరుద్ధం' అంటూ నిన్నగాక మొన్న ఫత్వా జారీ చేసిన ముల్లాయే, నేను చెబుతున్నది నిజమనడానికి ఉదాహరణ.

అసలు ముస్లిములు చేసే రోజువారీ ప్రార్ధనలోనే ద్వేషం దాగుంది. అదేంటి?

'లా ఇలాహ్ ఇల్లల్లాహ్ ముహమ్మదర్రసూలుల్లాహ్' అంటే అర్థమేంటి?

'అల్లా తప్ప వేరే దేవుడు లేడు. మహమ్మదొక్కడే ఆయన ప్రవక్త'. అని ఆ ప్రార్ధనకర్ధం.

అంటే, అర్థమేంటి? అల్లా తప్ప మిగిలిన ఎవరూ దేవుళ్ళు కారు అని ఆ ప్రార్ధన నర్మగర్భంగా  మాత్రమే కాదు, డైరెక్ట్ గానే చెబుతోంది. ఇతర ప్రవక్తలెవరూ ప్రవక్తలు కారు. మహమ్మద్ ఒక్కడే ప్రవక్త. ఆయన చెప్పిన ఖురానే దైవశాసనం, మిగతా మతాల గ్రంధాలన్నీ సైతాన్ పుస్తకాలని అది  క్లియర్ గా చెబుతోంది.

ముస్లిములు ప్రతిరోజూ చేసే దైవప్రార్థనలోనే అసలు నెగటివిటీ ఉంది. ద్వేషం ఉంది. ఇతరమతాలంటే, ప్రవక్తలంటే, అసహనభావం ఉంది. మరి అలాంటి ప్రార్ధనను ప్రతిరోజూ శ్రద్ధగా చేసేవాళ్ళు అలా ఉండక ఇంకెలా ఉంటారు? 

ఖురాన్లో హింసను ప్రేరేపించే సూరాలు బోలెడున్నాయి. పాకిస్తాన్ లోని తీవ్రవాద ముఠాలన్నీ ఆ సూరాలనే ఆధారంగా తీసుకుంటాయి. 'దేవుడే ఇలా చెయ్యమని మాకు చెప్పాడు, తప్పేముంది?' అని వాళ్ళు వాదిస్తారు. దానినే వాళ్ళు నమ్ముతారు కూడా. అందుకే ఎలాంటి ఘోరాలు చేసినా, వాళ్లలో పశ్చాత్తాపం ఎక్కడా కనపడదు దేవుడు చెప్పిన పనులనే తాము చేస్తున్నామని వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు.

ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూచినా, ఇతర మతాల విషయంలో ముస్లిముల ప్రవర్తన ఇలాగే ఉంటుంది. దీనికి మూలకారణం ఖురాన్ బోధలలోనే ఉంది.

వాటిని మార్చి, ఆ హింసాత్మక పద్యాలను ఖురాన్ నుంచి తొలగించి దానిని సంస్కరించనంతవరకూ ముస్లిమ్స్ లోని హింసాత్మకధోరణి పోదు.

కానీ అది ఎన్నటికైనా జరుగుతుందా? ఎన్నటికీ జరగదు. మరి వాళ్లెలా శాంతిగా మారతారు? అదీ జరగదు. మరేం జరగబోతోంది.

నేను చెప్పడమెందుకు? ఏం జరగబోతోందో ప్రపంచంలో అందరికీ తెలుసు. ఇజ్రాయెల్ లో ఏం జరుగుతోంది? ఇండియాలో ఏం జరుగుతోంది? అమెరికాలో ఏం జరుగుతోంది? ఇరాన్లో, సిరియాలో, రువాండాలో, ఉగాండాలో, ఇథియోపియాలో, నైజీరియాలో, ఆఫ్ఘనిస్తాన్ లో, చివరకు పాకిస్తాన్ లో కూడా ఏం జరుగుతోంది? మారణకాండ జరుగుతోంది. వాళ్ళు పెంచి పోషించిన తాలిబానే వాళ్ళను కాటేస్తోంది. ఎక్కడైనా అదే జరుగుతుంది.

మొన్నొక ముస్లిం ఫ్రెండ్ నాతో మాట్లాడుతూ, 'ప్రపంచదేశాలలో అన్నిట్లోనూ మా జనాభా పెరుగుతోంది. దేశదేశాలలో అతివేగంగా విస్తరిస్తున్న మతం ఇస్లామే' అన్నాడు. అది నిజమే. ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే, వాళ్లకు జనాభానియంత్రణ లేదు. ఇస్లాం అంటే ఇష్టపడి ఎవరూ గుంపులు గుంపులుగా దానిలోకి మారడం లేదు. వాళ్ళ జనాభా పెరగడం వల్ల ఇస్లాంకు మెజారిటీ వస్తోంది. 20 ఏళ్లలో వెయ్యిమంది ముస్లిమ్స్ లక్షమంది అవుతారు. మిగతావాళ్ళు రెండువేలు లేదా మూడువేలమంది అవుతారు. మరి జనాభా పెరగక ఏమౌతుంది?

ఈరోజు న్యూస్ చూశారా? UK లోని వేల్స్, లీసెస్టర్ లలో క్రిస్టియన్స్ మైనారిటీలయ్యారు.  ముస్లిం జనాభా 44 శాతం పెరిగింది. ఇంగ్లాండ్ లోని ఇంగ్లీష్ మేధావులందరూ ఏం చెయ్యాలో అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు. క్రైస్తవమతానికి ఆయువుపట్టులాంటి దేశంలో క్రైస్తవులు మైనారిటీలయ్యారు. ఊహించగలరా? రేపు ఇండియాలో కూడా ఇదే జరగబోతోంది.

ఒక ఇండియా శిష్యురాలు ఫోన్లో నాతో ఇలా అంది, 'ఎప్పటిదాకానో ఎందుకు? ఇప్పుడు మాత్రం హిందువులు మైనారిటీలు కారా? ప్రస్తుతం అలాగే బ్రతుకుతున్నాము కదా'

నిజమే అనిపించింది నాకు.

ఒక అమెరికన్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే అతనిలా అన్నాడు.

'మీ హిందువులు మా దేశంలో ఎన్ని గుళ్ళయినా కట్టుకోండి. మాకేమీ అభ్యంతరం లేదు. మీతో హానిలేదని మాకు తెలుసు. మీ జనాభా పెరగదు. మీరు మతమార్పిడి చెయ్యరు. కానీ ఒక్క మసీదును మా దేశంలో కడితే మేము చాలా కంగారుపడతాము. ఎందుకంటే, ముందు మసీదంటారు. తరువాత షరియా అంటారు. జనాభాను పెంచేస్తారు. తరువాత ఏకంగా  దేశమే మాదంటారు. ఇలా జరుగుతుందని మాకు బాగా తెలుసు. అందుకే మాకంటూ ఒక ప్లానుంది. మీ ఇండియావాళ్లకు ఒక ప్లానంటూ లేదు. ముందుముందు మీకు చాలా ట్రబులుంటుంది' అన్నాడు.

నాకు ఒప్పుకోక తప్పలేదు.

చైనాలోని ఊగిర్ ప్రావిన్స్ లో కూడా ముస్లింసమస్య ఉంది. అక్కడ, లక్షమంది ముస్లిం ఆడవాళ్లకు బలవంతంగా పామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించాడు జిన్ పింగ్. చైనాలో ఉండాలంటే చైనీయులుగా ఉండండి. మా రూల్స్ పాటిస్తూ ఉండండి. లేదంటే బయటకు పొండి' అని ఖచ్చితంగా చెప్పాడు. అది నిరంకుశ కమ్యూనిస్ట్ పరిపాలన గనుక అలా సాగింది. ప్రజాస్వామ్య దేశాలలో ఎలా సాగుతుంది? అందుకే ఇండియాలాంటి దేశాలలో కష్టాలు మొదలౌతున్నాయి.  ఇంగ్లాండ్ కంటే గొప్ప ఉదాహరణ ఇంకేదీ అవసరం లేదనుకుంటాను !

మూలాన్ని మార్చనంతవరకూ ఫలితాలెలా మారుతాయి? కళ్ళు మూసుకుని ఊరుకుంటే జనాభా పెరగకుండా ఉంటుందా? ఎవరేమన్నప్పటికీ, ఇంకొక 50 ఏళ్లలో, ప్రపంచదేశాలన్నింటిలో  ముస్లిములే మెజారిటీగా ఉంటారు. ఇస్లామే ప్రపంచమతం అవుతుంది. స్టాటిస్టికల్ వాస్తవాలు ఇదే నిజమంటున్నాయి.

దీనిని ఆపాలంటే, చైనా, ఇజ్రాయెల్ ల వల్లే అవుతుంది. ఇండియా వల్ల కాదు. ఏమంటే ఇండియాకు దాని రాజకీయవ్యవస్థయే పెద్ద అడ్డు అవుతుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇండియా దీనిని ఎదుర్కొనడం అసాధ్యం.

ముందు ముందు ఏం జరుగుతుందో చూడ్డానికి అసలు మనమంటూ ఉంటామా? డౌటే !