“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, ఫిబ్రవరి 2019, శనివారం

పుల్వామా టెర్రర్ ఎటాక్ - రాహుకేతువుల ప్రభావం

నేను టీవీ చూచి, న్యూస్ పేపర్ చూచి ఎన్నో నెలలైపోయింది. ఏడాది కూడా దాటి ఉండవచ్చు. అన్నీ అబద్దాలు చెప్పే చెత్త మీడియా మాయాజాలానికి మనం ఎందుకు దాసోహం అనాలనిపించి, మీడియా అంటే అసహ్యం పుట్టి, ఆ రెండూ చూడటం పూర్తిగా మానేశాను. ఈరోజు ఉదయం ఆఫీస్ లో మా కొలీగ్స్ చెప్పుకుంటుంటే ఈ విషయం తెలిసింది.

రెండు రోజుల క్రితం జమ్మూ లోని పుల్వామాలో ఇస్లాం రాక్షసుల ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధను కలిగించే సంఘటన. పాకిస్తాన్ దీనిని ఒక విజయంగా చిత్రీకరించుకోవచ్చు. విజయగర్వంతో పొంగిపోవచ్చు. కానీ ఇస్లాం చెబుతున్నదేమిటి? వీళ్ళు చేస్తున్నదేమిటి? అని ఆలోచిస్తే మహమ్మద్ ప్రవక్త కూడా వీళ్ళను చూచి సిగ్గుతో తలదించుకోవలసి వస్తుంది. వీళ్ళు చేస్తున్న దురాగతాలలో పాపాలలో ఆయన కూడా భాగం పంచుకోవలసి వస్తుంది.

ఎక్కడో మధ్యప్రాచ్యం నుండి దోపిడీదారులుగా మన దేశానికి వచ్చి, దౌర్జన్యంతో ఆక్రమించి, వందలాది ఏళ్ళపాటు దోచుకుని, ఇక్కడి సంస్కృతినీ శిల్పసంపదనూ ధ్వంసం చేసి, చివరకు దేశాన్ని మూడు ముక్కలుగా చేసిన తర్వాత కూడా ఇంకా ద్వేషం చల్లారక కొట్టుకుంటున్న వాళ్ళు 'ఇస్లాం' అంటూ వెధవనీతులు చెబుతుంటే దెయ్యాలు పురాణాలు వల్లించినట్లు ఉంది.

పాకిస్తాన్ అనేది భూగోళానికే ఒక శాపం. మానవజాతికే కళంకం. అది సైతాన్ కు ప్రతిరూపం. దానిని ఈ భూమినుంచి లేకుండా చేసినప్పుడే మానవజాతి శాంతిగా ఉండగలుగుతుంది. అది త్వరగా జరగాలని దేవుడిని ప్రార్ధిద్దాం.

ఈలోపల రాహుకేతువుల ఈ గోచారం ఈ టెర్రరిస్ట్ ఎటాక్ కు ఎలా కారణం అయిందో ఒక్కసారి చూద్దాం.

పాకిస్తాన్ లగ్నం మేషం. కనుక మేషరాశికి నేను వ్రాసిన ఫలితాలు దీనికి బాగా వర్తిస్తాయి. వీరికి విక్రమస్థానంలోకి ఉచ్చరాహువు వస్తున్నాడు. అందుకే వీళ్ళకు అతి ఉత్సాహం ఉన్నట్టుండి ఎక్కువైంది. ఈ ఎటాక్ ప్లాన్ చేశారు. జయప్రదంగా నిర్వహించారు.

భారతదేశపు లగ్నం వృషభం. ఇది ధర్మానికి చిహ్నం. పడ్డవాడు చెడ్డవాడు కాడు. మనకు శక్తీ యుక్తీ పుష్కలంగా ఉన్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్ కు 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్' హోదా ఇచ్చి నెత్తికెక్కించుకుంది. మనలని చావగోడుతూ మన సైనికుల్ని చంపుతూ ఉన్నందుకేమో అలాంటి హోదా ఇచ్చింది? మోడీ ప్రభుత్వం అలా కాదు. అది దెబ్బకు దెబ్బ తీస్తుంది. తియ్యాలి కూడా. అప్పుడే నీచ పాకిస్తాన్ కు బుద్ధి వస్తుంది. మనం బలంగా ఉంటేనే శత్రువు మనల్ని చూచి భయపడతాడు. లేదంటే మనకు తాటాకులు కడతాడు.

మనకు ద్వితీయంలోకి రాహువు వస్తున్నాడు. కనుక నష్టపోయినప్పటికీ అంతర్జాతీయ వేదికలమీద మన వాదనను స్పష్టంగా వినిపించగలుగుతాం. ప్రపంచదేశాల సింపతీని పొందగలుగుతాం. చివరకు విజయాన్ని సొంతం చేసుకోగలుగుతాం. రహస్యస్థానమైన అష్టమంలోకి ఉచ్చకేతువు వస్తున్నందున, మోడీ ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోదు. రహస్య ప్లాన్ తో ముందుకు వెళుతుంది. దెబ్బకు దెబ్బ తీస్తుంది. ఇంతకు పదింతలు పాకిస్తాన్ కు నష్టం జరుగుతుంది. ఇది తప్పదు.

శుక్రవారంనాడు పాకిస్తాన్లోని గడ్డంగాళ్ళు చేసే దొంగప్రార్ధనలు ఏమాత్రం సరిపోవు. అవి వాళ్ళను ఏమాత్రమూ కాపాడవు. నిత్యజీవితంలో నీతిగా బ్రతకాలి. అది లేకుండా అల్లా అల్లా అంటూ అరిస్తే అల్లాడుకుంటూ రావడానికి వాడేం పిచ్చోడు కాదు. చెప్పేవి నీతులు చేసేవి తప్పుడు పనులు అనే సామెత నీచ పాకిస్తాన్ కు కరెక్ట్ గా వర్తిస్తుంది కదూ !

త్వరలోనే పాకిస్తాన్ కు సరియైన శాస్తి జరగాలని భారతదేశ పౌరులుగా ఆశిద్దాం ! అంతేకాదు పరమేశ్వరుడిని ప్రార్ధిద్దాం కూడా !