“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, మార్చి 2010, సోమవారం

సూర్యోదయ, తిథి ప్రవేశ కుండలుల సామ్యం

ఉగాది నాడు తిథి ప్రవేశానికి, సూర్యోదయానికి మధ్య దాదాపు నాలుగు గంటల సమయం ఉన్నది. కనుక గ్రహపరిస్థితిలో పెద్ద మార్పు లేదు. లగ్నం మాత్రమే మారింది.

సూర్యోదయ కుండలిలో సహజంగా మీన లగ్నమేఅవుతుంది. కారణం సూర్యుడు మీన రాశిలో ఉండటమే. ప్రతి ఉగాదికి ఇదే లగ్నం ఉంటుంది. దాదాపుగా ప్రతిసారిఉగాదికి రవి చంద్రులు బుధ శుక్రులు ఇక్కడే ఉంటారు. ఇతర గ్రహాల స్తితిగతులు మాత్రమే మారుతాయి. కనుక విధానం అంత సరియైనది కాకపోవచ్చు. కాని బీవీ రామన్ లాటి ఉద్దండులు విధానాన్నే అనుసరించారు. నాలుగుగ్రహాలు అదే లగ్నంలో ఉన్నప్పటికీ, నక్షత్ర పాదాలను బట్టి నవాంశ చక్రంలో మార్పులు ఉండవచ్చు. బహుశా వారు విధానాన్ని అనుసరించటానికి ఇదే కారణం అయి ఉండవచ్చు.


పోస్ట్ లో పైన చెప్పిన రెండు చార్టుల మధ్య సామ్యాలు చూద్దాము.

>>తిథి ప్రవేశ కుండలిలో ధనుర్ లగ్నం అయింది. సూర్యోదయ కుండలిలో మీన లగ్నం అయింది. రెండు చార్టులలో కేంద్ర స్థానాలు నాలుగూ పాపాక్రాంతములయ్యాయి. ఇదొక గమనించదగిన సూచన. పంచభూతములలో ఆకాశ తత్వం మినహా మిగిలిన నాలుగు రాశులూ పాప గ్రహాల ఆధీనంలో ఉన్నాయి. ఇది మంచి సూచన కాదు.

>>తిథి ప్రవేశ కుండలిలో గురువు యొక్క రాశిలో లగ్న రాహువు వల్ల గురు చండాల యోగం కలిగింది. ఇదినాయకుల మరియు మత నాయకుల మోసాలకు సూచిక. సూర్యోదయ కుండలిలో లగ్నంలోని నాలుగు గ్రహాల వల్లఅనేక ఆటు పోట్లు ఎదురౌతాయి. దాదాపు ఫలితాలు ఒకేలా ఉన్నాయి.

>>తిథి ప్రవేశ కుండలిలో సుఖ స్థానంలో నాలుగు గ్రహాలు-అందులో బుధుడు నీచ, శుక్రుడు ఉచ్చ స్తితులలోఉన్నారు.శుక్ల పాడ్యమి కనుక అమావాస్య ప్రభావం సుఖ స్థానం మీద ఉంటుంది. వెరసి ప్రజాజీవనంలో సుఖంలోపించింది. ఒక్క శుక్ర దశ మాత్రమే బాగుంటుంది. సూర్యోదయ కుండలిలో-సుఖ స్థానంలో కేతువు స్థితివల్ల ఇదేఫలితం ఉంటుంది. కేతు దశలో హటాత్ సంఘటనలవల్ల జన జీవనంలో సుఖం లోపిస్తుంది. ఇక్కడ కూడా రెండు చక్రములూ దాదాపు ఒకె ఫలితాన్ని సూచిస్తున్నాయి.

>>తిథి ప్రవేశ కుండలి లో-దశమంలో వక్ర శని వల్ల పరిపాలన లోపాలు, ఆలస్యాలు, అనుకున్న సమయానికిప్రాజెక్టులు పూర్తి కాకపోవటం, పనులు జరగక పోవటం ఉంటాయి.ప్రభుత్వం మీద ప్రజల వత్తిడి తీవ్రమ్ అవుతుంది. సూర్యోదయ కుండలిలో- దశమంలో రాహువు ఉన్నాడు. శనివత్ రాహు అనే సూత్రమ్ ప్రకారం తిరిగి అదే ఫలితాలు ఉంటాయి. ఒక రకంగా చూస్తే రాహువే ఇంకా ప్రమాదకారి. కనుక రెండు చార్టులూ మళ్ళీ అవే ఫలితాలను చూపుతున్నాయి.

>>తిథి ప్రవేశ కుండలిలో- సప్తమంలో కేతువు ఉన్నాడు. అదే సూర్యోదయ కుండలిలో అయితే - సప్తమంలో వక్ర శని ఉన్నాడు. ఏ రకంగా చూచినా పరిపాలనా యంత్రాంగానికి, ప్రతిపక్షాలకూ మంచిది కాదు. కేతువు వల్ల హఠాత్ సంఘటనలు, శని వల్ల ఆలస్యం, పనులు కాక చికాకులు పెట్టటం, పరిపాలనలో సామాన్య ప్రజల అతి జోక్యం జరుగుతాయి. పరిపాలనా పరంగ ఇవి మంచివి కావు.

>> ఇక పోతే, జలతత్వ రాశిలొ నీచ కుజుని వల్ల- మొదటి చార్ట్ ప్రకారం- ఫైనాన్స్ రంగం నష్టపోవటం, నాయకుల మరణం, అగ్ని,జల ప్రమాదాలు జరుగుతాయి. రెండవ చార్ట్ ప్రకారం కూడా ఇవే మళ్ళీ సూచింపబడుతున్నాయి. అయితే కుజ దశ తేదీలు కొద్దిగా మారుతాయి. ఆ సమయంలో వచ్చె అమావాస్య, పౌర్ణమి రోజులకు రెండు మూడు రోజులు అటూ ఇటూ గా ఇవి జరుగుతాయి.

ఏతా వాతా, రెండు చక్రములూ దాదాపు ఒకే ఫలితాలను సూచిస్తున్నాయి కనుక ఈ ఏడాది బాగ లేదని చెప్పవచ్చు.