Love the country you live in OR Live in the country you love

20, ఆగస్టు 2017, ఆదివారం

ఉత్కళ ఎక్స్ ప్రెస్ ప్రమాదం - అమావాస్య ప్రభావానికి మళ్ళీ రుజువు

అమావాస్య ప్రభావం మళ్ళీ నిజమైంది. రేపు అమావాస్య. సరిగ్గా ఒక్కరోజు ముందు, శనివారం రాత్రి 11.55 కి ఉత్తర ప్రదేశ్ లో ఖతౌలి అనే స్టేషన్ దగ్గర పూరీ - హరిద్వార్ ఉత్కళ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. 24 మంది ప్రయాణీకులు చనిపోయారు. 156 మంది గాయపడ్డారు. వీళ్ళలో మళ్ళీ 14 మంది పరిస్థితి సీరియస్ గా ఉంది.

యధావిధిగా అందరూ సోషల్ మీడియాలో పెద్దపెద్ద మాటలు చెబుతున్నారు. కానీ నిజంగా తీసుకోవలసిన చర్యలు తీసుకుంటున్నారా? రెండు రోజుల తర్వాత షరా మామూలే అంటూ అన్నీ మర్చిపోయి ఇంకో న్యూస్ మీదకు వెళ్ళిపోతారా? మన ఇండియాలో ఇది మామూలేగా. ప్రతి ఏడాదీ వరదలు వస్తూనే ఉంటాయి. ఊళ్లు మునిగిపోతూనే ఉంటాయి. ప్రతి ఏడాదీ రైళ్ళు పడిపోతూనే ఉంటాయి. జనం చస్తూనే ఉంటారు. మనం మాత్రం ఎవడో ఒక చిరుద్యోగిని బకరాని చేసేసి, జనాల కంటి తుడుపుగా ఏవో నాలుగు స్టేట్మెంట్లు పారేసి ముందుకు సాగిపోతూనే ఉంటాం.

అధికారులు రాజుల్లా ఫీలై పోతూ వారివారి ఈగో కోటలలో కూచుని లెక్చర్లు ఇస్తున్నంత వరకూ ఇవి జరుగుతూనే ఉంటాయి. రియాలిటీని పట్టించుకోకుండా ఊహాలోకాలలో విహరిస్తున్నంతవరకూ ఇవి జరుగుతూనే ఉంటాయి. రాజకీయ నాయకులు జనాన్ని మాయమాటలతో మభ్యపెడుతున్నంతవరకూ ఇవి జరుగుతూనే ఉంటాయి. ఏం చేస్తాం? మన దేశం ఇంతే !! జ్యోతిష్య సూత్రాలు మాత్రం మళ్ళీ మళ్ళీ రుజువౌతూనే ఉంటాయి.

It 'always' happens only in India. జైహింద్.