24, జులై 2014, గురువారం

ఊహించినవి-జరిగినవి(26)

కాలజ్ఞానం 26 లో ఊహించినట్లు ఈ క్రింది సంఘటనలు 22,23 తేదీలలో జరిగాయి.

తన కర్ణాటక సంగీతజ్ఞానంతో కొన్ని వందల కచేరీలు చేసి చుట్టు పక్కల గ్రామాలలో 'సంగీతం మామ్మ'గా ఎంతో పేరు సంపాదించిన మేదరమెట్ల పర్వతవర్ధని(82) దుగ్గిరాల మండలంలో 22.7.2014 న చనిపోయారు.

ప్రపంచవ్యాప్తంగా కొంతమంది మ్యుజీషియన్స్ ఈ రెండు రోజులలో చనిపోయారు.వారి వివరాలు నెట్ లో చూడవచ్చు.

అలాగే,మతపరమైన రంగాలలో చూస్తే--అమర్నాథ్ యాత్రలో గ్యాస్ సిలెండర్ పేలి నలుగురు చనిపోయారు.శివసేన MP ఒకాయన రంజాన్ దీక్షలో ఉన్న ఒక ముస్లిం చేత బలవంతంగా రొట్టె తినిపించబోయారని లోక్ సభలో గందరగోళం అయ్యింది.తాము మోసగించబడుతున్నామని ముస్లిం కమ్యూనిటీలో కొందరు భావిస్తున్నారు.దానికి ఉద్ధవ్ ధాకరే సంజాయిషీ కూడా ఇవ్వవలసి వచ్చింది.

షిర్డీ సాయిబాబా దేవుడు కాడు ఒక ముస్లిం సెయింట్ మాత్రమే అని అన్నందుకు ద్వారకా శంకరాచార్యను కోర్టుకు వచ్చి హాజరు అయ్యి తన వాదనను వినిపించవలసిందిగా న్యాయస్థానం ఆదేశించింది.

ఈరోజు(24-7-2014) న జరిగినవి:--

>>మనోహరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర లెవల్ క్రాసింగ్ ప్రమాదంలో స్కూల్ బస్ ను నాందేడ్ పాసింజర్ రైలు డీ కొట్టి 26(?) మంది చిన్నపిల్లలు చనిపోయారు.

>>ప్రముఖ సాహిత్య విమర్శకుడు భాషా శాస్త్రవేత్త  చేకూరి రామారావు ఈరోజున అకస్మాత్తుగా గతించారు.
read more " ఊహించినవి-జరిగినవి(26) "

21, జులై 2014, సోమవారం

కాలజ్ఞానం -26

జూలై 22,23 తేదీలలో ఈ క్రింది సంఘటనలు జరుగవచ్చు.

సాంస్కృతిక,కళా,విద్యారంగాలలోని వారు ప్రమాదాలకు గురవ్వడం గాని. గతించడం గాని జరుగుతుంది.

ధార్మిక,మతరంగాల్లో ఉన్నవారికి మనశ్శాంతి కరువయ్యే,లేదా మోసపోయే సూచనలున్నాయి.
read more " కాలజ్ఞానం -26 "

20, జులై 2014, ఆదివారం

జ్యోతిష్యశాస్త్రం సత్యమే అనడానికి ఇంకొక రుజువు

నేను 17-7-2014 న వ్రాసిన కాలజ్ఞానం-25 అనే పోస్ట్ లో ఇలా ఊహించాను.

"కన్య సహజరాశిచక్రంలో రోగస్థానం గనుక మొండి ఎపిడెమిక్ వ్యాధులు సమాజంలో తలెత్తే అవకాశం ఉన్నది.ముఖ్యంగా మలేరియా,డెంగ్యూ,చికెన్ గున్యా,జపనీస్ ఎన్కెఫలైటిస్ వంటి వ్యాధులూ ఈగలూ దోమల వల్ల వచ్చే వ్యాధులూ వైరల్ జ్వరాలూ విజృంభించే ప్రమాదం ఉన్నది."

ఈరోజు 'ద హిందూ' దినపత్రిక ఏమంటున్నదో చూద్దామా?

KOLKATA, July 20, 2014

Encephalitis red alert in Bengal, toll 45


With 45 deaths due to encephalitis reported in the districts of north Bengal, the West Bengal government on Saturday issued a red alert in seven districts of the region.

State Minister for North Bengal Development Gautam Deb told journalist at Siliguri that a fever clinic would be set up in the North Bengal Medical College and Hospital and experts will collect samples from patients there. A high-level meeting will be held at Uttar Kanya, the extension of the Secretariat in north Bengal, on July 21 to assess the situation.

“With the death of one more person due to Japanese Encephalitis in the North Bengal Medical College and Hospital (NBMCH) on Saturday, the death toll has reached 45 in north Bengal,” NBMCH superintendent Amarendranath Sarkar told The Hindu.

The deaths have occurred over the past three weeks.

Dr. Sarkar also said that of the 200 patients who underwent tests so far 49 were diagnosed with Japanese Encephalitis and the rest showed acute encephalitis syndrome.

According to doctors, Japanese Encephalitis claimed thirteen deaths, acute encephalitis syndrome the rest. At present, 36 patients are undergoing treatment in NBMCH.

Encephalitis is a mosquito-borne viral disease, birds living near water bodies and pigs are its vectors. A person is diagnosed with encephalitis when the encephalitis virus is detected in the body; if the virus is not detected, it is termed as acute encephalitis syndrome.

With the State government issuing alert, health officials are going door to door collecting samples. Jaganath Sarkar the Chief Medical officer of Health (CMOH) told The Hindu that health workers were also visiting remote areas to collect blood samples.

Most of the patients admitted to NBMCH are from Jalpaiguri, Darjeeling, Cooch Behar districts. Some are also from Malda, Uttar Dinajpur and Dakshin Dinajpur districts.
read more " జ్యోతిష్యశాస్త్రం సత్యమే అనడానికి ఇంకొక రుజువు "

19, జులై 2014, శనివారం

ముందే చెప్పొచ్చు కదా?

మలేషియా విమానం MH 17 కూలిపోయిన సంఘటన గురించి వ్రాశాక నాకు కొన్ని మెయిల్స్ వచ్చాయి.

నాకు దాదాపు ప్రతిరోజూ చాలామంది నుంచి ఇలాంటి మెయిల్స్ వస్తుంటాయి.

'మీరు ఏదైనా సంఘటన జరిగిన తర్వాత జ్యోతిష్య పరంగా వ్రాస్తారు.ముందే చెప్పొచ్చు కదా.ఆపద జరగకుండా నివారించవచ్చు కదా?' అని వాటిలో వ్రాస్తుంటారు.

కొంతమంది బాగా దగ్గర మిత్రులు కూడా ఇదే విషయాన్ని అడుగుతూ ఉంటారు.

వాళ్ళ అమాయకత్వానికి నాకు జాలీ కలుగుతుంది.నవ్వూ వస్తుంది.

కర్మసూక్ష్మాలు ఎలా ఉంటాయో తెలియక వారు అలా మాట్లాడుతూ ఉంటారు.బాధితుల మీద జాలితో అలా మాట్లాడుతూ ఉంటారు.అందుకే వారిపైన నాకు కోపం రాదు.

వారికి తెలియని కొన్ని విషయాలున్నాయి.ఆ విషయాలను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను.

వ్యక్తిగత జీవితాలలో జరగబోయేది ముందుగా ఊహించవచ్చు.దానిని తప్పుకోడానికి రెమేడీలు చేసుకుని తప్పుకోవచ్చు.ఇలాంటివి కొన్ని వేలు నేను నా జీవితంలో కాని,నా సన్నిహితుల జీవితాలలో కాని ఎన్నోసార్లు చేశాను.కాని అలాంటి రెమేడీలను చెప్పినా కూడా అందరూ చెయ్యలేరు.ఇది వినడానికి వింతగా ఉంటుంది కాని-- పచ్చినిజం.అలా రెమేడీలు చెయ్యాలంటే కూడా ఆ జాతకునికి కొన్ని అర్హతలు ఉండాలి.

నిన్న విమాన ప్రమాదంలో కూడా ఒక కుటుంబం రక్షించబడింది.వాళ్ళు అదే విమానంలో ప్రయాణించాలని విమానాశ్రయానికి వచ్చారు.కాని వారికి సీట్లు లేనందువల్ల ఇంకొక విమానంలో టికెట్లు ఇవ్వబడ్డాయి.ముందు వారుకూడా 'ఈ విమానం మిస్సయిందే' అని బాధపడ్డారు.ఈ ప్రమాదం జరిగాక దిమ్మెరపోయి,తమను కాపాడిన ఏదో శక్తిని తలచుకొని ఇప్పుడు కృతజ్ఞతలు చెబుతున్నారు. కర్మసూత్రాలు ఇలా ఉంటాయి.

సామూహికంగా జరగబోయేవి కూడా ముందుగా ఊహించవచ్చు.కాని వాటిని తప్పించలేము.సామూహిక దృఢకర్మను తప్పించడం చాలా కష్టం.కష్టం అనే మాటకు అర్ధం- 'చెయ్యలేమని' కాదు.చెయ్యవచ్చు.కాని దానికి పరిహారంగా త్యాగం చెయ్యడానికి ముందుకు వచ్చే మనుష్యులు ఎక్కడున్నారు?

కంటికి కన్ను పంటికి పన్ను అనేదే ప్రకృతి నియమం.ప్రకృతిలో జాలి అనేది లేదు.నియమం(Law) మాత్రమే ఉన్నది.ఒకరి ప్రాణాన్ని కాపాడాలంటే ఇంకొకరు తమ ప్రాణాన్ని అర్పించాలి.అక్కడ ఆ సమయంలో ఆపరేట్ అవుతున్న కర్మనియమాన్ని (Karmic Law) తృప్తి పరచాలి.అలా చేసేవారు ఎవరున్నారు?ఈ ప్రపంచం మొత్తంలో అలాంటివాళ్ళు ఒక్కరూ లేరు.అందరూ ఉత్త మాటలు చెప్పే స్వార్ధపరులే గాని ఒకరికోసం తమ ప్రాణాన్ని అర్పించే నిస్వార్ధపరులు ఎవరున్నారు?

మాటలు మాత్రం తేలికగా చెప్పవచ్చు గనుక ఎన్నైనా చెబుతారు.అదే నిజజీవితంలో అయితే ఎంగిలి చేతితో కాకిని కూడా విదిలించరు.కొన్ని మెతుకులు దానికి పోతాయేమో అని. 

కొన్నేళ్ళ క్రితం నిజంగా జరిగిన ఒక ఉదాహరణను చెబితే విషయం బాగా అర్ధమౌతుంది.

ఇదే పాయింట్ మీద చాలాసార్లు అడిగి వాదించే సన్నిహితుడైన పెద్దమనిషి ఒకాయన ఉండేవాడు.ఆయన కూడా ఇదే విషయం మీద ఎన్నోసార్లు నన్ను గతంలో ప్రశ్నించాడు.చాలాసార్లు కర్మతీరు ఎలా ఉంటుందో అతనికి ఎంతో ఓపికగా వివరించేవాడిని.కాని అతను ఒప్పుకునేవాడు కాదు.చాలామంది ఇలాగే ఒప్పుకోలేరు.చాలాసార్లు ఇలా మొండిగా వాదించేవారిలో పచ్చి స్వార్ధం దాగి ఉంటుంది.అదే వారిచేత అలా మాట్లాడిస్తుంది.

ఒక చెడు జరుగబోతున్నపుడు ముందే తెలుసుకుని తప్పిస్తేనే జ్యోతిష్యం యొక్క ఉపయోగం.లేకుంటే అది దండగ అని ఆయన మూర్ఖంగా వాదించేవాడు.తెలుసుకున్నంత మాత్రాన తప్పించడం సాధ్యం కాదు దాని వెనుక చాలా లెక్కలుంటాయి అని ఎంత చెప్పినా అర్ధం చేసుకునే వాడు కాదు.డబ్బుతో ఏదైనా చెయ్యవచ్చు అనే అహం అతనిలో బాగా ఉండేది. డబ్బులు పడేసి రెమేడీలు చేయిస్తే సరిపోతుంది అనుకునేవాడు.కొన్నికొన్ని సార్లు డబ్బులు ఉన్నా పనులు కావు,కర్మ నియమాలు నీ డబ్బుకు లొంగవు అని ఎంత చెప్పినా అతనికి అర్ధం అయ్యేది కాదు. 

ఇతనికి ప్రాక్టికల్ ఉదాహరణతో చూపిస్తే గాని అర్ధం కాదనుకుని నేనూ నవ్వుతూ ఊరుకునేవాడిని.

ఒకసారి ఏదో సందర్భంగా వాళ్ళ అల్లుడి జాతకం నాకు చూపించాడు.అది పరిశీలించినప్పుడు,ఇన్నాళ్ళూ అతను దేనినైతే అడుగుతున్నాడో దానిని ఇతనికి అర్ధమయ్యేలా చేసే సమయం వచ్చిందని నాకు అర్ధమైంది.

ఆ అల్లుడికి త్వరలో ఒక యాక్సిడెంట్ జరగబోతున్నదని జాతకంలో సూచన ఉన్నది.అదే విషయం అతనితో చెప్పాను.

అతను యధాప్రకారం ఊహించినట్లే అన్నాడు.

'దీనిని తప్పిస్తేనే మీ జ్యోతిష్యాన్ని నమ్ముతాను'

నేను నవ్వుతూ ఇలా అన్నాను.

'తప్పిస్తే ఎలా నమ్ముతారు?తప్పిపోతే,అసలు అది రాసిపెట్టి ఉన్నదో లేదో మనకు ఎలా తెలుస్తుంది? జరిగితేనే కదా తెలిసేది.ప్రతిరోజూ మనకు అనేకం తప్పిపోతుంటాయి.కాని మనం దైవానికి కృతజ్ఞతలు చెప్పడం లేదే? జరగకపోతే నా గొప్ప.జరిగితే నీ తప్పు అనేగా మనం దేవుడిని అనేది?' అన్నాను.

అతను కాసేపు ఆలోచించాడు.

'అలా కాదు.మీరు చెప్పినట్లు యాక్సిడెంట్ జరగబోయే పరిస్థితి ఎదురు కావాలి.అంటే, 'ఇప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది' అని చూచేవారికి అందరికీ తెలియాలి.ఇక అయిపొయింది.యాక్సిడెంట్ తప్పదు.అన్న సీన్ క్రియేట్ కావాలి.అప్పుడు అది జరగకుండా తప్పిపోవాలి.అలా జరిగితే మీరు చెప్పినది నమ్ముతాను' అన్నాడు.

నాకు భలే నవ్వొచ్చింది.

మనుష్యులు తెలివితెటలలో నక్కను కూడా మించిపోయారు.కాని ఎంత అతితెలివి సంపాదించినా ప్రకృతినియమాలను వారు తప్పుకోలేరు.

'అంటే.ఏది ఎలా జరగాలో దేవుడినీ ప్రకృతినీ కూడా నిర్దేశించేటంత అహంకారం మీలో పెరిగిపోయిందన్న మాట' అన్నాను.

'మీరేమైనా అనుకోండి.ఇలా జరిగితేనే నేను నమ్ముతాను.లేకుంటే మీ కబుర్లు నేను నమ్మను' అన్నాడు.

'మీరు నమ్మకపోతే నాకు వచ్చిన నష్టం ఏమీలేదు.మిమ్మల్ని నమ్మించవలసిన అవసరమూ నాకు లేదు' అన్నాను.

'అలా అని తప్పించుకోవాలని చూడకండి' అన్నాడు తెలివిగా.

'సరే.మీ అల్లుడికి జరగబోయే ప్రమాదాన్ని తప్పించాలంటే మీరు కొన్ని రెమేడీలు చెయ్యవలసి ఉంటుంది.' అన్నాను.

'చేస్తాను.దానిదేముంది?ఎంత అవుతుంది?' అన్నాడు డబ్బు అహంకారంతో.

'తొందరపడకండి.దీనికి డబ్బుతో పనిలేదు.మీరే దీనిని చెయ్యాలి.అదికూడా ఎక్కడో దూరంగా కాదు,నా ముందే చెయ్యాలి' అన్నాను.

అతను వింతగా చూచాడు.

'ఎప్పుడో చెప్పండి?' అడిగాడు.

'ఎప్పుడో ఎందుకు.ఇప్పుడే చేద్దాం.అయితే మీరు సిద్ధమేనా మరి?' అన్నాను.

'సిద్ధమే' అన్నాడు.

'మళ్ళీ తర్వాత వెనక్కు పోకూడదు.' అన్నాను సీరియస్ గా.

'అది మా వంశం లోనే లేదు' అన్నాడు పౌరుషంగా.మాటమాటకూ వాళ్ళ వంశాన్ని గుర్తుచేసుకుని మీసాలు మేలేసే కులం వారిది.

'సరే.ఉండండి.' అని ఆయన చేతికి ఒక చాకూ బాటిలూ ఇచ్చాను.

'ఇదేంటి?' అంటూ అయోమయంగా చూస్తున్నాడు.

'కంటికి కన్ను పంటికి పన్ను అనేది ప్రకృతి నియమం.మీ అల్లుడికి జరుగబోయే ప్రమాదం తప్పించాలంటే మీరు దానికి బలి కావాలి.మీ త్యాగం మీ అల్లుణ్ణి రక్షిస్తుంది.ప్రకృతి నియమాన్ని తృప్తి పరుస్తుంది.' అన్నాను.

'ఏం చెయ్యాలి?' అన్నాడు.

'ఈ చాకుతో మీ కుడిచేతి మోచెయ్యి గుంతలో లోతుగా గుచ్చి కోసుకోండి.ఆ వచ్చే రక్తాన్ని ఈ బాటిల్లో పట్టి నా ముందు పెట్టండి' అన్నాను. 

అతను బిత్తరపోయాడు.

'ఇదేంటి? ఇదేం రెమెడీ? రెమెడీ అంటే మీరేదో పూజ చేయిస్తారనో,మొక్కులు మొక్కిస్తారనో అనుకున్నాను.ఇదేంటి ఘోరం?' అన్నాడు.

'ఘోరాన్ని ఆపడానికి ఘోరమే చెయ్యాలి.తప్పదు.ఇది పూజ కాదని ఎవరన్నారు?కమాన్ కానివ్వండి.' అన్నాను.

అతను నా ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు.

'ఇది నేను చెయ్యలేను.'అన్నాడు.

'ఎందుకని?' అనడిగాను.

'సపోజ్ నేను ఇది చేశాననుకోండి.మా అల్లుడికి ఏమీ జరగదు కదా?' అన్నాడు.

'జరగదు.దానికి నేను హామీ ఇస్తున్నాను' అన్నాను.

'మరి ఏమీ జరక్క పోతే నాకు ఎలా తెలుస్తుంది?' అన్నాడు.

'అదే మరి ఇందాకటి నుంచీ నేను చెబుతున్నది.అంటే జరిగితేనే మీరు నమ్ముతారు.తప్పిపోతే మీరు నమ్మరు అంతే కదా?అయినా మీ అల్లుడి కోసం మీ రక్తాన్ని కొంత ఇవ్వలేరా?' అన్నాను.

'అలా కాదు.నేను చెప్పినట్లుగా,నాకు అర్ధమయ్యేటట్లుగా తప్పిపోవాలి. అదేగా నేనూ చెబుతున్నది.' అన్నాడు మొండిగా.

'అలాగే తప్పిపోతుంది.మీకు అర్ధమయ్యేటట్లే తప్పిపోతుంది.కానివ్వండి' అన్నాను.

అనుమానంగా చూచాడు.

'సారీ సార్.నేనిది చెయ్యలేను.' అన్నాడు చాకు పక్కన పెడుతూ.

'అంటే మీ అల్లుడు ఏమై పోయినా మీకు పరవాలేదా?' అన్నాను అతన్ని రివర్స్ లో ఉడికిస్తూ.

అతనికి చాలా కోపం వచ్చింది.

'మీరు కాకపోతే లక్షమంది జ్యోతిష్కులున్నారు.వాళ్ళను అడుగుతాను. ఇలాంటి రాక్షస రెమేడీలు నేను చెయ్యలేను.' అంటూ విసురుగా లేచాడు.

'అవును.రాక్షస రెమేడీలు చెయ్యలేరు.కానీ రాక్షసపు వృత్తి మాత్రం చెయ్యగలరు.అంతేగా?' అడిగాను ఇంకా తనని వెర్రెక్కిస్తూ.

అతను ఫైనాన్స్ బిజినెస్ (వడ్డీ వ్యాపారం) చేస్తూ ఉంటాడు.రియల్ ఎస్టేట్ కూడా ఉన్నది.ఈ రెండు వ్యాపారాలలో జరిగేది పచ్చిమోసం చెయ్యడమూ,ఎదుటి మనిషి రక్తాన్ని జలగలా పీల్చడాలేగా?

అతను విసురుగా వెళ్ళిపోయాడు.

తర్వాత కొన్నాళ్ళకు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.

వాళ్ళ అల్లుడు కారు డ్రైవ్ చేస్తూ ఎక్కడికో వెళుతున్నాడు.విండో గ్లాస్ కిందకు దించి మోచేతిని అందులోనుంచి బయటకు పెట్టి ఒక చేతితో కారు డ్రైవ్ చేస్తున్నాడు.పక్కనుంచి ఒక లారీ పోతూ ఆ మోచేతిని కొట్టేసి వెళ్ళిపోయింది.ఎముక విరిగి బయటకు పొడుచుకుని వచ్చింది.కొన్నాళ్ళు అతన్ని ఆస్పత్రిలో ఉంచి కాంప్లికేషన్స్ పెరిగిపోతుంటే మోచెయ్యి వరకూ చేతిని తీసేశారు.

ఆ తర్వాత కూడా ఆ మామగారు కొన్ని సార్లు నాకు కనిపించేవాడు.కాని నాతో మాట్లాడేవాడు కాదు.కోపంగా చూస్తూ వెళ్ళిపోయేవాడు.నేను నవ్వుకుని ఊరుకునేవాడిని.

ఆయన కోపానికి అర్ధం ఏమిటంటే--'నాకు ఇంతకంటే సింపుల్ రెమెడీ ఏదో తెలుసనీ,అది తెలిసి కూడా నేను చేయించలేదనీ,కావాలనీ అలాంటి పరీక్ష పెట్టి ఆయన్ను ఉడికించాననీ,ఆయన చెయ్యలేని ఒక పనిని రెమెడీగా చెప్పి తప్పుకున్నాననీ,తత్ఫలితంగా వాళ్ళ అల్లుడికి చెయ్యి పోయిందనీ'--ఆయన అనుకునేవాడు.

ఎవరో జ్యోతిష్కులనడిగి రుద్రాభిషేకాలూ ఇంకా ఏవేవో రెమేడీలు ఆయన చేయించే ఉంటాడు.కాని అవేవీ పనిచెయ్యలేదు.వాటి దారి వాటిదే.కర్మ దారి కర్మదే.

ఈ మధ్యనే ఆయన చనిపోయాడని కొందరు మిత్రుల ద్వారా తెలిసింది.

రెమేడీలు ఎలా ఉండాలో మనం నిర్ణయించకూడదు.అవి ఎలా ఉన్నా సరే చేసే ధైర్యం మనలో ఉండాలి.అప్పుడే ప్రకృతిని ఎదుర్కోనగలుగుతాం.కర్మను మార్చగలుగుతాం.ఒక్కొక్కసారి ఒక ప్రాణాన్ని రక్షించడానికి ఇంకొక ప్రాణాన్ని బలి చెయ్యవలసి వస్తుంది.అదే దానికి రెమెడీ.

ఉదాహరణకు నిన్న జరిగిన మలేషియా విమానం ప్రమాదంలో 298 మంది చనిపోయారు.వారిని రక్షించి ఉంటె బాగుండేది అని చాలామందికి అనిపిస్తుంది.అందులో చాలామంది పిల్లలు కూడా ఉన్నారు.కనీసం వారినైనా రక్షించి ఉంటె బాగుండేది.పాపం చిన్నపిల్లలు కదా అని ఎవరికైనా అనిపిస్తుంది.

కాని ప్రకృతి నియమాలు వేరుగా ఉంటాయి.కర్మరహస్యాలు చాలా గహనమైనవి.మనం ఇప్పుడు కనిపిస్తున్న సీన్ మాత్రమె చూస్తున్నాం. గతంలో ఏం జరిగిందో,దేని ప్రతిక్రియగా ఇది ఇప్పుడు జరిగిందో మనకున్న స్వల్పదృష్టితో మనం చూడలేం.

ప్రేక్షకుడికి ఇప్పుడు చూస్తున్న ఒక్క సీన్ మాత్రమే కనిపిస్తుంది.కాని దర్శకుడికి అన్ని సీన్లూ తెలుస్తాయి.జరిగినవీ జరగబోయేవీ కూడా తెలుస్తాయి.అందుకే ఏం జరిగినా అతను చలించడు.కానీ మొత్తం సీన్లు అన్నీ తెలియని ప్రేక్షకుడు ఆ ఒక్క సీన్ మాత్రమే నిజం అనుకుని చలించి పోతాడు.ఏడుస్తాడు.కానీ స్క్రిప్ట్ మొత్తం తెలిసినవాడు ఏడవడు. నవ్వడు. చలించడు.

ఒక పిల్లవాడి తల్లి ఆ పిల్లవాడిని స్కూలుకు తయారు చేస్తూ బూట్లు తొడిగింది.కాని ఒక షూలో తేలు ఉన్న విషయం ఆమె చూచుకోలేదు.ఆ తేలు ఆ పిల్లవాడిని కుట్టింది.అలా కుడుతూనే ఉంది.చివరకు ఆ పిల్లవాడు స్కూలులో స్పృహతప్పి పడిపోయాడు.చనిపోయాడు.తేలు కూడా చనిపోయింది.

పిల్లవాని తల్లి స్వామి చిన్మయానంద శిష్యురాలు.ఆమె ఆయనను ఈ ఘోరం విషయమై ప్రశ్నించింది.

ఆయన ఇలా అన్నారు.

'నీ పిల్లవాని ప్రాణం పోయిందని నీవు బాధపడుతున్నావు.మరి తేలు ప్రాణం కూడా పోయింది కదా? దానిగురించి నీవు బాధపడవెందుకు?ఏ జీవి ప్రాణమైనా ప్రాణమేగా?ఇందులో ఒకటి ఎక్కువా ఒకటి తక్కువా ఎలా అవుతుంది?'

పిల్లవాడు 'తన' కనుక తనకు బాధ కలిగింది.తేలు ప్రాణానికి మన దృష్టిలో ఏమాత్రం విలువ లేదు కనుక అది పనికిరాని జీవి అయింది.కాని ప్రకృతి దృష్టి మన దృష్టిలాగే ఉండాలని నియమం ఏమీ లేదు.ప్రకృతి దృష్టిలో రెండు ప్రాణాలూ సమానమే.ప్రకృతి ఇచ్చే తీర్పు విభిన్నంగా ఉంటుంది.అదే ఆ తేలు తల్లి అక్కడ ఉంటే, తన పిల్లతేలు ప్రాణం పోయిందని అదీ కంప్లెయింట్ చేసేది.దానికి పిల్లతేలు ప్రాణమే ముఖ్యం.పిల్లవాడి ప్రాణం ముఖ్యం కాదు.

మన దృష్టి సంకుచితంగా ఉన్నపుడు ఆ కొంచమే కనిపిస్తుంది.అదే దృష్టి విశాలం అయినప్పుడు సమస్తమూ దర్శనమిస్తుంది.మనం అర్ధం చేసుకోలేకపోతే ప్రకృతి నియమాలు చాలా విచిత్రంగా ఉంటాయి.అదే అర్ధం చేసుకుంటే వాటిల్లో విచిత్రం ఏమీ ఉండదు.సమన్యాయమే అక్కడ మనకు దర్శనమిస్తుంది.

ప్రమాదంలో పడి ప్రాణాలు పోగొట్టుకోబోయే వారిని రక్షించవచ్చు.కాని ప్రాణానికి ప్రాణం అర్పించాలి.అలా చెయ్యగలిగితే వారిని కాపాడవచ్చు.మరి నాకు మెయిల్స్ ఇచ్చేవారిలో ఎందరు ఆ పని చెయ్యడానికి ముందుకొస్తారు?

అయ్యోపాపం అని మీకంత జాలి ఉంటే,వారి ప్రాణానికి మీప్రాణం అడ్డు వెయ్యండి.అప్పుడు వారిని కాపాడవచ్చు.అది మాత్రం కుదరదు.మెయిల్ ఇవ్వడం తేలిక గనుకా,ఖర్చులేని పని గనుకా,ఏమీ తోచడం లేదు గనుకా, ఎన్నైనా ఇస్తారు.

జ్యోతిష్యజ్ఞానం సత్యమైనది.రెమెడీలు కూడా సత్యములే.కానీ మానవ స్వభావమే సంకుచితమైనది.మనకు తెలిసిన లాజిక్కే సర్వస్వం అని అనుకోవడం మానవుని అహంకారం.ప్రకృతి నియమాలను ధిక్కరించగలను అనుకోవడం కూడా అంతే.

ప్రాచీనమైన మానవ మనస్తత్వంలోని మోసకారితనాన్నీ స్వార్దాన్నీ అహాన్నీ ఎవరు మార్చగలరు?
read more " ముందే చెప్పొచ్చు కదా? "

17, జులై 2014, గురువారం

కాలజ్ఞానం -25 (కన్యా రాశిలో రాహుస్థితి-దేశగోచారం)

13-7-2014 నుంచి రాహువు కన్యారాశిలో ప్రవేశించడం జరిగింది.ఒకటిన్నర సంవత్సరం పాటు ఇక్కడ ఉండటం జరుగుతుంది.ఈ సమయంలో మన దేశంలో జరిగబోయే కొన్నికొన్ని సంఘటనలు ఎలా ఉంటాయో చూద్దాం.

మన దేశానికి సహజరాశి మకరం.స్వాతంత్రం వచ్చినది వృషభ లగ్నంలో అయినప్పటికీ దేశ లక్షణాలను బట్టి సహజరాశి మకరమే అని చాలామంది ప్రాచ్య పాశ్చాత్య జ్యోతిష్యశాస్త్రవేత్తల అభిప్రాయం.

ఆ మకరరాశినుంచి ప్రస్తుతం నవమస్థానంలో రాహుసంచారం జరగబోతున్నది.నవమస్థానం విదేశాలకు,మత విషయాలకు,పెద్దలకు, గురువులకు,పుణ్యక్షేత్రాలకు,ధార్మిక కార్యక్రమాలకు సూచిక.రాహువు యొక్క కారకత్వాలలో విధ్వంసమూ,కుట్రలూ,కుత్రంత్రాలూ,విదేశీ మతశక్తులూ,మత పరమైన గొడవలూ ఉన్నాయి.

కనుక ఈ రెంటినీ కలిపి చూస్తె కొన్ని విషయాలు స్ఫుటంగా కనిపిస్తున్నాయి.

1.విదేశీ వ్యవహారాలలో మంచి కదలిక వస్తుంది.ప్రస్తుతం మన ప్రధాని విదేశీ యాత్రలు చెయ్యడమూ,అనేక దేశాధినేతలతో కలవడమూ,చెడిపోయిన/పోతున్న సంబంధాలను మళ్ళీ బాగు చేసుకునే ప్రయత్నం చెయ్యడమూ ఇందులో భాగాలే.ఫారిన్ పాలసీ మేటర్స్ ఉన్నట్టుండి బాగా క్రియాశీలకంగా మారడం నవమంలో అడుగుపెట్టిన రాహుప్రభావమే.

2.రాహువు ముస్లిం చాందసవర్గాలకు సూచకుడు గనుక మన దేశానికి ఆల్ ఖైదా,తాలిబాన్ వంటి పొరుగుదేశాల ఉగ్రవాద సంస్థలతో ప్రమాదం పొంచి ఉన్నది.వాళ్ళు మన దేశంలో మళ్ళీ కుతంత్రాలూ విధ్వంసమూ ప్లాన్ చేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.మతకలహాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతాయి.

3.ఆ కుట్రలలో దేవాలయాలూ,పుణ్యక్షేత్రాలూ,ప్రసిద్ధ మతగురువులూ టార్గెట్ అయ్యే అవకాశం బలంగా కనిపిస్తున్నది.

4.వయసు మళ్ళిన పెద్దలూ,మతనాయకులూ ప్రమాదాలలోగాని ప్రాణాంతక రోగాలతో గాని ప్రాణాలు కోల్పోయే సూచన ఉన్నది.

5.కన్య సహజరాశిచక్రంలో రోగస్థానం గనుక మొండి ఎపిడెమిక్ వ్యాధులు సమాజంలో తలెత్తే అవకాశం ఉన్నది.ముఖ్యంగా మలేరియా,డెంగ్యూ,చికెన్ గున్యా,జపనీస్ ఎన్కెఫలైటిస్ వంటి వ్యాధులూ ఈగలూ దోమల వల్ల వచ్చే వ్యాధులూ వైరల్ జ్వరాలూ విజృంభించే ప్రమాదం ఉన్నది.

6.భూకంపాల వంటి ప్రకృతి ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి.

7.మతసంస్థలలో అంతర్గతకలహాలూ,కల్లోలాలూ తలెత్తే అవకాశాలున్నాయి

ఎంతసేపూ చెడ్డ సంఘటనలేనా?మంచి అసలు జరగదా?అని కొందరికి అనుమానం రావచ్చు.మంచికూడా తప్పకుండా జరుగుతుంది.కాని దానికి ముందు జాగ్రత్తలు అవసరంలేదు.కనుక వాటిమీద ఎక్కువ ఫోకస్ ఉండదు. ఉదాహరణకు కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం.

8.ముస్లిం వర్గాలకు మంచిచేసే ఒక దీర్ఘకాలిక నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటిస్తుంది.దానివల్ల మోడీ ప్రభుత్వం అంటే వారిలో కొందరిలో ఉన్న వ్యతిరేకత తొలగిపోతుంది.

9.దేశంలో మతటూరిజం కొత్త పుంతలు తొక్కుతుంది.ఆ దిశగా అనేక టూరిస్ట్ ప్యాకేజీలు అందుబాటులోకి వస్తాయి.

10. షేర్ మార్కెట్ ఉత్సాహంగా ముందుకు దూసుకు పోతుంది.

పైన సూచించిన ప్రమాదకర రంగాలలో(1-7) ముందు జాగ్రత్తలు చాలా అవసరం.వీటిలో పౌరులు తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్నైతే ప్రభుత్వం తీసుకోవలసినవి మరికొన్ని.

ఏదైనా జరిగిన తర్వాత బాధపడే కంటే,ముందే మేలుకొని జాగ్రత్తపడటం మంచిది కదా.
read more " కాలజ్ఞానం -25 (కన్యా రాశిలో రాహుస్థితి-దేశగోచారం) "

16, జులై 2014, బుధవారం

ఆధ్యాత్మికనిధులు - సద్గురు లక్షణములు

మొన్న పదమూడో తేదీన నా పుట్టినరోజు సందర్భంగా, ఆధ్యాత్మిక నిధులనబడే ఈ పదమూడు పద్యాలను నా అభిమానుల కోసం ఇస్తున్నాను.

1
కం||సంసారాటవిని దగిలి
హింసల నందుచు వగచెడి హీనమనుష్యుల్
కంసారిన్ దలచుటెపుడు?
మాంసపు దేహమె నిజమని మందుదురిలలో

సంసారం అనే అడవిలో చిక్కుకుని దారి కనిపించక నానా హింసలు పడుతున్న హీనులైన మానవులు దైవాన్ని స్మరించేదేప్పుడు? వారికంతటి సమయం ఉంటుందా? నిరంతరకర్మ అనే క్రూరుడైన యజమాని,వారికి విశ్రాంతిని ఎప్పటికైనా ఇస్తాడా?

మాంసపూరిత దేహమే సత్యమని భ్రమించి దానికోసమే పరుగులెత్తే మనుష్యులు ఎప్పటికైనా ఆధ్యాత్మికమార్గంలోకి అడుగు పెట్టగలరా?పెట్టలేరు.ఏదో అద్భుతం జరుగుతుందని ప్రతిరోజూ ఆశిస్తూ కాలహరణం చేస్తూ చివరకు చావును ఆహ్వానించడమే వారికి జరుగుతుంది.

2
ఆ||మాయ జీవనంపు మత్తులందున జిక్కి
తెలివియంచు దలచి తిరుగువారు
దైవభూమియందు దీపించగా లేరు
మోక్షమెట్లు దొరకు మోసమందు?

లౌకిక జీవితంలో ఎదుటివారిని మోసం చెయ్యడమే సర్వోత్కృష్టమైన తెలివి అని లోకులు భ్రమిస్తారు.లోకం కూడా అలాంటివారినే మెచ్చుకుంటుంది. అనుసరిస్తుంది.ఈ లౌకికమైన మోసాలూ కపటమూ అలవాటైన మనుష్యులు దైవభూమి అయిన ఆధ్యాత్మిక మార్గంలో ఎలా ముందుకు పోగలరు?

అక్కడ వారి మోసపూరిత మనస్సే వారికి ప్రతిబంధకంగా మారుతుంది. లోకంలో ఏది గొప్ప అర్హతో అదే అంతరిక ప్రపంచంలో అతిపెద్ద లోపం అవుతుంది.తన తెలివే తనకు అడ్డు అవుతుంది.

3
ఆ||మోసమందు దేలు మోసకారులకెల్ల
మాయగురులె దిక్కు;మహిని జూడ
విటుల మరగు నాతి విఖ్యాతి గనుటెట్లు?
మనసు మంచిగాక మోక్షమెట్లు?

నిత్యం మోసంలో మునిగి తేలుతూ మోసపూరిత జీవితం గడుపుతున్న లోకులకు మాయగురువులే దక్కుతారు.ఎందుకంటే,మనకు వచ్చేవారు కూడా మనలాగే ఉంటారు.పతివ్రతకే మంచిభర్త లభిస్తాడు.పతితకు అటువంటి అదృష్టం దక్కదు.మంచి మనస్సు లేకపోతే మోక్షం ఎలా దక్కుతుంది?లోకాన్ని మోసం చేసినట్లు దైవాన్ని మోసం చెయ్యడం సాధ్యమేనా?

ఒకవేళ కొంత పూర్వకర్మ వలన అటువంటి గురువుల సాంగత్యం లభించినా, ఆ గురువుల పుస్తకాలు చదివి ఆ బోధలను ఇతరులకు చిలుకలలాగా బోధించే పని చేస్తారుగాని వాటిని ముందుగా తాము ఆచరించాలన్న ఆలోచన వారికి కలగదు.అలా కలగనివ్వకుండా వారి కర్మమే వారికి అడ్డు పడుతుంది.

ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి అంతా అర్ధమైందని భ్రమిస్తే అంతకంటే నగుబాటు ఇంకొకటి ఉండదు.

4
ఆ||కపటమందు సాగు కలుషంపు లోకంబు;
నిర్మలముగ సాగు నిత్యసుఖము
వక్రమంత బోక వైరాగ్యఘనమెట్లు?
చక్రధరుని సీమ జేరుటెట్లు?

లోకం అంతా కపటంతోనూ కల్మషంతోనూ నిండి ఉన్నది.నిత్యసుఖమైన మోక్షమో? నిర్మలంగా నిలిచి ఉన్నది.నీ మనస్సులో ఉన్న కల్మషమూ వంకరలూ నిన్ను వదలి పోకుండా ఉంటే, దైవం నీవైపు ఎందుకు చూస్తుంది?నీ ప్రత్యేకత ఏమిటని దైవం నిన్ను కరుణిస్తుంది?

ప్రతివాడూ తానొక ప్రత్యేకవ్యక్తి ననీ ఇంతవరకూ తనవంటి గొప్పవాడు పుట్టలేదనీ అనుకుంటాడు.ఇది పిచ్చి భ్రమ.నిజానికి ఈ ప్రపంచంలో ప్రతివాడూ ఒక అల్పుడే.అహంకారంతో తననొక విశిష్ట వ్యక్తిగా భ్రమిస్తూ విర్రవీగడమే గాని ప్రకృతి నిజంగా పరీక్షిస్తే తట్టుకుని నిబ్బరంగా నిలబడేవారు ఈ లోకంలో ఎవరున్నారు?ఒక్కరూ లేరు.

5
తే||మనము నందున వంకర మాయలుండ
మాయ గురులను జేరుచు మందవలయు
నిర్మలాంతము నందక నిత్యగురుల
చెలిమి సాధ్యమె?చిల్లరచేష్ట గాక?

చాలామంది ఇలా అంటూ ఉంటారు.

'మాకు సరియైన గురువు దొరకడం లేదు.దారిచూపే వారు దొరకడం లేదు.మాకు ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టాలని ఉంది కాని ఆ దారి దొరకడం లేదు'.

మన మనస్సులో వంకరలు ఉన్నంతవరకూ మనకు మాయగురువులే దొరుకుతారు.నిత్యజీవితంలో మనం మోసగాళ్ళమైతే,మనకు మోసగాళ్ళే గురువులుగా దొరుకుతారు.మనం అహంకారులమైతే మనకు ఇంకా దురహంకారులే గురువులుగా లభిస్తారు.మనం కోరికలు తీర్చుకోవడానికి గురువుల వెంట పడితే నిన్నూ తన అవసరాలకు వాడుకునే గురువులే నీకు ఎదురౌతారు.మనం ఆశపోతులమైతే ఆశపోతు గురువులే మనకు లభిస్తారు. ఇది విశ్వనియమం. 

6
కం||కామమె సర్వంబిలలో
కామంబే పట్టి నడపు కలుషపు జగతిన్
కామంబును మీరనిచో
నామాదుల యందుజిక్కి నీల్గగ వలయున్

కామమే ఈ లోకాన్ని నడుపుతున్న శక్తి.ఇక్కడ కామమే సర్వస్వం.ఈ కల్మష ప్రపంచాన్ని నడిపిస్తున్న కామాన్ని దాటలేకపోతే దాని అనుచరులైన నామరూపాదికములలో చిక్కి అల్లాడక తప్పదు.

నామరూపములను గెలిచిన ఘనుడే నిజంగా కామాన్ని జయించిన వాడు.మిగిలిన అందరూ ఉత్త వాగుడుకాయలు మాత్రమే.

7
ఆ||లోన మోసముండ లోగుట్టు గనుటెట్లు?
మనసు శుభ్రపడక మహితమెట్లు?
భయము బోకయున్న బంధరహితమెట్లు?
సూటి మనసు లేక సుఖమదెట్లు?

మనస్సులో మోసం రాజ్యమేలుతుండగా మహితగమ్యం ఎలా దక్కుతుంది?లోపల భయం ఉన్నంతవరకూ బంధం ఎలా వదులుతుంది?మనస్సు స్వచ్చంగా లేనంతవరకూ పరమసుఖం ఎలా లభిస్తుంది?

లౌకిక ప్రపంచమే కాదు.ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అంతా మోసమే రాజ్యం చేస్తున్నది.ఏదో ఆశించి గురువుల వెంట పడతారు శిష్యగణం.వారివద్ద ఇంకేదో ఆశించి దగ్గరౌతారు సోకాల్డ్ గురువులు.ఇది పరస్పర సింబియాటిక్ రిలేషన్.ప్రాచీనకాలంలో ఉన్నట్టి స్వచ్చమైన గురుశిష్య సంబంధాలు కూడా నేడు స్వార్ధపూరితములై కలుషితములైనాయి.

ఇటువంటి గురువులూ శిష్యులూ చేరి 'మోక్షం' 'అద్వైతం' 'యోగసిద్ధి' 'సమాధి' ' నో మైండ్ స్టేట్' వంటి ఊకదంపుడు మాటలను వల్లించడం ఎంత విడ్డూరం?అసలు ఈ పదముల అర్ధములేమిటో ఆచరణహీనులైన వీరికి ఎప్పటికైనా తెలుస్తాయా?ఎందుకీ మోసం?

నిత్యజీవితంలో స్వచ్చమైన మనస్సు లేనివారికి వేదాంతమూ తంత్రమూ ఎలా అర్ధమౌతాయి? ఏదో ఆశిస్తూ దానికోసం లేనిపోని మర్యాద నటిస్తూ ఎదుటి మనిషిని పలకరించే నేటివారికి పరమగమ్యం మాట అటుంచి,ఆధ్యాత్మిక లోకం లోకి ప్రవేశమే లభించదు.ఒకవేళ అలా లభిస్తుందని అనుకుంటే అది భ్రమ మాత్రమే.వారు ఆధ్యాత్మిక లోకపు ప్రవేశద్వారం వద్దనే ఆపివెయ్యబడతారు.

8
కం||కాంచన దాసులు లోకులు
కాంచనమే పరమసత్య కారణమిలలో
కాంచన లోలత బాయక
గాంచగ నెట్లౌను విభుని? కలికాలములో

లోకం అంతా ధనం వెంట పరిగెత్తుతున్నది.ఈ లోకులకు కాంచనమే పరమ సత్యం.మానవసంబంధాలు డబ్బు మీదనే ఆధారపడి ఉన్నాయి.ఎవరెన్ని మాటలు చెప్పినా ఈ లోకంలో అంతిమసత్యం ధనమే.ధనం కోసం అన్ని విలువలనూ వదులుకునే పరిస్థితిలో లోకం ఉన్నది.చివరకు దేవుణ్ణి పూజిస్తున్నది కూడా ధనం కోసమే.'అదితప్ప ఇంకేదైనా కోరుకో ఇస్తాను.ధనం మాత్రం అడుగకు'- అని ఏ దేవుడైనా అనిన మరుక్షణం ఆ దేవుణ్ణి చెత్తకుండీలో పడేస్తారు నేటి మనుష్యులు.

అనుచితమైన ఈ ధనవ్యామోహం పోనంతవరకూ మానవునికి దైవం ఎలా దక్కుతుంది?కలిమాయను మీరడం అతనికి ఎలా సాధ్యమౌతుంది?సాధ్యం కాదు.దైవంతో పచారీషాపు బేరాలు ఆపనంతవరకూ వీరికి దైవానుభూతీ ఎన్నటికీ కలుగదు.దైవమార్గంలోకి ప్రవేశమూ లభించదు.

9
ఆ||కావి బట్ట దొడిగి కల్లోల పడుచుండు
వేషధారి కన్న వేయిరెట్లు
నిర్మలాంతరంగ నిధినందు సంసారి
ఘనత నందు యోగ గరిమగల్గ

కాషాయవస్త్రాలు కట్టుకుని అసత్యపు బోధలు చేస్తూ లోలోపల చెలరేగుతున్న కల్లోలాన్ని శాంతింప చెయ్యలేని సన్యాసవేషధారులైన దొంగగురువుల కంటే, నిర్మలమైన అంతరంగం కలిగి యోగసిద్ధిని పొందిన సంసారి వెయ్యిరెట్లు ఘనుడు.

ఈరోజుల్లో ప్రతివాడూ 'పరమహంస' అనో 'పరివ్రాజకాచార్య' అనో 'బ్రహ్మర్షి' 'రాజర్షి' అనో  'లోకమాత' అనో 'యోగేశ్వరులు' అనో 'యోగిరాజ్' అనో 'సద్గురు' అనో 'మహాగురు' అనో ఇష్టం వచ్చినట్లు పేర్లు పెట్టేసుకుంటున్నారు. ఇలాంటి జోకర్లను చూస్తె నాకు భలే నవ్వు వస్తూ ఉన్నది.

లోకంలో ఎక్కడ చూచినా తామరతంపరగా దొంగగురువులు పుట్టుకొస్తారనీ లోకులు తండోపతండాలుగా వాళ్ళ చేతిలో వంచింప బడతారనీ 'బ్రహ్మంగారు' 'యోగివేమన్న' మొదలైన సద్గురువులు వందల ఏళ్ళనాడే చెప్పినారు. మహాగురువైన వేదవ్యాసమహర్షి కూడా 'భవిష్యపురాణం' లో ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినారు.అది నేడు మన కనులముందే నిజం అవుతున్నది.

10
కం||అడ్డంబుల్ దొలగి జనగ
గడ్డంబుల బెంచనేల? గర్వమదేలా?
చెడ్డల్ వదలెడి వేళల
దొడ్డగు ఘన యోగఫలము దరియగు సత్యా

అడ్డుగా ఉన్న జన్మజన్మాంతర సంస్కారములు శాంతించినప్పుడు గడ్డములు పెంచడం ఎందుకు?దానికి రంగు వెయ్యడం ఎందుకు?

ఒకానొక గురువుగారున్నారు.వారు మహా గొప్పవేదాంతం చెబుతారు.కాని వారిగడ్డానికి మొన్నమొన్నటి వరకూ బ్రష్షుతో చక్కగా రంగు వేసుకునే వారు. ఇంకొక అవతారపురుషులు తీరికసమయాలలో వారికి ఏమీ తోచనపుడు 'బ్లోయర్' తో వారి జుట్టును రింగులు తిప్పుకునేవారు.ఇంకొక గురువుగారు ప్రస్తుతం 'పురుషత్వ పరీక్ష'కు నిలబడబోతున్నారు.ఇలాంటి గురువుల 'వేదాంతం' ఏమిటో వారికీ వారిని అనుసరించే భక్తులకే తెలియాలి.

చెడు అనేది నిజంగా నిన్ను వదలి పారిపోతున్నపుడు ఘనమైన యోగసిద్ధి నీకు దానంతట అదే దగ్గరౌతుంది.అదే నిజమైన గుర్తింపు.అంతేకాని లోకంలో గొప్పకోసం వేషం వెయ్యనవసరం లేదు.

దైవం దృష్టిలో ఘనులమైతే చాలు.లోకం దృష్టిలో కానక్కరలేదు.లోకమూ లోకులూ విలువనివ్వదగిన విషయాలు కావు.

వాటికోసం మనం నటించనక్కరలేదు.

11
ఆ||రొక్కమెదురుగాగ సొక్కి సోలెడువారు
నిక్కమైన పదము నందలేరు
ప్రక్కలెగుర వేయ కుక్కకెట్లగు సొమ్ము?
ఒక్కగురుని పంచ జిక్కకున్న?

డబ్బుకోసం నానాపాట్లూ  పడేవారు ఆధ్యాత్మికసిద్ధిని పొందలేరు.లౌకిక ప్రయోజనాలకోసం గురువుల చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు నిత్యమైన మోక్షాన్ని అందుకోలేరు.తిండికోసం శునకం అనేక ఇళ్ళవెంట తిరుగుతూ రొప్పుతూ ఉంటుంది.ఒక్క యజమానిని నమ్మి అతని ఇంటిలో కాపలాగా ఉంటె దానికి ఉన్నచోటునే తిండి దొరుకుతుంది.నిజమైన సాధకుడు కూడా గురువు పట్లా దైవం పట్లా విశ్వాసపాత్రమైన కుక్కలాగా ఉండాలి.

నా పరమగురువులలో ఒకరైన పరమపూజ్య విజ్ఞానానందస్వామి వద్ద ఒక పెంపుడు కుక్క ఉండేది.దానిని చూపిస్తూ ఆయన ఇలా అనేవారు.

'అది నా శునకం.మరి నేనో?ఆయన(శ్రీరామకృష్ణుల చిత్రపటాన్ని చూపిస్తూ) శునకాన్ని.' 

12
కం||కామ హతాశులు గురువుల్
ఆమంబుల జిక్కితిరిల నంతేవాసుల్
ధూమంబున దగుల మహా
ధామంబగు భానురశ్మి దరిగనుటెట్లో?

ఈ లోకంలో చాలామంది గురువులు కామం చేతిలో హతులైనవారే.ఇక శిష్యులో?అనేక దోషములలో చిక్కి వాటిని వదిలించుకోలేక అల్లాడుతున్న వారు.ఇలాంటి శిష్యులను అలాంటి గురువులు ఏ విధంగా రక్షించగలరు? రక్షించలేరు.స్వయంగా కోరికలతో అల్లాడే గురువులు అవే కోరికలలో చిక్కియున్న తమ శిష్యులను ఎలా ఉద్ధరించగలరు? అది సాధ్యం కాదు.

పొగతో కూడిన చీకటిమేఘంలో చిక్కి దారి కనిపించక అల్లాడేవారికి మహాతేజస్సుతో వెలిగే సూర్యబింబం ఎలా దర్శనమిస్తుంది?

13
కం||నిష్కల్మషమౌ హృదియున్
నిష్కాపట్యంబు తోడ నెగడెడు మనమున్
నిష్కారణమౌ కరుణయు
నిష్క్రియ లెంతయు గురులకు నిధులౌ సత్యా

సద్గురువులైన వారికి ఈ క్రింది లక్షణములే నిజమైన సంపదలు.

కల్మషం లేని హృదయం.
కపటం లేని మనస్సు.
కారణం లేని కరుణ.
కర్మను దాటించగల యోగసిద్ధిని కలిగి ఉండటం

అంతేగాని వేషభాషలు,హావభావ ప్రకటనలు,పాండిత్య ప్రదర్శనలు,ఫీజులు తీసుకుని క్లాసులు చెప్పడాలు--ఇవేవీ కూడా సద్గురుత్వానికి గీటురాళ్ళు కావు.అది,లేని బలాన్ని నటించడమే అవుతుంది.ఆధ్యాత్మిక లోకంలో ఇదొక ఘోరమైన అపరాధం.

ప్రపంచం దృష్టిలో నేడు సద్గురువులుగా చెలామణీ అవుతున్న వారు భగవంతుని న్యాయస్థానంలో బోనులో నిలబడినప్పుడు వారి పరిస్థితి ఏమిటో అప్పుడు తెలుస్తుంది.లోకాన్ని మోసంచేస్తూ అది ఇస్తున్న భోగభాగ్యాలను అనుభవిస్తున్న సమయంలో అది అర్ధం కాదు.
read more " ఆధ్యాత్మికనిధులు - సద్గురు లక్షణములు "

14, జులై 2014, సోమవారం

గురుపూర్ణిమ-సాధనా సమ్మేళనం -6

పంచవటి గ్రూప్ అనేది ప్రాధమికంగా నిజమైన సాధకుల కోసం ప్రారంభించబడిన గ్రూపు. ఆధ్యాత్మిక జీవనాన్ని నిజంగా ప్రేమించే వారికోసం, అలా జీవించాలని కోరుకునే వారికోసం,యోగశక్తినీ దైవశక్తినీ సాధనాశక్తినీ ప్రత్యక్షంగా చూడాలనీ అనుభవించాలనీ త్రికరణశుద్ధిగా అనుకునేవారి కోసం ఈ గ్రూప్ సృష్టించబడింది.గ్రూప్ అధ్వర్యంలో ఇప్పటివరకూ ఆరు సాధనా సమ్మేళనాలు జరిగాయి.మొదటి సమ్మేళనం ప్రకాశంజిల్లా పూనూరు గ్రామంలో జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో రెండు, మహానందిలో ఒకటి,కోటప్పకొండలో ఒకటి జరిగాయి.ఇప్పుడు ఆరవది గుంటూరులో మా ఇంటిలో జరిగింది.

మొన్న 12-7-14 గురుపూర్ణిమ అయింది.

నిన్న 13-7-14 తేదీల ప్రకారం నా పుట్టినరోజు అయింది.

కనుక ఆ రోజులలో పంచవటి సభ్యులు కొందరు వచ్చి నన్ను కలుస్తామని అనుకున్నారు.నాకేమీ అభ్యంతరం లేదని చెప్పాను.కాకపోతే కొన్ని షరతులు విధించాను.

నేను పుట్టినరోజు చేసుకునే విధానం విభిన్నంగా ఉంటుంది.కొత్తబట్టలు, గుళ్ళూగోపురాలు, విందులు వినోదాలు, షాపింగులు, సినిమాలు, విహారయాత్రలు --ఇలా ఉండదు.వాటిలో ఏమీ లేదని నాకు అనుభవం నేర్పింది.కనుక ఆరోజున నేను పూర్తిగా మౌనధ్యానంలో ఏకాంతంగా కాలం గడుపుతాను. కనీసం ముప్పై ఏళ్ళనుంచి ఈ విధానం నేను పాటిస్తున్నాను.

ఆ రెండురోజులూ టీవీ ఉండదు.సెల్ ఫోన్ ఉండదు.ఇంటర్ నెట్ ఉండదు. పత్రికలు ఉండవు.అనవసరమైన మాటలు ఉండవు.ఇల్లు దాటి బయటకు పోవడం ఉండదు.నేను మాట్లాడిస్తే మాట్లాడాలి.లేదంటే మౌనంగా ఉండాలి.ఆ సమయంలో నేనెలా ప్రవర్తిస్తానో చెప్పలేను.అదంతా భరించాలి.కనుక నాతో పాటు రెండురోజులు ఉండాలంటే అలాంటి జీవనవిధానానికి తట్టుకోగల స్థితి ఉంటే సంతోషంగా రమ్మని చెప్పాను.

కొందరు రావాలని ఉన్నా కొన్నికొన్ని కారణాల వల్ల రాలేకపోయారు.కొందరు వస్తామన్నా నేనే వద్దన్నాను.చివరకు కొందరు మాత్రమే రాగలిగారు.

మొత్తమ్మీద ఏడుగురు సభ్యులు మాత్రం రాగలిగారు.వారు ఆ రెండురోజులూ నాతో మాఇంటిలో ఉన్నారు.అందులో ఒకరు బెంగళూర్ నుంచి,ముగ్గురు హైదరాబాద్ నుంచి,ఒకరు అనంతపూర్ నుంచి,ఇద్దరు గుంటూరు నుంచి వచ్చారు.మొదటి సమ్మేళనానికి వచ్చిన సభ్యుడొకరు మళ్ళీ ఈసారి కూడా రావడం ఆనందం కలిగించింది.అది అతనిలో ఆరిపోకుండా ఉన్న తపనకు సూచిక.మొదటి సమ్మేళనానికి వచ్చిన అనేకమంది మధ్యలో జారిపోయారు.ఇప్పటివరకూ నిలబడినవారు చాలా తక్కువ.

ఆధ్యాత్మికమార్గం చాలా కష్టమైనది.అది 'పదునైన కత్తి అంచుమీద నడక' అంటుంది కఠోపనిషత్తు.ఆ నడక మనం ఊహించినట్లుగా ఉండదు.అనుక్షణం కాళ్ళు తెగిపోతుంటాయి.ఆమార్గం మన భావాలకూ అభిప్రాయాలకూ అనుగుణంగా హాయిగా సుఖంగా ఏమీ ఉండదు.కనుక చాలామంది దీనినుంచి జారిపోతుంటారు.వారివారి భావాలకు అనుగుణంగా ఇక్కడి పరిస్థితి లేనప్పుడో లేక వారి అహం అనేది గాయపడినప్పుడో చాలామంది ఈ మార్గాన్ని వదిలేస్తారు.

దీనిని అంటించుకోవడం చాలా కష్టం.ఇందులో స్థిరంగా నిలబడటం ఇంకా కష్టం.అనుక్షణం మారడానికి సిద్ధంగా లేకపోతే ఇందులో ఎవ్వరూ ఇమడలేరు. మార్పును స్వాగతించలేకుండా తమతమ భావాలనూ ఆలోచనలనూ అహాలనూ అంటిపట్టుకుని ఉండేవారికి నేను సూచించే ఆధ్యాత్మికమార్గంలో పట్టు చిక్కదు.

ఈ రెండురోజులూ నాతో కలిసి ఉన్నవారికి నాతో కలిసి ధ్యానంచేసే అవకాశం ఇచ్చాను.బౌద్ధతంత్రం నుంచీ ఆర్షతంత్రం నుంచీ కొన్ని ప్రాక్టికల్ ధ్యానవిధానాలు నేర్పించాను. దగ్గరుండి వారిచేత చేయించాను.ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మికత అనేది ధియరీలో లేదు. అది ఆచరణలో ఉంటుంది.

శనివారం నాడు వారితో కలసి నేనూ ధ్యానం చేశాను.'స్పిరిట్యువల్ ఎనర్జీ ఫీల్డ్' అంటే ఎలా ఉంటుందో వారికి అనుభవం కావడం కోసం ఆ ధ్యానసమయంలో ఒక శక్తివలయాన్ని సృష్టించి అది వారికి అనుభవం అయ్యేటట్లు చేశాను.ఎందుకంటే ఎన్ని మాటలు మాట్లాడుకున్నా అంతిమంగా దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ప్రాక్టికల్ గా అనుభవిస్తేనే ఇలాంటి విషయాలు అర్ధమౌతాయి.నమ్మకమూ అప్పుడే కలుగుతుంది.

ప్రత్యక్షంగా ఋజువును చూపించగలిగినదే నిజమైన ఆధ్యాత్మికత.

రెండురోజులపాటు ప్రపంచాన్ని పట్టించుకోకుండా పూర్తిగా ధ్యానమయమైన జీవితం గడపాలంటే ఒకేసారి సాధ్యంకాదు.దానికి ఎంతో ముందునుంచి తయారు కావాలి.ఎన్నో పునాదులు వేసుకుంటూ రావాలి.మనస్సును తయారు చేసుకుంటూ రావాలి.ఎన్నింటినో మనంతట మనం వదులుకోవాలి. అప్పుడే అలా ఉండగలం.

సభ్యులు దానికి సిద్ధంగా లేరు గనుక మధ్యమధ్యలో వారికి కొంత లీజర్ టైం అవసరం అయింది.ఆ సమయంలో అనేక ఆధ్యాత్మిక విషయాలను ప్రాక్టికల్ ఉదాహరణలతో వారికి వివరించాను.వారి సందేహాలను తీర్చాను.

వాటిలో కొన్ని విషయాలు--
  • కర్మ-దాని వివిధ సూక్ష్మభేదములు-మంచిలో చెడు,చెడులో మంచి, చెడుకర్మ,మంచికర్మ,నిష్కామకర్మలు ఏమిటి?
  • నిత్యజీవితంలో అవి ఎలా చెయ్యబడతాయి?
  • కర్మరహస్యాలను నిత్యజీవితంలో ఎలా ఆచరణలో పెట్టాలి?
  • ధ్యానంలో మనస్సు ఎందుకు నిలబడదు?అలా నిలబడాలంటే ఏం చెయ్యాలి?
  • మనకు కనిపించని శక్తులు నిత్యజీవిత సంఘటనలను ఎలా ఆడిస్తాయి?వాటిని ఎలా అడ్డుకోగలం?ఎలా మార్చగలం?
  • మన మనస్సులలో నిత్యం తలెత్తే భయం,అసూయ,ఆశ మొదలైన ఎన్నోరకాల నెగటివ్ వైబ్రేషన్స్ తో ఎలా డీల్ చెయ్యాలి?
  • ధ్యానంవల్ల నిత్యజీవితంలో మనకు కలిగే ఉపయోగాలు ఏమిటి?
  • సాధన,ఉపాసన అనేవి ఎలా జరగాలి?వాటిలో మెట్లు ఏమిటి?ఎలా వాటిని అందుకోవాలి?
  • రోజువారీ జీవితం గడుపుతూనే దానిని యోగపరమైన,ధ్యానపరమైన సాధనగా ఎలా మార్చుకోవాలి?
  • మొదలైన అనేక మార్మికవిషయాల మీద చర్చలు ఈ సమ్మేళనంలో జరిగాయి.

ఈ సమ్మేళనంలో ప్రత్యక్షంగా పాల్గొనగలిగినవారిని అభినందిస్తున్నాను. కొందరు సభ్యులు మాత్రం శరీరంతో రాలేకపోయినా, మానసికంగా మా మధ్యనే ఉండి దాని ఫలితాలను చాలాదూరం నుంచి అందుకోగలిగారు.

వారిని ఇంకా అభినందిస్తున్నాను.

ఎందుకంటే,'యోగశక్తికి దూరంతో సంబంధం లేదు' అన్న విషయాన్ని వారు ప్రత్యక్షంగా గ్రహించారు గనుక.

ఆ విధంగా జరిగిన రెండురోజుల పూర్తిస్థాయి సాధనా సమ్మేళనం నిన్నటితో ముగిసింది.
read more " గురుపూర్ణిమ-సాధనా సమ్మేళనం -6 "

7, జులై 2014, సోమవారం

రాహుకేతువుల రాశిమార్పు -2014-ఫలితాలు

13-7-2014 న రాహుకేతువులు రాశులు మారబోతున్నారు.గత ఏడాదిన్నర నుంచీ వీరు వరుసగా తులా మేషరాశులలో ఉన్నారు.ఈ తేదీనుంచి దాదాపు ఇంకొక ఏడాదిన్నరవరకూ కన్యా మీనరాశులలో ఉండబోతున్నారు.

కనుక వీరి స్థితి ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నది.దీని ఫలితంగా అనేకమంది జీవితాలలో ఊహించని విధంగా అనేక మార్పులు కలుగుతాయి.

ద్వాదశరాశులకు ఆయాఫలితాలు ఎలా ఉండబోతున్నాయో స్థూలంగా పరికిద్దాం.

మేషరాశి
గురువుగారు చతుర్దంలోకి వచ్చిన మంచి ఫలితాలు రాహుకేతువుల ఈ మార్పుతో స్థిరీకరించ బడతాయి.ఎప్పటినుంచో బాధిస్తున్న సమస్యలు తొలగిపోవడం చూడవచ్చు.వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన మార్పులు కనిపిస్తాయి.పనిలో ఉత్సాహం ఎక్కువౌతుంది.ఆశావహమైన ఆలోచనలు కలుగుతాయి.నిరాశ దూరమౌతుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శత్రుబాధ తగ్గుతుంది.మంచిపనులకు అకస్మాత్తుగా ఖర్చు చేస్తారు.

వృషభరాశి
వ్యాపారం వృద్ధి అవుతుంది.షేర్ మార్కెట్ లో లాభాలు వస్తాయి.అనేక రకాలైన ప్లానులు వేస్తారు.సృజనాత్మకత విజ్రుంభిస్తుంది.సాంస్కృతిక కళా రంగాలలోని వారికి మంచికాలం మొదలౌతుంది.సంతానానికి మంచిరోజులు వస్తాయి.మంత్రసాధన,ఆధ్యాత్మికచింతనలు ఎక్కువౌతాయి.

మిధునరాశి
విద్యావృద్ధి కలుగుతుంది.గృహసౌఖ్యం పెరుగుతుంది.వాహనయోగం కలుగుతుంది.వృత్తిపరంగా కొన్ని చికాకులు తలెత్తవచ్చు.వృత్తిలో మార్పులు ఉంటాయి.దూరప్రయాణాలు జరుగుతాయి.ధనవృద్ధి సూచన ఉన్నది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది.

కర్కాటకరాశి
అధికారం పెరుగుతుంది.మాట చెల్లుబాటు అవుతుంది.ధైర్యం ద్విగుణీకృత మౌతుంది.ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.దగ్గర/దూర విదేశీప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.

సింహరాశి
ఆకస్మిక ధనవృద్ధి.పిత్రార్జితం రావడం,రాదనుకున్న డబ్బు రావడం జరుగుతుంది.విద్యకోసం విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది.అకస్మాత్తుగా ఉద్రేకాలకు లోనుకావడం,దానివల్ల అనవసరంగా ఎక్కువగా మాట్లాడటం, దానివల్ల అనర్దాలూ ఉంటాయి.కొంతమందికి తీవ్రమైన ఆధ్యాత్మికభావాలు ముప్పిరిగొంటాయి.

కన్యారాశి
ఉన్నట్టుండి వెలుగు కనిపిస్తుంది.ఎనర్జీ ఎక్కువౌతుంది.ఇంద్రియశక్తులు ఉన్నట్టుండి పెరుగుతాయి.మానసిక శక్తి వృద్ధి చెందుతుంది.ఉత్సాహం ద్విగుణీకృతమౌతుంది.శత్రువులు తగ్గుతారు.

తులారాశి
తండ్రిగాని తండ్రి సమానులు గాని ఉన్నట్టుండి మంచాన పడతారు.లేదా పరలోక యాత్రకు వెళతారు.ఏదో ఒక కారణంగా ఆస్పత్రి దర్శనం తరచూ కలుగుతుంది.ఊహించని ఖర్చులు బాగా పెరుగుతాయి.రహస్య ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి మెరుగౌతుంది.విదేశీ ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.శత్రువులు దూరమౌతారు.

వృశ్చికరాశి
పిత్రార్జితం అందుతుంది.స్నేహితుల వల్ల లాభం కలుగుతుంది.జ్యేష్ట సోదరులకు మంచి జరుగుతుంది.సాంప్రదాయ ఆధ్యాత్మికచింతన పెరుగుతుంది.జీవితం లాభయుతంగా ఉంటుంది.కానీ ప్రతి లాభం వెనుకా ఒక నష్టం కూడా వెంటనే జరుగుతుంది.

ధనూరాశి
వృత్తిలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తాయి.ఎదుగుదల ఉంటుంది. అయితే త్రిప్పటా,చికాకూ కూడా పక్కపక్కనే ఉంటాయి.ఉద్యోగ పరంగా ఎక్కువగా ఊళ్లు తిరగవలసి వస్తుంది.దాని ఫలితంగా గృహసౌఖ్యం తగ్గిపోతుంది.మానసికచింత పట్టి పీడిస్తుంది.దానిని అధిగమించడానికి దైవసంబంధ విషయాల ఆసరా తీసుకుంటారు.

మకరరాశి
ఇన్నాళ్ళూ ఇంటిలో పీడిస్తున్న చికాకులు దూరం కావడం చూస్తారు.ధైర్యం పెరుగుతుంది.కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి.దూరప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.ఆధ్యాత్మిక చింతన బాగా ఎక్కువౌతుంది.పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు.కొందరికి సాధనలో సిద్ధి కలుగుతుంది.

కుంభరాశి
మానసిక చింత ఎక్కువౌతుంది.కంటి వ్యాధులు పీడిస్తాయి.గృహసౌఖ్యం తగ్గుతుంది.కమ్యూకేషన్ స్కిల్స్ తగ్గిపోతాయి.మాట తడబడుతుంది. సంతానం దూరమౌతుంది. రహస్య ఆధ్యాత్మిక చింతనలో సేదదీరుతారు.

మీనరాశి
శత్రువులు బలపడతారు.ఎదుటివారి ప్లానులకు ఇష్టం లేకున్నా తలొగ్గవలసి వస్తుంది.కాని చివరకు అంతా మంచే జరుగుతుంది.బాధ్యతలు పెరుగుతాయి.తనవారికి కాలం కలసి వస్తుంది.దూరప్రయాణాలు ఉంటాయి.కొందరికి స్థలమార్పు సూచితం అవుతున్నది.దీర్ఘరోగాలు విజ్రుంభిస్తాయి.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.తొందరపడి నిర్ణయాలు తీసుకుని మోసపోతారు.జీవితభాగస్వామిలో చురుకుదనం పెరుగుతుంది.

ఈ ఫలితాలు గమనించడానికి 13-7-2014 వరకూ ఆగనక్కర లేదు.ఇప్పటికే ఆయా దిశలలో మార్పులు కలుగుతూ ఉండటం గమనించండి.
read more " రాహుకేతువుల రాశిమార్పు -2014-ఫలితాలు "

4, జులై 2014, శుక్రవారం

కాలజ్ఞానం -24(ఆషాఢమాస ఫలితాలు)


జూన్ 27 న 13-39 గంటలకు హైదరాబాద్ లో ఆషాఢమాసం మొదలైంది.

ఈమాసం ప్రారంభం కావడమే అనేక దుస్సంఘటనలతో మొదలైంది.లగ్నం కన్యా తులల మధ్యన సున్నా డిగ్రీలలో ఖచ్చితమైన శపితయోగ పరిధిలో ఉన్నది.

శుక్రవారం ఆర్ద్రానక్షత్రం వృద్దియోగంలో ఈ మాసం మొదలైంది.

ఈ నెల రాష్ట్రపరంగా ఆర్ధికపరంగా ఏమంత మంచి ఫలితాలను ఇవ్వదు.

భాగ్యభావం దెబ్బతినడంతో డబ్బు సమస్యలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తాయి.చెయ్యాలనుకుంటున్న పనులకు డబ్బులు ఎక్కడనుంచి తేవాలో అర్ధం కాదు.

అయితే ఏదో ఒక రకమైన ప్లానులు వేసి కష్టాలనుంచి గట్టెక్కాలని ప్రయత్నాలు జరుగుతాయి.

దశమంలో ఉన్న ఉచ్ఛగురువు ఒక్కడే ఈ కుండలికి మంచియోగాన్ని ఇస్తున్నాడు.కనుక పరిపాలన నడుస్తూనే ఉంటుంది.అదే లేకపోతే పరిస్తితి అధ్వాన్నంగానే ఉన్నదని చెప్పాలి.కాకుంటే,ధనాధిపతి అయిన కుజుడు అక్కడే నీచలో ఉండటంతో గురువుగారి మంచిప్రభావం చాలావరకూ న్యూట్రలైజ్ అయిపోతున్నది.

ఉద్దేశాలు ప్లానులు మంచివేగాని డబ్బులు ఎక్కడనుంచి వస్తాయో అర్ధంకాని పరిస్తితి ఉంటుంది.

జూలై 6,7,8,9 తేదీలలో మళ్ళీ ప్రమాదాలు దుర్ఘటనలు జరుగుతాయి.కొందరికి పదవీగండం ఉన్నది.కొందరు ప్రముఖులు గతిస్తారు.ప్రభుత్వానికి ఒక విజయం చేకూరుతుంది.

జూలై 13 న కొందరి జీవితాలలో ఒక బలీయమైన ఆధ్యాత్మికసంఘటన జరుగుతుంది.

లౌకికంగా చూస్తే,ఒక ఉగ్రవాదచర్యగాని,లేక ఒక దుస్సంఘటనగాని జరుగుతుంది.సాంస్కృతిక కళారంగాలలో ఒక నష్టం ఉంటుంది.

జూలై 16 నుంచి 18 లోపు ఆర్ధికపరమైన ప్రజాపరమైన చికాకులు రాష్ట్రాన్ని పీడిస్తాయి.న్యాయశాఖారంగంలో,మతరంగంలో దుర్ఘటనలు జరుగుతాయి.

భవిష్యత్ ప్లానింగ్ తోనూ,ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలన్న ఆందోళనతోనే ఈ నెల రాష్ట్రపరిపాలన సాగుతుంది.
read more " కాలజ్ఞానం -24(ఆషాఢమాస ఫలితాలు) "

2, జులై 2014, బుధవారం

చైనా ఆయిల్ పైప్ లైన్ లీక్-హాంగ్ కాంగ్ ఆందోళనలు-నైజీరియా కారుబాంబు పేలుడు-కొనసాగుతున్న రాహుప్రభావం

30-6-2014 సోమవారం సాయంత్రం 6.15 ప్రాంతంలో దాలియన్ అనే చైనీస్ పోర్ట్ సిటీ దగ్గర ఆయిల్ పైప్ లైన్ లీకై ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది.

ఆయిల్ అనేది రాహువు కారకత్వాలలో ఒకటి అని మళ్ళీ మళ్ళీ చెప్పనక్కరలేదు.ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు ఈ విషయం వ్రాసి ఉన్నాను.

కరెక్ట్ గా ఆరోజున శుక్ల తృతీయ.అంటే అమావాస్యకు మూడోరోజు.కనీసం 20,000 మందిని అక్కడనుంచి తరలించారు.ఎంతమంది ప్రమాదంలో గాయపడ్డారో లేదా చనిపోయారో బయటకు తెలియదు.చైనాలో బయటకు పొక్కకుండా రహస్యాలను దాచిపెట్టడం మామూలే.

ఈ సంఘటన సాయంత్రం 6.15 ప్రాంతంలో జరిగింది.ఆ సమయానికి గ్రహస్తితి ఎలా ఉందో చూద్దాం.ఆ సమయానికి ఆశ్లేషా నక్షత్రం నడుస్తున్నది.ఆశ్లేష సర్పనక్షత్రం అనీ రాహువు అధీనంలో ఉంటుందనీ ముందే వ్రాశాను.అదే రోజున ఈ ప్రమాదం జరగడం ఎంత విచిత్రం?

ఇకపోతే మనుష్యులకు లగ్నాలూ రాశులూ ఉన్నట్లే దేశాలకూ ఉన్నాయి.వాటికి స్వాతంత్ర్యం వచ్చిన సమయాన్ని ఆయా దేశాలకు సహజలగ్నాలుగా కొందరు స్వీకరిస్తున్నారు.అది సరికాదు.స్వాతంత్రం రాకముందు కూడా ఆ దేశం ఉన్నది.అసలు కొన్ని దేశాలు పరాయి పాలనలోకి పోనేలేదు.కనుక దేశాలకు లగ్నాలను వాటి స్వాతంత్ర్యసమయాన్ని బట్టి కాకుండా ఆ దేశం యొక్క లక్షణాలను బట్టి నిర్ణయించడం తార్కికంగా ఉంటుంది.పాతకాలపు ప్రఖ్యాత పాశ్చాత్య జ్యోతిష్కుడు 'అలాన్ లియో' తన పరిశీలనను బట్టి తనకు తోచినట్లు దేశాలకు లగ్నాలను నిశ్చయించాడు.తర్వాతకూడా చాలామంది పాశ్చాత్య జ్యోతిష్కులు ఆ పనిని చేశారు.అందులో కొన్ని సరిపోతాయి.కొన్ని సరిపోవు.

మనుష్యులకు ఉన్నట్లే ప్రతీదేశానికి కొన్నికొన్ని లక్షణాలుంటాయి.ఆయా లక్షణాలను బట్టే రాశులను నిర్ణయించాలి.ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ పన్నెండు రాశులలో ఇమిడిపోతాయి.ఎందుకంటే ప్రాధమికంగా మానవస్వభావం ఈ పన్నెండు రాశులను దాటి బయటకు పోదు.

ఈకోణంలో చూస్తే చైనాకు వృశ్చికరాశి బాగా సరిపోతుంది.ఎందుకంటే వృశ్చికరాశి వారికి గుట్టు ఎక్కువ.అన్నీ రహస్యంగా ఉంచాలన్న తాపత్రయం వారికి ఉంటుంది.తమ విషయాలు ఎవరైనా గమనిస్తారేమో అని జంకు ఎక్కువగా ఉంటుంది.దానికి తోడు వృశ్చికరాశివారికి స్వార్ధం చాలా ఎక్కువ ఉంటుంది.ఎదుటివారు ఏమైపోయినా సరే తమపని అయితే చాలు అన్న మనస్తత్వం ఉంటుంది.అవసరం అనుకుంటే ఎదుటివారిని నిర్దాక్షిణ్యంగా తొక్కిపడేయడానికి కూడా వారు వెనుకాడరు.చైనాకు కూడా ఈ లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయని చరిత్ర చదివితే అర్ధం అవుతుంది.పైగా చైనా చిహ్నం అయిన డ్రాగన్ విషజంతువు.అలాగే వృశ్చికం కూడా విషకీటకమే. కనుక చైనాది వృశ్చికరాశే అని నేను భావిస్తాను.

పైగా మనది మకరరాశి.మనకు ఏకాదశం చైనారాశి అవుతుంది.అంటే మిత్రస్థానం.కానీ అది మకరానికి బాధకస్థానం గనుక ప్రస్తుతానికి మిత్రులుగా నటిస్తున్నా వారివల్ల మనకు చాలా బాధలుంటాయి.అలాగే జరుగుతున్నది కదా. 

వృశ్చికరాశికి ద్వాదశంలోనే ప్రస్తుతం శపితయోగం ఉన్నది.కనుక భారీనష్టం సూచింపబడుతున్నది.దానికి అనుగుణంగానే సోమవారం నాడు ఆశ్లేషా (రాహు)నక్షత్రంలో ఈ సంఘటన జరిగింది.ఆ సంఘటన జరిగినప్పుడు కూడా లగ్నం వృశ్చిక ధనూరాశుల మధ్యలో సంధిలో పడింది.ఆ సమయానికి నక్షత్రాదిపతి అయిన బుధుడు అష్టమంలో సున్నా డిగ్రీలలో వక్రించి బాగా బలహీనుడుగా ఉండటం చూడవచ్చు.కనుకనే 20,000 మందిని అక్కడనుంచి ఖాళీ చేయించవలసినంత పెద్ద ప్రమాదం జరిగింది.

నిన్న హాంగ్ కాంగ్ లో లక్షలాది మంది రోడ్లమీదకు వచ్చి ధర్నా చెయ్యడం జరిగింది.హాంగ్ కాంగ్ ప్రజలు కూడా చైనీస్ జాతివారే అన్నది గమనించాలి. అంటే ప్రకృతి వైపరీత్యాలను సృష్టించడం నుంచి మనుష్యులలో ఆవేశాలను రెచ్చగొట్టడంవరకూ గ్రహప్రభావం అన్ని స్థాయులలోనూ ఉంటుందని ఋజువు కావడం లేదూ?నిన్నకూడా ఆశ్లేషా నక్షత్రమే హాంగ్ కాంగ్ లో నడిచింది.

అయితే ఈ రెండు సంఘటనలలోనూ ఎక్కువ ప్రాణనష్టం జరగలేదు.కారణం ఏమంటే వృశ్చిక రాశికి కోణస్థితిలో ఉచ్చంలో ఉన్న గురువుగారి స్థితి.ఆయన దృష్టి పడటం వల్ల  ఘోరమైన ప్రమాదాలూ గొడవలూ జరుగకుండా పరిస్థితి అదుపులోకి వస్తున్నది.అదే లేకుంటే జరిగే ప్రాణనష్టాన్ని ఆపడం ఎవరి వల్లా అయ్యేది కాదు.


నిన్న ఉదయం 8.00 గంటల సమయంలో ఈశాన్య నైజీరియాలో 'మైదుగురి' అనే ఊరిలో కారు బాంబు పేలి కనీసం 50 మంది చనిపోయారు.అనేక కార్లూ ద్విచక్రవాహనాలూ తుక్కుతుక్కు అయ్యాయి.నిన్న మంగళవారం కావడమూ ఆశ్లేషా నక్షత్రమే నడుస్తూ ఉండటమూ గమనించాలి.లగ్నం కర్కాటకం అయింది.హోరాదిపతి శుక్రుడు కార్లకు సూచకుడన్న విషయమూ ఆయన ఏకాదశంలో బాధకస్థానంలో ఉన్నాడన్న విషయమూ గమనార్హములు.వాహనస్థానంలో శపితయోగం ఉన్న విషయం గమనించండి.


50 మంది చనిపోయారంటే అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది.కాని అసలు విషయం అది కాదు.రంజాన్ మాసం కావడంతో ఎక్కువమంది వ్యాపారస్తులు అప్పటికి షాపులు తెరవలేదు.లేకపోతే పేలుడు ధాటికీ ఇంకా ఎన్నో రెట్లు ప్రాణనష్టం జరిగి ఉండేది.అంటే,మతపరమైన కార్యక్రమంలో ఉన్నందువల్ల వారు రక్షింపబడ్డారు.అన్ని మత కార్యకలాపాలకూ గురువు అధిపతి అని గుర్తు ఉంచుకుంటే,ఈ సంఘటనలో గురువుగారి ఉచ్చస్థితి వారిని ఎలా కాపాడిందో అర్ధమౌతుంది.లగ్నం కర్కాటక రాశిలోనే ఉచ్చంలో ఉన్న గురుచంద్రుల సమక్షంలోనే ఉన్నదని గమనించాలి.ఇది తాత్కాలిక గజకేసరీయోగం.ఈ విధంగా గురువుగారి అనుగ్రహం ప్రమాదాలనుంచి ప్రజలను అనూహ్యంగా కాపాడుతుంది.

శపితయోగం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చూపడంకోసం కొన్ని ఉదాహరణలు ఇచ్చాను.ఆప్ఘనిస్తాన్ లో జరుగుతున్న మారణకాండను కూడా వ్రాసి ఈ పోస్ట్ ను ఇంకాఇంకా పొడిగించడం ఇష్టంలేక ఇక ఆపుతున్నాను.
read more " చైనా ఆయిల్ పైప్ లైన్ లీక్-హాంగ్ కాంగ్ ఆందోళనలు-నైజీరియా కారుబాంబు పేలుడు-కొనసాగుతున్న రాహుప్రభావం "