Spiritual ignorance is harder to break than ordinary ignorance

24, జులై 2014, గురువారం

ఊహించినవి-జరిగినవి(26)

కాలజ్ఞానం 26 లో ఊహించినట్లు ఈ క్రింది సంఘటనలు 22,23 తేదీలలో జరిగాయి.

తన కర్ణాటక సంగీతజ్ఞానంతో కొన్ని వందల కచేరీలు చేసి చుట్టు పక్కల గ్రామాలలో 'సంగీతం మామ్మ'గా ఎంతో పేరు సంపాదించిన మేదరమెట్ల పర్వతవర్ధని(82) దుగ్గిరాల మండలంలో 22.7.2014 న చనిపోయారు.

ప్రపంచవ్యాప్తంగా కొంతమంది మ్యుజీషియన్స్ ఈ రెండు రోజులలో చనిపోయారు.వారి వివరాలు నెట్ లో చూడవచ్చు.

అలాగే,మతపరమైన రంగాలలో చూస్తే--అమర్నాథ్ యాత్రలో గ్యాస్ సిలెండర్ పేలి నలుగురు చనిపోయారు.శివసేన MP ఒకాయన రంజాన్ దీక్షలో ఉన్న ఒక ముస్లిం చేత బలవంతంగా రొట్టె తినిపించబోయారని లోక్ సభలో గందరగోళం అయ్యింది.తాము మోసగించబడుతున్నామని ముస్లిం కమ్యూనిటీలో కొందరు భావిస్తున్నారు.దానికి ఉద్ధవ్ ధాకరే సంజాయిషీ కూడా ఇవ్వవలసి వచ్చింది.

షిర్డీ సాయిబాబా దేవుడు కాడు ఒక ముస్లిం సెయింట్ మాత్రమే అని అన్నందుకు ద్వారకా శంకరాచార్యను కోర్టుకు వచ్చి హాజరు అయ్యి తన వాదనను వినిపించవలసిందిగా న్యాయస్థానం ఆదేశించింది.

ఈరోజు(24-7-2014) న జరిగినవి:--

>>మనోహరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర లెవల్ క్రాసింగ్ ప్రమాదంలో స్కూల్ బస్ ను నాందేడ్ పాసింజర్ రైలు డీ కొట్టి 26(?) మంది చిన్నపిల్లలు చనిపోయారు.

>>ప్రముఖ సాహిత్య విమర్శకుడు భాషా శాస్త్రవేత్త  చేకూరి రామారావు ఈరోజున అకస్మాత్తుగా గతించారు.