“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

ఆఫ్గనిస్తాన్ పరిస్థితి? జ్యోతిష్య విశ్లేషణ - 1

ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం కొన్ని వేల ఏళ్లుగా, అల్లరిమూకల రణరంగం గానే ఉంటూ వచ్చింది. ఎందుకలా? అంటే, కొన్ని కారణాలున్నాయి. ముఖ్యమైన కారణం మాత్రం ఒకటే.

యూరోప్ కీ ఆసియాకీ ఇది సరిహద్దులాంటిది. ఈ రెండు సంస్కృతులూ ఇక్కడ కలుస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే, ఈ రెండు ప్రాంతాలకూ ఇదొక తలుపు లాంటిది. యూరోప్, ఆసియాల మధ్య రాకపోకలు ఆఫ్ఘనిస్తాన్నుంచే జరగాలి. కాబట్టి, వేలాది సంవత్సరాలనుంచీ ఇదొక హైవే సిటీలా ఉంటూ వచ్చింది. దీనిగుండా రాకపోకలు చేసిన ప్రతి తెగా, దీన్ని ఆక్రమించిన ప్రతి తెగా, దీని జీవితాన్ని ప్రభావితం చేస్తూ వచ్చాయి.

హైవే మీద ఒక ఊరుంటే, అదొక మార్కెట్ లాగా అవుతుంది. ప్రయాణం కోసం కొందరు, వ్యాపారం కోసం కొందరు. ఇంకా రకరకాల పనులకోసం కొందరు, ఇలా ఎంతోమంది దానిలోకి వచ్చీపోతూ ఉండటంతో, అదొక కలగూరగంపలాగా తయారౌతుంది. ఎన్నో జాతుల, సంస్కృతుల ప్రభావాలకు లోనౌతుంది. ఆఫ్ఘనిస్తాన్ కు కూడా అదే జరిగింది.

క్రీపూ 1500 ప్రాంతంలో దీనిని గాంధారదేశం అనేవారు. అది ప్రస్తుతపు ఇరాన్ నుంచి సింధులోయ వరకూ వ్యాపించి ఉండేది. ఆ తరువాత కాంభోజరాజ్యం అనేవారు. దానిని అశ్వకులు అనే జాతి పాలించేవారు. గుర్రాలమీద తిరిగేవారినే అశ్వకులనేవారు.  వీళ్ళు ఈనాటికీ హిందూకుష్ పర్వతప్రాంతంలో (నేటి పంజషీర్ ప్రాంతం) అష్కున్, యాష్కున్ అనే పేర్లతో కొనసాగుతున్నారు. ఇవన్నీ 'అశ్వక' అనే సంస్కృతపదానికి అపభ్రంశపదాలే.

500 బీసీ లో బాబిలోనియా రాజు డేరియస్ - 1 దీన్ని జయించాడు. 329 బీసీ లో అలెగ్జాన్డర్ దీనిని జయించాడు. మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం అశోకచక్రవర్తి అధీనంలో ఉండేది. తరువాత కుషాణులు దీనిని పరిపాలించారు. ఆ తరువాత చాలామంది దీనిని జయించినప్పటికీ, ఇక్కడ చాలా తెగలు, వాళ్ళ సంస్కృతులు, చిన్నచిన్న రాజ్యాలు ఉన్నందువలన, అదొక కొండప్రాంతమై నందువలన, ఒక దేశంగా ఇది గుర్తింపబడలేదు.

దాదాపు 1500 సంవత్సరాలు ఇలా గడిచాక, 10 శతాబ్దంలో దీనిని జయపాలుడనే భారతరాజు పరిపాలించాడు. 13 వ శతాబ్దంలో చెంగిజ్ ఖాన్ దీనిని జయించాడు. ఇతను ముస్లిం కాదు. ఖాన్ అనేది మంగోలియాలో, 'రాజు' అనే పదానికి సమానార్ధకమే గాని, ఇస్లామిక్ పేరు కాదు. క్రీశ 1700, 1800 వరకూ ఇక్కడ ఇస్లాం మతం వేళ్లూనుకోలేదు. వీళ్ళు జొరాష్ట్రియన్ మతాన్ని, బౌద్ధమతాన్ని, సూర్యారాధనను, హిందూమతాన్ని పాటించేవారు. ఈనాటికీ అక్కడి ముస్లిములలో సూర్యారాధకులున్నారు.

బమియాన్ లో ఉన్న ప్రసిద్ధ బుద్ధవిగ్రహాన్ని తాలిబన్లు షూటింగ్ రేంజ్ టార్గెట్ గా వాడుకుని, కూల్చేశారు. అప్పుడు, పంజషీర్ తిరుగుబాటు నాయకుడు అహమద్ షా మసూద్ సైన్యానికి తాలిబన్లు కొందరు దొరికిపోయారు. మసూద్ కూడా ముస్లిమే అయినప్పటికీ, మోడరన్ భావాలున్న లిబరల్ ముస్లిం. వారిని మసూద్ ఇలా అడిగాడు.

'ఎందుకు మీరు బుద్ధవిగ్రహాన్ని తుపాకులతో కాల్చి ధ్వంసం చేశారు?'

వాళ్లలో ఒకడు ఇలా చెప్పాడు.

'ఇస్లాం ప్రకారం ఏ ఆకారాన్నీ పూజించకూడదు. అందుకే అలా చేశాం'

అప్పుడు, మసూద్ ఇలా అడిగాడు.

'ఈ ప్రాంతంలో చాలామంది సూర్యారాధకులున్నారు. సూర్యుడిని కూడా అలాగే కూల్చేసి, ప్రపంచాన్ని చీకట్లో ముంచేద్దామనుకుంటున్నారా మీరు?'

మూర్ఖ తాలిబన్ ఏం చెప్పాడో తెలీదు. చెప్పడానికి వాళ్ళదగ్గర లాజిక్కేముంటుంది గనుక? బూజుపట్టిన ఖురాన్ను గ్రుడ్డిగా నమ్మడం ఒక్కటే వాళ్లకు తెలిసిన లాజిక్.

లిబరల్ ముస్లిం అయిన మసూద్ ను అతని 46 వ ఏట హత్య చేసి చంపేశారు పాకిస్తాన్ నీచులు. ఇది సరిగ్గా 2001 లో ట్విన్ టవర్స్ కూలిపోవడానికి ఒక వారం ముందు జరిగింది.

ఇస్లాం అడుగుపెట్టాకనే ఆఫ్ఘనిస్తాన్ లో అరాచకం మొదలైంది. అంతకు ముందు, అది చాలావరకూ శాంతిగా బ్రతికిన ప్రాంతమే. అంతెందుకు? ఈనాడు ప్రపంచంలో ఎక్కడ గొడవలున్నా, ఎక్కడ శాంతి లేకపోయినా, ఎక్కడ కుట్రలు కుతంత్రాలూ ఉన్నా, అవి రాడికల్ ఇస్లాం వల్లనేనన్నది అందరికీ తెలుసు. రాడికల్ ఇస్లామన్నది ప్రపంచానికి పట్టిన అతిపెద్ద దరిద్రం. దానిని పోషిస్తున్న సైతాన్ దేశం పాకిస్తాన్. ఈ సంగతి అన్ని దేశాలకూ తెలుసు. ఇన్నాళ్లూ తెలియనట్లు నటించిన అమెరికాకూడా ఇప్పుడు  మూతి పగిలాక ఒప్పుకుంటోంది. రాడికల్ ఇస్లాం, పాకిస్తాన్ ఈ రెండూ లోకంలో లేకుండా పోతే తప్ప, ప్రపంచానికి శాంతి అనేది ఎప్పటికీ ఉండదు.

మనకు స్వాతంత్య్రం రాకముందు పాకిస్తాన్ అనే నీచపు దేశం లేదు. ఆ నీచులందరూ మన దేశంలోనే ఉంటూ, మనకే గోతులు త్రవ్వుతూ ఉండేవాళ్ళు.  ఆఫ్ఘనిస్తాన్ వరకూ అప్పుడు ఇండియా సరిహద్దులు ఉండేవి. అందుకనే స్వాతంత్రపోరాటం సమయంలో సరిహద్దు గాంధీ అని పిలువబడే 'ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్', గాంధీతో కలసి మనవాళ్ళు చేసిన సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. తర్వాత స్వాతంత్య్రంరావడం, గాంధీ, నెహ్రు, జిన్నాల నిర్వాకంతో ఇండియా, పాకిస్తాన్లు ఏర్పడటం ఇదంతా చరిత్ర.

ఈలోపల ఆఫ్ఘనిస్తాన్ను రష్యా ఆక్రమించాలని చూడటం, దానితో ఆఫ్ఘనిస్తాన్ లో రాడికల్స్ (పష్టూన్లు), లిబరల్స్ (తాజికులు, మిగతా తెగలు) అంటూ ముస్లిములు రెండు వర్గాలుగా విడిపోవడం, ఒకరినొకరు చంపుకోవడం, వాళ్లకు రష్యా, అమెరికాలు సాయం చేసి, ఎగదోసి, మారణహోమాన్ని రాజెయ్యడం, పాకిస్తాన్ కుతంత్రంతో తాలిబన్ పుట్టుక, విచక్షణారహితంగా అందరినీ చంపుతూ వాళ్ళు భయోత్పాతాలు సృష్టించడం, పాకిస్తానూ తాలిబానూ కలిసి ఆడిన డబల్ గేమ్, 9/11 జరగడం, చివరకు మళ్ళీ నేడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్  వశం కావడం - ఇదంతా కూడా చరిత్రే. దానిని మళ్ళీ నేను వ్రాయవలసి అవసరం లేదు.

జ్యోతిష్యపరంగా, ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ గొడవల మధ్యలో మన దేశపరిస్థితి ఎలా ఉంటుంది? అన్నది మాత్రమే నేను వివరిస్తాను.     

(ఇంకా ఉంది)