“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, జులై 2021, శనివారం

శనికుజుల ప్రభావం - 14 (అమావాస్య ఎలా పనిచేసింది?)

నిన్న అమావాస్య. 50 రోజుల శాపం కొనసాగుతోంది. ఏమేం జరిగాయో చూడండి మరి.

ఇండోనేషియాలో 6.2 స్థాయి భూకంపం

శనికుజుల దుర్ఘటనా యోగం మళ్ళీ రుజువైంది. 6. 2  స్థాయి భూకంపం ఇండోనేషియా తూర్పు తీరాన్ని కుదిపేసింది. సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం కర్కాటకరాశి అధీనమే.

బంగ్లాదేశ్ ఆహార ఫెక్టరీలో అగ్నిప్రమాదం.

మొన్నసాయంత్రం మొదలైన మంటలు ఈ ఫెక్టరీలో 24 గంటలు గడిచినా ఇంకా మండుతూనే ఉన్నాయి.  52 మంది ఈ మంటలలో కాలిపోయి చనిపోయారు. కుజుడు అగ్నితత్వగ్రహమని, నీచస్థితి అతన్ని మరీ చికాకు చేస్తుందనీ,  బాంగ్లాదేశ్ కూడా మకరంలోనే ఉంటుందనీ. చంద్రుడు ఆహారకారకుడనీ గుర్తుంటే ఈ సంఘటన ఎందుకు జరిగిందో అర్ధమౌతుంది.

ఇండియాలో ఘోర రైలు ప్రమాదం

మధ్యప్రదేశ్ లోని బిలాస్ పూర్ దగ్గర ఒక బొగ్గు లోడుతో వెళుతున్న గూడ్స్ పట్టాలు తప్పింది. ఈ తప్పడం ఒక అలాన్ అనే నదిపైనున్న బ్రిడ్జిపైన జరిగింది. ఆ దెబ్బకు 16 కోల్ లోడు ఉన్న బోగిలు పల్టీలు కొట్టి క్రింద నదిలోకి పడిపోయాయి. ఇది ప్యాసింజర్ ట్రెయిన్ కాదు కాబట్టి సరిపోయింది. అదే మనుషులున్న రైలైతే మహా ఘోర ప్రమాదమే జరిగి ఉండేది.  ఇది సరిగ్గా నిన్న అమావాస్య ఘడియలలో సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో జరిగింది.

అమెరికాను  బెంబేలెత్తించిన రష్యా సైబర్ దాడులు

రాన్సమ్ వేర్ అంటే విలువైన సమాచారాన్ని నెట్లోనుంచి దొంగిలించి, బ్లాక్ మెయిల్ చెయ్యడం. రష్యాలోని సైబర్ క్రిమినల్స్ ఈ విధంగా అమెరికాలోని అనేక కంపెనీల రహస్య సమాచారాన్ని కాజేసి వారిని  వణికించారు. ఎన్నో అమెరికా కంపెనీలు తమ బిజినెస్ కార్యకలాపాలను ఆపేయవలసిన పరిస్థితి తలెత్తింది. జో బైడెన్ ఈ విషయమై పుతిన్ కు మెత్తని వార్నింగ్ ఇచ్చాడు.

ఈ అమావాస్య ఇలా పనిచేసింది మరి !