“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, మార్చి 2019, సోమవారం

Christchurch Shooting - Astro pointers

15-3-2019 మధ్యాన్నం 1-40 కి న్యూజీలాండ్ లోని క్రిస్ట్ చర్చ్ అనే ప్రదేశంలో రెండు మసీదులలో జరిగిన కాల్పులలో ఒకచోట 50 మంది ఇంకో చోట 7 మంది కాల్చబడ్డారు.

ముస్లిమ్స్ అంటే విపరీతమైన ద్వేషం ఉన్న బ్రెంటన్ హారిసన్ టారంట్ అనే వైట్ రేసిస్ట్ చేసిన పని అది. ఆ సమయానికి ఉన్న గ్రహస్థితులను పరికిద్దాం.

కుజ శనుల మధ్యన కోణదృష్టి
---------------------------------------
కోణదృష్టి మంచిదని సాధారణంగా జ్యోతిష్కులందరూ అనుకునే మాట. కానీ ఆ దృష్టిలో ఉన్న గ్రహాలు పరస్పర శత్రువులై ఉండి, అవి కూడా ప్రమాదకరమైన గ్రహాలైనప్పుడు కోణదృష్టి కూడా భయంకరమైన ఫలితాలనిస్తుంది అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఈ సమయంలో కుజుడూ శనీ ఇద్దరూ చాలా దగ్గరగా కోణదృష్టిలో ఉన్నారు.

కుజుని భరణీ నక్షత్రస్థితి
--------------------------------
భరణి యమనక్షత్రం. కనుక యుద్ధాలకు రక్తపాతానికి కారకుడైన కుజుడు ఈ నక్షత్రంలో ఉన్నపుడు తప్పకుండా సామూహిక మరణాలు జరుగుతాయి. అదే మళ్ళీ ఇప్పుడు రుజువైంది.

రాహు గురుల మధ్యన గల షష్ఠ - అష్టక దృష్టి
----------------------------------------------------------
రాహుగురుల సంబంధం, అది ఏ రకంగా ఉన్నాసరే, అది మంచిది కాదు. ఎందుకంటే దీనిని జ్యోతిష్యశాస్త్రంలో 'గురుచండాల యోగం' అని పిలిచారు. అంటే, మతపరమైన విధ్వంసం జరిగే యోగం అని చెప్పవచ్చు. ఇప్పుడు జరిగింది అదేగా !

రాహు గురువుల నక్షత్ర స్థితి
------------------------------------
గురువు, బుధునిదైన జ్యేష్టానక్షత్రంలో ఉన్నాడు. రాహువు బుధుని సూచిస్తూ గురువుదైన పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు. అంటే, వీరిద్దరికీ నక్షత్రస్థాయిలో పరివర్తనా యోగం ఉన్నది. శత్రువులైన వీరు ఇలాంటి సంబంధంలో ఉండటం మంచిది కాదు. కనుక తెలివైన ప్లానింగ్ తో కూడిన ఇలాంటి రక్తపాతపు సంఘటన జరిగింది.

బుధరాహువుల సంబంధం అతితెలివిని ఇస్తుంది. రాహు గురువుల సంబంధం  మతపరమైన గొడవలను సృష్టిస్తుంది. ప్రస్తుతం జరిగింది అదేగా !

బుధుని వక్ర నీచ స్థితి
---------------------------
బుద్ధికారకుడైన బుధుడు వక్రించి ఉండటం వక్రబుద్ధికి సూచన. అలాగే నీచస్థితిలో ఉండటం నీచమైన ప్లాన్స్ కు సూచిక. ఈ రెండూ కలసి ఆ హంతకుని చేత అలాంటి పనిని చేయించాయి.

ముస్లిమ్స్ అంటే పెరుగుతున్న అంతర్జాతీయ ద్వేషం
---------------------------------------------------------------------
ముస్లిమ్స్ ఏ దేశంలో ఉన్నా శాంతిగా ఉండరని, ఆ దేశంలో మతపరమైన చిచ్చు పెడుతూ ఉంటారన్న నమ్మకం ప్రపంచ వ్యాప్తంగా అనేకదేశాలలో గత ఇరవైఏళ్ళుగా బలపడుతూ వస్తున్నది. ఈ నమ్మకానికి ఆధారాలుగా ముస్లిమ్స్ చేసిన, చేస్తున్న అనేక పనులు నిలుస్తున్నాయి. ముస్లిమ్స్ అంటే క్రైస్తవులలో పెరుగుతున్న విద్వేషమే ఈ సంఘటన వెనుకనున్న బలమైన కారణం ! దీనిని Islamophobia అని పిలుస్తున్నారు. ఈ phobia ప్రబలడానికీ, వ్యాప్తి చెందడానికీ ముస్లిములే, ముఖ్యంగా పాకిస్తాన్ వంటి దేశాలే ముఖ్యమైన కారకులు !

మూడో ప్రపంచయుద్ధం అంటూ వస్తేగిస్తే, అది క్రైస్తవదేశాలకూ ముస్లిం దేశాలకూ మధ్యన మాత్రమే వస్తుందని జ్యోతిష్కులే కాదు, ప్రపంచ సామాజిక శాస్త్రవేత్తలూ, మేధావులూ కూడా ఎప్పటినుంచో అంటున్నారు. విచిత్రమేమంటే ఈ రెండు మతాలూ 'శాంతి' 'శాంతి' అంటూనే ఉంటాయి. దానినే బోధిస్తున్నామంటాయి. కానీ ఆచరణలో మాత్రం అదెక్కడా కనిపించదు. ప్రపంచంలో ఇప్పటిదాకా జరిగిన రక్తపాతం అంతా ఈ రెండు మతాల వల్లే జరిగింది.

ఆ మార్గంలో రాజుకుంటున్న నిప్పుకు ఈ సంఘటనలు సూచికలని భావిద్దామా?