పదవి, అహంకారం, గర్వం, లెక్కలేనితనం, దౌర్జన్యం - ఒకవైపు
సాత్వికజీవనం, తపస్సు, మర్యాద, మంచితనం, నిదానం - మరొకవైపు
రెంటికీ జరిగిన ఘర్షణలో మొదటివర్గమే గెలిచింది.
అడవిలో తపోమయజీవనం గడుపుతూ, ధ్యాననిష్ఠలో ఉన్న జమదగ్నిమహర్షి హత్యకు గురయ్యాడు.
ఆయన కుమారుడైన పరశురాముడు క్రుద్ధుడయ్యాడు.
భారతఉపఖండమంతా 21 సార్లు వెదకి, దుర్మదాంధులైన పాలకులను వారి సైన్యాలను ఒక్కడే ఎదుర్కొని, వారిని అంతం చేశాడు పరశురాముడు.
దౌర్జన్యాన్ని ఒంటిచేతితో ఎదుర్కొని నిలిచి, తపశ్శక్తి ఒక్కటే ఆయుధంగా న్యాయంకోసం ఒక్కడే పోరాడిన మహావీరుడు పరశురాముడు.
మానవచరిత్రలో అంతటి మహావీరుడు మరొకడు లేడు.
అంతటి అమానుషశక్తి సంపన్నుడు కనుకనే, సాక్షాత్తు నారాయణుని అవతారాలలో ఆరవ అవతారంగా పూజించబడుతున్నాడు.
నిజంగానా?
దశావతారాల బొమ్మలలో తప్ప ఎక్కడా ఆయన ఆరాధన కనిపించడం లేదే?
ఒక్క కేరళలో, తుళునాడులో, ఉత్తరభారతం కొన్ని ప్రాంతాలలో కొంతమంది బ్రాహ్మణులు తప్ప ఎవరు పరశురామావతారాన్ని పూజిస్తున్నారు?
ఎవరూ లేరు.
మళ్ళీ కదిలిస్తే చాలు 'సనాతనధర్మం' గురించి అందరూ ఉపన్యాసాలిస్తారు.
ఎక్కడుంది సనాతనధర్మం?
ఎవరిని పూజించాలి? ఎవరిని పూజిస్తున్నాం?
మన మహాపురుషులెవరు? మనం గుళ్లుకట్టి పూజిస్తున్నదెవరిని?
మనకసలు ఆత్మాభిమానం ఉందా?
ఆత్మపరిశీలన చేసుకోండి. అర్ధమౌతుంది.
ఈ రోజు పరశురామజయంతి.
నిస్సహాయస్థితిలో ఉన్నాసరే, న్యాయంకోసం, ధర్మంకోసం, రాజులనే ఎదుర్కొని పోరాడిన మహాఋషి పుట్టినరోజు ఇది.
మనజాతికి ఆత్మాభిమానాన్ని నేర్పిన అవతారపురుషుడు పుట్టిన రోజు ఇది.
కనీసం ఈరోజైనా ఆయనను ఆరాధించాలి.
కానీ, అందరూ ఏం చేస్తున్నారు? బంగారం షాపులకు ఎగబడి, కొద్దో గొప్పో బంగారం కొనుక్కుని, సనాతనధర్మాన్ని ఏదో ఉద్ధరించామని మురిసిపోతూ, సాయంత్రం సాయిబాబా గుడికెళ్తున్నారు.
చాలాబాగుంది కదూ ! ఇదే మరి సనాతనధర్మమంటే !
పరశురాముడిని మర్చిపోయాం గనుకనే పహల్ గావ్ జరిగింది.
ఆత్మాభిమానం నశించింది గనుకనే, అందరూ మనల్ని తొక్కుతున్నారు.
కనీసం ఈరోజైనా పరశురాముని ఆరాధించండి. ఆయన చరిత్రను చదవండి. ఆయనను ధ్యానించండి. ఆయన పౌరుషాన్ని కొద్దిగానైనా మనకు ప్రసాదించమని వేడుకోండి.
అప్పుడే భారతజాతికి మనుగడ ఉంటుంది.
లేదంటే, ఈరోజు మనం హాయిగా షాపింగులు చేసుకుంటూ, బంగారాలు కొనుక్కుంటూ, సాయంత్రం సినిమాలకెళ్తూ బ్రతకవచ్చు. రేపు మన పిల్లలు, వారి పిల్లలు ఈ దేశంలో ఉండలేక పారిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మన ఆడపిల్లలు నేడే లవ్ జిహాద్ లకు గురౌతున్నారు. రేపు ఇంకేం జరుగుతుందో కాస్త ఊహించుకోండి.
నకిలీ సనాతనధర్మాన్ని కాదు, అసలైన సనాతనధర్మాన్ని అనుసరించండి.
అప్పుడే మనకు భవిష్యత్తు.
తమ మూలాలను, తమ మహనీయులను మర్చిపోయేవారిని, ఆత్మాభిమానం లేనివారిని ఎవరూ బాగుచెయ్యలేరు.