జనవరి 31 నుండి ఫిబ్రవరి 8 వరకూ, తిరుపతిలో బుక్ ఫెస్టివల్ జరుగుతుంది. దీనిలో మన 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' కు 35 వ నంబరు స్టాలు కేటాయించబడింది. దీనిలో మా పుస్తకాలన్నీ లభిస్తాయి.
ఈ మధ్యనే విడుదలైన ఈ క్రింది పుస్తకాలను కూడా ఈ స్టాల్లో అందుబాటులో ఉంచుతున్నాము.
1. స్వరచింతామణి
2. యోగ యాజ్ఞవల్క్యము
3. జ్ఞానసంకలినీ తంత్రము
మా భావజాలాన్ని వివరించడానికి మా సంస్థ సీనియర్ సభ్యులు స్టాల్లో అందుబాటులో ఉంటారు.
తిరుపతివాసులు, అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని భావిస్తున్నాము.
ఫిబ్రవరి 5 మరియు 8 తేదీలలో నేను కూడా తిరుపతిలోనే ఉంటాను. అప్పుడు ఈ స్టాల్ ను సందర్శించబోతున్నాను.
తిరుపతిలో కలుసుకుందాం.
