“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, ఆగస్టు 2010, బుధవారం

చెడు రోజులు

ప్రస్తుతం కుజ శనుల కలయిక వల్ల జరుగుతున్న దుష్ఫలితాలు చూస్తున్నారు కదా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నట్లుండిఅనేక హింసాత్మక సంఘటనలు, ఉత్పాతాలు, రక్తపాతాలు జరుగుతున్నాయి.

ఎలక్త్రికల్ ఎలక్ట్రానిక్ పరికరాలు రిపేర్ వస్తాయి అని ముందుగానే వ్రాశాను. అలాగే జరుగబోతున్నది.

ఇప్పుడు పులిమీద పుట్ర లాగా ఇంకొక చెడు సూచన ముందున్నది.

శుక్రుడు 8-8-2010 తేదీన శనితొ సరిగ్గా డిగ్రీ కలయికలోకి వస్తున్నాడు.9-8-2010 అమావాస్య వస్తున్నది. కనుకమళ్ళీ చెడుకాలం సూచితం అవుతున్నది. అప్పటినుంచి 20-8-2010 వరకు శుక్రుడు- శని,కుజుల మధ్యన బందీ అవుతాడు. దీనిని జ్యోతిష పరిభాషలో పాపార్గళం అంటారు. పైగా కన్యారాశి లో శుక్రునకు నీచ స్థితి గా ఉంటుంది. అమావాస్య రోజుకు ముందుగానే, అనగా రేపటినుంచే సూచనా సంఘటనలు మొదలు అవుతాయి. గమనించండి.

వీటి ఫలితాలు ఎలా ఉంటాయి?

స్త్రీలు, విలాస భవనాలు, విలాస వంతమైన వస్తువులు మరియు వాహనాలు, సినిమా రంగం, జలప్రవాహాలు, షేర్ మార్కట్, వెండి బంగారాలు మొదలైనవి శుక్రుని అధీనం లో ఉంటాయి. కనుక ఆయా రంగాలలో చెడు సంఘటనలు తప్పక జరుగుతాయి.

స్త్రీల హత్యలు, ఆత్మ హత్యలు, ఆడపిల్లల కిడ్నాపులు, స్త్రీలకు ఒళ్ళు కాలడం, విలాస భవనాలు పడిపోవడాలు, విలువైన వస్తువులు నాశనం కావడం, వాహనాలు ధ్వంసం కావడం, సినిమా (కళా) రంగంలో ప్రముఖుల మరణం, సినీ, నాటక, కళా రంగాలలో ఉన్నవారికి ప్రమాదాలు జరగటం, జల ప్రమాదాలు ఉప్పెనలు, వంతెనలు తెగటం, షేర్ మార్కెట్ పతనం, బంగారం వెండి ధరలు తగ్గటం మొదలైన సంఘటనలు జరుగుతాయి. బాంబు దాడులలో విలాసయుతమైన భవనాలు ధ్వంసం కావటం జరుగవచ్చు. ఈ సంఘటన వెనుక ఉగ్రవాదుల కుట్ర ఉండవచ్చు. ఈ మూడుగ్రహాల కలయిక దక్షిణాన్ని సూచించే కన్యలో జరుగుతున్నందున ఈ ఘటనలు కూడా ఆ దిక్కుననే ఎక్కువగా జరుగవచ్చు. లేదా శుక్రుని దిక్కు అయిన ఆగ్నేయం లో జరుగుతాయి.

చెడుకాలంలో దైవ స్మరణే ఉపాయం. తెలివైన వారు ఆ పని చేస్తూ సాహస కార్యాలకు దూరంగా ఉండి జాగరూకతతో ప్రమాదాలనుంచి తప్పుకోవచ్చు.