“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

17, నవంబర్ 2009, మంగళవారం

హోమియోపతి లో నోసోడ్ల వాడకం

హోమియో వైద్యులకు చాలా సార్లు ఒక విచిత్ర పరిస్తితి ఎదురౌతుంది. సరియైన మందును ఎంచుకొని సరియైనపోటేన్సీలో వాడినా ఫలితం కనిపించదు. ఇలా ఎందుకు జరుగుతుంది?

హానెమన్ ఏళ్ళ తరబడి పరిశోధించి దీనికి జవాబు ఇచ్చాడు. సూచింపబడిన మందు (Indicated remedy) పనిచెయ్యక పోవటానికి కారణం శరీరంలో లోతుగా దాగి ఉన్న మయాజం (miasm) మాత్రమె. మయాజం అంటేకల్మషం (pollution)అని అనుకోవచ్చు. ఇది మూడు రకాలుగా ఉంటుంది అని ఆయన చెప్పాడు. సోరా, సిఫిలిస్, సైకోసిస్ అనే మూడు మయాజం లు సూచింపబడిన మందు పనిచెయ్యకుండా అడ్డుకుంటాయి. కనుక ఆమయాజంలను ముందు తొలగిస్తే తరువాత పని తేలిక అవుతుంది.

సోరా అనేది గజ్జిని పై పూతలతో అణచివేసినండువలన ప్రాణ స్థాయిలో కలిగే ఒక బలహీన పరిష్తితి. అలాగే సిఫిలిస్సైకోసిస్ అనేవి సిఫిలిస్ ను గనేరియాను ఇంజక్షన్లతో ఏంటి బయోటిక్స్ తో అణచి వేస్తె కలిగే ప్రాణిక బలహీన స్థితులు. ఇవి ప్రాణ స్థాయిలో ఆవరించి మనిషిని బలహీన పరుస్తాయి. ఇవి అడ్డుగా ఉన్నంత వరకు సూచింపబడిన మందు పనిచెయ్యదు. ఎందుకు ఇలా జరుగుతున్నదో అర్థం కాదు. ఈ చిక్కు ముడిని హానిమాన్ విప్పాడు. అంతే కాదు ఈమయాజం ల యొక్క లక్షణాలను క్రోడీకరించి వీటిని ఎలా గుర్తించాలి ఎలా ఎదుర్కోవాలో కూడా ఆయనే చెప్పాడు. అందుకే హానిమాన్ కు ఎన్ని నోబుల్ ప్రైజులు ఇచ్చినా తక్కువే అని అంటారు. కాని వైద్య చరిత్రలో ఒక విస్మృతమేధావిగా మిగిలిపోయాడు.

ఇక విషయానికొస్తే, ఇట్లాంటి పరిస్తితి వచ్చినపుడు ఏమి చెయ్యాలి? కుటుంబ చరిత్ర, రోగి చరిత్ర మరొక సారి క్షుణ్ణం గాపరిశీలించి ఏ మయాజం ఆ కుటుంబంలో ఉందొ గమనించాలి. తరువాత ఆ మయాజం ని కూడా కలిపి, అనగా ఆలక్షణాలను కూడా కలిపి మందును ఇస్తే అప్పుడు పని చేస్తుంది. ఇక్కడ రెండు విషయాలు ముఖ్యం గా గుర్తించాలి.

మొదటి రకం: కేస్ టేకింగ్ శ్రద్ధగా చెయ్యకపోతే సాధారణంగా ఇటువంటి పరిస్తితి ఎదురౌతుంది. మొదట్లోనే కుటుంబచరిత్ర వగైరా వివరాలు ఓపికగా రాబట్టి రాసుకుంటే ఈ బాధ ఉండదు. అంతర్గతం గా ఉన్న మయాజం మొదట్లోనేకనిపిస్తుంది. దాన్ని బట్టి లోతైన మందులు వాడితే మొదట్లోనే ఈ పరిస్థితి రాదు. అలా కాకుండా ఏదో పై పైన కేస్తీసుకొని మందు ఇస్తే ఇటువంటి పరిస్తితి ఎదురౌతుంది.

అందుకే హానిమాన్ ఒక అమూల్య మైన మాట చెప్పాడు. సరిగా కేస్ టేకింగ్ చేస్తే రోగం సగం తగ్గినట్లే అన్నాడు. అంటేఅంత శ్రద్ధగా రోగ లక్షణాలను రాబట్టే పని చెయ్యాలి. అల్లోపతి డాక్టర్ల లాగా రోగి చెబుతున్న దాన్ని వినకుండా ఏదో పదిమందులు, ఇరవై టెస్టులు రాసేసి ఇవి వాడి మళ్ళీ రండి, ముందు నా ఫీజు ఇచ్చి వెళ్ళండి అని చెప్ప రాదు. అలా చేస్తేఅది హోమియో వైద్యం అనిపించుకోదు. వ్యాపార వైద్యం అనిపించుకుంటుంది.

రెండవ రకం: కేస్ టేకింగ్ సరిగా చేసి సరియైన మందు వాడుతున్నా కూడా కొంతకాలం తరువాత ముఖ్యం గా దీర్ఘ రోగాలలో పురోగతి కొంత కాలం వచ్చి ఆగిపోతుంది. సూచింపబడిన మందు పని చెయ్యటంఆగిపోతుంది. మందు మార్చి ఇవ్వవలసిన ఇతర లక్షణాలు కనిపించవు. అటువంటప్పుడు మయాజం ఏదుందో గమనించి మయాజం నిర్మూలన ఔషధాలు వాడితే అప్పుడు రోగ లక్షణాలు కూడా చక్కగా బయటకు కనిపిస్తాయి. ఆపిన మందు మళ్ళీ పని చెయ్యటం చూడవచ్చు. లేదా ఇంకో మందు సూచింప బడే ఇతర లక్షణాలు కనిపించవచ్చు.

సామాన్యంగా సోరాకు సల్ఫర్, సిఫిలిస్ కు మెర్కురీ, సైకోసిస్ కు తూజా ఔషధాలు వాడవచ్చు. కాని ఇవి కూడాపనిచేయ్యనప్పుడు నోసోడ్ లు అయిన సోరినం, సిఫిలినం, మేడోరైనం అనే ఔషధాలు వాడవలసి రావచ్చు. సోరినంఅనేది గజ్జి పుండు రసి నుంచి, సిఫిలినం అనేది సిఫిలిస్ స్రావం నుంచి, మేడోరైనం అనేది గనేరియా స్రావం నుంచి తీసి పోటేన్సీలోకి మార్చిన మందులు. వీటిని 200 పోటేన్సీ కంటే తక్కువలో వాడరాదు. మాట మాటకి రిపీట్ చెయ్యరాదు. అలా చేస్తే తీవ్రమైన రోగ లక్షణాలు శరీరంలో కలుగుతాయి.

ఈ మధ్య కాలం లో ఎయిడ్సు రోగి రక్తపు చుక్కను పోటేన్సీలోకి మార్చి ఎయిడ్స్ నోసోడ్ ను కూడా తయారు చేసారు. ప్రాణాలకు తెగించి
దాన్ని నోట్లో వేసుకొని మింగి ప్రూవింగ్ చేసి లక్షణాలు రాబట్టిన ధీరులకు నిజంగా మానవ జాతి రుణపడి ఉంది.