“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, జులై 2016, శనివారం

జూలై 2016 పౌర్ణమి ప్రభావం - బాస్టిల్ డే విషాదం

ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో ఇంకో విషాదం.

జూలై పద్నాలుగున జాతీయ దినోత్సవ సంబరాలలోకి ఒక ఇస్లామిక్ ఉగ్రవాద మృగం ఒక ట్రక్కును విచక్షణా రహితంగా నడిపి కాల్పులు జరిపి దాదాపు 90 మందిని చంపేశాడు.ఇంకా ఎంతోమంది గాయపడ్డారు.

ఖగోళంలో రాహు గురువుల సంయోగం చాలా దగ్గరగా కొనసాగుతూ ఉండటం దీనికిగల ముఖ్య కారణమైతే వృశ్చికరాశిలో కుజ చంద్ర శనుల సంయోగమూ, చంద్రునికి ఇది నీచస్థితి కావడమూ ఈ సంఘటనకు వెనుక ఉన్న కర్మకారణాలు.ప్రస్తుతం మనం పౌర్ణమికి దగ్గరగా వెళుతున్నాం.

ఖగోళ జ్యోతిష్య శాస్త్రాన్ని అలా ఉంచి చూస్తే మరికొన్ని విషయాలు కనిపిస్తాయి.

ఇలాంటి ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు, ఇండియాలోని ముస్లిమ్స్ ఎవ్వరూ 'అయ్యో పాపం' అనగా ఇప్పటిదాకా నేను వినలేదు కనలేదు. ఈ ధోరణే, ఇస్లామిక్ ఉగ్రవాదం పట్ల వాళ్ళ సానుభూతిని తేటతెల్లం చేస్తోంది.

మరోవైపు ఇండియాకు రావడానికి జాకీర్ నాయక్ నిరాకరించాడు.పైగా, తమది ఇస్లామిక్ టీవీ కావడం వల్లనే తమపైన వివక్ష చూపిస్తున్నారంటూ భారత ప్రభుత్వాన్ని నిందించాడు. నిజంగా ముస్లిమ్స్ మీద మనం వివక్ష చూపిస్తే భారతదేశంలో వాళ్ళు ఇంత జనాభాగా ఎదిగేవారేనా?ఇక్కడి తిండి తింటూ,ఇక్కడ నీళ్ళు త్రాగుతూ, ఇక్కడి గాలి పీలుస్తూ ఇక్కడి మతాలను దూషించేవారేనా?

అతని జ్ఞాపకశక్తి గట్టిదే కావచ్చు, భగవద్గీత నుంచీ, పురాణాల నుంచీ అతను అనేక శ్లోకాలను కోట్ చెయ్యవచ్చు.అది పెద్ద గొప్ప పనేమీ కాదు.ఒక రెండేళ్ళు గనక ఖురాన్ బట్టీ పడితే అంతకంటే అద్భుతంగా ఆ శ్లోకాలను మనమూ వప్ప జెప్పవచ్చు.అసలు విషయం అది కాదు.

అతను చెప్పే లాజిక్ అంతా లోపభూయిష్టమే. అతను ఒక పిడివాదిలాగా మాట్లాడతాడు.ఎదుటి మనిషికి ఏమీ జవాబు చెప్పలేక తన లాజిక్ లో కార్నర్ అయిపోయినప్పుడు 'మా ఖురాన్ ఇలా చెబుతోంది గనుక మేం అదే నమ్ముతాం.దానికి వ్యతిరేకంగా ఉన్న మంచినీ, తార్కిక సత్యాలనూ కూడా మేం నమ్మం' అని తేల్చేస్తాడు.ఇక అలాంటప్పుడు చర్చ ఎందుకు? వాదన ఎందుకు? ఎవరి నమ్మకం వారిది కదా?

నాకొక ముస్లిం శిష్యురాలు గతంలో ఉండేది.ఆ అమ్మాయి వాళ్ళ బావ ఒకరోజున ఆమెతో ఇలా అన్నాడట.

'మీ గురువుగారిని పీస్ టీవీలో జాకీర్ నాయక్ ఉపన్యాసాలు వినమను.ఒక్కసారి విన్నాడంటే ఆయన ముస్లింగా మారడం తధ్యం.'

ఆమెతో నా మాటగా ఇలా అన్నాను.

'జాకీర్ నాయక్ నాతో ఒక గంట సేపు మాట్లాడితే, తనే ఇస్లాం వదిలేసి అసలైన హిందూమతం స్వీకరిస్తాడని మీ బావతో చెప్పు.అతను రాకపోతే కనీసం మీ బావనైనా వచ్చి నాతో మాట్లాడమను.'

అటువైపునుంచి ఏమీ జవాబు రాలేదు.

అతనేకాదు - 'అదే కారణమైనా కానీ, కనిపించని దేవుడి కోసం కనిపించే సాటి మనిషిని చంపడం అసలు న్యాయమేనా?' - అన్న ప్రశ్నకు ప్రపంచంలోని ఏమాత్రం మానవత్వం ఉన్న ఏ మనిషీ జవాబు చెప్పలేడు.

అంతేకాదు, ఇస్లాంలోని మౌలిక విషయాల మీద ప్రశ్నలు సంధిస్తే వాటికి ఎలాంటి జవాబులూ రావు.ఎంతటి జాకీర్ నాయక్ కూడా వాటికి జవాబు చెప్పలేడు. జవాబులు చెప్పలేనప్పుడు మూర్ఖంగా మాట్లాడతారు. అంతే.

ఉదాహరణకు ఒక చిన్న ప్రశ్న.

'మీలోనే కొందరు ఇస్లాం అంటే శాంతి అంటారు. మరికొందరేమో- అదే ఇస్లాం చెప్పింది కాఫిర్లను చంపమని - అని అంటారు? మీలో అసలెవరు కరెక్ట్? అసలు ఇస్లాం ఏం చెప్పింది? పక్కమనిషిని చంపమని చెప్పిందా లేదా? అది చెప్పడమే తప్పా? లేక మీరు అర్ధం చేసుకోవడం తప్పా? రెండిట్లో ఏదైనా, మానవత్వ కోణంలో చూస్తే, రెండూ తప్పులేగా? అలాంటప్పుడు ఆ బోధలు అనుసరించి మీరు చేస్తున్నదీ తప్పేగా? కాదని ఎలా సమర్దిస్తారు?' - అన్న ప్రశ్నకు ఎంతటి మొనగాడైనా ఎలాంటి సమంజసమైన తార్కికమైన జవాబునూ చెప్పలేడు.

ఇంకో ప్రశ్న.

'ఇస్లాం ప్రకారం 'శాంతి' అంటే ఏమిటి? ముస్లిములు కానివారిని అందర్నీ చంపేసి, ఆ తర్వాత మిగిలేదానినే మీరు శాంతి అంటున్నారా? అది శాంతి ఎలా అవుతుంది?'

ఇంకో ప్రశ్న.

'ఇస్లాంలో ఉన్న బోధలు మానవత్వానికి విరుద్ధంగా ఉంటే వాటిని మార్చాలా? లేక గుడ్డిగా అనుసరించాలా? ఒకవేళ గుడ్డిగా అనుసరించాలి అన్నప్పుడు, ఆ వ్రాసినవారు మానవతా వాదులు కానట్లే కదా? మరి వారిని శాంతి దూతలని ప్రవక్తలని ఎలా అంటారు? హింసను ప్రేరేపించేవాడు ప్రవక్త ఎలా అవుతాడు? దీనిని మీరు ఎలా సమర్ధిస్తారు?'

ఈ ప్రశ్నలలో వేటికీ ఏ విధమైన తర్కబద్ధమైన జవాబూ రాదు. ఇవ్వడం వారివల్ల కాదు.

ఏమీ తెలియని అజ్ఞానులు జాకీర్ నాయక్ లాంటివాళ్ళ ప్రసంగాలు విని అదేదో గొప్ప అనుకుంటారు.ఇలాంటి అరబుర్ర గాళ్ళను చూచి నేను నవ్వుకుంటాను.

'తినగ తినగ వేము తియ్యనుండు' అన్నట్లు - వినగా వినగా విషం కూడా అమృతంలాగా తోస్తుంది.విషపు భావజాలాన్ని నూరిపొయ్యగా నూరిపొయ్యగా మామూలు మనుషులే టెర్రరిస్ట్ లు గా మారతారు.ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరిగింది ఇదే.

ఫ్రాన్స్ లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఒక విచిత్ర ధోరణి కనిపిస్తున్నది. అదేమంటే - భవిష్యత్తులో ప్రపంచం మొత్తం - ఇస్లామిక్, నాన్ ఇస్లామిక్ దేశాలు- అనే రెండు కూటములుగా విడిపోతుంది.అప్పుడు జరిగేదే మూడో ప్రపంచ యుద్ధం.అప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరిగే వినాశనం చాలా దారుణాతి దారుణంగా ఉంటుంది.ఈ భవిష్యవాణి ఖచ్చితంగా జరుగుతుంది.ఏమీ అనుమానం లేదు.అయితే అది దేశాలమధ్య జరగదు.మతాలమధ్య జరుగుతుంది.మతాల ప్రాతిపదికన రెండుగా చీలిన ప్రపంచపు దేశాలమధ్యన జరుగుతుంది.

అప్పుడు జరిగే వినాశనాన్నే వీరబ్రహ్మం గారూ, నోస్త్రాడేమస్ మొదలైన కాలజ్ఞానులు వర్ణించారు.అది భవిష్యత్తులో జరిగే మాట నిజమే.దానిని ఆపటం ఎవరికీ సాధ్యం కాదనే నాకనిపిస్తున్నది.

ఇస్లాం మతం వల్ల ప్రపంచంలో చాలా రక్తపాతమూ నాశనమూ జరిగాయి ఇప్పటికీ జరుగుతున్నాయి. అంతెందుకు? మన దేశంనుంచి బౌద్ధమతం కనుమరుగు కావడానికి ప్రధాన కారణం ఇస్లాం సృష్టించిన రక్తపాతమే.బౌద్ధ సన్యాసులనూ గురువులనూ నరకడమూ, సజీవంగా దహనం చెయ్యడమూ - ఇలాంటి పనులు చేసి భయోత్పాతం సృష్టించడం వల్లనే మిగిలినవాళ్ళు టిబెట్ మొదలైన ఇతర దేశాలకు పారిపోయారు.కానీ ఆ నిందను మాత్రం దివ్యమూర్తి అయిన ఆదిశంకరుల మీద మోపారు.హిందూమతం అంటే ద్వేషం ఉన్న మిగతావాళ్ళు ఆ మాటను పట్టుకుని గుడ్డిగా ప్రచారం చేశారు.ఇప్పుడు అదే నిజమని అందరూ నమ్ముతున్నారు.

వాళ్ళు ఎప్పుడూ చేసేది అదే. చెయ్యాల్సిన ఘోరాలన్నీ వాళ్ళు చేస్తారు.నిందమాత్రం ఎదుటివారిమీద మోపుతారు. మొదటి నుంచీ వాళ్ళ స్ట్రాటజీ అదే. 

అదలా ఉంచితే, చాపక్రింద నీరులా హింసావిషాన్ని వ్యాపింపజేస్తున్న ఇలాంటి ఉగ్రవాద శాంతి మూకలను శాంతిగా భరిస్తున్న మనమా శాంతి దూతలం?లేక, సాటి మనుషులను చంపమని ప్రోత్సహిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదులా శాంతిదూతలు?

మన ప్రభుత్వం గట్టిగా ఉండకపోతే, ముందు ముందు, మన దేశంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయనేది, ఎంతోమంది అమాయక పౌరులు బలౌతారనేది, ఖచ్చితంగా ఊహించవచ్చు.

పోనీలే అలాగైనా మన జనాభా కాస్త తగ్గుతుందిలే అనుకుంటే, ఆ ఆలోచనా ధోరణికి ఇక ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు.

వినాశకాలే విపరీత బుద్ధి: