“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

9, ఆగస్టు 2019, శుక్రవారం

దేశానికి నిజమైన స్వతంత్రం ఇప్పటికి వచ్చింది

గాంధీ నెహ్రూలు చేసిన చారిత్రాత్మక తప్పిదం 72 ఏళ్ళ తర్వాత మోడీ, అమిత్ షాల చేత సరిచెయ్యబడింది. గాంధీ నెహ్రూలు చేసిన ఈ తప్పు వల్ల కాశ్మీర్ లో ఇన్నేళ్ళలో దాదాపు 50,000 మంది దారుణంగా చనిపోయారు. ఈ లెక్క ఇంకా ఎక్కువే కావచ్చు.

ప్రాచీన కాలంలో ఆఫ్ఘనిస్తాన్ వరకూ భారతదేశంలోనే ఉండేది. శ్రీరాముని కుమారుడు లవుడు స్థాపించినదే లవహోర్ లేదా లాహోర్. లక్ష్మణుడు స్థాపించినదే లక్నో. భరతుడు స్థాపించినది మధుర. ఇవన్నీ అప్పట్లో అడవులుగా ఉంటె, వాటిని కొట్టించి జనపదాలుగా మార్చారు వీళ్ళు. అలాగే నేటి కాశ్మీర్ కూడా భారతదేశంలో భాగమే.

స్వతంత్రం వచ్చిన సమయంలో గట్టిగా నిలబడకుండా, ఎవరేది చెబితే దానికి తలలూపడం గాంధీ నెహ్రూలు చేసిన పెద్దతప్పు. అసలు నెహ్రూను రాజకీయాలలో ప్రోమోట్ చెయ్యడం గాంధీ చేసిన ఘోరాతిఘోరమైన తప్పు. నెహ్రూకి ఉన్న అమ్మాయిలపిచ్చి లాంటి బలహీనతలను చక్కగా వాడుకుని బ్రిటిష్ వాళ్ళూ, మహమ్మదాలీ జిన్నా, షేక్ అబ్దుల్లాలు భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేశారు. నిజానికి, నెహ్రూ, జిన్నా, షేక్ అబ్దుల్లాలు అన్నదమ్ములని గట్టి ఆధారాలున్నాయి. నిజానికి నెహ్రూలో ఉన్నది ముస్లిం రక్తమే. అందుకే వాళ్లకు వత్తాసుగా మాట్లాడి, కాశ్మీరుకు స్వతంత్ర ప్రతిపత్తి కట్టబెట్టాడు. ఏడు దశాబ్దాలుగా రావణకాష్టంలా మండుతున్న కాశ్మీర్ సమస్యను మన నెత్తిన పెట్టి పోయాడు.

భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ని రూపొందించడం అతి పెద్ద తప్పు. అంబేద్కర్ కూడా దీనికి ఒప్పుకోలేదు. ఇది పాస్ చేసిన రోజున సమావేశానికి ఆయన హాజరు కాలేదు. పటేల్ దీనిని ఒప్పుకోలేదు. ఈ విధంగా చాలామంది దేశభక్తులు దీనిని ఒప్పుకోలేదు. కాశ్మీరులో 70 ఏళ్ళ మారణహోమానికి అదే కారణం అయింది. కాశ్మీరుకు ఫండ్స్ ఇచ్చేది మనం. అనుభవిస్తున్నది షేక్ అబ్దుల్లా కుటుంబం ఇంకా పాకిస్తాన్ అనుకూలవాద హురియత్ వర్గాలు. అక్కడి ప్రజలు మాత్రం దరిద్రంలోనూ, నిరక్షరాస్యత లోనూ 70 ఏళ్ళుగా మగ్గిపోతున్నారు. టూరిజం పుణ్యమాని దాని అనుబంధ వ్యాపారాలు చేసుకుంటూ కొన్నేళ్ళు నెట్టుకొచ్చారు. కానీ తీవ్రవాద మూకల పుణ్యమా అంటూ టూరిజం కాస్తా కూలబడింది. కాశ్మీర్ ప్రజలకు బ్రతుకు తెరువు లేదు. చదువు లేదు. భయంకరమైన ఇస్లాం చట్టాలు అమల్లో ఉన్నాయి. స్త్రీలకు ఏ హక్కులూ లేవు. ఇదీ కాశ్మీర్ పరిస్థితి.

కాశ్మీర్ పండిట్స్ ను ఎక్కడికక్కడ ఊచకోత కోస్తూ దారుణంగా చంపుతుంటే భయపడి వాళ్ళందరూ వాళ్ళ ఇల్లూ వాకిళ్ళూ వదిలిపెట్టి కట్టుబట్టలతో పారిపోయి వచ్చి డిల్లీలోనూ ఇంకా ఇతర రాష్ట్రాలలోనూ స్థిరపడి ఏవేవో పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. 

ఇది చాలదన్నట్టు మన భూభాగాన్ని కొంత ఆక్రమించిన పాకిస్తాన్ దాన్ని POK గా మార్చింది. అందులో కొంత భాగాన్ని తెలివిగా చైనాకు ధారాదత్తం చేసింది. అదొక పీటముడిగా తయారైంది. కాశ్మీర్ తమదే అన్నట్టు పాకిస్తాన్ మాటమాటకీ అందులో జోక్యం చేసుకుంటూ ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఉంటుంది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చూసీ చూడనట్టు ఊరుకుంటూ ఉంటుంది. మనం కడుతున్న టాక్స్ మాత్రం స్పెషల్ ఫండ్ రూపంలో వందలు వేల కోట్లు కాశ్మీర్ కు చేరుతూ ఉంటుంది. కానీ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం కాదు. ఇదీ గత 70 ఏళ్ళుగా జరిగిన తంతు.

ఇదంతా పనికిరాదని, కాశ్మీర్ భారతదేశంలో భాగం కావాలని తపించి, గాంధీ నెహ్రూల కుట్రలను బయటపెట్టిన అకలంక దేశభక్తుడు డా || శ్యాంప్రసాద్ ముఖర్జీ విషప్రయోగం చెయ్యబడి కన్నుమూశాడు. ఇంకా చెప్పాలంటే నెహ్రూ షేక్ అబ్దుల్లాలు కలసి ఆయన్ను చంపేశారు. ఆయన కలమాత్రం అలాగే ఉండిపోయింది. ఇన్నాళ్ళకు మోడీ, అమిత్ షా ల పుణ్యమా అని ఆ కల నిజమైంది.

ఆనాడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ పూనుకొని మిలిటరీ యాక్షన్ తీసుకోక పోయి ఉంటే, నేడు తెలంగాణా మొత్తం పాకిస్తాన్ అధీనంలో ఉండి ఉండేది. నేడు మోడీ, అమిత్ షాలు పూనుకోక పోతే కొంతకాలానికి కాశ్మీర్ కూడా పాకిస్తాన్ కబంధ హస్తాలలోకి వెళ్ళిపోతుంది.

భారతదేశం ఇన్నాళ్ళూ సూపర్ పవర్స్ కి భయపడుతూ బ్రతుకుతూ వచ్చింది. ఇప్పుడు చైనా కూడా సూపర్ పవర్ అయింది. ఒకవైపున అరుణాచల ప్రదేశ్ తమదే అంటోంది. ఇంకోవైపున నేపాల్ లో పాగా వేసింది. భూటాన్ ను మింగాలని చూస్తోంది. పాకిస్తాన్ కు ఓపెన్ గా సహాయం చేస్తోంది. ఇప్పుడు కూడా శాంతివచనాలు చెబుతూ కళ్ళు మూసుకుని కూచుంటే కాశ్మీర్ మన చేతిలోనుంచి జారిపోవడం ఖాయం. అదే జరిగితే ఉత్తరాఖండ్ వరకూ పాకిస్తాన్ చైనాలు వచ్చేస్తాయి. మన దేశపు ఉనికే ప్రమాదంలో పడుతుంది. ఇదంతా గమనించే మోడీ అమిత్ షాలు ఈ తెలివైన పని చేశారని నా ఊహ.

ఆర్టికల్ 370 ని రద్దు చేయించడంలో వీరిద్దరి పాత్ర అమోఘం. ఇంతకంటే దేశభక్తికి రుజువు ఇంకేమీ అవసరం లేదు. నన్నడిగితే ఇంకో 30 ఏళ్ళపాటు మోడీనే మనకు ప్రధానిగా ఉండాలంటాను. స్వతంత్రం వచ్చాక నీతీ నిజాయితీ, చిత్తశుద్ది, గుండెధైర్యం ఉన్న ప్రధాని ఇప్పటివరకూ ఆయనొక్కడే అనిపించాడు మరి !!

అయితే, ప్రస్తుతం కాశ్మీర్ అంతా కర్ఫ్యూలో ఉంది. దాన్ని ఎత్తేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అనుమానమే. పాకిస్తాన్ చేత ఎగదోయ్యబడే అక్కడి ఉగ్రమూకలను తట్టుకోవాలి, ఇంకో పక్కన అంతర్జాతీయ ఒత్తిళ్లను తట్టుకోవాలి. ముందు ముందు పాకిస్తాన్ ఎగదోసే రోజువారీ కుట్రలను అల్లర్లను ఎదుర్కోవాలి. మోడీ ప్రభుత్వానికి చాలా సవాళ్లు ఎదురుగా ఉన్నాయి. ఎన్ని సవాళ్లు సమస్యలు ఉన్నా సరే, సరిచెయ్వవలసిన తప్పును ధైర్యంగా సరిచేశారు. రాజ్యాంగ రూపకర్తలు చేసి, మనకు అంటించిపోయిన, దారుణమైన తప్పును ఇంకా ఇంకా ఆలస్యం చేసి ముదరబెట్టుకోకుండా ధైర్యంగా పరిష్కారం చేశారు.

ఈ సాహసోపేతమైన చర్యకు మోడీని, అమిత్ షాను భారత ప్రజలందరూ నెత్తిన పెట్టుకోవాలి. అలా చెయ్యనివారందరూ నా దృష్టిలో దేశద్రోహుల క్రిందే లెక్క.