“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, ఆగస్టు 2019, శుక్రవారం

ఇండియా ప్రధాన శత్రువులు ఇంటిదొంగలే

ఇది ఈనాడు కొత్తగా జరుగుతున్నది కాదు. చరిత్ర మొదటినుంచీ మనదేశంలో ఇదే తంతు. మొదటినుంచీ మన దేశానికి ప్రధానమైన శత్రువులు ఇంటిదొంగలే. కృష్ణుడి కాలంలో గ్రీకులకు రోమన్లకు ఉప్పు అందించి మన గుట్టుమట్లు చెప్పి, రహస్య మార్గాలు ఎక్కడున్నాయో చెప్పి శత్రువులకు రాచమార్గాలు వేసింది ఇంటిదొంగలే. వారిలో కొంతమంది రాజులూ ఉండేవారు. పక్కరాజును మనం గెలవలేమని అనుకున్నప్పుడు విదేశీయులను ఆహ్వానించి వారిచేత సాటి రాజును ఓడించేవారు. ఆ తర్వాత ఆ విదేశీరాజు వీడిని కూడా చితక్కొట్టి చెవులు మూసేవాడు. ఇలా చరిత్రలో ఎన్నో సార్లు జరిగింది. అయినా మనవాళ్లకు బుద్ధి రాదు. ఎంతసేపూ 'నా కులం నా ఊరు' తప్ప జాతీయతాభావం రాదు.

మధ్యయుగాలలో తురుష్కులు అరబ్బులు మొఘలులు మన దేశం మీదకు దండెత్తి వఛ్చినపుడు కూడా మనవాళ్ళు ఇదే విధంగా హీనంగా ప్రవర్తించి, మన గుట్టుమట్లన్నీ వారికీ అందించి, మాతృదేశానికి తీరని ద్రోహం చేశారు. మాలిక్ కాఫర్ ఢిల్లీ నుంచి బయల్దేరి కాకతీయ సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసి, మదురై వరకూ ఊచకోత కోస్తూ సాగిపోయాడంటే అర్ధం ఏమిటి? ఇంటిదొంగలు అతనికి సాయం చేసి తలుపులు బార్లా తెరవడమే దానికి కారణం.

ఇంతమంది రాజులు, సైన్యాలు ఉన్న మన దేశాన్ని ఇంగిలీషు వాళ్ళు తేలికగా ఎలా గెలవగలిగారు? ముఖ్యకారణాలు ఎన్నున్నా వాటికి సహాయపడిన మనుషులు ఇంటిదొంగలే. స్వతంత్ర పోరాటం ముగిసి మనకు గెలుపు వఛ్చినపుడు కూడా మనవాళ్ళు ఇదే విధంగా చేశారు. కనీసం ఈ డెబ్బై ఏళ్లలోనూ వారికి దేశభక్తి రాకపోగా ప్రస్తుతం బాహాటంగా శత్రుదేశాలను సమర్ధించే కార్యక్రమం ఎక్కువై పోయింది. బయటనుంచి వఛ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు మన దేశాన్ని  సమర్ధించాలి గాని బయట దేశాలను కాదు. వాళ్ళు ఏ మతం వారైనా సరే, ఇండియాలో ఉంటున్నప్పుడు ఇండియానే సమర్ధించాలి. ఇది బేసిక్ రూల్.

కానీ మన దేశంలో చాలా విచిత్రమైన జాతులున్నాయి. తినేది ఇక్కడి తిండి, పీల్చేది ఇక్కడి గాలి, తాగేది ఇక్కడి నీళ్లు, వంత పాడేది మాత్రం శత్రుదేశాలకు. ఇదీ మనవాళ్ళు అని మనం అనుకుంటున్న వాళ్ళ వరస.

పాకిస్తానూ, చైనా కలసి కాశ్మీర్ విషయాన్ని రచ్చ చెయ్యాలని చూస్తున్నాయంటే ఒక అర్ధం ఉంది.  కానీ మన దేశంలో కొన్ని పార్టీలూ, ఒవైసీ లాంటి నాయకులూ, కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు వంత పాడటం చూస్తుంటే వాళ్లకు సిగ్గు లేకపోయినా మనకు సిగ్గేస్తోంది. ఇలాంటి విషయాలలో దేశంలో అన్ని పార్టీలూ ఒక్కటిగా నిలబడాలి. లేకపోతే కాలక్రమంలో వాళ్ళ మనుగడనే కోల్పోవాల్సి వస్తుంది.

ఈనాడు ఒవైసీ వంటి నాయకులూ, పాకిస్తాన్ నాయకులూ కాశ్మీర్లో మానవహక్కుల గురించి మాట్లాడుతున్నారు. మరి 1990 ప్రాంతాలలో పది లక్షలమంది కాశ్మీర్ పండిట్లు వాళ్ళ ఇళ్ళూ వాకిళ్ళూ వదలిపెట్టి ఇండియాలోని ప్రతి రాష్ట్రానికీ పారిపోయి వచ్చి రోడ్ల పక్కన బ్రతకవలసిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ మానవ హక్కులు వాళ్లకు లేవా? అప్పుడు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు? ఆ గొడవలతో ఎన్నెన్ని కాశ్మీర్ పండిట్ల కుటుంబాలు పాకిస్తాన్ అనుకూలవాద వర్గాల బుల్లెట్లకు బలై పోయాయి? ఆ లెక్కలు కూడా తియ్యండి మరి. కాశ్మీర్లో ఉన్న ముస్మీములే మనుషులా? హిందువులు కారా? వాళ్ళ గురించి ఎవరూ మాట్లాడరెందుకు?

ఈనాడు రాహుల్ గాంధీగారు, నేను కాశ్మీర్ వఛ్చి చూస్తా చూస్తా అంటూ ప్రతిరోజూ అరుస్తున్నాడు. మరి 1990 లలో కాశ్మీర్ లోని హిందూ కుటుంబాలను ఎక్కడికక్కడ చంపేస్తూ ఉంటె, ఇదే రాహుల్ గాంధీగారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఏమి చేసింది? ఆనాడు కాశ్మీర్ పండిట్ల గోడు ఎవరూ పట్టించుకోలేదు ఎందుకని? ఈనాడు ఈ మొసలి కన్నీళ్లు ఎవరికోసం? ముస్లిం ఓట్ల కోసమా? ఇంకా అదే కార్డా? కాలం మారింది కాస్తన్నా మారండయ్యా కాంగ్రెస్ బాబులూ !

పాకిస్తాన్ కు స్వతంత్రం వఛ్చినపుడు అక్కడున్న హిందువుల శాతం 22. అది నేడు రెండు శాతానికి ఎలా పడిపోయింది? వారంతా ఏమై పోయారు? ఎందుకు వాళ్ళ శాతం అలా తగ్గింది? వాళ్ళను అంతగా భయభ్రాంతులకు గురిచేసింది ఎవరు? బడి నుంచి గుడి వరకూ వారిని వెంటాడి వేధించి చివరకు ప్రాణభయంతో  దేశాన్ని వదలి పారిపోయేలా చేసింది ఎవరు? అదే సమయంలో ఇక్కడ మన దేశంలో ముస్లింజనాభా ఎంత పెరిగింది? ఎందుకు పెరిగింది? మానవహక్కులూ రక్షణా లేని దేశంలో ఇంతలా వారి జనాభా ఎలా పెరుగుతుంది? ఈ లెక్కలన్నీ తియ్యాలి మరి !

పిచ్చివాగుడు వాగుతున్నాడని మనం తరిమేసిన జాకీర్ నాయక్ మలేషియాలో ఉంటూ అక్కడి చైనీయుల మీద భారతీయుల మీద ఇష్టం వఛ్చినట్లు వాగుతూ ఉంటె అతన్ని అక్కడనుంచి కూడా బయటకు పంపిస్తామని వాళ్లంటున్నారు. కానీ మన దేశంలో ఉంటూ మన దేశాన్ని విమర్శించడమే గాక, బాహాటంగా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్న వాళ్ళను మనమేం చెయ్యడం లేదు. అది మన విజ్ఞత కావచ్చు. లేదా హిందువులకు సహజమైన మానవతాధోరణి కావచ్చు.  అది వారికి అర్ధం కావడం లేదు. దీన్నేమనాలి మరి? 

నిన్నటికి నిన్న లండన్లో మన స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారతీయుల మీద పాకిస్తాన్ అనుకూల వర్గాలు రాళ్ళేసి గోల చేశాయంటే, అదికూడా బ్రిటిష్ పోలీసుల సమక్షంలో జరిగిందంటే, దీన్నేమనాలి? కాశ్మీర్లో ఏదో జరిగిపోతోంది అంటూ గోల చేసే అంతర్జాతీయ టీవీలు ఈ ఈవెంట్ ని ఎందుకు కవర్ చెయ్యలేదో మరి?

టెర్రరిస్తాన్ మనకు నీతులు చెప్పడం ఎలా ఉందంటే సైతాన్ ఖురాన్ వల్లించినట్లు ఉంది.

మనం బలహీనంగా నంగినంగిగా ఉన్నంతవరకూ ప్రతివాడూ మన నెత్తికెక్కి తాండవం చెయ్యాలనే చూస్తాడు. ప్రపంచ దేశాల దృష్టిలో అందుకే మనం ఇలా ఉన్నాం. మనం గట్టిగా ఉండవలసిన సమయం వచ్చ్చేసింది. గట్టి చర్యలతో బయట దేశాలకు ఎలాంటి మెసేజి పంపుతున్నామో, ఇంటి దొంగల విషయంలో, వారు వ్యక్తులైనా, పార్టీలైనా, అంతే గట్టిగా ప్రవర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ప్రపంచ దేశాల దృష్టిలో మన పరువు కాస్తైనా నిలబడుతుంది మరి !