“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, ఫిబ్రవరి 2016, గురువారం

దేశద్రోహం

గత కొద్ది రోజులుగా మన యూనివర్సిటీలలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే కొన్ని విషయాలు చిన్న పిల్లలకు కూడా అర్ధమయ్యేలా ఉన్నాయి.

1971-72 యుద్ధంలో ఓడిపోయిన దగ్గర నుంచీ పాకిస్తాన్ మనమీద పరోక్ష యుద్ధం చేస్తూనే ఉన్నది.సరాసరి తలపడితే మనమీద గెలవడం కష్టం అన్న సంగతి గ్రహించిన అది, అప్పటినుంచీ గెరిల్లా యుద్ధానికి సిద్ధమైంది.గెరిల్లా యుద్ధంలో hit and run అనేదే మూలసూత్రం.చాటుగా దొంగదెబ్బ తియ్యడం బయటకేమో అమాయకంగా నటించడాలే దీని వ్యూహాలు.

దీనికి మద్దతుగా అది అనేక రకాలైన వ్యూహాలను అమలుచేస్తున్నది.

1.కాశ్మీరులో ముస్లిములను హిందువులు హింసకు గురిచేస్తున్నారు అని ప్రచారం చేస్తూ నిజానికి అక్కడి కాశ్మీరీ పండిట్లను నిర్దాక్షణ్యంగా చంపడం ద్వారా వారిని భయభ్రాంతులకు గురిచేసి కాశ్మీరు నుంచి వారిని ఖాళీ చేయించడం.అప్పుడు అక్కడెలాగూ ముస్లిం మెజారిటీ ఉంటుంది గనుక వారిచేత మాకు ఇండియాలో ఉండటం ఇష్టం లేదు.మాకు స్వతంత్రం కావాలి అని గొడవ చేయించి ఒకవేళ ఆ స్వతంత్రం అంటూ గనుక వస్తే మరుక్షణంలో చక్కగా పాకిస్తాన్లో కలసిపోవడం.

2. ఇండియాలో ఉన్న ముస్లిములను పధకం ప్రకారం తరతరానికీ విపరీతంగా సంఖ్యాబలం పెంచుకుంటూ పోవడం. ఆ తర్వాత వారిచేత పార్టీలు పెట్టించి ప్రస్తుతం ఒక రాష్ట్రంలో జరుగుతున్నట్లు భయోత్పాతం సృష్టించడం. చివరకు ఇస్లామిక్ రాజ్యాన్ని స్తాపించడం.

3. ఈ లోపల ఇండియాలో ఉన్న కాలేజీలు యూనివర్సిటీలలో హిందూవ్యతిరేక భావజాలాలున్న కులగ్రూపులతోనూ,వామపక్ష గ్రూపులతోనూ జతకట్టడం.మెల్లిగా పాకిస్తాన్ అనుకూల భావాలను ప్రచారం చేసి సాధ్యమైనంత విషాన్ని వారి తలల కెక్కించడం.

4. మరో పక్కన చాపకింద నీరులా మదరసాలలో తీవ్రవాదాన్ని చొప్పించడం.

5. ఈలోపల సాధమైనన్ని తీవ్రవాద స్లీపింగ్ సెల్స్ ను ఇండియాలో నలుమూలలా ఏర్పాటు చెయ్యడం.దీనికోసం తెలికగా వలలో చిక్కే చేపల్ని పట్టుకుని రిక్రూట్ చేసుకుని వారిని లోకల్  లాగిస్టిక్ సపోర్ట్ కోసం వాడుకోవడం.

6. తీవ్రవాదులను సాధ్యమైనన్ని మార్గాల గుండా ఇండియాలో ప్రవేశపెట్టి విధ్వంసం సృష్టించడం.ఇక్కడి స్లీపింగ్ సెల్స్ ద్వారా వారికి కావలసిన సహాయం అందేట్లు చెయ్యడం.

7. కొన్నికొన్ని రాష్ట్రాలలో బలం పుంజుకుంటున్న ముస్లిం పార్టీల ద్వారా కోవర్టుగా పనిచెయ్యడం.

8. మెల్లిగా సాధ్యమైనన్ని రాష్ట్రాలను 'మాకు స్వతంత్రం కావాలి. మేం ఇండియాలో భాగంగా ఉండం.' అన్న నినాదం వైపు మళ్లేలా చెయ్యడం.తద్వారా బంగ్లాదేశ్ ను స్థాపించినందుకు ఇండియాపైన పగ తీర్చుకోవడం.

9. ఏదో రకంగా అణ్వాయుధాలను సమకూర్చుకుని - 'జాగ్రత్త. మీరేదైనా చేస్తే మీమీద ఆటం బాంబ్ ప్రయోగిస్తాం.' అని మనల్ని బెదిరించడం.ఇంకోపక్క చెయ్యాల్సినవన్నీ వాళ్ళే చేస్తూ ఉండటం.

ఈ రకంగా అన్ని విధానాల ద్వారా ఇండియాను ఇరుకున పెట్టి ఇబ్బంది పెట్టి విధ్వంసం సృష్టించడమే పాకిస్తాన్ అజెండా. మన దేశానికి వ్యతిరేకంగా multi pronged strategy ని అది అమలు చేస్తున్నది.ఇది వాస్తవం.దురదృష్టవశాత్తూ పాకిస్తాన్ కు వత్తాసు పలికే దేశద్రోహులు మన దేశంలోనూ దండిగానే ఉన్నారు.ఇదీ వాస్తవమే.

మొదటినుంచీ మన దేశం విదేశీయులకు బానిసగా మారడం వెనుక ఎన్నో కారణాలున్నప్పటికీ ముఖ్యకారణం మాత్రం ఒకటే.మన సొసైటీ లోపలనుంచే బయటి వారికి వత్తాసు పలికి, వారికి సహాయ సహకారాలందించిన ఇంటిదొంగలు ఉండబట్టే అన్నీ ఉండికూడా ఏమీ లేనివారిలా మనం 1000 సంవత్సరాల బానిసత్వంలో మగ్గిపోయాం.ప్రపంచంలోని ప్రతిజాతి చేతా దోచుకోబడ్డాం. 

ప్రస్తుతం కూడా ఇదే తంతు జరుగుతున్నది.

పార్లమెంట్ మీద దాడి చేసినవారికి మన సొసైటీలో సానుభూతేమిటి? మన దేశంలో ఉగ్రవాద దాడులు చేసిన వారికి వత్తాసు పలకడం ఏమిటి?నినాదాలేమిటి?వారిని సమర్ధిస్తూ మీటింగులు పెట్టడం ఏమిటి?అదికూడా విద్యాలయాలలో ఈ విపరీత పోకడలేమిటి?అసలు విద్యార్ధులకు రాజకీయ పక్షాల అండదండలెందుకు?వాళ్ళు అక్కడకు వెళుతున్నది చదువు కోసమా లేక రాజకీయుల చేతిలో పావులుగా మారి విద్యా సంవత్సరాలూ చదువూ పాడు చేసుకోవడానికా?

కొంతమంది విద్యార్దులేమో - వామపక్ష భావాల ఉచ్చులో పడి నక్సలైట్లుగా మారి అడవుల్లో హతమై పోతుంటారు. ఇంకొందరేమో పాకిస్తాన్ చైనా దేశాల భావజాలపు వలలో చిక్కి తమ చదువులనే గాక పక్కవాళ్ళ చదువులు కూడా పాడు చేస్తుంటారు.అదేమంటే - వాక్స్వాతంత్రానికి భంగం అంటారు.

వాక్స్వాతంత్రానికి కూడా పరిమితులున్నాయి.భారత రాజ్యాంగం పార్ట్-III లో మనకు ఇస్తున్న ప్రాధమిక హక్కులలో   వాక్స్వాతంత్రం కూడా ఒకటి.Fundamental rights మొదట్లో 6 గా ఉండేవి.తరువాత right to living and right to education కలపగా 8 అయ్యాయి.

అధికరణం 19 లో ఉన్న ఆరు స్వాతంత్రాలలో వాక్స్వాతంత్రం కూడా ఒకటి.కానీ దీనిపైన ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించవచ్చు.అందుకు చూపే కారణాలలో 'in the interest of Sovereignty and integrity of India and the security of the state కూడా ఒకటి.రాజ్యాంగం నాకు వాక్స్వాతంత్రం ఇచ్చింది అంటూ ఏది పడితే అది వాగడానికి వీలుకాదు.పక్కమనిషిని అనవసరంగా దూషించడమే నేరం అవుతుంటే ఇంక దేశవ్యతిరేక నినాదాలు ఇవ్వడం నేరం కాకపోతే ఇంకేమౌతుంది?

దేశంలో విధ్వంసం సృష్టిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు జేజేలు పలకడం దేశవిద్రోహం కాకుంటే మరేమిటి? అలా జేజేలు కొడుతున్న వారికి కొన్ని వర్గాలూ పార్టీలూ వత్తాసు రావడం ఏమిటి?ఇలా చెయ్యడం వాక్స్వాతంత్రం అంటారా?దానిని వద్దంటే ప్రాధమిక హక్కులను కాలరాచినట్లా? ఇదేమి వింత?

ఇలాంటి వింతలు ఒక్క మన దేశంలో మాత్రమే జరుగుతాయేమో? It happens only in India కి ఇది కూడా ఒక ఉదాహరణగా తీసుకోవచ్చా?

అతుకుల బొంత లాంటి రాజ్యాంగాన్ని తయారు చేసి దేశానికి ఇచ్చిన ఘనులది అసలు తప్పు.దేశద్రోహులనూ ఉగ్రవాద స్లీపింగ్ సెల్స్ నూ ఓట్లకోసం ఇన్నేళ్ళుగా పోషిస్తూ వస్తున్న పార్టీలది రెండో తప్పు.ఆ తప్పుల ఫలితాలే ఇప్పుడు విశ్వరూపం ధరించి కాటు వేస్తున్నాయి.ఇప్పటికైనా కళ్ళు తెరవక పోతే, మన దేశం పని అధోగతే.

ఏదైనా జరగకూడనిది జరిగినప్పుడు,ఇప్పుడు వత్తాసు పలుకుతున్న వీరందరూ ఏదో ఒక విదేశానికి పోయి హాయిగా తలదాచుకుంటారు. చచ్చేది మాత్రం ఇక్కడి ప్రజలే.

లాహోర్ దాకా వెళ్ళిన మన సైన్యాన్ని వెనక్కు రప్పించడం అప్పటి నాయకుల మొట్టమొదటి క్షమించరాని నేరం.పాకిస్తాన్ ఆక్రమించిన మన భూభాగాన్ని క్లెయిం చెయ్యకుండా వదిలెయ్యడం రెండో క్షమించరాని నేరం.కఠినమైన వైఖరి అవలంబించకుండా కాశ్మీర్ అంశాన్ని నానబెట్టి నానబెట్టి ఇంతవరకూ తేవడం మూడో క్షమించరాని నేరం.తీవ్రవాదులను వారి సపోర్టర్స్ నూ ఇన్నాళ్ళూ బుజ్జగిస్తూ రావడం నాలుగో క్షమించరాని నేరం.ఇంకా ఇంకా ఎన్ని నేరాలు చేద్దామని మీ ఉద్దేశ్యం?


పాకిస్తాన్ లగ్నం మేషం. ఇండియా లగ్నం వృషభం. మేషం నుంచి పంచమంలో ప్రస్తుతం గురుచండాల యోగం ఉన్నది. కనుక పాకిస్తాన్ దుర్బుద్ధితో అనేక కుట్రలు కుతంత్రాలను చేస్తుంది.ఆ యోగం మనకు చతుర్దంలో పడుతుంది గనుక మన ప్రజాజీవనంలో ఆ కుట్రల ఫలితాలను మనం అనుభవించవలసి వస్తుంది.ప్రస్తుతం జరుగుతున్నది అదే. గమనించండి.

ఈ యోగం వల్ల - విద్యార్ధులకు బుద్ధి చెప్పాల్సిన గురువులూ పెద్దలూ నాయకులూ కూడా భ్రష్టులై వాళ్ళ నేరపూరిత ప్రవర్తనకు వత్తాసు వస్తున్నారు.తప్పు అని చెప్పవలసిన వారే దగ్గరుండి తప్పు చేయిస్తున్నారు.వీరు చేస్తున్నది మామూలు తప్పుకాదు.తను కూచున్న కొమ్మను తానే నరుక్కోవడం ఇది.తన ఇంటికి తానే నిప్పు పెట్టుకోవడం ఇది.

ఇదంతా రాహు గురువుల సంయోగమూ + గురువు యొక్క వక్రతల ఫలితం. గురువు యొక్క ఈ వక్రత మే 10 వరకూ ఉన్నది.కనుక ప్రస్తుత సంక్షోభం ఆ సమయం వరకూ కొనసాగుతుంది.ఒకవేళ ఇది సమసిపోయినా ఇలాంటివి ఇంకొన్ని తయారౌతాయి.ఆ తర్వాత ఆగస్ట్ 11 గురువు గారు కన్యారాశిలో ప్రవేశించే వరకూ ఇలాంటి ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి.ఆ తరువాత మాత్రం అసలైన ఉపద్రవాలూ ఉగ్రవాద చర్యలూ జరుగుతాయి. ఎందుకంటే అప్పుడు గురువు యొక్క రక్షణ వలయం తప్పుకుంటుంది కనుక రాహువుకు ఫ్రీ హ్యాండ్ వస్తుంది.రాహువును కట్టడి చేసేవారు అప్పుడు ఎవరూ ఉండరు.అందుకని అప్పుడు ఉగ్రవాద చర్యలు ఇంకా ఎక్కువౌతాయి.

మోడీ ప్రధానమంత్రి అయ్యాక విదేశీ సంబంధాలు మెరుగు పడుతున్నాయి. అంతర్జాతీయంగా మన దేశప్రతిష్ట చాలా పుంజుకుంటున్నది. అది చూచి సహించలేని దుష్టశక్తులు ఇంటా బయటా రకరకాల కుయుక్తుల ద్వారా ఆ పురోగతిని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.

పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసేవారు దేశభక్తులెలా అవుతారు?మన దేశంలో ఉంటూ ఇక్కడి గాలి పీలుస్తూ ఇక్కడి నీరు త్రాగుతూ ఇక్కడి తిండి తింటూ ఈ దేశానికే వ్యతిరేకంగా మాట్లాడేవారినీ, వ్యవహరించే వారినీ దేశద్రోహ నేరం క్రింద అరెస్ట్ చేస్తే తప్పేముంది?ఖచ్చితంగా ఆపని జరగాల్సిందే.

పోనీలే అని ఇప్పుడు ఊరుకుంటే 'తోటకూర నాడే బుద్ధి చెబితే ఇంతవరకూ వచ్చేది కాదు కదమ్మా?' అన్నట్లుగా అవుతుంది.

మన దేశాన్ని ద్వేషించడమూ దేశద్రోహమే,మన శత్రువులకు జేజేలు కొట్టడమూ దేశద్రోహమే.అలా జేజేలు కొట్టినవారిని సమర్ధించడం కూడా దేశద్రోహమే అవుతుంది.అసలు అలా సమర్దిస్తున్నవారిని కూడా దేశద్రోహ నేరం క్రింద బుక్ చెయ్యాలి.ఈ తప్పులకు గట్టి శిక్షలు పడాలి.అలా చెయ్యకుండా వెనుకంజ వెయ్యడం కూడా చాలా తప్పే అవుతుంది.

ఇటువంటి దేశద్రోహ పోకడల్ని మొగ్గలోనే కఠినంగా త్రుంచెయ్యాలి.లేకుంటే ముందు ముందు పెద్ద పెద్ద అనర్ధాలు జరిగే ప్రమాదం ఖచ్చితంగా ఉన్నది.

మనం సీరియస్ గా ఉన్నామని పాకిస్తాన్ కు తెలియ జెయ్యాలి. అప్పుడే కొన్నాళ్ళకు కాకుంటే కొన్నేళ్ళకైనా ఘనత వహించిన జాతిపీతలూ శాంతిదూతలూ చేసిన ఘోరమైన తప్పులను కనీసం కొద్దిగానైనా సరిదిద్దుకోగలుగుతాం.

లేకుంటే ఆనాడు వారు చేసిన తప్పులకు ఈనాటి అమాయకప్రజలో లేక ముందుతరం అమాయకప్రజలో తమతమ ప్రాణాలతో మూల్యం చెల్లించక తప్పదు.