“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

21, జులై 2015, మంగళవారం

గురువుగారు సింహరాశి ప్రవేశం - ఫలితాలు

ఈ నెల 14 న గురువు కర్కాటకరాశిని వదలి సింహరాశి లోకి ప్రవేశించాడు. అప్పటినుంచే మనకు గోదావరి పుష్కరాలు మొదలయ్యాయి.

ఈ రాశిలో ఆయన ఒక ఏడాది పాటు సంచరిస్తాడు.ఈ ఏడాదిలో పన్నెండు లగ్నాలు/రాశుల వారికి ఏయే ఫలితాలు ఉంటాయో చూద్దాం.ఈ ఫలితాలను లగ్నం మరియు చంద్రరాశి నుంచి కలిపి చూచుకోవాలి.

మేషరాశి
ఉత్సాహం ఉరకలెత్తుతుంది.అన్నింటా ఆశావహులై ఉంటారు.మనస్సు చురుకుగా పనిచేస్తుంది.అదృష్టం కలసివస్తుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభరాశి
ఇంటిలో చికాకులు పెరుగుతాయి.లీగల్ విషయాలు కోర్టుపనులు కలసి వస్తాయి.విదేశాలలో విద్య ఫలిస్తుంది.వృత్తిలో పురోగతి ఉంటుంది.ప్రమోషన్లు వస్తాయి.వాహనయోగం కలుగుతుంది.

మిధునరాశి
ధైర్యం పెరుగుతుంది.సమాజంతో సంబంధాలు మెరుగౌతాయి.వృత్తి ఉద్యోగాలలో పురోగతి కనబడుతుంది.కనిష్ట సోదరులకు కష్టకాలం.దగ్గర ప్రయాణాలు చేస్తారు.

కర్కాటక రాశి
మాట దురుసువల్ల గొడవలు జరుగుతాయి.విదేశాలనుంచి ధనలాభం ఉంటుంది.సమాజంలో మాట చెలామణీ అవుతుంది.ధనప్రాప్తి కలుగుతుంది. కంటి జబ్బులు కలుగుతాయి.

సింహరాశి
అన్నింటా వెలుగు రేఖలు కనిపిస్తాయి.ఉత్సాహం ఉరకలేస్తుంది.విజయాలు సాధిస్తారు.ధైర్యంగా ముందుకు దూసుకుపోతారు.

కన్యారాశి
అనుకోని ఖర్చులు ఎక్కువౌతాయి.ఆస్పత్రికీ రోగాలకూ ఖర్చు చెయ్యవలసి వస్తుంది.ఉన్న చోటిని వదలి ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.దీర్ఘరోగాలు ఎక్కువౌతాయి.

తులారాశి
అన్నింటా లాభాలు చవిచూస్తారు.గురుకటాక్షం కలుగుతుంది.స్నేహితులు సహాయపడతారు.జ్యేష్ట సోదరులకు మంచికాలం మొదలౌతుంది.

వృశ్చికరాశి
జీవితంలో వెలుగు కనిపిస్తుంది.వృత్తి ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. ఇన్నాళ్ళూ ఖాళీగా ఉన్నవారు వృత్తిపరంగా ఎదుగుతారు.జీవితంలో ఎదగడానికి కొత్తకొత్త ప్లాన్లు వేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ధనూరాశి
ఆధ్యాత్మికచింతన పెరుగుతుంది.కుటుంబంలో పెద్దలు గతిస్తారు.విదేశీ ప్రయాణాలు ఉంటాయి.ధనలాభం కలుగుతుంది.యాత్రలు చేస్తారు.

మకరరాశి
అధికారులతో విరోధాలు కలుగుతాయి.డబ్బు చేతిలో నిలవదు.మార్మిక విషయాలలో ఆసక్తి పెరుగుతుంది.

కుంభరాశి
కార్యశీలత పెరుగుతుంది.వ్యాపారాలు ప్రారంభిస్తారు.లోకానికి ఏదో చెయ్యాలన్న తపన ఎక్కువౌతుంది.సమాజంతో సంబంధాలు పెరుగుతాయి.

మీనరాశి
నిరుద్యోగులు ఉద్యోగులౌతారు.అజీర్ణ రోగాలు బాధిస్తాయి.శత్రుబాధ ఎక్కువౌతుంది.వృత్తిపరంగా త్రిప్పట విసుగు చికాకు ఎక్కువౌతాయి.

ఈ గోచారంలో గురువుగారు రాశిసంధిని నక్షత్రసంధిని దాటి ప్రస్తుతం కేతు నక్షత్రంలో సంచరిస్తున్నాడు గనుక చాలామందికి మానసిక చికాకులు, ఉద్యోగంలో చికాకులు,కుటుంబంలో కలహాలు,పెద్దలతో పడకపోవడం,జీర్ణకోశ బాధలు ఎక్కువకావడం మొదలైనవి ఉంటాయి.

వ్యక్తిగత జాతకరీత్యా ఆయా పరిహారాలు చెయ్యడం వలన ఆయా చెడు ఫలితాలనుంచి తప్పుకోవచ్చు.