“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

24, ఆగస్టు 2023, గురువారం

WELL DONE ISRO

23 ఆగస్టు 2023

ఇండియా చరిత్రలో మరపురాని రోజు.

చంద్రుని దక్షిణధృవం పైన ఇండియా పంపిన లాండర్ దిగింది.

ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన మొట్టమొదటి దేశం మన దేశమే అయింది.

కేవలం 615 కోట్ల ఖర్చుతో ఈ పనిని ISRO సాధించింది. ఇది ఒక మల్టీ స్టారర్ బాలీవుడ్ సినిమా తియ్యడానికి అయ్యే ఖర్చుకంటే తక్కువే. ఇండియన్ రాకెట్ల కున్న శక్తి కూడా తక్కువే. కానీ భూమి, చంద్రుల గ్రావిటీని తెలివిగా వాడుకుని ISRO ఈ విజయాన్ని సాధించింది. అంటే, అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పనిని చెయ్యగలిగింది. ఇదే అసలైన తెలివికి నిదర్శనం.

ఇది ప్రతి భారతీయుడు గర్వపడవలసిన క్షణం. పండుగ చేసుకోవలసిన క్షణం.

ఈ విజయం ఒక్కరోజుతో రాలేదు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, అపజయాలకు భయపడకుండా, ముందటి తప్పులను దిద్దుకుంటూ మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసిన పట్టుదలలు ఉన్నాయి. ఏ విజయానికైనా ఇవే దారులు.

నిద్రాహారాలు మానుకుని ఏళ్లకేళ్లు పనిచేసి ఈ కలను  నిజం చేసిన ISRO శాస్త్రవేత్తలను, వారి వెన్ను తట్టి ప్రోత్సహించిన మోడీగారిని ఎంత అభినందించినా తక్కువే అవుతుంది. చంద్రయాన్ -2 విఫలమైనప్పుడు, అప్పటి ISRO చైర్మన్ శివన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.  మోదీజీ ఆయన వెన్నుతట్టి ఓదార్చి 'పరవాలేదు మళ్ళీ చేద్దాం' అన్నారు. మోదీగారికి మనం ప్రణామాలు అర్పించాలి.

అయితే, యధావిధిగా అనేక దేశాల, మనుషుల స్పందన చాలా నీచంగా ఉంది.

ఇండియాలో అయితే, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, హేతువాద, నాస్తిక, క్రైస్తవ సంఘాలు, ముస్లిములలో ఎక్కువమంది నెగటివ్ కామెంట్స్ ఇచ్చారు. లేదా మౌనంగా ఉండిపోయారు. ఇది వాళ్ళ దేశభక్తి లేమికి పక్కా నిదర్శనం.

కొందరేమో ఈ విజయాన్ని నెహ్రూ కు అంటగట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు గాంధీ, నెహ్రూ అనే ఇద్దరు వ్యక్తులు లేకపోయి ఉన్నట్లయితే, మనకు స్వాతంత్రం ఇంకా ముందే వచ్చి ఉండేది. దేశం ఇంకా త్వరగా ఎదిగి ఉండేదని, నేడు ఉన్నన్ని సమస్యలు ఉండేవి కావని నా నమ్మకం. దీనికి చారిత్రిక ఆధారాలున్నాయి. గాంధీ నెహ్రూలను భారతీయులు ఎంత త్వరగా పక్కన పెడితే దేశానికి అంత మంచిది.

ఇకపోతే, అగ్రరాజ్యాలు అసూయతో రకరకాల కామెంట్స్ చేశాయి. బ్రిటన్ పౌరులు అయితే, 'చంద్రునిపైకి రాకెట్ పంపగలిగిన దేశానికి మనం ధనసాయం చెయ్యడం ఏంటి? ఇప్పటిదాకా ఇచ్చిన సాయాన్ని వెనక్కు కట్టమని ఒత్తిడి చెయ్యాలి' అని నీచంగా కామెంట్ చేశారు. గతంలో ఒకసారి, 'బ్రిటన్ మనకు చేసే ధనసాయం పీనట్స్ లాంటిది' అని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పైగా, ఆ డబ్బులో ఎక్కువశాతం NGOs కు పోతుంది. అవేమో, మతమార్పిళ్లకు ఆ డబ్బును వాడుతున్నాయి. ఏదో పెద్ద ఇండియాను ఉద్ధరిస్తున్నట్టు పోజొకటి.

నెటిజన్స్ చాలా బాగా ఈ ఏడుపును తిప్పి కొట్టారు.

'రెండు వందల ఏళ్లు మా దేశాన్ని దోచుకుని 45 ట్రిలియన్ డాలర్లు బ్రిటన్ ఎత్తుకు పోయింది. అందులో మీ ఎయిడ్ 35 బిలియన్లు తగ్గించి మిగతా డబ్బు వెంటనే ఇండియాకు చెల్లించాలి. అంతకంటే ముందు మా కోహినూర్ వజ్రం మాకివ్వండి' అంటూ వాళ్ళు దీటుగా స్పందించారు 

'నీవలె నీ పొరుగువాడిని ప్రేమించు' అని జీసస్ చెప్పాడని మిషనరీలు ఊదరగొడతారు. మరి పొరుగుదేశం సాధించిన ఒక ఘనవిజయాన్ని మనస్ఫూర్తిగా ఎందుకు అభించనందించలేకపోతున్నాయి క్రైస్తవ దేశాలు? ఏమిటీ హిపోక్రసీ? 

భూమి బల్లపరుపుగా ఉందన్న బైబిల్ వాక్యాలను ఇప్పటికీ నమ్మే క్రైస్తవ దేశాలనుంచి ఒక మంచిమాటను ఆశించడం తప్పే కదూ?

చంద్రుడు రెండు ముక్కలు అయ్యాడని ముస్లిములు ఇప్పటికీ భావిస్తారు. ఖురాన్ లో ఇది సూరా 54. 1-2 లలో వ్రాయబడి ఉంది. అది నిజం కాదని, పక్కా అబద్దమని  ఇలా ఎప్పుడూ జరగలేదని సైన్స్ రుజువుచేసినా కూడా, వాళ్లదే మాటకు కట్టుబడి ఉన్నారు. అలాంటి మతాలను అనుసరించే దేశాలనుంచి ఒక మంచిమాటను ఎలా ఆశించగలం?

పాకిస్తాన్ అయితే కుళ్ళుతో చచ్చిపోయేలాగా ఉంది. అలాంటి బెగ్గర్ కంట్రీ అభిప్రాయాలను మనం అస్సలు  పట్టించుకోనవసరం లేదు.

అయితే కొంతమంది పాకిస్తానీలు మంచి జోకులేసారు.

'మేమున్నది చంద్రుడి పైనే. ఇండియా ఉత్త ల్యాండర్ ను మాత్రమే పంపింది. మేము  ఆల్రెడీ అక్కడే ఉన్నాం. చంద్రుడి పైన కరెంట్ ఉండదు. తాగటానికి నీళ్లుండవు. ఏమీ దొరకదు. పాకిస్తాన్లో కూడా అంతే. మేం చంద్రుడి పైన నివశిస్తున్నాం' అని ఒక పాకిస్తానీ ఏడవలేక నవ్వుతూ అన్నాడు.

గత 75 ఏళ్లుగా  ఇండియా ఎదుగుదలను అగ్రరాజ్యాలు అడుగడుగునా అడ్డుకున్నాయి.  ఒకానొక సమయంలో, మనకు క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ ఇవ్వడానికి అమెరికా ససేమిరా ఒప్పుకోలేదు. ఆ సమయంలో రష్యా ఒక్కటే మనకు సాయం చేసింది. సహజంగా రష్యా నుండి మనకు హృదయపూర్వకమైన అభినందనలు వెల్లువెత్తాయి. వాళ్ళ లూనా-25 కొద్దిరోజుల క్రితమే చంద్రునిపైన కూలిపోయింది. అయినా సరే, మనల్ని వాళ్ళు అభినందించారు. అదీ అసలైన స్పిరిట్ అంటే !

ఇతర దేశాలలో అయితే, మన మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్ లు, ఇంకా ఆస్ట్రేలియా మాత్రమే మనల్ని నిజంగా అభినందించాయి. మిగతా అన్ని దేశాలు ఏడుస్తూనే కంగ్రాట్స్ చెప్పాయి.

1970 లలో లిక్విడ్ ప్రొపెల్లెంట్ ఇంజన్ కు, క్రయోజెనిక్ టెక్నాలజీకి ఇండియాలో ఆద్యుడైన ISRO సైంటిస్ట్ నంబి నారాయణన్ ను, అతని సహచరులైన, శశి కుమారన్, చంద్రశేఖరన్, SK శర్మలను దొంగకేసులో ఇరికించి, వారి జీవితాలను నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళను జైల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఈ కుట్ర వెనుక CIA హస్తం ఉంది. ఏమంటే, ఇండియా ఎదగడం అమెరికాకు ఇష్టం లేదు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం వంత పాడింది. సుదీర్ఘంగా సాగిన ఈకేసు చివరకు కొట్టివేయబడింది.  వీళ్ళు నిర్దోషులు అని రుజువైంది. కానీ వాళ్ళ జీవితాలు నాశనం అయ్యాయి. ఈలోపల మన స్పేస్ ప్రోగ్రాం 30 ఏళ్లు వెనుకబడి పోయింది. కాంగ్రెస్ సాయంతో అమెరికా ఇంత కుట్రను తెరవెనుక ఉండి నడిపించింది.

మోడీ గారి ప్రభుత్వం వచ్చాక మాత్రమే, 2019 లో, నంబి నారాయణన్ గారికి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వబడింది. ఈయన వ్రాసిన పుస్తకం, 'Ready to fire: How India and I survived the ISRO spy case' అనే పుస్తకాన్ని చదవండి. నిజాలు తెలుస్తాయి.

ఎవరెలా ఏడ్చినా, ఇండియా ఎదుగుదలను ఏ శక్తీ ఆపలేదు. ఈ శతాబ్దం ఇండియాదే. ఇండియన్స్ లీడర్స్ గా లేకుండా ఏ రంగమూ నేడు ప్రపంచంలో లేదు.

సౌత్ ఆఫ్రికా నుంచి మాట్లాడుతూ మన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు, 'ఈ విఙయం ఒక్క ఇండియాదే కాదు. యావత్తు మానవాళిది' అనే అద్భుతమైన మాటన్నారు. అదీ అసలైన మానవత్వంతో కూడిన విశాల మనస్తత్వం అంటే ! ఒక్క హిందువు నోటివెంట మాత్రమే అలాంటి విశ్వజనీనమైన మాట వస్తుంది.

సోమనాధ్ ఆలయం పతనంతో ఇండియా పతనం మొదలైంది. కాశీ విశ్వేశ్వరాలయ ధ్వంసంతో ఇండియా నాశనం కావడం మొదలైంది. అయోధ్యలో రామాలయం విధ్వంసంతో ఇండియా కూడా నాశనం కావడం మొదలైంది.

ఈ మూడూ తిరిగి నిర్మించబడుతున్నాయి. మోదీగారి నాయకత్వంలో ఇండియా మళ్ళీ సూపర్ పవర్ కాబోతోంది.

ISRO  చైర్మన్ పేరుకూడా సోమనాథ్ కావడం కాకతాళీయమా? నేనైతే కాదనే అంటాను.

బయటనుండి వచ్చిన జాతులు, మతాలు  వందలాది ఏళ్లుగా మన దేశాన్ని  అనేక విధాలుగా ఛిన్నాభిన్నం చేశాయి. వాటి కుట్రలు బయటపడి, దేశంలో హిందూమత పునరుజ్జీవనం అయితేనే దేశం మళ్ళీ సూపర్ పవర్ అవుతుంది. ఎవరెన్ని చెప్పినా ఇది సత్యం.

ఇంతకు ముందు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను.

ఇంకో నూరేళ్ళపాటు మోడీగారే మన ప్రధానమంత్రిగా ఉండాలి. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, ఇంకా ఇదే టీమ్ ఆయనతో పనిచేయాలి. దేశద్రోహుల ఆటలు అంతం చెయ్యాలి. ఇదే వేగంతో ఇండియా ఎదగాలి. సూపర్ పవర్ కావాలి. వివేకానందుడు, సుభాష్ చంద్రబోస్, అరవిందో మొదలైన ఎందరో మహనీయులు కన్న కలలు నిజం కావాలి.

ఇది కోట్లాదిమంది దేశభక్తుల స్వప్నం.

ఇది నిజం కావాలని మన దేశపు దేవతలైన శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని, ఈశ్వరుడిని, అమ్మవారిని  ఇతర దేవతలను, మహర్షులను, గురువులను, మహనీయులను ప్రార్ధిద్దాం.

జై హిందూస్థాన్ ! జై మోదీజీ !

జై భరతమాత !

read more " WELL DONE ISRO "

22, ఆగస్టు 2023, మంగళవారం

పరమహంస యోగానంద గారి జాతకం - Part 7 (కొన్ని చేదు వాస్తవాలు)

యోగానంద గారి జాతకాన్ని గురించి ఎంతైనా వ్రాయవచ్చు. కానీ అవసరం లేదు. కొన్ని వాస్తవాలను మాత్రం వ్రాసి ఈ సీరీస్ ముగిస్తున్నాను.

తమకు నచ్చిన గురువులను మహనీయులను అవతారాలుగా భావించే మనస్తత్వం చాలామంది మనుషులలో కనిపిస్తుంది. ఇలాంటి వారిని చూస్తే నేను చాలా నవ్వుకుంటాను. అవతారాలు సందుకొకరు గొందికొకరు ఉండరు.

జిల్లెళ్ళమూడి అమ్మగారి భక్తుడొకాయన ఒకసారి నాతో మాట్లాడుతూ, 'అమ్మగారి బోధలు పాత అవతారాల బోధలను మించిపోయాయి. రామునికంటే కృష్ణునికంటే అమ్మగారే గ్రేట్' అన్నాడు. 

అందరికంటే అమ్మగారు చాలా గ్రేట్ అని నాకు నిరూపించాలని అతను చాలా తాపత్రయపడిపోయాడు.

అతనితో ఇలా చెప్పాను.

'చూడు బాబు, నేను రాముడినీ చూడలేదు. కృష్ణుడినీ చూడలేదు. అమ్మగారిని కూడా చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక నిముషం సేపు చూడగలిగాను. కనుక ఆమె అవతారమా కాదా అనే విషయం నాకు  తెలియదు. రాముడితో కృష్ణుడితో ఆమెను పోల్చవలసిన అవసరం కూడా నాకు కనిపించడం లేదు. ఆమె గొప్పతనాన్ని ప్రూవ్ చేయవలసిన అగత్యం నాకు లేదు. నాకు ప్రూవ్ చెయ్యవలసిన పని నీకూ లేదు. అలా చేస్తే నీకు ఒరిగేదీ లేదు. కాబట్టి నీ సోది ఇక ఆపు'

'మరైతే మీరు జిల్లెళ్ళమూడి ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఇల్లెందుకు కొన్నారు?' అడిగాడు.

'అమ్మంటే నాకిష్టం. అమ్మ బోధలంటే నాకిష్టం. అందుకే వస్తున్నాను. అంతవరకే' అని చెప్పాను.

జీసస్ ను కూడా యిలాగే అవతారం చేసి కూచోబెట్టారు కొంతమంది మూఢభక్తులు. ఇప్పుడైతే ఆయన సాక్షాత్తు దేవుడే అంటున్నారు క్రైస్తవులు. ఇవన్నీ చాలా హాస్యాస్పదమైన పోకడలు. అసలు పుట్టాడో లేదో రుజువు కానివాడిని దేవుడిని చేసి కూచోబెడతారు మానవులు.

యోగానంద రూపంలో జీసస్ మళ్ళీ వచ్చాడని కొందరు అమెరికన్స్ నమ్మేవారు. ఇదే ప్రశ్న ఆయనను డైరెక్ట్ గా అడిగారు కూడా. ఆయన సూటిగా జవాబు చెప్పలేదు. 'ఏ అలైనా సముద్రం నుంచి మాత్రమే వస్తుంది' అన్నాడు. అయితే ఆయన ఇంకొక మాట చెప్పాడని స్వామి క్రియానంద అంటాడు. 

'జీసస్ పుట్టినపుడు ఆ శిశువును చూడటానికి వచ్చిన ముగ్గురు తూర్పుదేశపు వైజ్ మెన్ ఎవరంటే - బాబాజీ, లాహిరీ మహాశయ, యుక్తేశ్వర్ గిరి - గార్లని ఆయన తనతో చెప్పాడని క్రియానంద వ్రాశాడు. 'మరి జీసస్ ఎవరు?' అనడిగితే యోగానంద మాట్లాడలేదు. కనుక, యోగానందే జీసస్ అని చాలామంది అమెరికన్స్ అనుకున్నారు. 'జీసస్ రెండవ రాకడ' అంటే 'యోగానంద అమెరికా వచ్చి క్రియాయోగాను బోధించడమే' అని వారు నమ్మారు. యోగానంద కూడా ఇటువంటి భావాలకు నర్మగర్భంగా ఆజ్యం పోశాడు. అయితే ఇక్కడ కొన్ని లొసుగులున్నాయి.

లాహిరీ మహాశయుల శిష్యుడైన స్వామి ప్రణవానంద 1860 ప్రాంతాలలో కాశీలో బాబాజీని దర్శించారు.  అది లాహిరీ మహాశయుల ఇంటిలోనే, ఆయన సమక్షంలోనే జరిగింది. ఆ సమయంలో 'మీ వయసు ఎంత?' అని ప్రణవానంద బాబాజీని అడిగారు. 'అయిదారు వందల సంవత్సరాలుంటుంది' అని బాబాజీ చెప్పారు. ఈ విషయం రికార్డ్ కాబడి ఉంది. అంటే బాబాజీ 1300 CE లేదా 1200 CE ప్రాంతానికి చెందిన వాడై ఉండాలి. మరి యోగానందతో బాటు చాలామంది బాబాజీకి 2000 ఏళ్ళున్నాయని, ఆయన జీసస్ కు సమకాలికుడని ఊదరగొడుతున్నారు. ప్రపంచమంతా దీనినే నమ్ముతోంది. అయితే, ఇది నిజం కాదు. లోకంలో ప్రచారంలో ఉన్నవి చాలావరకూ అబద్దాలే.

ప్రణవానందగారు లాహిరి మహాశయుల ఇంటిలో బాబాజీని చూసినట్లుగా చెప్పేది నిజమైతే, యోగానంద తదితరులు చెప్పేది నిజం కాదు. అలాంటప్పుడు జీసస్ పుట్టినపుడు బాబాజీ వెళ్లి దర్శించాడని యోగానంద చెప్పినది కట్టుకథ అవుతుంది. అసలు క్రియానందకు యోగానంద ఈ విషయం నిజంగా చెప్పాడా  లేక ఇదంతా క్రియానంద క్రియేషనా అన్నది కూడా ఎవరికీ తెలియదు.

పైగా, యోగానంద జీసస్ అయితే, బాబాజీ, లాహిరి బాబా, యుక్తేశ్వర్లు ఆయన దర్శనం కోసం రావడం నిజమైతే, మరుజన్మలో అదే యోగానంద ఆ ముగ్గురి శిష్యుడు ఎలా  అయ్యాడు? ఇది సంభవం కాదు. కనుక ఇవన్నీ కాకమ్మకబుర్ల లాగా ఉన్నాయి.

ఒక జన్మలో తను అర్జునుడినని,  జేమ్స్ జే లిన్ నకులుడని యోగానంద అనేవాడు. మరి 'కృష్ణుడు ఎవరు?' అనడిగితే చెప్పేవాడు కాదు. ఒకసారి, 'బాబాజీనే కృష్ణుడు' అని చెప్పాడు. మళ్లీ ఇంకోసారి 'బాబాజీకి కృష్ణుడు క్రియాయోగాన్ని బోధించాడు' అంటాడు. ఇంకో జన్మలో తనే 'చెంఘీజ్ ఖాన్' అంటాడు. మరో జన్మలో 'విలియం ది కాంకరర్' తనే అంటాడు. ఇవన్నీ చదివితే, చదివే వాళ్ళకు పిచ్చెక్కుతుంది.

ఇంకా నయం 'ప్రస్తుతం ద్రౌపది ఎవరు?' అని వినేవాళ్ళు అడగలేదు. సంతోషం !

ఆ మాటకొస్తే,  అసలు యోగానందకు బాబాజీ దర్శనమే కాలేదు. యోగానంద 1935 లో ఇండియాకు వచ్చినపుడు, 'నాకు మరణం దగ్గర పడుతున్నది, నువ్విక్కడే ఉండు' అని యుక్తేశ్వర్ గిరిగారు చెప్పినా వినకుండా, పూరీ ఆశ్రమాన్ని వదలి,  కుంభమేళాకు తన స్నేహితులతో బంధువులతో కలసి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళడానికి గల కారణం, బాబాజీ దర్శనం అక్కడ అవుతుందేమో అన్న ఆశ మాత్రమే. ఏమంటే, గతంలో అలాంటి ఒక కుంభమేళాలోనే యుక్తేశ్వర్ గారికి బాబాజీ దర్శనం అయింది. తనక్కూడా అలా అవుతుందని, అది తన పుస్తకంలో వ్రాసుకుందామని యోగానంద ఆశించాడు. కానీ ఆయనకు బాబాజీ దర్శనం కాలేదు. కారణం? తన గురువు మాట వినకుండా, కుంభమేళాకు వస్తే బాబాజీ ఎందుకు దర్శనం ఇస్తాడు?

నేడు మనం చూస్తున్న బాబాజీ చిత్రం ఒక అమెరికన్ ఆర్టిస్ట్ చేత యోగానంద వేయించినదే.  అందులో బాబాజీకి ఒక అమెరికన్ యువకుని పోలికలు వచ్చాయి. అది సరైన చిత్రం కాదు. బాబాజీని చూచిన ఇతరులు ఎంతోమంది బాబాజీ అలా ఉండడని చెప్పారు. కానీ లోకమంతా ఆ చిత్రమే నిజమని నమ్ముతున్నారు. ఇదొక వింతల్లో వింత ! మాయలలో మాయ ! బాబాజీ ఆ చిత్రంలోలా ఉండడు. 

తనను వదిలేసి కుంభమేళాకు యోగానంద వెళ్ళినపుడు యుక్తేశ్వర్ గారు చాలా బాధపడ్డారు. తన మరణ సమయంలో యోగానంద తనతో ఉండాలని ఆయన ఎంతో ఆశించారు. కానీ ఆ కోరికను యోగానంద తీర్చలేకపోయాడు. ఈ గిల్టీ ఫీలింగ్ యోగానందలో జీవితాంతం ఉండిపోయింది. దీనికి కారణం యోగానంద గారికున్న ఎమోషనల్ ప్రవర్తన మాత్రమే. దానివల్లనే యుక్తేశ్వర్ గారు ఇస్తున్న సూచనలను యోగానంద గ్రహించలేకపోయాడు. మరణ సమయంలో ఆయన దగ్గర ఉండకుండా వెళ్ళిపోయాడు.

తన గురువును నిరాశ పరచాడు గనుకనే, తన శిష్యుల చేతిలో నిరాశకు గురయ్యాడు యోగానంద. కర్మసూత్రం ఎంతటివారినైనా వదలదని దీనివల్ల ఋజువౌతున్నది.

యోగానంద గారికి లోతైన యోగదృష్టి లేదన్నది నా నమ్మకం. దీనికి రుజువుగా ఒకే ఒక్క సంఘటన చూపిస్తాను.

అరుణాచలంలో రమణమహర్షి దర్శనం చేసుకున్నప్పుడు, మహర్షి  కంటే, మహర్షి శిష్యుడైన యోగి రామయ్య ఆయనకు బాగా నచ్చాడు. 'గురువు కంటే శిష్యుడే ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయిలో ఉన్నాడని  అనిపిస్తున్నది' అని తన సహచరులతో అన్నాడు. అంటే మహర్షి కంటే యోగి రామయ్య ఉన్నతస్థాయిలో ఉన్నాడని ఆయననుకున్నాడు. ఇది చదివినపుడు నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. ఇది 1935 లో జరిగింది. యోగానంద గారి యోగదృష్టి అలా ఉండేది !

ఇప్పుడు ఒక పిట్టకథ.

ఇకపోతే, తను యోగానంద కొడుకునని చెబుతూ బెన్ ఎస్కిన్ అనే అమెరికన్ ఒకతను 2000 ప్రాంతంలో తెరపైకి వచ్చాడు. యోగానంద అమెరికాకు వచ్చిన కొత్తలో అడిలైడ్ ఎస్కిన్ అనే తన తల్లి  ఆయనకు ఫోటోగ్రాఫర్ గా పనిచేసిందని, వారిద్దరికీ గట్టి అనుబంధం ఉందని, 1933 లో పుట్టిన బెన్ ఎస్కిన్ వాదించాడు. అతనిలో ఇండియన్ పోలికలుండేవి. రంగు కూడా గోధుమరంగుగా ఉండేవాడు. పైగా, 1933 కి నాలుగేళ్లు ముందే అతని అమెరికన్ పెంపుడు తండ్రికి వాసెక్టమీ ఆపరేషన్ అయింది. కనుక ఇతని తండ్రి ఎవరో ఒక ఇండియన్ అనేది ఆ పెంపుడు అమెరికన్ తండ్రికి కూడా తెలుసు. 

యోగానందే ఆ తండ్రి అని భావించిన ఆ అమెరికన్ తండ్రి, యోగానందను తెగ తిట్టేవాడు. అడిలైడ్ ను కొట్టేవాడు. 'యూ బ్లడీ బ్లాక్ బాస్టర్డ్' అని తన చిన్నపుడు తనను తెగ తిట్టేవాడని బెన్ అన్నాడు. ఈ కోపంతో  పదేళ్ళపాటు నెవాడా ఎడారి దగ్గర దిక్కులేని స్థితిలో తల్లీ కొడుకులను వదిలేశాడు ఆ అమెరికన్ తండ్రి. బెన్ ఎస్కిన్ నానా కష్టాలు పడి, చిన్నవయసు నుండే కూలిపనులు చేసుకుంటూ బ్రతికేవాడు. డబ్బులు లేక చదువుకోలేదు. అతని తల్లి ఎడిలైడ్ అతనితో ఇలా అనేది, 'నీలో ఉన్న రక్తం చాలా విలువైనది. నువ్వు ముందుముందు చాలా గొప్పవాడివి అవుతావు'. ఇలా అనేదిగాని అసలు తండ్రి ఎవరో ఆమె చెప్పేది కాదు.

కాలిఫోర్నియాకు చెందిన న్యూ టైమ్స్ అనే పత్రిక ఇదంతా కాలమ్స్ గా వ్రాసింది. మళ్ళీ దుమారం రేగింది. కలకత్తాలో ఉన్న యోగానంద బంధువుల రక్తాన్ని సేకరించి, బెన్ రక్తంతో పోల్చి DNA టెస్ట్ చేయించారు SRF అధినేతలు. అది నెగటివ్ వచ్చిందని బెన్ చేప్పేది అబద్దమని SRF వాదించింది. SRF పర్యవేక్షణలో జరిగిన టెస్ట్ కరెక్ట్ ఎలా అవుతుందని బెన్ వాదించాడు. పక్షపాతం లేని మూడో ఏజెన్సీ తో ఆ టెస్ట్ జరగాలని అతను కోరాడు. అయితే ఆ విధంగా టెస్ట్ జరగడానికి SRF ఒప్పుకోలేదు.

నేరాన్ని ధీరానంద పైకి లేదా నిరోధ్ పైకి తొయ్యాలని SRF లాయర్ ప్రయత్నించాడు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బెన్ తండ్రి అయ్యుంటాడని ఆ లాయర్ అన్నాడు. ఈ వ్యాఖ్యలతో మండిపడిన వను బాగ్చి (ధీరానంద కుమారుడు), అనిల్ నిరోద్ (నిరోధ్ కుమారుడు)లు, వాలంటరీగా తమ రక్తం శాంపిల్స్ ఇచ్చి బెన్ రక్తంతో పోల్చి అమెరికాలోనే టెస్ట్ చేయించారు. అవి నెగటివ్ రిజల్ట్ వచ్చాయి. అంటే ధీరానంద, నిరోధ్ లు బెన్ తండ్రులు కారని రుజువై పోయింది. అదేవిధంగా ఒక Third party దగ్గర యోగానంద బంధువుల బ్లడ్ ను కూడా బెన్ రక్తంతో పోల్చి  DNA టెస్ట్ చెయ్యాలని వారు కోరారు. కానీ దానికి SRF స్పందించలేదు.

బెన్ తండ్రి, అమెరికన్ కాదనేది వాస్తవం. అతని రంగు, పోలికలు అన్నీ ఒక ఇండియన్ లాగా ఉండేవి. అతని అన్నలందరూ తెల్లగా అమెరికన్ల లాగానే ఉండేవారు. కానీ బెన్ మాత్రం ఇండియన్ లేదా మెక్సికన్ పోలికలతో ఉండేవాడు. ధీరానంద, నిరోధ్ లు అతని తండ్రులు కారు. మరి అతని తండ్రి ఎవరు? అనే ప్రశ్న తేలకుండా ఉండిపోయింది.

బెన్ ఎస్కిన్ కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. బెన్ తల్లి ఎడిలైడ్ దాదాపు నూరేళ్లు బ్రతికి ఒక పిచ్చాసుపత్రిలో కరెంట్ షాకులతో చనిపోయింది. యోగానంద బ్రతికి ఉన్నంతవరకూ ఆమె ఆయన భక్తురాలుగానే ఉంది. ఆయన్ను తరచూ కలుస్తూనే ఉండేది. చివరకు ఈ వివాదం ఎటూ తేలకుండా ఉండిపోయింది.

బెన్ ఎస్కిన్ ను, యోగానందను చూసినవారు మాత్రం ఇద్దరికీ ఖచ్చితమైన పోలికలున్నాయని అంటారు. ఇదెంతవరకూ నిజమో మనకు తెలియదు. బెన్ ఎస్కిన్ చనిపోయేవరకూ యోగానందే తన తండ్రి అని నమ్మేవాడు. అదే చెప్పేవాడు. ఇదంతా చర్చ్ అల్లిన కట్టుకథ అని, యోగానందకు చెడ్డపేరు తేవడానికి క్రైస్తవ మిషనరీలు చేసిన కుట్ర అని యోగానంద భక్తులంతా అంటారు.

జ్యోతిష్యశాస్త్రాన్ని ఉపయోగించి చూడమని, ఈ సమస్యను తేల్చమని కొందరు నన్ను కోరారు. యోగానందగారి జాతకం స్పష్టంగా ఉందికదా? చూశాను. కానీ అందరికీ వివరించి చెప్పవలసిన పని నాకు లేదు. కాబట్టి చెప్పను.

'యోగానందకు తన శిష్యురాళ్ళతో సెక్స్ సంబంధాలున్నాయి, వాటిని మానుకోమని నేను చెప్పాను, కానీ యోగానంద వినడం లేదు. అందుకని యోగానందతో నా సంబంధం త్రెంచేశాను' అని బదరీనాథ్ లో  బాబాజీ తనతో అన్నాడని మార్షల్ గోవిందన్ అనే ఇంకొక క్రియాయోగ గురువు వ్రాశాడు. ఇతను SAA రామయ్య అనే తమిళ సిద్ధ సాంప్రదాయ క్రియాయోగ గురువుకు శిష్యుడు. ఇదంతా అబద్దమని, మార్షల్ గోవిందన్ అనేవాడు ఒక ఫ్రాడ్ అని చాలామంది అంటారు.

'బాబాజీ క్రియాయోగా' అనే ఇంకొక సిద్ధ క్రియాయోగా సంప్రదాయాన్ని ఈ SAA రామయ్య అనే అతను తమిళనాడులో స్థాపించాడు. అమెరికాలో వీళ్లకు కూడా బ్రాంచిలున్నాయి.  బాబాజీ పేరు నాగరాజన్ అని, ఆయన కడలూరులో పుట్టాడని, అగస్త్యమహర్షి శిష్యుడని, శ్రీలంకలోని కటర్గమాలో సిద్ధభోగనాధుని శిష్యరికంలో క్రియాయోగాన్ని నేర్చుకున్నాడని వీళ్లంటారు. యోగానంద చెప్పినట్లు, జీసస్ కు బాబాజీకి సంబంధం లేదని, అదంతా ఒక కట్టుకథ అని వీరి వాదన.

నిజానిజాలు ఎవరికీ తెలియవు.

మళ్ళీ మన కధలోకొద్దాం.

యోగానంద మరణం తర్వాత జేమ్స్ జె లిన్ SRF కు అధిపతి అయ్యాడు. అయితే, ఆయన ఎక్కువకాలం జీవించలేదు. ఆయనకు ఏదో మెదడు రోగం వచ్చి  త్వరలోనే చనిపోయాడు. ఆ తర్వాత యోగానందకు ప్రియశిష్యురాలైన దయామాత ఆ స్థానాన్ని అలంకరించి, 2010 లో చనిపోయేవరకూ దాదాపు 50 ఏళ్లపాటు SRF కు అధినేతగా ఉంది. ఆమె హయాంలో 50 మందికి పైగా అమెరికన్ సన్యాసులు సంస్థను వదలి వెళ్లిపోయారు. కొంతమంది వేరే కుంపట్లు పెట్టుకున్నారు. ఇండియాలోని YSS సంస్థలో కూడా,  తనకు ఇష్టం లేని చాలామందిని ఆమె తొలగించింది. ప్రస్తుతం SRF (అమెరికా సంస్థ) + YSS (ఇండియా సంస్థ) లకు జాయింట్ గా బ్రదర్ చిదానంద అనే అమెరికన్ సన్యాసి అధినేతగా ఉన్నాడు. అంటే, వారి సంస్థలో జగద్గురువు పదవిలో అన్నమాట !

క్రియాయోగాను అమెరికాకు చేర్చి యోగానంద మంచిపనే చేశాడు. క్రియాయోగ అనేది తెల్లవాళ్ళకు తెలిసింది. ప్రపంచవ్యాప్తం అయింది. కానీ చివరకేమైంది? సంస్థ అనేది అమెరికా వాళ్ళ చేతులలోకి వెళ్ళిపోయింది. ఒక గ్లోబల్ బిజినెస్ అయ్యి కూచుంది.

'ఇండియా సాధువుల గొప్ప ఏంటి?' అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. 'ఇండియా యోగులకు మేమెందుకు కాళ్లకు మొక్కాలి?' అని అడుగుతున్నారు. వెరసి క్రియాయోగా అనేది అమెరికన్ పేటెంట్ అయిపొయింది. ప్రస్తుతం ఇండియన్స్ అందరూ అమెరికన్ స్వాముల దగ్గర క్రియాయోగాను నేర్చుకోవలసిన గతి పట్టింది.

SRF హెడ్ సంస్థను ఇండియాలో పెట్టి, బ్రాంచీలను అమెరికాలో పెట్టి ఉండవలసింది. కానీ యోగానంద దీనికి వ్యతిరేకంగా చేశాడు. ఫలితంగా, క్రియాయోగా అమెరికా వాడి చేతిలోకి వెళ్ళిపోయింది.

1982 లో నేను క్రియాయోగాను తిరస్కరించిన పాయింట్ కూడా సరిగ్గా ఇదే. 'అమెరికన్ స్వాములు నేర్పిస్తే మనం యోగాను నేర్చుకోవలసిన ఖర్మేంటి? ప్రపంచానికి యోగశాస్త్రాన్ని ఇచ్చినది మనం. మనదగ్గరే వాళ్ళు నేర్చుకోవాలి. ఏం మనదగ్గర గురువులు లేరా? యోగశాస్త్రం మనదగ్గర లేదా?' అని నేను ప్రశ్నించాను. మా స్నేహితులతో ఇదే పాయింట్ మీద వాదించాను. నా వాదనను వాళ్ళపుడు ఒప్పుకోలేదు. కానీ 10 ఏళ్ల తర్వాత ఒప్పుకున్నారు. క్రియాయోగాలో యోగానంద చాలా మార్పులు చేశాడని, అమెరికా స్వాములు దానినే YSS కరెస్పాండెన్స్ కోర్సుగా తమకు నేర్పించారని, దానిని ఎన్నేళ్లు అభ్యాసం చేసినా ఏమీ ఫలితాలు కనిపించడం లేదని ఒక సీనియర్ క్రియాయోగి 1992 లో నాతో వాపోయాడు. 'నువ్వు 1982 లో మాతో అన్నది కరెక్టే' అని పదేళ్ల తర్వాత నాతో అన్నాడు.

అమెరికన్స్ కు కాళ్ళు వంగవు. వాళ్లకు పద్మాసనం రాదు. అందుకని వాళ్లకు పద్మాసనాన్ని తీసేసి, కుర్చీలో కూచుని ప్రాణాయామం చెయ్యమని యోగానంద వెసులుబాటు ఇచ్చాడు. అదే విధంగా, ఖేచరీముద్రను తీసేశాడు. ఖేచరీముద్ర రాకుండా క్రియాయోగాలో ఉన్నతస్థాయి అభ్యాసాలు కుదరవు. ఆ ముద్ర రాకపోతే, వాటిని చెయ్యడం సాధ్యం కాదు. కానీ అమెరికన్ క్రియాయోగా గురువులకు ఖేచరీ ముద్ర రాదు. యోగానంద వాళ్ళకు నేర్పలేదు. లాహిరీ మహాశయులు నేర్పించిన 'థోకార్' అనే క్రియ, దాని వేరియేషన్స్ కూడా వీళ్ళకు తెలియవు.  కానీ వాళ్ళ అహంకారాలు, పోజులు మాత్రం ఏమీ తక్కువ ఉండవు.

2017 లో రెండవసారి నేను అమెరికా వెళ్ళినపుడు ఒక అమెరికన్ స్వామీజీ నాతో ఇలా అన్నాడు, 'ఇండియన్ స్వామీజీలకు మేమెందుకు కాళ్లకు మొక్కాలి? వాళ్ళకంటే మేమేం తక్కువ? వాళ్ళకెందుకు మేము ఊడిగం చెయ్యాలి?'

'ఎందుకంటే, యోగశాస్త్రం ఇండియాలో పుట్టింది కాబట్టి, వాళ్ళు మీకు గురువులు కాబట్టి, వాళ్లకు మీరు మొక్కాలి' అని నేను చెప్పాను. నా మాట ఆయనకు నచ్చలేదు. దీక్ష తీసుకున్న గురువుకే నమస్కారం పెట్టడానికి వాళ్లకు అహంకారం అడ్డు వస్తోంది. అలా ఉంటుంది అమెరికా తెల్లవాళ్ళ ధోరణి.

దేనినైనా ఒక పెద్ద బిజినెస్ గా మార్చడం అమెరికన్ల రక్తంలో ఉంది. అది యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, తంత్రా కావచ్చు. ఒకసారి వాళ్ళ చేతులలోకి వెళ్లిపోయిందంటే ఇక పేటెంట్ అమెరికాకు వెళ్ళిపోయినట్లే. తిరిగి మన చేతులలోకి దానిని రానివ్వరు. అది వారికొక జీవనోపాధి, ఒక MNC గా దానిని మార్చేస్తారు. క్రియాయోగాను కూడా ఇదే చేశారు.

అమెరికన్స్ చేతులలో చిక్కుకోకుండా ఉన్నది మూడే మూడు సంస్థలు, ఒకటి రామకృష్ణా మిషన్, రెండు రమణమహర్షి ఆశ్రమం. మూడు జిల్లెళ్ళమూడి అమ్మగారి ఆశ్రమం. తెల్లవాళ్ళను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు ఈ ముగ్గురూ, కనుక వీళ్ళదగ్గర అమెరికా ఆటలు సాగలేదు. మిగతా అందరినీ వాళ్ళు ముంచేశారు.  ఆసనాలు, క్రియాయోగా, సిద్ధయోగా, ఓషో, మహేష్ యోగి, జెన్, ఎన్నో టిబెటన్ బుద్ధిజం స్కూళ్ళు ఇలా అన్నింటినీ తెల్లవాళ్లు కబళించేశారు. బిజినెస్ గా మార్చేశారు. ఈ మూడు మాత్రం వారి చేతికి చిక్కలేదు.

రమణమహర్షిని కూడా కాపీ కొట్టి 'హృదయయోగా' అని మెక్సికో లో మొదలుపెట్టారు. ఎంతవరకు ఆ బిజినెస్ సాగుతుందో చూడాలి.  

మొత్తమ్మీద, క్రియాయోగా అనేది అమెరికన్స్ చేతిలోని గ్లోబల్ బిజినెస్ అయి కూచుంది. పేటెంట్లు, కాపీరైట్లు అన్నీ అమెరికాకు తరలిపోయాయి. యోగానంద చేసిన తప్పులలో ఇది ఇంకొకటి.

పనిలో పనిగా, క్రియాయోగ స్కూల్స్, ఆశ్రమాలు ఎన్నెన్నో శాఖోపశాఖలుగా విడిపోయాయి. ఇప్పుడు ప్రతి ఊరిలోనూ ఒక క్రియాయోగా ప్రత్యేక బ్రాంచి ఉంది. ప్రతీవారూ 'మాకు బాబాజీ కనిపించాడు. దీక్షలివ్వమని మాకు అధారిటీ ఇచ్చాడు. మాదే అసలైన క్రియాయోగా' అని చెబుతూ ఎవరి బిజినెస్ వారు  చేసుకుంటున్నారు.

కానీ, నిర్వికల్ప సమాధిస్థితి గాని, శ్వాసరహిత స్థితిగాని, గుండె ఆగిపోయినప్పటికీ యోగి బ్రతికి ఉండే స్థితిగాని ఎవరిలోనూ కనిపించడం లేదు. పుస్తకాలు చదివి కాకమ్మకబుర్లు చెప్పడమే గాని, వీటిని సాధించినవారు ఎవరూ లేరు. ఈ క్రియాయోగా స్కూళ్ళు మాత్రం 'మా గురువు గొప్ప మా ఆశ్రమం గొప్ప. అసలైన క్రీయాయోగా మా దగ్గర మాత్రమే ఉంది' అంటూ అందరూ కలసి గోలగోలగా కొట్టుకుంటున్నారు.

వెరసి క్రియాయోగా అనేది ఒక ఫార్స్ అయి కూచుంది. మరి ఇదంతా చూసి యోగానంద గారు, యుక్తేశ్వర్ గారు, లాహిరీ మహాశయులు పైనుంచి ఎలా ఫీలవుతున్నారో వాళ్ళకే ఎరుక. 

ఇక బాబాజీ సంగతందామా? ఆయనదేముంది పాపం? ఎక్కడపడితే అక్కడే ఉంటాడు. ఎవరికి పడితే వారికి కనిపిస్తూ ఉంటాడు. అందరికీ బిజినెస్ ఐటం గా మారాడు. ప్రతివాడూ బాబాజీ పేరు చెప్పి షాపు తెరుస్తున్నాడు. బిజినెస్ సాగుతోంది. గొర్రెలు గుడ్డిగా ముందుకు పోతున్నాయి.

సరిగ్గా ఇది వ్రాస్తున్నపుడే కాలింగ్ బెల్ మోగుతోంది !

బాబాజీ వచ్చి, బెల్లు కొడుతున్నట్టున్నాడు. కోప్పడతాడేమో? ఆ ! కోపం ఎందుకూ? నేనేం అబద్దాలు రాయలేదుగా? నాకెందుకు భయం? చూసొస్తా.

అప్పటిదాకా క్రియాయోగా అనబడే ఈ ఫార్స్ అంతా చదువుకుంటూ ఉండండి.

సరేనా ! జై గురుదేవ !

(అయిపోయింది)

read more " పరమహంస యోగానంద గారి జాతకం - Part 7 (కొన్ని చేదు వాస్తవాలు) "

17, ఆగస్టు 2023, గురువారం

పరమహంస యోగానంద గారి జాతకం - Part 6 (Nirad Ranjan Chowdhury)

అమెరికాలోని యోగదా సంస్థ (Self Realization Fellowship) ను నిలబెట్టడంలో ముఖ్యపాత్రను పోషించిన వారిలో శ్రీ నిరోద్ ముఖ్యుడు. ధీరానంద 1929 లో ఈ సంస్థనుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత నిరోద్ ను సంస్థల్లోకి వచ్చి పనిచెయ్యమని ఆహ్వానించాడు యోగానంద. ఏమంటే, యోగ-వేదాంత సంప్రదాయం పైన మంచి పట్టు ఉండి, చక్కగా మాట్లాడి ప్రచారం చెయ్యగలిగే కార్యకర్తలు అప్పటికాయనకు ఎంతో అవసరంగా ఉంది. ఒక్కడే ఎంతని ప్రచారం చెయ్యగలడు అమెరికాలో?

ఇకపోతే, ఈ నిరోధ్ కథ ఏంటో చూద్దాం. ఈ పేరును వింటే నేటి తరానికి నవ్వొస్తుంది. ఇలాంటి పేర్లు కూడా పెట్టుకుంటారా అని. కానీ బెంగాలీలలో ఈ పేరు చాలా సామాన్యంగా ఉంటుంది. అరబిందో శిష్యులలో కూడా నిరోద్ బారన్ అనే ఆయన ఉన్నాడు.

కలకత్తా దగ్గర పఱైకోరాలో, 1887 లో నిరోధ్ జన్మించాడు. ఆ సంవత్సరంలో శని వక్ర స్థితిలో ఉంటూ మిధున, కర్కాటక రాశులలో సంచరించాడు. గురువు తులారాశిలో ఉన్నాడు. ప్రశ్న చార్ట్ సహాయంతో జననకాలసంస్కరణ విధానాన్ని ఉపయోగించి చూడగా, శని కర్కాటకంలో వక్రించి ఉన్నాడని, గురువు రుజుగమనంలో తులలో ఉన్నాడని తెలుస్తోంది. రాహుకేతువులు కర్కాటక మకర రాశులలో ఉన్నారు. కనుక నవంబర్ నెలలో ఈయన పుట్టాడని ఊహిస్తున్నాను. జాతకంలో ఉన్న శపితయోగం కర్కాటక రాశిలో ఉంది. శని వక్ర స్థితి వల్ల మిధునం లోకి పోతూ, శాపం నుండి బయటపడి (యోగానందతో విడిపోయి) అమెరికాలో జీవితం సాగిస్తాడని ఖచ్చితంగా సూచిస్తున్నాడు. తులలోని గురువు, న్యాయం కోసం పోరాడతాడని సూచిస్తున్నాడు. ఈ జాతకచక్రాన్ని ప్రక్కన ఇచ్చాను చూడండి. దానిలో శని గురువులు, రాహుకేతువులు తప్ప మిగతా గ్రహాల స్థానాలను, లగ్నాన్ని లెక్కించకండి. ఇది స్థూలంగా చేసిన జననకాల సంస్కరణ మాత్రమే. రోజు, గంట, నిముషం వరకూ చేసినది కాదు. ఎలా చేశాను? అనిమాత్రం అడక్కండి. నా జవాబు మామూలే. చెప్పను.

ధీరానంద లాగా ఈయనకూడా బ్రాహ్మణ కుటుంబంలోనివాడే. ఈయన అసలు పేరు నిరాద్ రంజన్ చౌధురీ. బెంగాలీ బ్రాహ్మణులకు చౌధురీ అనే పేరుంటుంది, సౌత్ లో శర్మ, శాస్త్రి ఉన్నట్లు. అమెరికా వెళ్ళాక సులభంగా ఉండటం కోసం ఈ పేరును నిరోద్ గా యోగానంద మార్చాడు.

నేటి ఇండియా పార్లమెంట్ లో కాంగ్రెస్ నాయకుడైన అధీర్ రంజన్ చౌధురీ కి ఈయనకు ఏదైనా బంధుత్వం ఉందొ లేదో మనకు తెలియదు. కానీ పేర్లు ఒక్కలాగే ఉన్నాయి. 

వీరి వంశంలోని తాతముత్తాతలు అందరూ యోగులే.  వీరిది యోగకుటుంబం. వీరి యోగసంప్రదాయం క్రియాయోగా కంటే భిన్నమైనది. కాకపోతే ప్రాణాయామం, కుండలినీ శక్తి, షట్చక్రాలు మొదలైన సాధనలు దాదాపుగా అన్ని దారులలోనూ ఒకేవిధంగా కలుస్తూ ఉంటాయి. వీరికొక ఆశ్రమం ఉండేది. దానిపేరు సాధనా కుటీర్ ఆశ్రమం. చిన్నతనంలోనే తన తాత గోవిందచంద్ర రాయ్, మేనమామ ప్రసన్నకుమార్ రాయ్ ల దగ్గర యోగాభ్యాసాన్ని నేర్చుకుని అభ్యాసం చేసేవాడు.

అప్పటిలోనే ఈయన కలకత్తా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. ఇంగిలీషు చదువుతూనే సంస్కృతం కూడా అభ్యసించాడు. జీన్స్ లో ఉన్న ఆధ్యాత్మిక భావాలతో వైరాగ్య పూరితుడై, ఇల్లు వదలి సంచారయోగిగా దేశమంతా సంచరిస్తూ, బర్మా, దక్షిణ చైనా దేశాలలో కూడా సంచరించాడు. ఆ క్రమంలో ఎందరో యోగులను కలసి వారివద్ద యోగరహస్యాలను నేర్చుకున్నాడు. 1919 లలో అమెరికాకు వచ్చి హార్వర్డ్ యూనివర్సిటీ, బర్కీలీ యూనివర్సిటీలలో చదివాడు. అంటే యోగానంద కంటే ముందే ఈయన అమెరికా వెళ్ళాడు.

అమెరికాలో ఉన్నప్పుడే బోస్టన్ లో యోగానంద ఉపన్యాసాలు వినడానికి వెళ్ళాడు. ఆ విధంగా ఒకసారి బోస్టన్ లోను, మరొకసారి సాన్ ఫ్రాన్సిస్కో లోను యోగానంద గారిని కలిశాడు. కానీ ఇండియాలో ఉన్న ఈయన బంధువులకు యోగానంద అంటే మంచి అభిప్రాయం లేదు. యోగమార్గంలో ఆయన అంత గొప్ప ప్రజ్ఞావంతుడు కాదని వారు భావించారు. కనుక యోగానందతో చేరవద్దని నిరాద్ ను వారించారు. కానీ నిరాద్ వినలేదు.

యోగానందకూడా నిరాద్ లోని పాండిత్యాన్ని, అతని యోగసాధనను చూచి, తనకు ఉపయోగిస్తాడని భావించి, తన సంస్థలోకి ఆహ్వానించాడు. ఇతనికి 'బ్రహ్మచారి నిరోద్' అని నామకరణం చేసి 1928 లో డెట్రాయిట్ యోగదా సెంటర్ కు ఇతన్ని ఇంచార్జ్ గా ఉంచాడు యోగానంద. సమర్ధవంతంగా దాన్ని నడుపుతూ తన సొంత రచనలను ప్రచురించాడు నిరోద్. ఆలివర్ బ్లాక్, ఫ్లోరినా డార్లింగ్ ( సిస్టర్ దుర్గామాత ) మొదలైన ప్రముఖులకు మొదట్లో నిరోధే క్రియాయోగాన్ని నేర్పించినవాడు.

ఆ విధంగా నిరాద్ 1928 లో డెట్రాయిట్ యోగా సెంటర్ ను మొదలుపెట్టాడు. అప్పట్లోనే ఈయన Wings of Bliss అనే పద్యాలతో కూడిన పుస్తకాన్ని వ్రాశాడు. ఆ తరువాత అమెరికా అంతా పర్యటిస్తూ, క్రియాయోగాన్ని బోధిస్తూ, అనేకమంది అమెరికన్స్ ను సాధకులుగా గురువులుగా తీర్చిదిద్దాడు. యోగదా సంస్థకు ఎనలేని సేవ చేశాడు.

యోగానందకు తన శిష్యురాళ్ళతో ఉన్న అతి చనువు, అప్పటికే యోగదా సంస్థలో రెండవ స్థానంలో ఉన్న ధీరానందకు నచ్చలేదు. పైగా సంస్థ డబ్బు విషయంలో వీరిద్దరికీ గొడవలొచ్చాయి. ఫలితంగా, ధీరానంద యోగదా సంస్థనుండి నిష్క్రమించాడు. ధీరానంద నిష్క్రమణతో, మౌంట్ వాషింగ్టన్ లో ఉన్న ముఖ్య కార్యాలయంలోని డైరెక్టర్ పోస్టు ఖాళీ అయింది. దానిలో చేరి పనిచెయ్యమని నిరోద్ ను ఆహ్వానించాడు యోగానంద. ఆ పదవిలో చేరి 1932 వరకూ చాలా చురుకుగా పనిచేశాడు నిరోద్. దాదాపు పదివేల మంది అమెరికన్స్ కు క్రియాయోగ దీక్షనిచ్చాడు.

ఒక హౌస్ కార్ ను నిరాద్ కు ఇచ్చి దానిలో అమెరికా అంతా తిరుగుతూ ప్రచారం చెయ్యమని పురమాయించాడు యోగానంద. అప్పటికే నిరాద్ కు పెళ్లయింది. యాగ్నేస్ స్పెన్సర్ అనే ఒక అమెరికన్ వనితతో ఆ పెళ్లిని తనే జరిపించాడు యోగానంద. ఆ కారులో తన భార్యతోను, కుమారుడు అనిల్ తోను అమెరికా అంతా తిరిగి క్రియాయోగ ప్రచారం చేశాడు నిరోద్. మిన్నెసోటా నుండి ఫ్లోరిడా వరకు,  టెక్సాస్ నుండి న్యూయార్క్ వరకు ఈ విధంగా ప్రయాణిస్తూ, ఎంతో మందిని యోగమార్గం వైపు ప్రభావితం చేశారు నిరోధ్ కుటుంబం.

ఆ సమయంలో SRF లో చాలామంది వైస్ ప్రెసిడెంట్లు ఉండేవారు. వారిలో నిరోద్ కూడా ఒకడు. పండిట్ జీ అని ఇంకొకాయన ఉండేవాడు. హమీద్ బే అని ఇంకొకాయన ఉండేవాడు. ఈయన కాప్టిక్ మార్మిక సాధకుడు. అప్పట్లో ఈ విధంగా అనేకమందిని తన సంస్థలో ప్రచారకులుగా ఉంచుకుని సంస్థ ప్రచారాలను అమెరికన్స్ లోకి తీసుకెళ్లాడు యోగానంద. తరువాత కాలంలో హమీద్ బె, యోగదా సంస్థను వదిలేసి Coptic Fellowship of America ను స్థాపించుకున్నాడు. ఆ సంస్థ ఇప్పటికీ కొనసాగుతోంది.

హమీద్ బే గురించి తెలియాలంటే ఇక్కడ చూడండి.

పండిట్ జీ కి యోగానంద మీద చాలా అనుమానాలుండేవి. విసుగుతో ఆయన కూడా ఆ సంస్థను వదలి వెళ్ళిపోయాడు. చివరకు యోగానంద, నిరోద్ ఇద్దరే మిగిలారు. అప్పట్లో తామంతా సంస్థలో సమాన భాగస్వాములమని యోగానంద వారికి చెప్పేవాడు. అందుకనే తన సంస్థకు Self Realization Fellowship అని పేరు పెట్టాడు. అలా వద్దని 'యోగదా సత్సంగ సభ' అనే పేరును దానికి పెట్టమని యుక్తేశ్వర్ గారు అన్నారు. కానీ యోగానంద వినలేదు. ఫెలోషిప్ అంటే, సమానస్థాయి సభ్యులున్న సంస్థ అని అర్ధం. రకరకాల సంప్రదాయాలున్న సభ్యులు ఒకే సంస్థలో ఉంటూ సెల్ఫ్ రియలైజేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నామని ఆ పేరుకు అర్ధం వస్తుంది. అది నిజమని వీళ్ళందరూ కూడా అనుకున్నారు. 

వీరందరూ కలసి యోగానంద స్థాపించిన East West అనే పత్రికలో వ్యాసాలు పద్యాలు కవితలు వ్రాస్తూ ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు స్నేహితులుగా ఉన్నారు. వీళ్ళు ఎన్నడూ యోగానందను గురువుగా భావించలేదు. వీళ్ళలో రోమన్ ఎస్టోజా అని ఒక విదేశీయుడు కూడా ఉండేవాడు. వీరందరూ తమ తమ భావాలను ప్రచారం చేస్తూ,  తమతమ మీటింగులలో యోగానంద గారి సాహిత్యం కూడా అమ్మిపెట్టేవారు. వాటిలో ఎక్కువ శాతం ధీరానంద వ్రాసినవే.

1940 సంవత్సర సమయానికి, ఇంతకుముందు ధీరానంద ఎలా అయితే SRF అంటే విరక్తి చెందాడో, అదే విధంగా నిరోద్ కూడా విరక్తి చెందాడు. 1940 లో యోగానందతో విడిపోయిన నిరాద్, అమెరికా అంతటా పర్యటిస్తూ తనదైన యోగమార్గాన్ని ప్రచారం చేస్తూ గడిపాడు. 1950 వరకూ ఇలా జరిగింది. చివరకు చికాగోలో స్థిరపడి 1983 లో తను చనిపోయేవరకూ యోగా గురువుగానే ఉన్నాడు నిరోద్. ఈయన భార్య కూడా ఈయన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 1995 వరకూ యోగాను నేర్పించేది. చికాగో ప్రాంతాలలో ఈయనకు చాలామంది శిష్యులు ఈనాటికీ ఉన్నారు. వారందరూ నేటికీ అమెరికాలో యోగా గురువులుగా ఉన్నారు. ఈయనను ఒక మహాయోగిగా వారు భావిస్తారు.

యోగానందతో కలసి జీవించిన శిష్యురాళ్ళలో ఇద్దరు, దుర్గామాత (Fiona Darling), జ్ఞానమాత (Edith Bissett) లు నిరోద్ గురించి ఎంతో గొప్పగా చెప్పేవారు. దుర్గామాతను యోగానంద దగ్గరకు చేర్చినది నిరోధే. అందుకని జీవితాంతం నిరోధ్ అంటే ఎంతో అభిమానాన్ని చూపించేది దుర్గామాత.

1925-26 ప్రాంతంలో East West పత్రిలలో వ్రాస్తూ, నిరోధ్ కు తాను దీక్షనిచ్చానని బ్రహ్మచారి నిరోద్ అని పేరుపెట్టానని యోగానంద వ్రాశాడు. దీనికి నిరోధ్ అభ్యంతరం చెబుతూ, తనకు వేరే గురువులున్నారని, దయచేసి ఈ 'బ్రహ్మచారి' టైటిల్ ను తన పేరునుండి తొలగించమని, బ్రహ్మచారిగా ఉండాలని సన్యాసం తీసుకోవాలని తనకేమీ కోరిక లేదని యోగానందను కోరాడు. అందరికీ గురుత్వం వహించాలన్న దుగ్ద యోగానందలో చాలా ఎక్కువగా ఉండేదని దీనినిబట్టి అర్ధమౌతుంది.

విచిత్రం ఏంటంటే, 1939 లో నిరోద్ ను SRF నుండి తొలగిస్తూ యోగానంద చేసిన అభియోగాలతో ఒకటి - అప్పటి చట్టాల ప్రకారం ఒక హిందువు ఒక అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు - కాబట్టి సంస్థ నియమాలను, దేశ చట్టాన్ని నిరోద్ ఉల్లంఘించాడని అన్నాడు. కానీ, ఆ పెళ్లిని 1931 లో, మౌంట్ వాషింగ్టన్ మెయిన్ సంస్థ లాన్స్ పైన, దగ్గరుండి మరీ చేయించింది యోగానందే. ఆ పెళ్లిని సినిమా కూడా తీసి, అప్పట్లో అమెరికా సినిమా హాళ్లలో చాలా గొప్పగా ప్రదర్శించారు. ఆ ఏర్పాటు కూడా యోగానందే చేశాడు. అదొక బిజినెస్ ను పెంచుకునే ట్రిక్. కానీ నిరోద్ ను సంస్థనుండి తొలగించే సమయంలో అదే పెద్ద నేరంగా చూపించాడు యోగానంద. ఇది యోగానంద చేసిన ఘోరమైన తప్పులలో ఒకటి.

ఫ్లోరిడాలో ఒక యోగదా టెంపుల్ ను కట్టడానికి నిరోద్ కు ఇవ్వమని పదివేల డాలర్లను యోగానందకు పంపించాడు జేమ్స్ జె లిన్. కానీ ఆ డబ్బును నిరోద్ కు ఇవ్వకుండా తానే ఉంచుకున్నాడు యోగానంద. నిరోద్ ను ఫ్లోరిడా నుండి వెనక్కు వచ్చేసి మౌంట్ వాషింగ్టన్ లోనే ఉండమని ఆజ్ఞాపించాడు. బహుశా తనకంటే నిరోద్ ఎదిగిపోతున్నాడని యోగానంద భయపడి ఉంటాడు. బయటకు రాని ఇలాంటి సంఘటనలు SRF లో చాలా జరిగాయి. చివరకు నిరోద్ సంస్థనుండి బయటకు పంపబడ్డాడు.

యోగానంద నుండి విడిపోయిన తర్వాత కూడా నిరోధ్ యోగమార్గంలో నడవడం ఆపలేదు.  ఏమంటే యోగానంద పరిచయం కాకముందే ఆయన ఒక యోగిగా ఉండేవాడు. వాళ్ళ కుటుంబ గురుసంప్రదాయం వారికుంది. దానినాయన అనుసరించేవాడు. వేలాదిమంది అమెరికన్స్ కు యోగదీక్షనిస్తూ ఆ తర్వాత దాదాపు 40 ఏళ్ళు ఆయన అమెరికాలోనే ఉండిపోయాడు. యోగానందకు చాలా దగ్గర వ్యక్తి అయిన సిస్టర్ జ్ఞానమాత చివరివరకూ నిరోధ్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తూనే ఉంది. ఆయనను అభిమానిస్తూనే ఉంది.

అప్పట్లోనే యోగదా లెసన్స్ ను ప్రిసెప్టా లెసన్స్ అనే పేరుతో యోగానంద మొదలుపెట్టాడు. ఇది ఒక కరెస్పాండెన్స్ కోర్స్. ఈ లెసన్స్ ఈనాటికీ YSS లో ఉన్నాయి. 1982 లో నా స్నేహితులు కొంతమంది ఈ లెసన్స్ తెప్పించుకుని క్రియాయోగాను అభ్యాసం చేసేవారు. నన్ను కూడా ఆ కోర్సు తీసుకోమని వారు కోరారు. కానీ అప్పటికే నాదైన యోగమార్గం నాకు ఉండటంతో నేనా ప్రతిపాదనను తిరస్కరించాను, ఆ కథను మరో పోస్ట్ లో వ్రాస్తాను.

క్రియాయోగాను కరెస్పాండెన్స్ కోర్సులో అమ్మడం యుక్తేశ్వర్ గిరిగారికి నచ్చేది కాదు. కానీ యోగానంద తన ధోరణిలో తను వెళ్ళేవాడు. ఒకటి మనసులో పెట్టుకున్న తర్వాత ఎవరిమాటా వినని తత్త్వం యోగానందలో ఉండేది. పైగా, తనకు దైవాదేశం ఉన్నదని, తను ఏది చేసినా అది రైటే అని ఆయన భావించేవాడు. యోగానంద ఇండియా వచ్చినపుడు కూడా నిరోద్ అమెరికా అంతా తిరుగుతూ యోగప్రచారంలోనే ఉన్నాడు. 1936 లో యోగానంద ఇండియానుండి అమెరికాకు తిరిగి వెళ్ళాడు. అప్పడు 1937 లో కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన యోగానంద అభినందన సభలో మాట్లాడటానికి మాత్రమే నిరోడ్ తన ప్రచారాన్ని ఆపి కాలిఫోర్నియాకు వచ్చాడు. అంత నమ్మకంగా ఈయన యోగదా సంస్థకు పనిచేశాడు.

1937 East West Magazine మార్చి సంచికలో ఈ విధంగా వ్రాయబడింది, ' గత కొన్నేళ్లుగా శ్రీ నిరోధ్ ఒక్కడే, తన నిరంతర కృషిలో దాదాపు పదివేలమంది అమెరికన్స్ ను క్రియాయోగా వైపు ఆకర్షించి, వారికి దీక్షలిచ్చాడు. ఇది ఎంతో ప్రశంశాపాత్రమైన పని' అంటూ యోగానందకు స్టెనోగా పనిచేసిన రిచర్డ్ రైట్ వ్రాశాడు.

ఒకరకంగా చెప్పాలంటే, తొలిదినాలలో అమెరికాలో SRF సంస్థను నిలబెట్టినవాళ్లలో నిరోధ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. కానీ ఈరోజున SRF గాని, యోగానంద మూఢభక్తులు గాని నిరోధ్ పేరే అనుకోడం లేదు. ధీరానందను కూడా అందరూ మర్చిపోయారు. నేటి మోడ్రన్ క్రియాయోగా అనుయాయులకు ఈ కథలన్నీ తెలియవు. అదంతా 'ఆటో బయోగ్రఫీ ఆప్ ఏ యోగి' పుస్తకం ప్రభావం. అందులో అన్నీ కాకమ్మకధలు తప్ప, వాస్తవికమైన ఇలాంటి విషయాలేమీ కనిపించవు. అదంతా ఒక ఏకపక్ష బుర్రకథ.

1935 లో అమెరికా నుండి యోగానంద ఇండియాకు వెళ్ళిపోయినపుడు కనీసం నిరోధ్ కు చెప్పనుకూడా చెప్పలేదు. యోగానంద ఇండియా వెళ్లిపోయాడని, మౌంట్ వాషింగ్టన్ ఆశ్రమ ఇంచార్జ్ అయిన సిస్టర్ జ్ఞానమాత చెబితేనే నిరోధ్ కు తెలిసింది. యోగానందలో ఈ లక్షణం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. తనకు ఏది అనిపిస్తే అది చెయ్యడమే గాని, తన నమ్మకస్తులతో కూడా దాని గురించి చెప్పాలన్న ఊహ ఆయనలో ఉండేది కాదు. 

అంతెందుకు? 1920 లో ఇండియా నుండి అమెరికా వచ్చినపుడు కూడా, తనకేదో దర్శనం కలిగిందని చెబుతూ హడావుడిగా ఓడ టికెట్లు కొనుక్కుని బయల్దేరాడు గాని, తన గురువైన యుక్తేశ్వర్ గిరిగారికి ఒక్కమాట చెప్పాలని కూడా యోగానందకు తోచలేదు. యోగానంద ఫలానా రోజున బయలు దేరుతున్నాడన్న విషయం ఎవరి ద్వారానో తెలుసుకున్న యుక్తేశ్వర్ గారు కలకత్తాకు వచ్చి, ఓడలోకి వెళ్ళడానికి స్పెషల్ పర్మిషన్ సంపాదించుకుని, ఓడనెక్కి యోగానందకు సెండాఫ్ ఇచ్చాడు. అప్పుడు మాత్రం యోగానంద చాలా అవమానం ఫీలయ్యాడు. యోగానందలోని ఈ పోకడ చాలా విచిత్రంగా కనిపిస్తుంది.

స్వామి యోగానంద గిరిగా ఇండియాకు వెళ్లిన యోగానంద, పరమహంస యోగానంద అనే పేరును పెట్టుకుని అమెరికాకు తిరిగి వచ్చాడు. ఈ పేరును యుక్తేశ్వర్ గిరిగారు తనకు ప్రసాదించారని యోగానంద చెప్పుకున్నాడు. కానీ అలా చేసినట్లు ఎక్కడా రుజువులు లేవు. ఈ విషయాన్ని యోగానంద సమకాలీకుడైన శైలేంద్ర బిజయ్ దాస్ గుప్తా గారు తన పుస్తకంలో వ్రాశారు.

ధీరానందతో కోర్టు కేసు నడుస్తున్న సమయంలో, యోగానందకు 'స్వామి' అని పేరు పెట్టుకునే అర్హత లేదని ధీరానంద వైపు లాయర్ వాదించాడు. ఆయనకు సన్యాసదీక్షా మంత్రాలు రావని, వస్తే చెప్పమని కోర్టులో ఛాలెంజ్ చేశాడు. యోగానంద గారు చెప్పలేకపోయాడు. బహుశా మర్చిపోయి ఉండవచ్చు. నీ 'స్వామి' టైటిల్ డ్రాప్ చెయ్యమని జడ్జి యోగానంద గారికి సూచించాడు. అందుకని, ఇండియా నుండి తిరిగి వచ్చేటప్పుడు 'పరమహంస' అనే టైటిల్ తో తిరిగి వచ్చాడు యోగానంద. ఈ టైటిల్ ఎలా వచ్చింది అన్న విషయం పైన ఒక కధ ఉంది.

ఇండియా వచ్చిన సమయంలో ఒకనాడు సేరంపూర్ ఆశ్రమంలో ఉన్నపుడు, రోడ్డు పక్కన సైడుకాలవలో ఒంటేలు పోస్తున్నాడు యోగానంద. ఆ రోజులలో ఇది మామూలే. చాలామంది ఇలా చేసేవారు. మొన్నమొన్నటిదాకా కూడా పల్లెల్లో చాలామంది ఇలాగే చేసేవారు. యుక్తేశ్వర్ గిరిగారు తన ఇంటి బాల్కనీ నుండి దీనిని చూశారు. ఆయనకు ఇలాటి చేష్టలు నచ్చేవి కావు. అందుకని, ఎగతాళిగా, 'అబ్బో, యోగానంద పరమహంస అయిపోయాడే' అని చమత్కారంగా అన్నారట. పరమహంస అంటే, విధినియమాలకు, సమాజపు కట్టుబాట్లకు అతీతుడైనవాడని అర్ధం. ఆ కామెంట్ ను యోగానంద కూడా విన్నాడు. అక్కడే ఉన్న ఆనందమోహన్ లాహిరీ (లాహిరీ మహాశయుల మనుమడు), దాస్ గుప్తా లతో యోగానంద, 'చూశారా, గురువుగారు నన్ను పరమహంస అన్నారు' అన్నాడట. ఇక అదే నిజమని అనుకున్న యోగానంద, ఆ టైటిల్ ను వాడటం మొదలుపెట్టాడు. యోగానంద పరమహంసగా మారడం అలా జరిగింది. ఈ విషయం కూడా దాస్ గుప్తా గారు వ్రాసిన 'పరమహంస యోగానంద జీవితం' అనే పుస్తకంలో ఉంది. దాస్ గుప్తా గారు యుక్తేశ్వర్ గిరిగారి ప్రియశిష్యుడు. యోగానంద అంటే ఎంతో గౌరవం ఉన్నవాడు. దాదాపు యోగానంద స్నేహితుడే. కనుక ఆయన అబద్దాలు వ్రాయవలసి అవసరం లేదు.

యోగానంద ఇండియా నుండి అమెరికాకు తిరిగి వచ్చాక నిరోధ్ కు ఆయనకు మెల్లిగా గొడవలు మొదలయ్యాయి. 1939 లో నిరోధ్ జీతాన్ని సగం తగ్గించాడు యోగానంద. అప్పట్లో యోగదా సంస్థ మేనేజిమెంట్ అందరికీ నెలకింత అని ఖర్చులకోసం  జీతంగా ఇవ్వబడేది. అదే విధంగా నిరోధ్ కూ ఉండేది. దానిని సగానికి కోత పెట్టాడు యోగానంద. కారణం తెలియదు. తన చుట్టూ ఉన్న సిస్టర్స్ చెప్పుడు మాటలు వినడం వల్ల అయి ఉండవచ్చు. ఆ తర్వాత కొన్ని నెలలకు నిరోధ్ ను సంస్థనుండి తొలగిస్తూ యోగానంద నిర్ణయం తీసుకున్నాడు.

వెంటనే నిరోధ్, యోగానంద కు ఒక ఉత్తరం వ్రాస్తూ, SRF అనేది ఒక felloship కనుక అందులో తామంతా పార్ట్ నర్స్ అని, కనుక తనను తీసివేస్తే, తన వాటాను తనకు చెల్లించమని అడిగాడు. అలాంటి వాటాలేమీ లేవని యోగానంద బదులిచ్చాడు. అప్పుడు, 23-10-1939 న యోగానందపైన కేసు వేశాడు నిరోధ్. ఈ ఆధ్యాత్మిక సంస్థ కొచ్చే లాభాలలో అందరికీ వాటా ఉందని యోగానంద 1934 లో తనతో ఒక అగ్రిమెంట్ చేశాడని నిరోధ్ వాదించాడు. 1925 ప్రాంతాలలో కెప్టెన్ రషీద్ కూడా ఇలాగే వాదించాడు. ఆ కేసు వెంటనే తేలిపోయింది. కెప్టెన్ రషీద్ చేసిన ఆరోపణలు వేరు. అవి కేవలం డబ్బు గురించినవి మాత్రమే. కానీ నిరోధ్ చేసిన అభియోగాలు ఇంకా చాలా ఉన్నాయి.

సంస్థ పెరిగేకొద్దీ, తానే దేవుడినన్న భ్రమలలోకి యోగానంద వెళ్లిపోయాడని నిరోధ్ వాదించాడు. అంతేగాక, మౌంట్ వాషింగ్టన్ మెయిన్ సెంటర్లో, తానుండే మూడవ అంతస్తులోని తన ప్రక్క రూములలో యువతులైన శిష్యురాళ్ళను ఉంచుకుని, రెండవ అంతస్తు, మొదటి అంతస్తులోని రూములను వయసుమళ్ళిన శిష్యురాళ్ళకు ఇతర శిష్యులకు ఇస్తాడని, రాత్రంతా ఆ అమ్మాయిలు ఆయన గదిలోకి వస్తూ పోతూ ఉంటారని,వారిని ఎవరితోనూ కలవనివ్వడని, బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తనతోనే వారిని ఉంచుకుంటాడని, ఇదంతా తనకు నచ్చలేదని, ఇదంతా హిందూ సాంప్రదాయానికి యోగసంప్రదాయానికి విరుద్ధమైన పోకడలని నిరోధ్ వాదించాడు. 

వారి ధ్యానపు గదులన్నీ చాలా డెకరేషన్ తో రిచ్ గా ఉంటాయని, ఇది యోగ సంప్రదాయానికి విరుద్ధమని, సాధనాకుటీరాలు అంత రిచ్ గా ఎందుకుండాలని ఆయన వాదించాడు. అంతేగాక, యోగానంద తన శిష్యురాళ్ళకు  పారదర్శకమైన గౌనులు తొడిగి, ఆ తరువాత వారిని నగ్నంగా చేసి ఒక గాజుతొట్టిలో స్నానం చేయిస్తాడని, ఆ తరువాత ఏవేవో రహస్యమైన తాంత్రిక దీక్షలుంటాయని ఇదంతా కూడా తనకు నచ్చలేదని ఆయన వాదించాడు.

ఇదంతా పిచ్చివాగుడని, డబ్బుకోసం ఇలా నిరోధ్ ఆరోపిస్తున్నాడని, అబద్దపు ఆరోపణలు చేస్తున్నాడని యోగానందవైపు లాయర్ వాదించాడు. కానీ చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఇదంతా తాను చూచానని, తన తండ్రి చెప్పినవి నిజాలేనని, పెద్దయిన తర్వాత, నిరోధ్ కుమారుడైన అనిల్ నిరోధ్ వ్రాశాడు.  అనిల్ నిరోధ్ పెద్దవాడైన తర్వాత కార్నెల్ యూనివర్సిటీలో గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా రిటైరయ్యాడు. అలా ఆరోపించడానికి ఈ అనిల్ నిరోధ్ అనే ఆయన పిచ్చివాడేమీ కాదు. ఇతనొక బాలమేధావి. అయిదేళ్ల వయసులో ఇతను అమెరికాలోని 12th గ్రేడ్ పాసయ్యాడు. 16 ఏళ్ల వయసుకే యూనివర్సిటీ ఆఫ్ చికాగో గ్రాడ్యుయేట్ అయ్యాడు. నిరోధ్ కుమారుడు గనుక అలాంటి మేధస్సు అనిల్ లో ఉండటం ఆశ్చర్యం లేదు.

అనిల్ నిరోధ్ ఒక డిస్కషన్ ఫోరమ్ లో చెప్పిన ఈ విషయాలన్నీ SRF కు మహాకోపం తెప్పించాయి. ఆ డిస్కషన్ ఫోరమ్ తర్వాత మూతపడింది. 'మనకెందుకులే ఈ గోల, యోగానంద బ్యాచ్ ను వాళ్ళిష్టం వచ్చినట్లు అబద్దాలు చెప్పుకొని చావనీ' అని అనిల్ అనుకోని ఉండవచ్చు.

యోగదా సంస్థ సభ్యులు పెళ్లి చేసుకోకూడదని, ఏమంటే వారి జీవితంలో దేవుడే ముఖ్యమైన గమ్యం కావాలి గాని, పెళ్లి పిల్లలు గమ్యాలు కాకూడదని, దేవుడి తర్వాత తనకే (యోగానందకే) అంత ప్రాముఖ్యతనివ్వాలి గాని ఇక ఏ విషయాన్నీ పట్టించుకోకూడదని యోగానంద చెప్పేవాడని నిరోధ్ ఆరోపించాడు. భర్తకంటే భార్యకంటే తననే ఎక్కువగా చూడాలని యోగానంద కోరేవాడని కూడా ఆయనన్నాడు. ఈ పోకడ నేటి బ్రహ్మ కుమారి, ఈషా యోగా వంటి అనేక కల్ట్ పోకడలను ప్రతిబింబిస్తోంది.

హిందూ యోగ సంప్రదాయాన్ని తన స్వార్ధపు ప్రయోజనాల కోసం యోగానంద వాడుకుంటున్నాడని, తనను తాను ఒక అవతారంగా ప్రోమోట్ చేసుకోడానికి హిందూయోగాన్ని వాడుతున్నాడని నిరోధ్ ఆరోపించాడు. భగవంతుడు తన ద్వారా మాత్రమే మాట్లాడతాడని, ఆయన్ను తన ద్వారా మాత్రమే, క్రియాయోగం ద్వారా మాత్రమే అందుకోగలుతారని ఆయన భావించేవాడని, అది నిజం కాదని నిరోధ్ అన్నాడు.

అంతేగాక, తనుగాక ఇంకా ఎందరో యోగదా సంస్థకు పనిచేస్తే, ఆ ఫలితమంతా యోగానంద ఒక్కడే పొందాలని చూస్తున్నాడని, డొనేషన్స్ ను తన సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నాడని కూడా ఆయన ఆరోపించాడు. యోగానంద బోధనలకు అసలైన యోగసాంప్రదాయానికి చాలా వ్యత్యాసం ఉందని, తనను తాను ప్రోమోట్ చేసుకోడానికి హిందూమత సిద్ధాంతాలను యోగానంద చాలా వక్రీకరించాడని తన జీవితాంతం వరకూ నిరోధ్ నమ్మేవాడు.

వీటిలో ఒకటి - బాబాజీ, జీసస్ ఇద్దరూ స్నేహితులని, జీసస్ కు బాబాజీ క్రియాయోగ దీక్ష నిచ్చాడని ప్రచారం చేయడం, అమెరికాలో నిలదొక్కుకోడానికి, క్రైస్తవ ఫాదర్ల దాడులనుంచి కాపాడుకోడానికి, హిందూ క్రైస్తవ బోధనలు ఒకటే అని ప్రచారం చేస్తూ, క్రియాయోగ పరమగురువులలో జీసస్ ను కూడా ఒకడిగా పెట్టడం - ఇదంతా ఆ వక్రీకరణలో భాగమని నిరోధ్ చాలామంది తన అనుయాయులతో అనేవాడు. 

ఈ కేసు గెలవడానికి, బ్రిఘం రోస్ అనే ఒక అతి ఖరీదైన క్రిమినల్ లాయర్ని యోగానంద పెట్టుకున్నాడు. నిరోధ్ దగ్గర అంత డబ్బు లేదు గనుక, ఆయనొక మామూలు లాయర్ని పెట్టుకున్నాడు.  ఈ వాదోపవాదాలన్నీ అప్పటి న్యూస్ పేపర్లకు పండగ అయ్యాయి. ప్రతిరోజూ ఈ వాదోపవాదాలు పేపర్లలో వచ్చేవి. అమెరికా జనం విరగబడి చదివేవారు. అయితే బ్రిఘం రోస్ కోర్టులో దాఖలు చేసిన ఒకేఒక్క కాగితంతో నిరోధ్ కేసు ఓడిపోయాడు.

అదేంటంటే, 3 మే 1929 న, న్యూయార్క్ సెంటర్ ను వదిలేసి మౌంట్ వాషింగ్టన్ కు రాబోయేముందు, నిరోద్ సంతకం చేసిన ఒక డిక్లరేషన్. అందులో, సంస్థనుండి గాని , సంస్థ పుస్తకాల సేల్స్ లో వాటాను గాని, ఎటువంటి ప్రతిఫలాన్నీ తను ఆశించను, ఆశించకుండా పనిచేస్తాను. కేవలం ఒక రూము ఇచ్చి, తిండి పెట్టడంతో తను సరిపెట్టుకుంటాను' అని వ్రాసి ఉంది. ఈ నోటరీ చెయ్యబడిన పేపర్ను యోగానంద లాయరు, కోర్టులో ప్రెజెంట్  చెయ్యగానే, జడ్జి 'ఇంగ్రామ్ బుల్' ఈ కేసును కొట్టేశాడు. ఏమంటే, అందులో నిరోధే స్పష్టంగా వ్రాశాడు, 'సంస్థనుండి నేనేమీ డబ్బు ఆశించను' అని. ఇప్పుడు వాటాకోసం అడగడం దానికి వ్యతిరేకం గనుక కేసు కొట్టివేయబడింది.

అంతకు ముందు ధీరానంద పెట్టిన కేసుతో కళ్ళు తెరుచుకున్న యోగానంద, ఆ తర్వాత చేరిన మేనేజిమెంట్ సభ్యులందరి దగ్గరా అలాంటి డిక్లరేషన్ సంతకం పెట్టించేవాడు. అయితే అది, సన్న అచ్చులో ఉండి, ఇప్పుడు మనం ఎన్నోచోట్ల చూచే 'స్టాట్యుటరీ వార్నింగ్' లాగా ఉండేది. చూచీ చూడకుండా అలాంటి ఎన్నో కాగితాలను తను సంతకం పెట్టానని, ఇలాంటి డిక్లరేషన్ మీద యోగానంద తన సంతకం తీసుకుంటాడని తాను ఊహించలేదని, అలా తెలిస్తే అసలీ కేసును తానెందుకు వేస్తానని నిరోధ్ వాపోయాడు. మొత్తం మీద, క్రిమినల్ లాయర్ బ్రిఘం రోస్ దెబ్బకు, నిరోధ్ కేసును ఓడిపోయాడు.

ధీరానంద గురించి తెలియాలంటే ఆయన వ్రాసిన Glimpses of Light మరియు Philosophic Insight అనే పుస్తకాలను చదవండి.

నిరోధ్ గురించి తెలియాలంటే ఆయన వ్రాసిన Twins of Heaven మరియు The Master In You అనే పుస్తకాలను చదవండి.

ఇవన్నీ Amrita Foundation, PO Box 190978, Dallas, Texas నుండి లభిస్తాయి.

తన యోగమార్గం, క్రియాయోగానికంటే భిన్నమైనదని నిరోధ్ ఎప్పుడూ చెప్పేవాడు. అయితే లాహిరీ మహాశయులను ఒక గొప్ప యోగిగా ఎంతో గౌరవించేవాడు. SRF లో ఉండగా తన మార్గాన్నే అమెరికన్స్ కు భోధించేవాడు. అది మా 'పంచవటి' విధానం లాగా, వేదాంత-యోగ సంప్రదాయాల సమ్మిళితంగా, క్రియాయోగానికి కొంత భిన్నంగా ఉండేది. యోగానంద నుండి విడిపోయాక 1940 నుండి 1950 వరకూ అమెరికా అంతా తిరుగుతూ తన మార్గాన్ని ప్రచారం చేశాడు నిరోధ్. తరువాత చికాగో లోని హైడ్ పార్క్ దగ్గర ఒక ఇల్లు కొనుక్కుని అక్కడ సెటిలయ్యాడు. వేలాదిమంది అమెరికన్స్ ఈయనను గురువుగా నేటికీ భావిస్తారు. 1983 లో 95 ఏళ్ల వయసులో చనిపోయేవరకూ ఆరోగ్యంగానే ఉన్నాడు. ఈయన అమెరికన్ శిష్యులు చాలామంది ఇప్పటికీ మిడ్ వెస్ట్ లో యోగాను బోధిస్తున్నారు.

యోగాచార్య శ్రీ నిరోధ్ స్థాయి ఏమిటో తెలుసుకోవాలంటే డోనాల్డ్ కేసలానో హెవిట్ వ్రాసిన  American Yogi-Christ Sri Nerode: Restoring His Long-Lost Teachings of East-West Magazine అనే పుస్తకాన్ని అమెజాన్ నుంచి ఇక్కడ కొని చదవండి అర్ధమౌతుంది.

read more " పరమహంస యోగానంద గారి జాతకం - Part 6 (Nirad Ranjan Chowdhury) "

ఆ రొచ్చు నాకొద్దు

యధావిధిగా మా ఫ్రెండ్ ఉదయాన్నే ఫోన్ చేశాడు.

నేను రిటైరయ్యాను. తనింకా సర్వీస్ లో ఉన్నాడు. ఇంకో నాలుగు నెలలలో తనూ రిటైర్ అవుతాడు.

ఆమాటా ఈ మాటా మాట్లాడాక, 'ఫలానా వాడి గురించి తెలిసిందా?' అని అడిగాడు.

ఈ ఫలానా అనే అతను కూడా నాతోబాటే రిటైరయ్యాడు.

నేను రైల్వే వదిలేసి ఏడాది దాటింది. సర్వీసులో ఉన్నప్పుడే ఆ రొచ్చు రాజకీయాలకు నేను దూరంగా ఉండేవాడిని. ఇక ఇప్పుడెందుకు? రైల్వే పక్షులతో నాకేంటి పని? పట్టించుకోవడం మానేశాను.

'ఏం పోయాడా?' అన్నాను.

'ఛీ అదేం కాదు. రిటైరయ్యాక, ఒక తెలిసినాయని పట్టుకుని ప్రెవేట్ ఉద్యోగంలో చేరాడు. హైద్రాబాద్ లో ఫ్రీ క్వార్ట్రర్స్. ఫ్రీ కారు. నెలకు లక్ష జీతం' అన్నాడు.

'మంచిదే' అన్నాను.

'నువ్వూ ట్రై చెయ్యచ్చుగా' అన్నాడు.

'నాకంత  పరిగెత్తాలని లేదు. నన్నిలా బ్రతకనీ' అన్నాను.

'అలాకాదు. ఊరకే కూచునే బదులు కాసేపు ఆఫీసుకి పోయి వస్తే లక్ష వస్తుంది కదా? ఎందుకు పోగొట్టుకోవడం?' అన్నాడు.

తను చెప్పేది వాస్తవమే. అలా చేస్తున్న వాళ్ళు మా కొలీగ్స్ లో చాలామంది ఉన్నారు.

'జీవితంలో అతని గోల్స్ వేరు. నా గోల్ వేరు. నేనేమీ ఊరకే కూచుని లేను. చేయవలసిన  సాధన ఎంతో ఉంది. జీవితమనేది ఒక్క డబ్బు కోసమే కాదు. చచ్చేదాకా డబ్బుకోసం నేను బ్రతకలేను. ఆ వెట్టిచాకిరీ నాకొద్దు. నీకు ఆశ ఉంటే నాలుగు నెలల తర్వాత నువ్వు ట్రై చెయ్యి' అన్నాను.

'ఊరకే చెప్పాను. నాకూ అంత అవసరం ఏమీ లేదులే' అన్నాడు.

'మంచిది. ఎవరి జీవితం వారిది. ఎవరి గోల్స్ వారివి. అందరూ  ఒకేలాగా ఎలా ఉంటారు? డబ్బుకు మితం ఎక్కడుంది? ఎక్కడో ఒకచోట 'ఇకచాలు' అంటూ నువ్వు గీత  గీసుకోక తప్పదు. లేకపోతే, ఆ పరుగులో ఏదో ఒకరోజున ఆఫీస్ టేబుల్ ముందే హార్ట్ ఎటాక్ తో పోవలసి వస్తుంది. అలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాం కదా మన సర్వీసులో. అలాంటి జీవితం నాకొద్దు. ఎందుకా బ్రతుకు?' అన్నాను.

'సర్లే నీ భావాలు అందరికీ నచ్చవు' అన్నాడు ఫ్రెండ్.

'నచ్చాలని నేనేమీ చెప్పడం లేదు. అలా ఆశించడమూ లేదు. కాస్త కళ్ళు తెరిచి జీవితాన్ని విశాలంగా చూడమని మాత్రమే అంటున్నాను. బావిలో కప్పలాగా చివరిక్షణం వరకూ డబ్బు, సుఖాలు అంటూ బ్రతకవద్దని మాత్రమే అంటున్నాను. అంతే' అన్నాను.

'ఉంటామరి' అని ఫోన్ పెట్టేశాడు ఫ్రెండ్.

నవ్వుకుంటూ నా పనిలో పడ్డాను.

read more " ఆ రొచ్చు నాకొద్దు "

13, ఆగస్టు 2023, ఆదివారం

పరమహంస యోగానంద గారి జాతకం - Part 5 (స్వామి ధీరానంద కధ)

స్వామి ధీరానంద అసలు పేరు బసు కుమార్ బాగ్చి. ఈయన కూడా బెంగాలీ వాడే. ఈయన 1895 లో జనవరి 7 న  బెంగాల్ లోని శాంతిపూర్ లో పుట్టాడు. ఈయన జాతకాన్ని ఇక్కడ చూడండి.

జననసమయం తెలియదు. జననకాల సంస్కరణ చేసి రాబట్టవచ్చు. కానీ అంత అవసరం లేదు. జీవిత సంఘటనలను బట్టి స్థూలంగా చూస్తే, ఉదయం 7. 30 నుండి 9. 30 లోపు పుట్టినట్లు తెలుస్తోంది. కనుక చంద్రుడు మేషంలో ఉన్నాడు. కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో ఈయన జన్మించాడు. ఇదెలా చెయ్యాలి అన్నది మాత్రం అడక్కండి. చెప్పను.

సప్తమాధిపతిగా శుక్రుడు దశమంలో ఉంటూ దూరదేశంలో వృత్తిని సూచిస్తున్నాడు. దశమాధిపతి శని ఉచ్ఛస్థితిలో సప్తమంలో ఉండటం కూడా దీనినే సూచిస్తున్నది. లాభాధిపతి, బాధకుడూ కూడా అయిన శని సప్తమంలో ఉచ్చస్థితిలో ఉండి, దూరదేశంలో ఉన్నతస్థానంలో ఉన్న స్నేహితుడిని కూడా సూచిస్తున్నాడు. అతనితో శత్రుత్వం వస్తుందని కూడా సూచిస్తున్నాడు. నవమ ద్వాదశాధిపతిగా విదేశనివాసాన్ని సూచిస్తున్న గురువు అమెరికాను సూచించే మిధునంలో ఉన్నాడు. కానీ వక్ర స్థితిలో ఉండటం వల్ల, ఏ పనిమీద అక్కడకు వెళ్ళాడో దానిని వదిలేసి వెనక్కు వస్తాడన్న సూచన ఉన్నది. ఉన్నత విద్యను సూచిస్తున్న సూర్యుడు నవమంలో బుద్ధికారకుడైన బుధునితో కలసి ఉంటూ, ఆధ్యాత్మిక విద్యకు కారకుడైన గురువుతో చూడబడుతూ ఫిలాసఫీలో ఉన్నతవిద్యను సూచిస్తున్నాడు. అయితే, గురువు వక్రత్వం వల్ల దానిని వదిలేసి వేరే లైన్ లో ముందుకు వెళతాడని కూడా సూచన ఉన్నది. ఇవన్నీ ఈయన జీవితంలో జరిగాయి. 

1911 లో శాంతిపూర్ మునిసిపల్ హై స్కూల్లో మెట్రిక్ పాసై, 1916 లో కలకత్తా స్కాటిష్ చర్చ్ కాలేజీలో MA ఫిలాసఫీ పూర్తి చేశాడు. యోగానందా ఈయనా కాలేజీ లో స్నేహితులు. ఇద్దరూ కలసి ధ్యానం చేసేవారు. మహాత్ములను దర్శించేవారు. ఫిలాసఫీ చర్చించుకునేవారు. మంచి వేదాంతిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా, సేవా తత్పరునిగా ఈయనకు పేరుంది.

బసుకుమార్ కుటుంబం అంతా భాదురీ మహాశయ (నాగేంద్రనాధ్ భాదురీ) శిష్యులు. ఈయన ధ్యానంలో కూర్చుని గాలిలోకి లేచేవాడని తన పుస్తకంలో యోగానంద వ్రాశారు. కానీ యోగానంద పరిచయం అయ్యాక భాదురీ మహాశయ దగ్గరకు పోవడం ధీరానంద తగ్గించాడు. యోగానంద సలహా మేరకు శాస్త్రిమహాశయ (స్వామి కేవలానంద) దగ్గర క్రియాయోగ దీక్ష స్వీకరించాడు బసుకుమార్.

యోగానంద కాలేజీ రోజులలో భాదురీ మహాశయను తరచుగా దర్శించేవాడు. అమెరికా వెళ్లి యోగప్రచారం చెయ్యమని యోగానందకు అప్పట్లో చెప్పినది భాదురీ మహాశయులే. ఈయన హఠయోగంలో మంచి నేర్పరి. ప్రాణాయామసిద్ధుడు. ఈయన భస్త్రికా ప్రాణాయామము చేసేటప్పుడు ఆ గదిలో ఒక తుఫాన్ వచ్చినట్లు ఉండేది. వాయుకుంభకం చేసి అమాంతం గాలిలోకి లేచే శక్తి ఈయనకు ఉండేది.

యోగానంద స్థాపించిన రాంచి బ్రహ్మచర్య విద్యాలయలో అధ్యక్షుడుగా బసుకుమార్ ఉండేవాడు. 1917 లో ఈయనకు సన్యాసం ఇచ్చి స్వామి ధీరానంద అని పేరు పెట్టాడు యోగానంద. ఆ సమయంలో జననకాల చంద్రునిపైన గోచార గురువు సంచరించాడు. ఇది యోగకారక కాలం. అయితే అర్ధాష్టమ శని జరిగింది. కనుక ఒక రకంగా యోగమూ, ఒక రకంగా అవయోగమూ అయిన సన్యాసాన్ని యోగానంద ద్వారా స్వీకరించాడు.

ఆ సమయంలో స్వామి సత్యానంద కూడా వీరితోనే ఉండేవాడు. ఆ విధంగా కొన్నేళ్లపాటు రాంచీ విద్యాలయాన్ని సమర్ధవంతంగా నడిపాడు ధీరానంద. తనకు తోడుగా ఉంటాడని ధీరానందను అమెరికా తీసికెళ్ళాడు యోగానంద. అప్పుడు రాంచీ బ్రహ్మచర్య విద్యాలయను స్వామి సత్యానంద చూచుకునేవాడు.

ధీరానందకు యోగానంద అంత చనువివ్వడం, జ్యోతిష్యశాస్త్రంలో మంచి పండితుడైన స్వామి యుక్తేశ్వర్ గిరిగారికి నచ్చేది కాదు. ధీరానందతో స్నేహం తగ్గించమని ఆయన యోగానందకు సలహా ఇచ్చాడు. కానీ యోగానంద వినలేదు. ధీరానందను అమెరికా తీసికెళ్ళడం కూడా యుక్తేశ్వర్ గిరిగారికి ఇష్టం లేదు. 'ఈ ప్రయాణం మంచికి కాదు. భవిష్యత్తు బాగుండదు' అని యుక్తేశ్వర్ గిరిగారు హెచ్చరించారు కూడా. అయినా, ఆయనమాటను యోగానంద వినలేదు.

ధీరానంద, సత్యానందలలో ఒకరిని అమెరికాకు రమ్మని, అక్కడ ఉంటూ పనిలో తనకు సాయం చెయ్యాలని యోగానంద కోరాడు. 'నేను అమెరికాకు రాన'ని సత్యానంద తిరస్కరించాడు. కనీసం ధీరానందనైనా పంపమని యోగానంద మళ్ళీ ఉత్తరం వ్రాశాడు. 1922 లో ధీరానంద అమెరికాకు వెళ్ళాడు. ఆ సమయంలో శని గురువులు కన్యా రాశిలో రాహువుతో కలసి ఉన్నారు. గురువు నవమ ద్వాదశాధిపతి. శని దశమ లాభాధిపతి. రాహువు పూర్వకర్మకారకుడు. ముగ్గురూ పన్నెండో రాశిని చూస్తున్నారు. కనుక స్నేహితుని ద్వారా, మతసంబంధమైన పనిమీద విదేశీయానం కలిగింది. అయితే అది షష్ఠమ భావం నుంచి గనుక గతకర్మ సంబంధమైన ఫలితంగా అమెరికాకు వెళ్ళాడు.

అమెరికా వెళ్ళాక మొదట్లో అంతా బాగానే ఉంది. బోస్టన్ లో ఉంటూ యోగప్రచారం చేశారు ఇద్దరూ. తమ సంస్థకు 'యోగదా సత్సంగ సభ' అని పేరు పెట్టమని యుక్తేశ్వర్ గిరిగారు చెప్పారు. కానీ వీళ్ళిద్దరూ ఆయన మాటను వినకుండా  'యోగదా శిక్షణా ప్రణాళి' అనే  పేరును ఆ సంస్థకు పెట్టారు. ఆ తర్వాత దానిని 'సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్' గా మార్చారు. యుక్తేశ్వర్ గారు బాధపడినా, మౌనంగా ఉండిపోయారు.

1925 లో లాస్ ఏంజెల్స్ లోని మౌంట్ వాషింగ్ టన్ పైన ఉన్న ఒక పెద్ద హోటల్ ను కొనేసి, దానిని తమ సంస్థ ప్రధాన కార్యాలయంగా మార్చాడు యోగానంద. దానిని చూసుకోడానికి రమ్మని ధీరానందను కోరాడు. కానీ, అప్పటికే బోస్టన్ లో ధీరానంద మంచి పేరును సంపాదించాడు. ఫిలాసఫీకి తోడు ఆయన గణితశాస్త్రాన్ని కూడా భోధించేవాడు. అయినా సరే, యోగానంద కోరిక మేరకు బోస్టన్ ను వదిలేసి లాస్ ఏంజెల్స్ కు చేరుకున్నాడు. 1925 లో ధీరానంద గురించి పొగుడుతూ చాలా గొప్పగా వ్రాశాడు యోగానంద.

దాదాపు నాలుగేళ్లు అక్కడ రెసిడెంట్ స్వామిగా ఉండి ఎంతో సేవ చేసి, ఎంతో పేరు సంపాదించుకున్న ధీరానంద 1929 లో స్వామి యోగానందతో విభేదించి విడిపోయాడు.

అది గ్రేట్ డిప్రెషన్ సమయం. డబ్బుల్లేక కటకటగా ఉంది. ఆశ్రమం నడవడమే గగనంగా ఉంది. ఆ సమయంలో సంస్థనుండి ధీరానంద విడిపోయాడు. కారణం ఏమిటో ఎవరికీ తెలీదు. డబ్బు  ఒక కారణం కావచ్చు. పైగా, యోగదా సంస్థలోని రాజకీయాలు, అమ్మాయిల గొడవలు ధీరానందకు నచ్చలేదని కొందరంటారు.  అసలు కారణం తెలీదుగాని, యోగదా సంస్థతో విడిపోదామని ధీరానంద నిశ్చయించుకున్నాడు. విడిపోయాడు. ఎందుకు అనేది మాత్రం ఎవరికీ చెప్పలేదు.

మనసులో కోరికలు మిగిలి ఉన్నపుడు క్రియాయోగమే కాదు, ఏ యోగమూ మనిషిని రక్షించదు. అది యోగానంద కావచ్చు. ధీరానంద కావచ్చు. ఎవరైనా కావచ్చు.  ఇది వాస్తవం.

ఈ మాటను నేను ఉబుసుపోక చెప్పడం లేదు. 1982 నుంచే క్రియాయోగం నాకు తెలుసు. దాని లోతుపాతులూ తెలుసు. దాని అభ్యాసులు ఎంతోమంది నా స్నేహితులున్నారు. వాళ్ళను దగ్గరగా చూసి ఈ మాటను చెబుతున్నాను. క్రియాయోగా వల్ల ఎన్ని  కుటుంబాలు ఎలా విచ్చిన్నమయ్యాయో వచ్చే పోస్ట్ లలో వ్రాస్తాను.  

ఆ సమయంలో గురువు జననకాల చంద్రుని పైన సంచరించాడు. కనుక అంతా ఆశాజనకంగా కనిపించింది. SRF తనకు అవసరం లేదనుకున్నాడు. సొంతగా బ్రతకగలనని అనిపించింది. శని నవమస్థానంలో సంచరించాడు. బాధకునిగా లాభస్థానాన్ని చూశాడు. కనుక స్నేహితుడైన యోగానందతో విడిపోయాడు.

ఎవరెన్ని చెప్పినా, ఈ ప్రపంచాన్ని నడుపుతున్న శక్తి డబ్బు అనేది వాస్తవం. 'మనుషుల మధ్యన సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే' అని కారల్ మార్క్స్ వ్రాసినది చాలావరకు సత్యమే. అన్నదమ్ముల మధ్యన, స్నేహితుల మధ్యన, సంస్థల మధ్యన, చివరకు భార్యాభర్తల మధ్యన కూడా గొడవలు రావడానికి ప్రధానకారణం డబ్బే అయి ఉంటుంది. ఇది వాస్తవం. అన్నీ వదిలేసి సన్యాసి అయినవాడు కూడా డబ్బును వదలలేడు. ఏమంటే, డబ్బు లేనిదే పూట గడవదు. ఆశ్రమాలు నడవాలన్నా డబ్బు ఉండాలి. ఆశ్రమాలలో వచ్చే గొడవలన్నీ డబ్బు కోసం అధికారం కోసమే వస్తాయి. లేదా అమ్మాయిల గొడవలతో వస్తాయి. ఈ విషయాన్ని, గత ఏభై ఏళ్లుగా నాకు పరిచయం ఉన్న అనేక ఆశ్రమాలలో, సంస్థలలో గమనించాను.

ధీరానంద వెళ్ళిపోయినపుడు యోగానంద చాలా డిప్రెషన్ కు గురయ్యాడు. ఎంతో  బాధపడ్డాడు. దాదాపు 14 ఏళ్ల అనుబంధం వీరిది. ఇండియాలో కాలేజీ రోజులనుంచి వీళ్ళు స్నేహితులు. కలిసి ఒకే మార్గంలో నడుద్దామని అనుకున్నారు. అమెరికా వెళ్లారు. కలిసి మతప్రచారం చేశారు. ఉన్నట్టుండి ధీరానంద అలా చేసేసరికి తట్టుకోలేక యోగానంద మెక్సికో పర్యటనకు వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత మూడేళ్ళ వరకూ యోగానంద ఈ షాక్ నుంచి తేరుకోలేదు. 1932 లో జేమ్స్ జె లిన్ పరిచయం అయ్యేవరకూ ఈ బాధలోనే ఆయన ఉన్నాడు. ఆయనిలా అనేవాడు, 'ధీరానందకు నేనెంతో చేశాను. ఎంతో అతని నుంచి ఆశించాను. కానీ చివరకు ఆశాభంగాన్నే నాకు మిగిల్చాడు'.  

అసలలా ఆశించడమే తప్పని నేనంటాను. ఆశ ఉంది కాబట్టి ఆశాభంగం కలిగింది. ఆశే లేకపోతే ఆశాభంగం ఎలా కలుగుతుంది?

ఇద్దరూ కలసి అమెరికాలో క్రియాయోగాను బాగా ప్రచారం చేసి ఎన్నో ఆశ్రమాలను పెట్టాలని యోగానంద భావించాడు. తన టాలెంట్ ను యోగానంద ఫ్రీగా వాడుకుని, తన సొంత ఇమేజిని మాత్రం పెంచుకుంటున్నాడని, చివరకు తనకేమీ మిగలడం లేదని, సమాన టాలెంట్ ఉన్నప్పటికీ చివరకు తనొక సేవకునిగా మిగిలిపోతున్నానని ధీరానంద భావించాడు. ఎవరి గోల వారిది !

నిజానికి యోగానందకు శాస్త్రాలలో అంత పాండిత్యం లేదు. ధీరానంద అలా కాదు. అతను ఫిలాసఫీలో MA చేశాడు. మంచి  పండితుడు, వక్త కూడా. కనుక అతని పాండిత్యాన్ని తమ సంస్థ కోసం ఉపయోగిద్దామని యోగానంద అనుకున్నాడు. కానీ ధీరానంద ఆలోచనలు వేరేగా ఉన్నాయి. ఆయనెందుకు హర్ట్ అయ్యాడో, అసలు గొడవ ఎక్కడ వచ్చిందో, బయటకు ఎవరికీ చెప్పలేదు. తనలోనే ఉంచుకున్నాడు. అంతవరకూ అతను ఉత్తముడే అనిపిస్తుంది. 

యోగానంద వ్రాసినట్టుగా నేడు లభిస్తున్న పుస్తకాలన్నీ నిజానికి ధీరానంద వ్రాసినవే అని, యోగానందకు అంత పాండిత్యం లేదని చాలామంది భావిస్తారు. ఒకరకంగా  చెప్పాలంటే, ధీరానంద అనే వ్యక్తి యోగానందకు ఘోస్ట్ రైటర్ అని అనుకోవచ్చు.

అలా యోగానంద నుండి విడిపోయిన ధీరానంద లాస్ ఏంజిల్స్ లో తనదైన వేరే యోగసంస్థను స్థాపించాడు. ఈ చర్య, అమెరికన్ భక్తులలో పెద్ద గందరగోళం అయోమయాలను రేపింది. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్? అసలైన సంస్థ ఈ రెంటిలో ఏది? అని అమెరికన్లు సందేహించడం మొదలైంది. కానీ ధీరానంద సంస్థ అభివృద్ధి చెందలేదు.  ఎందుకంటే, యోగానందకున్న జనసమ్మోహకశక్తి ధీరానందకు లేదు. యోగానందకు మాస్ హిప్నాటిజం వచ్చు. ఎదుటిమనిషిని తన ఆరాతో ఆకట్టుకునే శక్తి ఆయనకుండేది. అది ధీరానందకు లేదు. ఈయన మంచి పండితుడు, శాస్త్రాలు తెలిసినవాడు, సాంప్రదాయ వాది. అంతేగాని జనాన్ని ఆకర్షించే శక్తి యోగానందకున్నంతగా ఈయనకు లేదు. క్రమేణా ధీరానంద సంస్ధనెవరూ  పట్టించుకోలేదు. 1933 వరకూ దానిని  ఏదో విధంగా నడిపాడు ధీరానంద. తరువాత అది మూత పడింది.

ఆ సమయంలో గోచార గురువు జననకాల చంద్రుని నుండి దశమంలోకి వచ్చాడు. బాధకుడు గనుక, సంస్థ మూతపడేలా చేశాడు. అయితే వేరే రకంగా స్థిరత్వాన్నిచ్చాడు.

ఈ సంఘటన జరిగిన కొద్ది కాలానికి ఉన్నట్టుండి ధీరానందకు జబ్బు చేసి ఆస్పత్రిలో చేరాడు. మూణ్నెల్లు ఆస్పత్రిలో ఉన్నాడు. ఉంటాడో పోతాడో అన్నంతగా అనారోగ్యం తలెత్తింది. ఆ సమయంలో ఒక అమెరికన్ నర్సు ఈయనకు చాలా శ్రద్ధగా సేవలు చేసింది. ఆమెతో ప్రేమలో పడ్డాడు. అంతటితో సన్యాసానికి తిలోదకాలిచ్చాడు. 1934 లో ఆమెను పెళ్లిచేసుకున్నాడు. 

ఆ తరువాత, 1935 లో అయోవా యూనివర్సిటీ నుండి బయో ఫిజిక్స్ లో Ph.D చేసి మిషిగన్ రాష్ట్రానికి మకాం మార్చాడు. మిషిగన్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో EEG డిపార్ట్ మెంట్ కు చీఫ్ అయ్యాడు. బ్రెయిన్ వేవ్స్ మీద ఈయన రీసెర్చి సాగింది. దశమ శని, సన్యాసవృత్తిని వదిలించి, వృత్తిపరంగా మంచి సక్సెస్ ను ఇచ్చాడు. ఈయన జాతకచక్రములో శని ఉచ్ఛస్థితిలో ఉండటాన్ని గమనించండి. ఇలాంటి జాతకులు వృత్తిలో చాలా ఉన్నత స్థాయిని అందుకుంటారు. ఎన్నో జాతకాలలో ఇది రుజువైంది.

1942 లో మిషిగన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా రిటైరయ్యాడు. యాన్ అర్బర్ అనే ప్రదేశంలో ఈయన నివాసం ఉండేవాడు. డెట్రాయిట్ లో ఉన్నపుడు ఈ చోటకు నేను  చాలాసార్లు వెళ్లాను. ఏమంటే, ఆ ప్రాంతంలో నా శిష్యులు కొంతమంది ఉన్నారు.

ఆ తరువాత రీసెర్చి పనిమీద 1957 లో ఇండియాకు వచ్చాడు. తిరిగి అమెరికాకు వెళ్లి 1977 లో యాన్ అర్బర్ లో చనిపోయాడు. ఆ సమయంలో గోచార గురువు ఆయుష్య స్థానంలో సంచరించాడు. అర్ధాష్టమ శని మొదలైంది. రాశిచక్రంలో కాలసర్పయోగం నడుస్తోంది. కనుక అంత్యకాలం సమీపించింది. జీవితం ముగిసింది. అప్పటికి ఆయనకు 82 ఏళ్లు.

యోగానంద నుంచి విడిపోయినప్పటికీ, యోగసాధనను మాత్రం మానుకోలేదు. యోగానందను తన గురువుగా ఈయనెన్నడూ భావించలేదు. అదే విధంగా బోధనను కూడా మానుకోలేదు. ఈయన శిష్యులు చాలామంది అమెరికాలో ఉన్నారు.

అసలేం జరిగిందంటే,  1929 లో న్యూయార్క్ సిటీలో యోగానందను కలసి, సంస్థలో తన వాటా తనకు ఇవ్వమని కోరాడు ధీరానంద. 1920 నుండి 1929 వరకూ సంస్థకు తాను అందించిన సేవలకు గాను తన వాటాగా తనకు రావలసిన డబ్బుని ఇవ్వమని అడిగాడు. అనేక చర్చలు సంప్రదింపులు అయిన మీదట 8000 డాలర్లు ఈయనకు తాను బాకీ ఉన్నట్లుగా ప్రామిసరీ నోటును వ్రాసిచ్చారు యోగానందగారు.

ఈ ప్రామిసరీ నోటును పెట్టి, 1935 లో ఈయన యోగానంద గారి మీద కోర్టులో కేసు వేశాడు. తామిద్దరూ యోగదా సంస్థలో భాగస్వాములమని తన వాటాగా ఆ డబ్బు తనకు రావాలని వాదించాడు.

అప్పట్లో ఒక డాలర్ 24 రూపాయలుండేది. 8000 డాలర్లు అంటే రెండు లక్షల రూపాయలతో సమానం. 1929 లో రెండు లక్షలంటే ఇప్పుడెంతో అర్ధం చేసుకోవచ్చు.

ఈ కేసులో ధీరానంద గెలిచాడు. యోగానంద గారు ఓడిపోయాడు. ఏమంటే ప్రామిసరీ నోటు క్లియర్ గా ఉంది. అయితే, తమకు చెప్పకుండా దాదాపు ఇరవై వేల డాలర్లను ధీరానంద వాడుకున్నాడని,  కనుక అతనే తమకు డబ్బు బాకీ ఉన్నాడనీ యోగానంద గారి లాయర్ వాదించాడు. కానీ, దానికి రుజువులు లేవు. సంస్థ లెక్కలప్రకారం 1924 నుండి 1929 వరకూ, ఒక రూమ్ ఇచ్చి, తిండి పెట్టడం తప్ప, ధీరానందకు సంస్థ ఇచ్చినది ఏమీ లేదు. కనుక ధీరానంద కేసు వెయ్యడం కరెక్టే అని జడ్జి భావించాడు. ధీరానండకు అనుకూలంగా తీర్పు చెప్పాడు.

తీర్పు వచ్చేనాటికి యోగానందగారు  అమెరికాలో లేరు. యోగానంద ఏకౌంట్లో 22 డాలర్లు మాత్రమే ఉన్నాయని, పరిహారం చెల్లించలేమని  బ్యాంక్, కోర్టుకు చెప్పింది. యోగానంద అమెరికా సిటిజెన్ కాదు. బ్రిటిష్ వీసా మీద ఆయన అమెరికాలో ఉన్నాడు. ఆ సమయానికి ఇండియా వెళ్లిపోయాడు. కారణం? తనకు కాలం సమీపించిందని యుక్తేశ్వర్ గారికి తెలిసింది. వెంటనే ఇండియా రమ్మని యోగానందకు సమాచారం పంపాడు. అందుకని యోగానంద ఇండియాకు వెళ్ళిపోయాడు.

అప్పటికి ధీరానంద, స్వామిగా లేడు.  యోగదా సంస్థ అంటే విరక్తి పుట్టింది. సన్యాసాన్ని వదిలేశాడు. ఆస్పత్రిలో తనకు సేవలు చేసిన నర్సుని పెళ్లి చేసుకున్నాడు. డిసెంబర్ 1935 లో యోగానంద ఇండియా వచ్చారు. తిరిగి 1936 వరకూ ఏడాది పాటు ఆయన ఇండియాలోనే ఉన్నారు. ఆ సమయంలోనే  అమెరికాలో తీర్పు వెలువడింది. ఇండియాలో ఏడాది పాటు ఉండి, తిరిగి అమెరికా వెళ్లేసరికి ధీరానంద తన Ph.D పూర్తి చేసుకుని, హార్వర్డ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ రీసెర్చర్ గా ఉన్నాడు. కేసు మళ్లీ మొదలైంది. ఎట్టకేలకు 4,200 డాలర్లు చెల్లించే ఒప్పందం కుదిరింది. జేమ్స్ జే లిన్  అండతో యోగానందగారు ఆ డబ్బును చెల్లించారు. అది లాయర్ ఖర్చులకే చాలలేదు. చివరకు ధీరానందకు ఏమీ పరిహారం అందలేదు.  యోగానందతో విడిపోవడం మాత్రం జరిగింది.

ఈ విధంగా, ఆధ్యాత్మిక వ్యాపారం అనేది ఇద్దరు ప్రాణ స్నేహితులని విడదీసింది. ఒక ఆధ్యాత్మిక సంస్థకు చెడ్డ పేరును తెచ్చింది 

చాలా చిన్నవయసు నుండీ ఆధ్యాత్మిక చింతనలో పెరిగి, యోగానందకు స్నేహితునిగా ఉండి, అమెరికా వెళ్లి యోగప్రచారం చేసి, చివరకు యోగానందతో గొడవపడి, సన్యాసాన్ని వదిలేసి, అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకుని, మళ్ళీ యూనివర్సిటీలో చేరి చదివి, PhD సంపాదించి, చివరకు మిషిగన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా రిటైరయ్యాడు ధీరానంద అనబడే బసు కుమార్ బాగ్చి. బ్రెయిన్ వేవ్ రీసెర్చిలో ఈయన పయనీర్ గా ఉన్నాడు. తన రీసెర్చి మీద దాదాపుగా నూరు పేపర్స్ ప్రెజెంట్ చేశాడు.

యోగానంద గారు 1952 లో పోయారు. తరువాత 25 ఏళ్లు బ్రతికాడు ధీరానంద. 28 ఆగస్టు 1977 న యాన్ ఆర్బర్ లో చనిపోయాడు.

తనను తాను జీసస్ గా భావించుకుంటూ, 'నా జీవితంలో ఇద్దరు జుడాస్ ఇస్కరియేట్ లున్నారు' అనేవాడు యోగానంద గారు. జుడాస్ అనే శిష్యుడే జీసస్ ను రోమన్ సైనికులకు పట్టిస్తాడు. అందుకని నమ్మకద్రోహం చేసినవారిని జుడాస్ అనడం  లోకంలో పరిపాటి అయ్యింది.

తన జీవితంలో, అటువంటివారిలో ఒకడు ధీరానంద. రెండవవాడు నిరోధ్ అని యోగానంద అంటాడు. ధీరానంద, నిరోద్ ల గురించి బాగా తెలిసిన వాళ్ళు అది అబద్దమని, వాళ్ళు దుర్మార్గులు కాదని, యోగానందలో చాలా లోపాలున్నాయని  'ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఏ  యోగి' పుస్తకం మాయలో అవన్నీ నేడు మరుగున పడిపోయాయని, అది ప్రచారం మాయ అని అంటారు. 

నిరోధ్  కథ వచ్చే పోస్ట్ లో చూద్దాం.

read more " పరమహంస యోగానంద గారి జాతకం - Part 5 (స్వామి ధీరానంద కధ) "

10, ఆగస్టు 2023, గురువారం

పరమహంస యోగానంద గారి జాతకం - Part 4 (కర్మను జయించడం అసాధ్యం)

జ్యోతిష్యశాస్త్రం ఆషామాషీది కాదు. అది దైవజ్ఞానం. దైవమంటే విధియే. విధిని గ్రహింపజేసేది గనుక ఈ శాస్త్రం దైవశాస్త్రమైంది. జాతకచక్రం అనేది కూడా అద్భుతమైనదే. గతజన్మల కర్మఫలాన్నంతా అది ఒకచోట చూపిస్తుంది. చూచే జ్ఞానదృష్టి జ్యోతిష్కునికి ఉండాలి. క్రైస్తవం, ఇస్లాం మొదలైన అజ్ఞానపూరిత మతాలు అనేటట్లు ఇది డెవిల్ వర్షిప్ కానే కాదు. వాళ్లకు సరియైన అవగాహన లేక అలా అనుకుంటారు. ఒక్క హిందూమతం మాత్రమే జ్యోతిష్యశాస్త్రాన్ని సరిగ్గా అర్ధం చేసుకోగలిగింది. అంతేకాదు. దానిలో అద్భుతమైన రీసెర్చి జరిగింది కూడా మనదేశంలోనే.

యోగసాధనకూ జ్యోతిష్యశాస్త్రానికీ సూక్ష్మమైన సంబంధాలు ఉంటాయి. అవి అర్ధం కావాలంటే, జ్యోతిష్యశాస్త్రంలో మంచి ప్రజ్ఞతో బాటు యోగమార్గంలో మంచి సాధనాబలం ఉండాలి. లేకపోతే ఆ రహస్యాలు అర్ధం కావు.

లౌకిక కోరికలు తీరడానికి జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కడ చూచినా వాడుతుంటారు. కానీ, దీని అసలు ప్రయోజనం ఆధ్యాత్మిక రంగంలో ఉంటుంది.

ఒకరి జాతకాన్ని చూచి, ఆ వ్యక్తి ఆధ్యాత్మిక సాధనకు పనికి వస్తాడా, లేదా, ఒకవేళ పనికివస్తే, అతనికి ఏ సాధన సరిపోతుంది? ఏవి సరిపోవు? ఏయే కాలసమయాలలో అతనికి సాధన సిద్ధిస్తుంది? వంటి సూక్ష్మవిషయాలను గ్రహించవచ్చు. ప్రాచీన గురువులు ఇలా చేసేవారు. శ్రీ యుక్తేశ్వర్ గిరిగారికి ఈ ప్రజ్ఞ ఉండేది. నేటి గురువులలో ఎవరికీ ఈ శక్తి లేదు. సోకాల్డ్ తాంత్రిక గురువులతో సహా, శిష్యుని జాతకాన్ని పరిశీలించి అతని ఇష్టదేవతను నిర్ణయించడం, ఏ మంత్రం, ఏ సాధన అతనికి సరిపోతుంది అన్న విషయాన్ని నిర్ణయించడం, సాధనా క్రమంలో వచ్చే ఆటంకాలను ఎలా తొలగించాలి? దానికి ఏయే విధానాలను ఉపయోగించాలి? మొదలైన విషయాలను ఎవరూ పాటించడం లేదు. ఏమంటే, అంతటి ప్రజ్ఞా, శక్తీ నేటి బిజినెస్ గురువులలో ఎవరికీ లేవు. అంతటి శుద్ధమైన శిష్యులు కూడా నేడు లేరు. అందుకే నేటి ఆధ్యాత్మిక ప్రపంచం అంతా  గురువులు శిష్యులు అనబడే జోకర్లతో నిండి నవ్వు పుట్టిస్తోంది.

యోగానంద గారి కుటుంబ జ్యోతిష్కుడు తప్పు చెప్పలేదు. యోగానంద గారి జాతకంలో మూడు పెళ్లిళ్లు ఉన్నాయి. నవాంశ చక్రాన్ని గమనించండి. మేషలగ్నంలో బుధుఁడున్నాడు. సప్తమంలో సూర్య, కుజులున్నారు. సుఖస్థానంలో శపితయోగం ఉంది. లగ్న, సప్తమాలలో ఉన్న మూడు గ్రహాలను బట్టి ఈయనకు మూడు పెళ్లిళ్లు ఉన్నాయనడం సరియైనదే. అయితే, సప్తమం మారకస్థానం గనుక, అందులో నీచ రవి ఉన్నాడు గనుక, సూర్యుడు, కుజుడు సూచిస్తున్న ఇద్దరు భార్యలు చనిపోవాలి. లగ్నంలో ఉన్న బుధుడు సూచిస్తున్న ఒకే భార్య బ్రతకాలి. సుఖస్థానంలో ఉన్న శపితయోగం దీనిని బలపరుస్తుంది. కనుక ఆ జ్యోతిష్కుడు ఆ విధంగా వ్రాసి ఉంచాడు. ఆయన వ్రాసినది సరిగానే ఉంది.

అయితే, జీవితం అనేది ఏదో శక్తి చేత పూర్తిగా ముందే వ్రాయబడి, మార్పుకు అవకాశం లేకుండా రాయిలాగా ఉండదు. సంకల్పశక్తితో దానిని మార్చుకునే వీలు కూడా ఉంటుంది. అయితే అంత సంకల్పశక్తి అందరికీ ఉండదు. కోటానుకోట్ల మానవులందరూ గాలివాటానికి ఎగురుతున్న గాలిపటాలవంటివారే. గాలికి ఎదురీది, తమ దిశను మార్చుకునే శక్తి గాలిపటానికి ఉండనట్లే, తమ గతకర్మను మార్చుకునే శక్తికూడా అందరు జీవులకూ ఉండదు. అలా చెయ్యాలంటే గొప్పదైన సాధనాబలం అవసరమౌతుంది. అప్పుడు మాత్రమే గతకర్మను మార్చుకోవడం సాధ్యమౌతుంది.

అలాంటి మార్చుకున్న పరిస్థితిలో కూడా, గతకర్మ పూర్తిగా క్షయించి పోదు. దాని రూపాన్ని మార్చుకుంటుంది అంతే. ఇదంతా చాలా సూక్ష్మంగా ఉంటూ, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా జరుగుతుంది. కనుక, గ్రహశక్తులను పూర్తిగా ఓడించడం మనిషికి దాదాపుగా అసాధ్యమని విజ్ఞులంటారు.

యోగానందగారు గొప్ప యోగి గనుక, తన సంకల్పశక్తితో, తన జాతకంలో వ్రాసిపెట్టి ఉన్న మూడు పెళ్ళిళ్ళను రద్దు చేసుకోగలిగారు.  అయితే, గతకర్మ అంత తేలికగా వదిలేది కాదు. అది ఆయనను ఇంకో రూపంలో పట్టుకుంది.

గ్రహాలకు, భావాలకు అనేక కారకత్వాలుంటాయి. అంటే, అవి ఒకేసారి జీవితంలోని అనేక విషయాలను శాసిస్తూ ఉంటాయి. ఆ కారకత్వాలలో ఒకదానిని మనం మార్చుకుంటే, గత కర్మబలం ఇంకో కారకత్వం వైపు పోతుంది. అంటే, జాతకం అనే భవనంలో ఒక తలుపును మనం మూస్తే, వెంటనే ఇంకొక తలుపు తెరుచుకుంది. అంతేగానీ, గతకర్మ పూర్తిగా నశించదు. అన్ని తలుపులూ ఒకేసారి మూసుకోవు. కర్మను అలా పూర్తిగా తొలగించాలంటే సాధన ఒక్కటే దారి. రెమెడీలతో అది సాధ్యం కాదు. ఆ సాధన కూడా సర్వపరిపూర్ణమైన సాధన అయి ఉండాలి. అలాంటి సాధన, దానిని చేయించే గురువు దొరకడం, దానిని సాధించడం నూటికో కోటికో ఒక్కరు మాత్రమే చేయగలుగుతారు గానీ అందరికీ అది కుదరదు. కనుక, కర్మ తీరదు. ఇది సత్యం.

జాతకంలో సప్తమభావం అనేది వివాహాన్ని సూచిస్తుంది. అదే సప్తమభావం ఇంకా ఇతర అనేక విషయాలను కూడా సూచిస్తుంది. సప్తమభావం అనేది  ప్రధానంగా భాగస్వాములను, ప్రత్యర్థులను సూచిస్తుంది. జీవిత భాగస్వామినీ ఇదే సూచిస్తుంది, వ్యాపార భాగస్వాములనూ ఇదే సూచిస్తుంది. ఆ జాతకుడు ఒక గురువైతే, గట్టి నమ్మకంతో తనను అనుసరించి నడిచే శిష్యులను కూడా ఇదే సూచిస్తుంది. భార్యను కూడా సహధర్మచారిణి అనే కదా మనం అంటాము. అంటే, తనతోబాటు, తన ధర్మాన్ని అనుసరిస్తూ నడిచే మనిషి అని అర్ధం. గురువు విషయంలో అయితే శిష్యులు కూడా అంతే కదా !

పెళ్లిళ్ల విషయంలో యోగానందగారు తన కర్మను మార్చుకోగలిగారు. కానీ, అదే కర్మ, శిష్యుల రూపంలో, అనుచరుల రూపంలో వచ్చి తను చేయవలసిన పనిని చేసింది. పెళ్లి చేసుకుంటే భార్య రూపంలో వచ్చి వేధిస్తుంది. పెళ్లి చేసుకోకుంటే, అదే కర్మ శిష్యుల రూపంలో వచ్చి వేధిస్తుంది. అదే ఈయన జాతకంలో జరిగింది. ఇదీ రహస్యం.

యోగానందగారు అమితంగా ప్రేమించి, ప్రాణప్రదంగా నమ్మిన శిష్యులు ముగ్గురున్నారు. వారిలో ఇద్దరు ఆయనకు వెన్నుపోటు పొడిచారు. దూరమయ్యారు. వారిద్దరి పేర్లు స్వామి ధీరానంద, నిరోధ్ లు. ఊరకే దూరమవ్వడం కాదు, ఆయనపైన కోర్టు కేసులు వేసి చాలా వేధించారు. అనేక నిందలు వేశారు. మీడియా కెక్కారు. ఇదంతా అమెరికాలో జరిగింది. వాళ్ళను అమెరికా తీసికెళ్ళింది యోగానంద గారే.  తన సంస్థలో ఉన్నతస్థానాలను ఇచ్చింది యోగానందగారే. వాళ్లేమో అలా ప్రవర్తించారు. ఇవి రెండూ, రెండు పెళ్లిళ్లతో సమానమే. వాళ్లిద్దరూ అలా దూరం కావడం, ఇద్దరు భార్యలు చనిపోవడంతో సమానమే. యోగానందగారు చాలా సున్నితమైన మనస్సున్నవాడు. ఈ నమ్మకద్రోహ సంఘటనలతో యోగానందగారు చాలా క్రుంగిపోయారు. మూడవ శిష్యుడైన  జేమ్స్ జె లిన్ మాత్రం యోగానందగారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, కష్టాలలో ఆయనను అంటిపెట్టుకుని ఉండి, సాధనలో గొప్ప స్థితులను అందుకుని, ఆయన తర్వాత SRF కు ప్రెసిడెంట్ అయ్యాడు. సంస్థను నిలబెట్టాడు. మూడవ భార్య బ్రతికి, ఈయనతో చక్కగా కలసి ఉండటమంటే ఇదే.

కనుక తన కర్మను యోగానందగారు మార్చుకున్నారు, కానీ ఓడించలేకపోయారు. అలా ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని నా పరిశోధన చెబుతోంది. కనుక Outwitting the stars అంటూ తన పుస్తకంలోని అధ్యాయానికి యోగానందగారు పెట్టిన టైటిల్ అలంకారికంగా బాగుంటుంది గాని,  అది సత్యం కాదు. సంభవమూ కాదు. గ్రహాలను జయించామని మనం అనుకుంటాం. అవేమో మనల్ని మన జ్యోతిష్యాలను చూచి మౌనంగా నవ్వుకుంటాయి. ఇది సత్యం.

వీళ్ళు ముగ్గురి కధలను వచ్చే పోస్ట్ లలో చూద్దాం.

read more " పరమహంస యోగానంద గారి జాతకం - Part 4 (కర్మను జయించడం అసాధ్యం) "

9, ఆగస్టు 2023, బుధవారం

పరమహంస యోగానంద గారి జాతకం - Part 3 (Outwitting the stars)

భూమిని నడిపిస్తున్నది కర్మనియమమే. జంతుస్థాయిలో అదే దైవం. జంతువంటే  నాలుగు కాళ్ళ జంతువులు మాత్రమే కాదు. మనకు తెలిసిన చాలామంది మనుషులు కూడా అదే కోవలోకి వస్తారు. మానసికంగా, అలవాట్ల పరంగా జంతువుల స్థాయిలో ఉన్న మనుషులు కూడా జంతువులే. కనుక జంతువులెలా అయితే కర్మను తప్పుకోలేవో, మనుషులూ తప్పుకోలేరు. తప్పుకోగలమని భ్రమించడం వాళ్ళ పిచ్చి భ్రమ. చేసిన కర్మకు ప్రతిఫలం అనుభవించడం ఎవరికైనా తప్పదు. అందుకే శ్రీ శారదామాత ఇలా అనేవారు, 'మనిషి ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. తెలిసి చేసినా, తెలియక చేసినా, కర్మఫలితాలను ఎవరూ తప్పుకోలేరు'.

యోగులు సాధకులు కూడా అంతే. వాళ్ళు సామాన్య మానవులకంటే తప్పకుండా ఉన్నతులే. కానీ వారు కూడా కర్మవలయంలో ఉన్నవారే. దానిని పూర్తిగా దాటినవారు కారు. కాబట్టి వారి వారి కర్మఫలితాలను వారు కూడా అనుభవిస్తారు. అయితే ఒక మామూలు మనిషి స్థితికీ వారి స్థితికి చాలా భేదం ఉంటుంది గనుక, సామాన్య మానవులు ఏడుస్తూ తిట్టుకుంటూ కర్మఫలాన్ని అనుభవించినట్లు వారు అనుభవించరు. తమ కర్మను వారు మార్చుకోగలుగుతారు. కానీ పూర్తిగా మాత్రం తప్పుకోలేరు.

యోగానందగారి గారి జీవితం కూడా దీనికి అతీతమేమీ కాదు. పిచ్చిదైన ఎమోషనల్ భక్తిని కాస్త ప్రక్కన పెట్టి వాస్తవిక కోణంలో చూస్తే వాస్తవాలు అర్ధమౌతాయి.

తల్లిగారి మరణం తర్వాత హిమాలయాలకు పారిపోదామన్న కోరిక యోగానందగారిలో తీవ్రంగా మారింది. ఇది 1904 తర్వాత జరిగింది. అప్పుడు ఆయనకు పన్నెండేళ్ళు ఉంటాయి. అప్పుడాయన జాతకంలో శుక్ర - రాహు దశ జరుగుతున్నది. రాహువు పర్వతాలను అడవులను సూచించే మేషంలో ఉన్నాడు. అది నవమస్థానం అయింది. రాహువు దుందుడుకు కార్యకలాపాలకు సూచకుడు. మేషం చరరాశి. కనుక ఇంకొక ఇద్దరు స్నేహితులతో కలసి ఇంటినుండి హిమాలయలకు పారిపోయాడు. అయితే శుక్ర రాహువుల షష్టాష్టక స్థితి వల్ల ఈ ప్లాను బెడిసి కొట్టింది. వాళ్ళ నాన్నగారు BNR (Bengal Nagpur Railway) లో ఉన్నతోద్యోగి కనుక, పోలీసుల సాయంతో హరిద్వార్ స్టేషన్లో వీళ్ళను పట్టుకుని వెనక్కు తెచ్చుకోగలిగాడు. దశమాధిపతిగా శుక్రుడు తండ్రిని సూచిస్తూ చతుర్థంలో ఉంటూ దశమాన్ని చూస్తున్నాడు. కనుక తండ్రిగారికి దొరికిపోయాడు.

అందరికీ ఉన్నట్లే వీళ్ళ కుటుంబానికీ ఒక కుటుంబ జ్యోతిష్కుడున్నాడు. అయితే, నేటి తూతూమంత్ర జ్యోతిష్కుల లాగా అతను మోసగాడు కాదు. అప్పట్లో జ్యోతిష్కులు చాలా నియమనిష్టలతో ఉండేవారు. నేటి జ్యోతిష్కుల లాగా ధనవ్యామోహపరులు కారు. యోగానందగారు ఈ విధంగా ఇంటినుండి పారిపోతాడని ఆ జ్యోతిష్కుడు ముందే వ్రాసి పెట్టాడు. అది అక్షరాలా జరిగింది. అదే జ్యోతిష్కుడు ఇంకొక విషయం కూడా ఈయన జాతకంలో వ్రాశాడు. అదేంటంటే, యోగానందగారు మూడు పెళ్లిళ్లు చేసుకుంటాడని, అందులో ఇద్దరు భార్యలు చనిపోతారని, మూడవ భార్య మాత్రం మిగులుతుందని వ్రాశాడు.

యోగానందగారు సన్యాసం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళ అన్నగారు ఈ జాతకచక్రాన్ని ఆయనకు చూపించి, 'చూశావా? నువ్వు హిమాలయాలకు పారిపోతావని మన కుటుంబ జ్యోతిష్కుడు ముందే వ్రాసి ఉంచాడు. కానీ మాకు దొరికిపోతావని కూడా వ్రాశాడు. అలాగే జరిగింది. అదే జాతకంలో నీకు మూడు పెళ్లిళ్లు వ్రాసిపెట్టి ఉన్నాయని కూడా వ్రాశాడు. కనుక అదీ జరుగుతుంది. కాబట్టి నువ్వు నీ సన్యాస ప్రయత్నాలను ఆపు' అన్నాడు. 

యోగానందగారు జ్యోతిష్యాన్ని నమ్మేవారు కాదు. తన గురువూ, గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్తా అయిన స్వామి యుక్తేశ్వర్ గిరి గారిని కలుసుకునేవరకూ అదే నమ్మకంతో ఆయన ఉన్నాడు. అన్నగారు అలా హెచ్చరించిన తర్వాత కొన్నాళ్ళకు యోగానంద గారికి ఒక దర్శనమో, సూచనో ఏదో అందింది. ఒకరోజున తన జాతకచక్రాన్ని తగులబెట్టేశాడు. ఆ పొడిని ఒక సంచిలో ఉంచి, దానిపైన ఒక కాగితం అంటించాడు. దానిపైన, 'దివ్యజ్ఞానంలో కాలి బూడిద అయిన గతకర్మ విత్తనాలు తిరిగి మొలకెత్తలేవు' అని వ్రాసి ఉంచాడు.

దానికి వాళ్ళన్నయ్య ఇలా అన్నాడు, 'నువ్వు నీ జాతకపు కాగితాన్ని కాల్చి బూడిద చెయ్యవచ్చు. కానీ నీ గతకర్మను మార్చలేవు'.

యోగానందగారి సంకల్పశక్తి బాగానే పనిచేసింది. ఆయన ఒక్క పెళ్లి కూడా చేసుకోలేదు. సన్యాసి అయ్యాడు. గొప్ప గురువయ్యాడు. ఆ విధంగా గ్రహాలను ఆయన ఓడించాడు. కానీ కర్మ కూడా తనపనిని తను చేసింది. ఆ జోస్యం ఇంకొక విధంగా నిజమైంది. అంతిమంగా గ్రహాల చేతిలో యోగానందగారు ఓడిపోయారు. ఈ విషయాలు ఏ పుస్తకం లోనూ మీకు దొరకవు.

అదెలా అయిందో వచ్చే పోస్ట్ లో చదవండి.

(ఇంకా ఉంది)

read more " పరమహంస యోగానంద గారి జాతకం - Part 3 (Outwitting the stars) "