“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, మే 2021, సోమవారం

ఆస్ట్రేలియాలో ఎలుకల బెడద - రాహుకేతువుల ప్రభావం


SA - South Australia; NSW- New South Wales; QL- Queensland;

ఒక దేశాన్ని గాని, కుటుంబాన్ని గాని, మనిషిని గాని ఒకే విధమైన దురదృష్టం వదలకుండా వెంటాడుతున్నదంటే దానికి తప్పకుండా కారణాలుంటాయి.  ఆ కారణాలలో కొన్ని మాత్రమే మనకు కనిపిస్తాయి. కనిపించని కారణాలు ఎన్నో ఉంటాయి. వాటినే 'పూర్వకర్మ' అంటాము. మనిషి జాతకంలో అయితే, ఆ పూర్వకర్మను కనిపెట్టి తొలగించుకునే ఉపాయాలుంటాయి. వాటినే పరిహారక్రియలంటారు. అయితే, వాటిని అందరూ కనుక్కోలేరు, కనుక్కున్నా తీసెయ్యలేరు. తీసెయ్యగలమని డబ్బాలు కొట్టుకునే నేటికాలపు జ్యోతిష్కులు ముందు వారి సమస్యలను వారు పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది. ఆ తరువాత లోకాన్ని ఉద్ధరించే కార్యక్రమంలోకి దిగవచ్చు.

మనిషికున్నట్లే దేశానికీ శాపాలుంటాయి. ఆ దేశం గనుక దౌర్జన్యంగా ఆక్రమించుకోబడినదైతే, ఆ శాపాలు మరీ దారుణంగా ఉంటాయి. వారి పూర్వీకులు చేసిన పాపఖర్మ ఫలితాలను నేటితరంవారు ఖచ్చితంగా అనుభవించవలసి వస్తుంది. కుటుంబాలలో అయితే, ఈ పాపఖర్మ, వదిలిపెట్టని రోగాలుగా, తరతరాలకూ సంక్రమిస్తూ వేధించే దురదృష్టాలుగా, అనారోగ్యాలుగా, కష్టనష్టాలుగా, దీర్ఘరోగాలుగా ఉంటుంది. దేశానికైతే, తుఫానులు, ప్రకృతి ప్రమాదాలు, వేలాదిగా లక్షలాదిగా మనుషులను తుడిచిపెట్టే సాంక్రమిక రోగాలు, కరువుకాటకాలు మొదలైన రూపాలలో ఉంటుంది.

అయితే, పూర్వకర్మను జయించడం అంత తేలిక కాదు. 'ఇదిరా బాబూ దారి' అంటూ  చెబితే మనుషులే వినరు, ఇక దేశాలు దేశాధినేతలు వింటారా? జరిగే పని కాదు. అయినా సరే, జ్యోతిషశాస్త్ర పరిశోధకులు ఊరుకోరు కదా. విషయాలను తరచి తరచి చూస్తూనే ఉంటారు. అలాంటిదే ఈ పరిశోధన కూడా.

గత నూట యాభై సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో దాదాపుగా పాతికసార్లు ఈ ఎలుకమందల దాడులు జరిగాయి. కొన్నిసార్లు చాలా ఎక్కువగా జరిగాయి. మిగతావి తక్కువ మోతాదులో జరిగినప్పటికీ అవి కూడా రైతులకు ప్రజలకు చాలా నష్టాన్ని కల్గించినట్టివే. ఆయా సంవత్సరాలను, అప్పటి ముఖ్యమైన  గ్రహస్థితులను పైన పట్టికలో చూడవచ్చు. ఎరుపు రంగులో ఉన్నవి, ఊహించలేనంత నష్టాన్ని కలిగించిన ఎలుకదాడులు. మిగతావి కొంచం చిన్నపాటివి. ఇప్పుడు విశ్లేషణలోకొద్దాం.
  • ముఖ్యంగా, రాహుకేతువులు ఉచ్చనీచలలో ఉన్నప్పుడు, శని, ప్లుటోలు కలసిగాని, దృష్టిలో ఉన్నపుడుగాని ఈ సంఘటనలు ఆస్ట్రేలియా దేశానికి ఎక్కువ నష్టాన్ని కలిగించాయి.
  • వృషభ, మిధున, వృశ్చిక, ధనూరాశులు ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఆ తరువాత సింహరాశి ఎక్కువగా కనిపిస్తున్నది.
ముందుగా, ఊహించనంత నష్టాన్ని కలిగించిన సంవత్సరాలను గమనిద్దాం. అవి - 1917, 1956, 1979, 1993, 2021.

1917 లో రాహుకేతువులు ధనుస్సు - మిధున రాశుల ఇరుసులో నీచస్థితిలో ఉన్నారు. శని కర్కాటకంలో, ప్లూటో మిధునంలో ఆచ్ఛాదనాయోగంలో ఉన్నారు. ప్లుటోతో నీచకేతువు కలిసున్నాడు. కనుక ఈ అతిపెద్ద ప్లేగ్ ఆస్ట్రేలియాలో వచ్చింది.

1956 లో రాహుకేతువులు వృశ్చిక - వృషభ రాశులలో మళ్ళీ నీచస్థితిలో ఉన్నారు. శని వృశ్చికంలో నీచరాహువుతో కలసి భయంకరమైన శపితయోగంలో ఉన్నాడు. ప్లూటో సింహరాశిలో ఉన్నాడు. ఒక్కసారి రాశిచక్రాన్ని చుట్టి రావడానికి ప్లూటో 248 సంవత్సరాలు తీసుకుంటాడు. కనుక 1708 లో ఏం జరిగిందో మనకు తెలియదు. 1956 లో  వచ్చిన ఈ ప్లేగ్ వల్ల ఎలుకల దెబ్బకు పిల్లులకు అంతుతెలియని రోగాలు సోకి పిల్లులు చచ్చిపోయాయి. అంటే, ఎలుకలు పిల్లులను చంపేసినట్లు అయింది. బ్రహ్మంగారు చెప్పినవి ఇలాంటివే కదా మరి !

1979 లో వచ్చిన మరొక ఎలుకల వరద సమయంలో రాహుకేతువులు సింహ - కుంభరాశుల ఇరుసులో ఉన్నారు. ఇక్కడ సింహరాశికి ప్రాముఖ్యత పెరిగింది. ఆస్ట్రేలియా దేశం కూడా సింహం తలకాయలాగే ఉంటుంది గమనించండి. ఈ సమయంలో శని సింహరాశిలోను, ప్లూటో కన్యారాశిలోను ఉంటూ మళ్ళీ ఆచ్ఛాదనాయోగంలో ఉన్నారు.

1993 లో వచ్చిన విపత్తులో రాహుకేతువులు వృశ్చిక - వృషభ రాశుల ఇరుసులో నీచస్థితిలో ఉన్నారు. శని కుంభరాశిలోను, ప్లూటో తులారాశిలోను ఉంటూ పరస్పర కోణదృష్టిలో ఉన్నారు.

ఇక ప్రస్తుతం 2021 లో చూస్తే, రాహుకేతువులు వృషభ - వృశ్చికరాసులలో ఉచ్ఛస్థితిలో ఉండగా, శని ప్లుటోలిద్దరూ మకర రాశిలో కలసి ఉన్నారు. కనుక మళ్ళీ ఇప్పుడు అతిపెద్ద ఎలుకల బెడద ఆస్ట్రేలియాకు వచ్చింది.

చూశారా లింకులు ఎలా ఉన్నాయో?

ఇప్పుడు మిగతా సంవత్సరాలలో ఏఏ గ్రహయోగాలు పనిచేశాయో చూద్దాం.

  • రాహుకేతువుల ఉచ్చస్థితులున్న సంవత్సరాలు : 1871,1872, 1890, 1928, 2021.
  • రాహుకేతువుల నీచస్థితులున్న సంవత్సరాలు : 1880,1917, 1918, 1955, 1956. 1975, 1993.
అంటే, ప్రతి 7 నుంచి 9 ఏళ్ళకొకసారి తీవ్రమైన ఎలుకల బెడద ఆస్ట్రేలియాలో వస్తున్నదని, దానికి కారణం రాహుకేతువుల స్థితులని ఒక  విషయం అర్ధమౌతున్నది.

ఇప్పుడు శని ప్లూటో ల స్థితిని, వీరితో రాహుకేతువుల సంబంధాన్ని గమనిద్దాం.
  • 1871-72: ధనూశని, మేషప్లుటోల కోణదృష్టి. ధనుర్లగ్నంలో శని.
  • 1880: నీచమేషశని, వృషభ ప్లూటోల ఆచ్చాదనాయోగం, ధనుస్సునుండి  నీచరాహు దృష్టితో శపితయోగం. 
  • 1890: సింహశని, ఉచ్చ ధనూకేతువుల మధ్య కోణదృష్టి. ధనుస్సులో కేతువు.
  • 1917 నుంచి 1932 వరకూ ప్లూటో మిధునరాశిలో ఉన్నాడు. ధనుస్సును చూస్తున్నాడు. ఆ పదిహేనేళ్ల కాలంలో ఏడుసార్లు ఎలుకల బెడద తలెత్తింది. ధనుర్లగ్నం దెబ్బతినింది.
  • 1922 లో  శనిరాహువులు కన్యలో ఉంటూ శపితయోగం తలెత్తింది. ఇది ధనుస్సుకు దశమంలో జరిగింది.
  • 1925 లో ఉచ్చతులాశని మిధునప్లుటోలు కోణదృష్టిలో ఉన్నారు. రాహువు కర్కాటకంలో ప్లుటోతో ఆచ్చాదనాయోగంలో ఉన్నాడు. ప్లూటో ధనుస్సును చూస్తున్నాడు.
  • 1928 లో శని కేతువులు వృశ్చికంలో యుతిలో ఉన్నారు. ప్లూటో రాహువులు మిధున వృషభాలలో ఆచ్చాదనాయోగంలో ఉన్నారు. ధనుర్లగ్నానికి ద్వాదశంలో శనికేతువుల యుతి జరిగింది.
  • 1931 లో ధనూశని మిధునప్లుటోలు సమసప్తకదృష్టిలో ఉన్నారు. రాహుకేతువులు మీనకన్యారాశులలో ఉంటూ వీరికి అర్గలదోషాన్ని పట్టించాయి. ధనుస్సులో శని.
  • 1932 లో మకరశని కుంభరాహువుల ఆఛ్చాదనాయోగం, కుంభరాహు, మిధున ప్లుటోల మధ్యన కోణదృష్టి ఉన్నది. ప్లూటో ధనుస్సును చూస్తున్నాడు.
  • 1952 లో కన్యాశని సింహకేతువుల మధ్య ఆచ్చాదనాయోగం ఉన్నది. ధనుస్సుకు దశమంలో శని.
  • 1955 లో తులాశని, నీచమిథునకేతువుల మధ్యన కోణదృష్టి ఉన్నది. సింహప్లూటో, నీచధనూరాహువుల మధ్యన కోణదృష్టి ఉన్నది. ధనుస్సులో నీచరాహువు.
  • 1967 లో మీనశని, మేషరాహువులమధ్య ఆచ్ఛాదనాయోగం ఉన్నది. ధనుస్సుకు చతుర్దకేంద్రంలో శని.
  • 1972 లో వృషభశని, కన్యాప్లూటో, మకరరాహువుల మధ్యన పరస్పర కోణదృష్టి ఉన్నది. ధనుస్సుకు దశమంలో ప్లూటో.
  • 1975 లో మిధునశని, నీచవృషభకేతువుల మధ్యన ఆచ్చాదనాయోగం ఉన్నది. నీచకేతువుకు కన్యాప్లూటో తో కోణదృష్టి. ధనుస్సుకు సప్తమంలో శని, దశమంలో ప్లూటో.
  • 1994 లో కుంభశని, తులారాహువుల మధ్యన కోణదృష్టి ఉన్నది. ధనుర్లగ్నానికి వీరు అర్గలదోషాన్ని పట్టించారు. 
ఈ విధంగా ఆస్ట్రేలియాను సూచిస్తుందని చాలామంది నమ్మే ధనుర్లగ్నం ఆయా సంవత్సరాలలో చెడుయోగాల బారిన పడింది.

ప్రస్తుత ఎలుకలదాడి వల్ల జరిగిన నష్టం 1 బిలియన్ (100 కోట్ల) ఆస్ట్రేలియన్ డాలర్స్ అంటున్నారు. అంటే మన లెక్కలో 5,600 కోట్ల రూపాయలు. గత నూటయాభై ఏళ్లలో జరిగిన నష్టాన్ని లెక్కిస్తే కనీసం లక్ష కోట్లుంటుంది.

ఓరి ఎలకలో ! ఎంత పని చేస్తున్నాయ్ !

బలీయమైన పూర్వపు పాపకర్మను అనుభవింపజేయడంలో శని, ప్లూటో (యమగ్రహం), కాలస్వరూపమైన రాహుకేతువుల పాత్ర సుస్పష్టం. ఆస్ట్రేలియాకు ఎలుకల బెడద పట్టిన ప్రతి ఏడాదీ వీరి పాత్రను యధోచితంగా గమనించవచ్చు. ఈ బాధ ఆస్ట్రేలియాకు ఎలా తప్పుతుందంటారా? ఉపాయం ఉంది. అయితే, మనుషులే  చెప్పింది వినరు, ఇక దేశాలు వింటాయా మీ పిచ్చిగాని !

అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్ !

అంతే !
read more " ఆస్ట్రేలియాలో ఎలుకల బెడద - రాహుకేతువుల ప్రభావం "

30, మే 2021, ఆదివారం

ఆస్ట్రేలియాలో ఎలుకల వర్షం ఎందుకు?

ఈ విషయాన్ని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారో లేదో నాకు గుర్తులేదు. ఎందుకంటే దానిని నా చిన్నపుడు చదివాను. అందులో ఇదుందో లేదో మీరే చెప్పాలి.

ఆస్ట్రేలియాలో ప్రస్తుతం లక్షలాది ఎలుకలు వీరవిహారం చేస్తున్నాయి. ప్రభుత్వం చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. పంటలను, నిలువ చేసిన ధాన్యాన్ని లక్షల ఎలుకలు తినేస్తున్నాయి. అవి ఇళ్లలోకి కూడా చొరబడుతున్నాయి. కొన్ని ఇళ్లలో అయితే, కప్పులనుంచి జలజలా ఎలుకల వర్షం కురుస్తోందట. ట్రాప్ పెడితే తెల్లవారే సరికి 500 ఎలుకలు అందులో పడుతున్నాయట.

ఈ ఎలుకల బెడద ఆస్ట్రేలియాకు కొత్తది కాదు. తెల్లవాళ్లు అక్కడ కాలుపెట్టినప్పుడే వారితో బాటు ఎలుకలు అక్కడ అడుగు పెట్టాయి. అంతేకాదు కలరా, మలేరియా, స్మాల్ పాక్స్, ఫ్లూ మొదలైన రోగాలు కూడా తెల్లవాళ్ళతోనే అక్కడి స్థానికులకు సంక్రమించాయి.

1788 జనవరిలో కెప్టెన్ ఆర్ధర్ ఫిలిప్ తన ఓడతో అక్కడ అడుగుపెట్టాడు. ఆ ఓడలో గుర్రాలు, ఎద్దులు, ఆవులు, కుందేళ్లతో పాటు, ఎలుకలను కూడా తీసుకెళ్లి ఆస్ట్రేలియాలో వదిలాడు. 'ఆ ద్వీపం మాదే' అని బ్రిటన్ ప్రకటించింది. బ్రిటన్ నుండి నేరస్తులతో, దొంగలతో ఆ దీవిని నింపడం మొదలైంది. యూరోప్ నుంచి వలసజనం తండోపతండాలుగా అక్కడకు పోవడం మొదలైంది. అప్పటికే అక్కడ దాదాపుగా పదిలక్షల మంది స్థానిక ప్రజలున్నారు. వాళ్లలో రకరకాల జాతులున్నాయి, తెగలున్నాయి, భాషలున్నాయి. అయితే వారంతా ఆటవికులు. నల్లవాళ్ళు. అసలు వారంతా అక్కడకెలా వచ్చారు? మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న ఆస్ట్రేలియాలో అప్పటికే పదిలక్షలమంది మనుషులెలా ఉన్నారు?

అరవై డెబ్భై వేల సంవత్సరాల క్రితమే ఇతర దేశాలనుండి మనుషులు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారని రుజువులున్నాయి. అక్కడ దొరికిన సమాధులు, జంతువులు మనుషుల అస్థిపంజరాలు, మిగతా ఆనవాళ్ళు, ఇంకా స్థానికుల జీన్స్ ను పరిశీలించి శాస్త్రవేత్తలు ఈ సత్యాన్ని రాబట్టారు. వీరిలో ఇండోనేషియా, ఇండియా మొదలైన దేశాల జీన్స్ ఉన్నాయి. వాళ్ళ పేర్లు సంస్కృత, ప్రాకృత మూలాలతో ఉంటాయి, ఉదాహరణకు కొన్నింటిని చూడండి -  బంగారి, దారన, మాయ, అన్మనారి, బృంద, అల్కవారి, కర్రి, ఐలూక, తారక, గురుమఱ్ఱ, వింద్రదను.

ఈ పేర్లను తెల్లవారు గుర్తుపట్టలేకపోవచ్చు. మనం గుర్తుపట్టలేమా ! ఇవెక్కడివో మనం చెప్పలేమా?

రెండువందల ముప్పై ఏళ్ళక్రితం కేవలం పదిమందితో అక్కడ అడుగుపెట్టిన బ్రిటిష్ సంతతి నేడు మూడుకోట్లకు చేరుకుంది. ఈ రెండువందల సంవత్సరాలలో స్థానికులు పదిలక్షలనుంచి ఎనిమిదిలక్షలకు తగ్గిపోయారు. ఇదెలా జరిగింది?

తెల్లవాళ్లు ఏ దేశంలో అడుగుపెట్టి, ఎక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకున్నా, అది స్థానికులను చంపడం ద్వారానే చేశారు. అమెరికాలో అదే జరిగింది. ఆస్ట్రేలియాలో కూడా అదే జరిగింది. ఇండియాలో కూడా అదే చేశారు. అయితే, పూర్తిగా అదేవిధంగా చెయ్యలేక, కులాలపరంగా, మతాలపరంగా, వేరే రకాల చిచ్చులు పెట్టి, ఇక తప్పనప్పుడు తప్పుకున్నారు.  

ఆస్ట్రేలియాను మొదట్లో న్యూ హాలండ్ అనీ ఆ తరువాత న్యూ సౌత్ వేల్స్ అనీ అనేవారు. అక్కడ స్థానికులను తుపాకీని మందుగుండును ఉపయోగించి విచక్షణా రహితంగా కాల్చి చంపారు తెల్లవాళ్లు. వాళ్లేమో బల్లెం, గొడ్డలి, ఒడిసెల వంటి ఆటవిక ఆయుధాలు వాడేవారు. తెల్లవాడు తుపాకీతో, టెక్నాలజీతో అక్కడ అడుగుపెట్టాడు. అప్పటిదాకా వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమి 'నాది' అన్నాడు. వాళ్ళు సహజంగానే తిరగబడ్డారు. ఆ విధంగా జరిగిన ఘర్షణలతో వేలాదిమంది స్థానికులు చనిపోయారు. లక్షలాది మంది కూడా కావచ్చు. లెక్కల్లేవు. ఎంతోమంది స్థానికులను వారు తినే ఆహారంలో విషం కలిపి చంపేశారు తెల్ల సెటిలర్స్.  లేదా, ఆహారంలో, తిండిగింజలలో విషం కలిపి, స్థానిక ఆటవికులకు అందుబాటులో ఉండేలాగా వదిలిపెట్టేవాళ్ళు. ఆశగా అవి తీసుకుపోయి తిన్న ఆదివాసీలు వేల సంఖ్యలో చనిపోయేవారు. ఇదిగాక, తెల్లవాళ్ళనుంచి అప్పటిదాకా లేని  రోగాలు స్థానికులకు సోకాయి. అవే, కలరా, మలేరియా, మీజిల్స్, స్మాల్ పాక్స్, ఫ్లూ మొదలైన రోగాలు. ఈ రోగాలు యూరోప్ నుండి మిగతా ప్రపంచం మొత్తానికీ పాకాయి. తెల్లవాడు రాకముందు మన దేశంలో కూడా ఈ రోగాలు లేవు. అంతేకాదు. సిఫిలిస్, గనేరియా మొదలైన సుఖరోగాలు కూడా యూరోపియన్లు మిగతా ప్రపంచానికంతా అంటించిన పుణ్యరోగాలే అని చరిత్ర చెబుతోంది.

ఈ విధంగా, తుపాకీతోను, తినే ఆహారంలో విషం కలపడం ద్వారాను, అంటురోగాలు వ్యాప్తి చెయ్యడం ద్వారాను బ్రిటిష్ వారు, స్థానిక ఆస్ట్రేలియా ఆదివాసీలను తుడిచిపెట్టేశారు. అందుకే గత రెండువందల ముప్పై ఏళ్లలో, స్థానిక నల్లజాతి ప్రజల సంఖ్య పదిలక్షలనుంచి ఎనిమిది లక్షలకు పడిపోతే, తెల్లవాళ్ల సంఖ్య పదిమంది నుంచి మూడుకోట్లకు పెరిగింది.

ఇదంతా మీకు నెట్లో దొరుకుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆస్ట్రేలియా చరిత్ర మీద రీసెర్చి చేసి చూడండి. మీకే అర్ధమౌతుంది.

అయితే, నేను చెప్పబోతున్నది ఇది కాదు.

ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని, ప్రజలను గజగజలాడిస్తున్న ఎలుకల వరదకు కారణమేంటో తెలుసా? శాస్త్రవేత్తలు ఏవేవో కారణాలు చెప్పవచ్చు. వారు చెప్పే కారణమేంటంటే - కావలసిన దానికంటే ఆహారధాన్యాలను విపరీతంగా పండించి లక్షల టన్నుల ధాన్యాన్ని, గోధుమలను సైలోలలో నిల్వచెయ్యడమని. కానీ అసలు కారణం ఇది కాదు.

మనుషులకు సైటెక్కువ. అందులోనూ వాళ్లకు షార్ట్ సైట్ మాత్రమే ఉంటుంది. అంటే ఎదురుగా ఉన్నది తప్ప దూరంగా ఉన్నది కనపడదు. అందుకే వాళ్ళ ఖర్మ వాళ్ళను వెంటాడుతూ ఉంటుంది. వినండి !

ఎక్కడో యూరప్ నుంచి వచ్చారు తెల్లవాళ్ళు. డెబ్భై వేల ఏళ్ళనుంచీ ఆస్ట్రేలియాలో బ్రతుకుతున్న స్థానిక నల్లవారిని దారుణంగా జంతువులలాగా వేటాడి చంపారు. ఎలుకలకు మందుపెట్టి చంపినట్టు, తినే తిండిగింజలలో విషం కలిపి అక్కడి గూడెం ప్రజలను వేలాదిగా చంపేశారు. తెల్లవాళ్ళనుంచి ఆ గడ్డకు చేరిన అంటురోగాలు సోకి ఎన్నో ఆదివాసీల గూడాలు తుడిచి పెట్టుకుపోయాయి. ఆ రోగాలకు మందులు లేక లక్షలాది స్థానికులు దిక్కులేని చావులు చచ్చారు. ఆ ఉసురంతా ఎక్కడికి పోతుంది మరి?

ఆహారంలో విషం కలిపి ఎలుకలను చంపినట్టు ఆదివాసీలను చంపారు గనుకనే, ఇప్పుడు  లక్షలాది ఎలుకలు ఆస్ట్రేలియాలో వీరవిహారం చేస్తున్నాయి. ఇప్పుడే కాదు, ప్రతి నాలుగైదు ఏళ్ళకొకసారి ఈ ఎలుకల బెడద ఆస్ట్రేలియాలో ఉంటూనే ఉన్నది. నెట్లో రీసెర్చ్ చెయ్యండి మీకే తెలుస్తుంది !

ఈ ఎలుకలను చంపడం అక్కడి ప్రభుత్వం వల్ల కాక, ఇండియాలో బ్యాన్ అయిన భయంకర విషం 'బ్రొమడైలన్' 5000 లీటర్లు కావాలని ఇండియాను అడుగుతోంది. చూశారా కర్మ ఫలితం తరతరాలుగా ఎలా వెంటాడుతుందో?

నవీనులు సైన్స్ ను నమ్ముతారు.  కర్మను నమ్మరు. కానీ మన నమ్మకం ప్రకారం ప్రపంచం నడవదు. దాని వెనుక కంటికి కనిపించని కర్మసూత్రాలున్నాయి. వాటి ప్రకారం సృష్టి నడుస్తుంది గాని, మన దుర్మార్గపు మనస్తత్వంతో, అతితెలివితో నడవదు.

'కత్తిని వాడేవాడు కత్తితోనే చస్తాడు' - అంటుంది బైబిల్. మరి క్రీస్తును పూజిస్తామని చెప్పుకునే తెల్లవాళ్లు ఆస్ట్రేలియాలో చేసిందేమిటి? ఇదేనా క్రైస్తవం? ఆస్ట్రేలియా ఆదివాసీలకు తెల్లవాళ్ళు చేసిన అన్యాయమే ఇప్పుడు వాళ్ళని వెంటాడుతోంది. ఒకప్పుడు విషపూరిత ఆహారం పెట్టి ఎలుకల మాదిరిగా  ఆదివాసీలను తెల్లవాళ్లు చంపేశారు. ఇప్పుడు తెల్లవాళ్లు పండిస్తున్న పంటను విషపూరితం చేస్తున్నాయి ఎలుకల మందలు. లక్షలాదిగా వెంటాడుతున్నాయి. పొలాలలో, గోదాముల్లో, షాపులలో, ఇళ్లలో, బెడ్ రూములలో, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ, సీలింగ్ నుంచి వర్షంలా కురుస్తూ, జనాన్ని భయభ్రాంతులను చేస్తున్నాయి. మనుషుల్ని కూడా కరుస్తున్నాయిట. వీటివల్ల మనుషులలో ప్లేగు వ్యాధి వ్యాపిస్తే అప్పుడుంటుంది అసలు సినిమా !
 
ఇది కర్మ ఫలితం కాదా మరి?

దీనిమీద మళ్ళీ ఒక సినిమా తీసి వందల కోట్లు సంపాదిస్తాడు ఇంకో తెల్లోడు. నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే రంగంలోకి దిగి ఉంటుంది. డబ్బులు డబ్బులు డబ్బులు. ఏం జరిగినా దాన్ని చూపించి డబ్బు సంపాదించడమొక్కటే ప్రస్తుతం జనానికి తెలిసిన విద్య. అంతేగాని ఒళ్ళు కొవ్వెక్కి చేసుకున్న పాపఖర్మాన్ని ఎలా తొలగించుకోవాలి అన్నవిషయం మాత్రం ఎవరికీ తెలియదు. చెప్పినా వినేస్థితిలో ఎవరూ లేరు. కోట్లు మూలుగుతున్నవాళ్ళు కరోనాతో రెండురోజుల్లో దిక్కులేకుండా చనిపోతున్నా కూడా ఎవరికీ జ్ఞానోదయం కావడం లేదు.

ఇండియానుంచి కొన్న విషం పెట్టి ఎలుకలను చంపవచ్చునేమోగాని, అవి మళ్ళీ పుట్టకుండా ఆపగలరా? అలా ఆపగలిగే పనైతే గత రెండువందల ఏళ్ళనుంచీ వదలకుండా ఎలుకలెందుకు ఆస్ట్రేలియాను వెంటాడుతున్నాయి? విషం తిని చనిపోయిన లక్షలాది ఎలుకల వల్ల నేల, నీరు, గాలి అన్నీ పాడౌతాయి. విషపూరితాలౌతాయి. అప్పుడు మళ్ళీ ఇంకో కొత్త రోగం పుట్టుకొస్తుంది. దానికి మళ్ళీ ఇంకేదో అసహజమైన అడ్డదారి తొక్కుతారు. అది ఇంకో ముసలానికి కారణమౌతుంది. ఈ చక్రభ్రమణానికి అంతెక్కడ?    

ఏం ప్రపంచంరా దేవుడా? ఎప్పుడు బాగుపడతారో మనుషులు? ఎప్పుడు కళ్లుతెరిచి జ్ఞానవంతులౌతారో? నీకే ఎరుక !
read more " ఆస్ట్రేలియాలో ఎలుకల వర్షం ఎందుకు? "

27, మే 2021, గురువారం

యాస్ తుఫాన్ భీభత్సం - కుజశుక్రుల ఆచ్చాదనా యోగపు మరో ఫలితం

అతి పెద్ద తుఫాన్ల పట్టికలో చేర్చబడిన 'యాస్' తుఫాను ఇండియాను, బాంగ్లాదేశ్ ను గత మూడు రోజులుగాఎలా వణికించిందో చూసాం. లక్షలాది మంది ప్రజలు దీనివల్ల ఈ మూడు రోజులుగా నానా అగచాట్లు పడ్డారు. కొంతమంది చనిపోయారు కూడా. ఇది కూడా ఆచ్చాదనాయోగపు మరో ఫలితమే. నేనింతకు ముందు కూడా చెప్పాను, ఒకే గ్రహయోగం అనేక దేశాలలో అనేక విధాలుగా ఫలితాలు చూపిస్తుందని. దానికి యాస్ తుఫాను కూడా మరో ఉదాహరణ !

23 వ తేదీన బంగాళాఖాతంలో ఒక డిప్రెషన్ గా ఇది గుర్తించబడింది. ఆరోజునే, శుక్రుడు 23 వ డిగ్రీలోకి ప్రవేశించాడు. జ్యోతిష్యశాస్త్ర పరంగా ఇది తూర్పు దిక్కుకు సూచిక అవుతుంది. అందుకే, అప్పటిదాకా గుజరాత్ ను వణికించిన తుఫాన్ వాతావరణం, ఆ రోజునుంచీ తూర్పు దిశగా మళ్లింది. బెంగాల్ ను, బాంగ్లాదేశ్ ను భయపెట్టడం మొదలుపెట్టింది. 24 తేదీన కుజశుక్రుల మధ్యన ఖచ్చితమైన ఆచ్చాదనాయోగం ఏర్పడింది. కనుక ఆ రోజున దీనిని తీవ్రమైన తుఫాన్ గా గురించి 'యాస్' అని పేరు పెట్టారు. ముందుకు కదులుతున్న శుక్రుని నడకను అనుసరిస్తూ ఇది 25 న బలాన్ని పుంజుకుంది. 26 న ఉదయం తొమ్మిదికి తీరాన్ని తాకింది. ఈ మూడు రోజులూ రెండుదేశాల ప్రధానమంత్రులూ, అధికారులూ, యంత్రాంగమూ, నిద్రలేని రాత్రులను గడిపారు.

ఈ వర్షాలవల్ల బెంగాల్లో మూడులక్షల ఇళ్ళు దెబ్బ తిన్నాయి. అయిదు లక్షలమంది నిరాశ్రయులైనారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం కోటిమంది దెబ్బతిన్నారు. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఏమౌతుందో, మనిషి విర్రవీగుడు ఏమౌతుందో దీనివల్ల అర్ధం చేసుకోవచ్చు. 

శుక్ర కుజుల మధ్యన ఏర్పడిన ఆచ్చాదనాయోగం కుజుని అష్టమ దృష్టిద్వారా మకరం మీదకు పడింది. మకరం ఇండియాకు సూచిక. 26 వ తేదీన పౌర్ణమి, చంద్రగ్రహణం కలసి వచ్చాయి. చంద్రుడు జలతత్వ రాశి అయిన వృశ్చికంలో ప్రవేశించి కేతువుతో కలిశాడు. అక్కడనుంచి వీరి దృష్టి మరో జలతత్వ గ్రహమైన శుక్రునిమీద పడింది. కుజుడున్న మిధునరాశి నుండి వాయుతత్వం వీరితో జత కలిసింది. జలం వాయువూ కలసి విజృంభించి తుఫాన్ ను మకరరాశి సూచిస్తున్న నేలవైపు తీసుకెళ్లాయి. కనుక 26 వ తేదీన తుఫాన్ ఇండియాకు తూర్పుదిశలో నేలను తాకి భీభత్సాన్ని సృష్టించింది.

శుక్ర, కుజుల మధ్యన ఏర్పడిన ఆచ్చాదనాయోగం, చంద్రకేతు సంయోగం, గ్రహణం, పౌర్ణమి - ఇవీ ఈ జనసంక్షోభానికి దోహదం చేసిన కారణాలు.

read more " యాస్ తుఫాన్ భీభత్సం - కుజశుక్రుల ఆచ్చాదనా యోగపు మరో ఫలితం "

శాన్ జోస్ కాల్పులు - ఆచ్చాదనాయోగం

26-5-2021 బుధవారం నాడు ఉదయం 6-24 గంటల ప్రాంతంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో, శాన్ జోస్ లోని ఒక రైల్వే యార్డులో ఒక వ్యక్తి జరిపిన కాల్పులలో ఎనిమిది మంది చనిపోయారు. చివరకు నేరస్తుడు కూడా తనను తాను కాల్చుకుని చనిపోయాడు.  పదిహేను సంవత్సరాలు అతనితో కాపురం చేసి విడాకులు తీసుకున్న అతని మాజీ భార్య చెప్పిన ప్రకారం అతనికి చాలా కోపం ఉండేది. సాటి ఉద్యోగులతో గొడవలు పడుతూ ఉండేవాడు. చివరకు ఇలా చేశాడు, అది కూడా పౌర్ణమి ఘడియలలో, చంద్రగ్రహణం సమయంలో.

నిన్న చంద్రగ్రహణం మరియు పౌర్ణమి ఘడియలు నడిచాయి. ఇంతకు ముందు ఎన్నో పోస్టులలో నేను చెప్పినట్లుగా, పౌర్ణమి అమావాస్యల ప్రభావాలు, వాటికి ముందు రెండు రోజులు వెనుక రెండు రోజులు ఉంటాయి. వాటిని షాడోస్ లేదా ఛాయలు అనవచ్చు. ప్రస్తుత సంఘటన సరిగ్గా అలాంటి ఛాయాసమయంలోనే జరిగింది.

ఆ సమయానికి శాన్ జోస్ లో వృషభలగ్నం 21 వ డిగ్రీ ఉదయిస్తున్నది. అదే వృషభ లగ్నంలో సూర్యుడు 11, రాహువు 17 డిగ్రీలలో లగ్నానికి వెనుకగాను, శుక్రుడు 27 డిగ్రీలలో ముందుగాను ఉంటూ లగ్నడిగ్రీకి అర్గలదోషం పట్టించారు. పైగా లగ్నంలో ఉన్న సూర్యుడు, సప్పమంలో ఉన్న చంద్రులవల్ల పౌర్ణమిప్రభావం లగ్నంమీద చాలా బలంగా పడింది. పైగా రాహుకేతువులు ఇదే ఇరుసులో ఉచ్చస్థితిలో ఉన్నారు. పైగా మనఃకారకుడైన చంద్రుడు ఉఛ్చకేతువు (కుజుని) తో కలసి విపరీతమైన హింసాత్మక ప్రవృత్తులు రేకెత్తడాన్ని సూచిస్తున్నాడు. అన్నిటినీ మించి, బుద్ధికారకుడైన బుధుడు సున్నా డిగ్రీలలో ఉంటూ ఈ సమయంలో మనుషులలో రేకెత్తే బుద్ధిలేనితనాన్ని సూచిస్తున్నాడు.

పౌర్ణమి ఘడియలలో మామూలుగానే మనుషుల మనసులు గాడితప్పుతాయి. అవి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరుగుతాయి. సహజంగానే కోపతాపాలు ఉన్నవారిని ఈ సమయం చాలా రెచ్చగొడుతుంది. కనుక వాళ్ళు స్థిమితాన్ని కోల్పోయి విచక్షణారహితంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ లోలోపల దాగిఉన్న ఉద్రేకాలు ఈ సమయంలో బయటపడతాయి. ప్రస్తుత సంఘటనలో అదే జరిగింది.

సామ్యూల్ జేమ్స్ కాసిడి అనే ఈ నేరస్తుడు ఆ రైల్ కంపెనీ ఉద్యోగే. యాజమాన్యం మీదా, సహోద్యోగులమీదా అతనిలో ఎప్పటినుంచో ఉన్న కోపం ఈ సమయంలో ఇలా బయటపడింది. తనతో సహా తొమ్మిదిమందిని పొట్టన పెట్టుకుంది. మరొకరు ఆస్పత్రిలో చావుబ్రతుకులలో ఉన్నాడని అంటున్నారు.

నా పోస్టులు శ్రద్ధగా చదివేవారికి ఇక్కడొక అనుమానం రావాలి.

మీరెప్పుడూ చెప్పే విధంగా మిధునరాశి అమెరికాను సూచిస్తుంది కదా? మరి ప్రస్తుత కుండలిలో మిధునరాశికి  సంబంధం లేదుకదా? మరి ఇది అమెరికాలో ఎందుకు జరిగింది? అని. ఈ  పాయింట్ అర్ధం కావాలంటే, మేదినీ జ్యోతిష్యం లోని మరొక్క సూత్రం మీకు అర్ధం కావాలి. ఇది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంధాలలో మీకు దొరకదు. నా రీసెర్చిలో దీనిని నేను కనుక్కున్నాను. దాని పేరే 'ఆచ్చాదనాయోగం'.

ఈ ఆచ్చాదనా యోగం ప్రకారం ఒక రాశిలో ఉన్న ప్రతిగ్రహమూ తన ముందూ వెనుక రాశులను ఆచ్చాదిస్తుంది, అంటే తన ప్రభావంతో కప్పేస్తుంది. ఆ గ్రహం యొక్క రాశిలో రాహుకేతువులు గనుక ఉంటే, వాటి విపరీతపు నడక యొక్క ప్రభావం వల్ల వెనుక రాశిమీద ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదీ ఆ సూత్రం. దీనిని నేను  కొన్ని వందల జాతకాలలో గమనించిన మీదట స్థిరీకరించాను. ప్రామాణిక గ్రంధాలలో ఇది చూచాయగా అక్కడక్కడా చెప్పబడి ఉన్నప్పటికీ, ఆచరణలో ఎవ్వరూ దీనిని ఉపయోగించడం లేదు. ఇదొక మరుగునపడిపోయిన ప్రాచీన జ్యోతిష్య సూత్రం. దీనిని నేను వెలికితీశాను.

ఇప్పుడు దీనిని వివరిస్తాను చూడండి.

కుజుని రాశి అయిన వృశ్చికంలో కేతువున్నాడు. కనుక కుజునికి వెనుక దృష్టి బలంగా ఉంటుంది.  కనుక, తన వెనుక రాశి అయిన వృషభాన్ని బలంగా చూస్తాడు లేదా ఆఛ్చాదిస్తాడు. ప్రస్తుతం వృషభంలోనే పౌర్ణమి జరుగుతోంది. పైగా లగ్నం కూడా అదే అయింది. అన్నింటినీ మించి కుజశుక్రుల డిగ్రీలను గమనించండి. కుజుడు 26 డిగ్రీలలోను, శుక్రుడు 27 డిగ్రీలలోను ఉన్నారు. అంటే ఖచ్చితమైన ఆచ్చాదనా యోగం వీరిద్దరి మధ్యనా ఉన్నది. కానీ ఇలాంటి హింసాత్మక ఘటన జరగడానికి కుజశుక్రులమధ్యన ఉన్న సంబంధం సరిపోదు. శని కుజుల మధ్యన ఉండాలి. అదెలా జరిగిందో వినండి మరి.

వక్రశని ధనుస్సులోకి వస్తాడు. అక్కడనుంచి కుజుని సప్తమదృష్టి ఆయనపైన బలంగా పడుతుంది.  అంతేగాక,  కాల్పులను, పేలుళ్లను, దుందుడుకు చర్యలను కలిగించే యురేనస్ దృష్టి మేషం మీదనుంచి శనిమీద ఉన్నది. అదే విధంగా కుజునిమీద పడుతూ, అక్కడనుంచి మళ్ళీ శనికి సరఫరా అవుతున్నది. మరి కాల్పులవంటి హింసాత్మక చర్యలకు దోహదమయ్యే యోగం ఏర్పడిందా లేదా? మీరే చెప్పండి.

ఈ విధంగా అమెరికాకు సూచికైన మిధునరాశి పాత్ర ఈ కుండలిలో స్పష్టంగా ఉన్నది. 

జరుగుతున్న దశను చూద్దాం - అది శని - చంద్ర - సూర్యదశ అయింది. శని బాధకుడు, నాశనాన్ని సూచించే అష్టమంలో ఉన్నాడు. సూర్యచంద్రులు పౌర్ణమిని సూచిస్తున్నారు. ఇంకేం కావాలి?

ఇవన్నీ కలవబట్టే ఈ సంఘటన జరిగింది. అమావాస్య పౌర్ణమి ప్రభావాలకు కొన్ని వందల రుజువులను కొన్ని ఏళ్లుగా చూపిస్తూ వస్తున్నాను,. అలాంటి పౌర్ణమి ప్రభావానికి ఇది మరో సరికొత్త ఉదాహరణ !
read more " శాన్ జోస్ కాల్పులు - ఆచ్చాదనాయోగం "

20, మే 2021, గురువారం

పానీ పూరీ - బూజు బ్రెడ్డు

కరోనాకు తోడు ఇప్పుడు బ్లాక్ ఫంగసంట !

అసలీ రోగాలు ఎలా పుడతాయో, వీటిని ఎవడు కనుక్కుంటున్నాడో అర్ధం కాక తెగ ఆలోచిస్తుంటే మాగన్నుగా నిద్రపట్టేసింది. నిద్రలో కల! కలలో యధావిధిగా తనే ప్రత్యక్షమైంది. తనంటే మళ్ళీ అపార్ధం చేసుకోకండి. కర్ణపిశాచే !

కుశలప్రశ్నలూ అవీ అయ్యాక, నా సందేహాన్ని తనదగ్గరే వెలిబుచ్చాను.

'అసలేంటీ గోల? ఈ కరోనా ఏంటి? బ్లాక్ ఫంగస్ ఏంటి? అసలివెప్పట్నుంచీ ఉన్నాయి? ఎందుకిప్పుడే విజృంభిస్తున్నాయి? సెలవివ్వుము' అనడిగా.

కర్ణపిశాచి అలిగింది.

'అంతేలే. పనున్నపుడేగా నేన్నీకు గుర్తొచ్చేది' అంది  నిష్టూరంగా. 

వార్నీ ! మనుషుల్నేగాక వీటిని కూడా భంగపోవాలా? సరే ఏం చేస్తాం? అనుకుంటూ,

'మా బుజ్జి కదూ ! నీకేం కావాలో చెప్పు. ఒక డజను రెండిసివర్ వయల్స్ బ్లాకులో కొనివ్వనా? తీసికెళ్తావా? మీలోకంలో ఫ్రిజ్ లో దాచుకుంటావా?' అడిగా బ్రతిమిలాడుతూ.

కర్ణపిశాచి పాపం అల్పసంతోషి. కరిగిపోయింది.

'సరే ! చెప్తా విను. ఇవన్నీ పురాణకాలంలోనే ఉన్నాయి' అంది సీరియస్ గా.

నాకు కళ్ళు గిర్రున తిరిగాయి.

'అవునా?' అన్నా తెగ హాచ్చర్యపోతూ.

'అవును. ఎక్కువ నటించకుండా విను. కరోనా పుట్టింది ద్రౌపదితో' అంది.

నిద్రలోనే కెవ్వున కేకేశాను.

'మరి బ్లాక్ ఫంగస్ పుట్టింది హిడింబి తోనా?' అడిగా సిన్సియర్ గా.

'కరెక్ట్. అందుకే నువ్వంటే నాకు తెగిష్టం. నిద్రలో కూడా నీ బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తోంది మరి' అంది మురిసిపోతూ.

నాకు మళ్ళీ భలే హాచ్చర్యమేసింది 'ఏంటి ఇంత కరెక్టుగా ఎలా గెస్ చేశానబ్బా' అని. 

అయినా సరే హాచ్చర్యాన్ని పక్కనపెట్టి 'ఇవి రెండునూ ఎట్లుద్భవించినవి? ఎట్లు మనవరకూ వచ్చినవి? ఎట్లు మనలను పీడించుచున్నవి? ఆ వృత్తాన్తమంతయూ పూసగుచ్చినట్లుగా వివరించుము' అంటిని.

'వినుము. వివరించెదను' అని పిశాచి చెప్పదొడంగినది.

'పాండవులు వనవాసం చేసే సమయంలో అడవిలో కుటీరాలు వేసుకుని వాటిల్లో ఉండేవారు. కానీ ఈ గెస్టులున్నారు చూశావూ, వాళ్ళను వెతుక్కుంటూ వస్తూనే ఉండేవాళ్ళు' అంటూ మొదలు పెట్టింది.

చెబుతున్నదాన్ని మధ్యలోనే ఆపి - 'ఏదీ ఇప్పుడు కూడా, మా ఇంటికి రావద్దురా బాబూ ఎవరింట్లో వాళ్ళుండండిరా బాబూ అని మొత్తుకుంటున్నా కూడా, తెగించినట్టి గెస్టులు, బంధువులు వస్తుంటారు చూడు అలాగన్నమాట' అన్నాను.

'ఆ అంతే అలాగే ! ఆ విధంగా, చాలామంది గెస్టులు వాళ్ళకోసం కూడా వస్తూ ఉండేవారు. పాపం ద్రౌపది ఆ విధంగా వచ్చిన గెస్టులందరికీ వండి పెడుతూ ఉండేది. పైగా ఒకరా ఇద్దరా? పాండవుల ఫాన్స్ అందరూ వస్తూ ఉండేవారు. ఆ మహాతల్లి అందరికీ వండి వడ్డిస్తూ ఉండేది.  ఇలా ఉండగా, ఒకరోజున అనుకోకుండా సాయంత్రం పూట చాలామంది గెస్టులు వచ్చిపడ్డారు. ఏం  తెలీని ద్రౌపది, అప్పటికే సిద్ధంగా ఉన్న పూరీపిండిని చిన్న చిన్న పూరీలు చేసి, నీళ్లలో మసాలా వేసి ఉడికించి, పానీపూరీలు చేసి వారందరికీ పెట్టింది. అందరూ తృప్తిగా తిని వెళ్లిపోయారు. ఆ విధంగా పానీపూరీ పుట్టింది' అంటూ ఆగింది కర్ణపిశాచి.

'ఇదంతా బానే ఉందిలేగాని, దీనికీ కరోనాకీ సంబంధం ఏమిటో చెప్పిచావుము' అన్నా.

'వస్తున్నా. నీకన్నీ తొందరే, కొంచం ఆగు. గెస్టులు అలా వెళ్ళిపోయాక ద్రౌపది ముందు ఒక రాక్షసి ప్రత్యక్షమైంది'

' ఎవరు నువ్వు? ఎందుకొచ్చావ్?' అనడిగింది ద్రౌపది.

'నేనీ అడివిలోనే ఆ చెట్టుమీదనే ఉంటాను. నా పేరు కరోనా. ఎందరో గెస్టులు  మీ ఇళ్లకు వచ్చిపోవడం  చూస్తూ ఉన్నాను. వారందరికీ నువ్వు చాలా శ్రద్ధగా భక్తిగా సేవ చెయ్యడం కూడా చూస్తున్నాను. కానీ ఈరోజున నీవు చేసిన క్రొత్త వంటకం నాకు చాలా నచ్చింది. నాక్కూడా అది చేసి పెట్టుము' అని రిక్వెస్ట్ చేసింది కరోనా రాక్షసి.

పోన్లేపాపం అనుకున్న ద్రౌపది రాక్షసి కోరినట్లే పానీపూరీలు చేసి పెట్టింది. తృప్తిగా తిన్న రాక్షసి మాయమయ్యేముందు ద్రౌపదికి ఒక వరం ఇచ్చింది.

'ముందుముందు కలియుగంలో అధర్మం పెరిగిపోయినప్పుడు నేను విజృంభించి సర్వనాశనం చేయబోతున్నాను. భూభారం తగ్గించబోతున్నాను. కలియుగంలో మనుషులు శుచీశుభ్రతా లేకుండా, ఎక్కడబడితే అక్కడ తింటూ తాగుతూ విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటారు. అదే వాళ్లకు శాపమౌతుంది. అలాంటివాళ్లను నేను తినేస్తాను. ఆ సమయంలో ఎవరైతే పానీపూరీల బండ్లదగ్గర రోడ్లమీద నానాచెత్తా తింటూ ఉంటారో వాళ్ళను ఎక్కువగా ఎటాక్ చేస్తాను. కానీ నీ పేరు తలచుకుని పానీపూరీ తినేవాళ్ళజోలికి మాత్రం పోను. ఇదే నేనిస్తున్న వరం' అని చెప్పి మాయమైపోయింది కరోనా రాక్షసి.

వింటున్న నాకు మతిపోయింది. 'అమ్మా ఇదా రహస్యం ! ఈ విషయం తెలీక కదా, అమెరికోడు నానామందులూ తయారు చేస్తున్నాడు. లోకమంతా తల్లక్రిందులైపోతోంది. చచ్చేవాళ్ళు చస్తుంటే, బతికున్నవాళ్ళు వాక్సిన్లకోసం కొట్టుకుచస్తున్నారు. సింపుల్ గా పానీపూరీ తింటే కరోనా నయమౌతుందా? భలే సీక్రెట్ చెప్పావే? ఓకే, మరి బ్లాక్ ఫంగస్ కధ చెప్పు' అడిగా ఉత్సాహంగా.

'ఏంటి? ఉత్సాహం చాలా ఎక్కువగా ఉందే? సరే విను' అంటూ 'ఒసేయ్ ఇట్రావే' అని ఎవరినో పిలిచింది కర్ణపిశాచి.

వెంటనే నల్లగా తుమ్మమొద్దులాగా అందంగా ఉన్న ఒకమ్మాయి ప్రత్యక్షమైంది.

నేను కలలోనే ఝడుసుకుని 'అమ్మోయ్ ! ఈ అమ్మాయెవరు?' అంటూ అరిచా.

'భయపడినట్లు ఎక్కువగా నటించవద్దని ముందే చెప్పానీకు. ఈ అమ్మాయే బ్లాక్ ఫంగస్. మన సంస్కృతభాషలో 'నీలకిణ్వని' అంటార్లే. మీకు తెలీక బ్లాక్ ఫంగస్ అంటున్నారు. సంస్కృతం, ఆయుర్వేదం మరచిపోతే ఇలాగే ఉంటాయి మీ బ్రతుకులు' అంది పిశాచి.

'సరే ఒప్పుకున్నా తల్లీ, మేమన్నీ మరచిపోయాం. భ్రష్టులమైపోయాం. ఎక్కువగా తిట్టకు. విషయంలోకి రా' బ్రతిమిలాడా.

'నేనెందుకు? తనే చెప్తుంది. చెప్పవే కిన్నీ' అంది పిశాచి ముద్దుగా.

'కిన్నీ? అబ్బో , ముద్దుపేర్లు కూడానా మీకు' అనుకున్నా లోలోపల.

గుర్రుగా చూసిన కిన్నీ చెప్పడం మొదలుపెట్టింది.

'భీముడు ఆటవికరాజ్యానికి వెళ్లి, వాళ్ళను మల్లయుద్ధంలో జయించి, వాళ్ళమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరే హిడింబి. పెళ్లయ్యాక ఆ అమ్మాయి కూడా వీళ్లతోబాటే ఉంటూ ఉండేది. ఆమెను నేటి రాజస్థాన్ ప్రాంతంలో ఉంచాడు భీముడు. అయితే అందరితో ఉండకుండా ఆమె తనదైన వేరే కుటీరంలో ఉండేది. ద్రౌపది పాండవులందరికీ కామన్ భార్య అయినప్పటికీ, అందరికీ మళ్ళీ వేరే భార్యలుండేవారు. అలాంటి వాళ్లలో, భీముడికి హిడింబి ఒక భార్య. ఆ హిడింబి రాక్షసమ్మాయని అందరూ అంటారుగాని రాక్షసులనేవాళ్ళు అసలు లేరు. అడివిమనుషులనే అలా పిలిచేవారు అప్పట్లో.  కనుక హిడింబి ఆటవిక అమ్మాయి. వాళ్ళ తిండి తిప్పలు తేడాగా ఉంటాయి. వాళ్లకు పులిసిన పదార్ధాలంటే భలే ఇష్టం. పులిసిన కల్లు త్రాగుతారు, పులిసిన పండ్లు తింటారు, ఆహారం కూడా పులవబెట్టి తింటేనే వాళ్లకు బాగుంటుంది. అందుకని ఆమె అలాంటి తిండి తయారుచేసుకుని తింటూ ఉండేది. ఇదిచూసి పాండవుల మిగతా భార్యలందరూ ఒకరోజున ఆమెను గేలిచేశారు.  ఎందుకంటే, వాళ్లంతా రాజస్థాన్ ప్రాంతం నుంచి వచ్చిన తెల్లటి అందగత్తెలు. ఆమె నల్లగా ఉంటుందని, పులిసిన తిండి తింటుందని,  అందరూ కలసి ఆమెను ఎగతాళి చేశారు.

ఆమెకు వాళ్ళమీద కోపమొచ్చి ఇలా శాపం పెట్టింది 'ముందు ముందు ఎవరైతే ఆహారాన్ని మూడు నాలుగురోజులు మురగబెట్టి పులవబెట్టి తింటారో, వాళ్లకు బ్లాక్ ఫంగస్  అనే రోగం వచ్చుగాక. ఎక్కువగా ఇది బ్రెడ్ మీదా, పులవబెట్టి, ఎండ తగలని చోట్లలో ఉండే ఆహారం మీదా, ఫ్రిజ్ లోనూ పుట్టుగాక. అది సోకినవారందరూ చచ్చుదురుగాక'. 

ఈ శాపాన్ని విని భయభ్రాంతులైపోయిన మిగతా సవతులందరూ ఆమె కాళ్ళమీద పడి ప్రార్ధించగా ఎట్టకేలకు కరుణించిన ఆమె శాపవిమోచనం ఇలా అనుగ్రహించింది.

'పులిసిన పదార్ధాలు తినేముందు నన్ను తలుచుకుని ఎవరైతే తింటారో వాళ్ళను మాత్రం ఈ బ్లాక్ ఫంగస్ ఏమీ చెయ్యదు'.

'ఓహో ఇదా కనెక్షన్? అందుకా ఈ నీలకిణ్వని ఇలా రాక్షసిలాగా ఉన్నప్పటికీ మహా అందంగా ఉంది? హిండిబి రాజస్థాన్లో ఉండేదా? అందుకేనా అక్కడే బ్లాక్ ఫంగస్ ఎక్కువగా ఉంది?' అనుకున్నా లోలోపల.

'సరే వాళ్లెవరో చేసిన నేరాలకి మనకు పడుతోందన్నమాట శిక్ష? బాగుంది. అయితే, ఇప్పుడేం చెయ్యమంటారో చెప్పండి, మీరిక వెళ్తే నెన్నిద్రపోవాలి' అన్నా పెద్దగా ఆవలించినట్టు నటిస్తూ. లేకపోతే, ఇలాగే కథలమీద కధలు చెబుతూ వదిలేటట్టు లేరు.

'అదే మరి మీ మనుషుల బుద్ధి? పనైపోయాక వెంటే వెళ్లిపొమ్మంటారు. అందుకే మేం మీకు కనిపించనిది. మీ దగ్గరకు రానిది' అన్నారిద్దరూ ముక్తకంఠాలతో.

'ఛీ ఛీ నేనలాంటోన్ని కాను. పనితో సంబంధం లేదుగాక లేదు. నేనెప్పుడూ మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటాను. మరచిపోయే ప్రసక్తే లేదు. మరి ఈ కరోనా, బ్లాక్ ఫంగస్ సమస్యలకు ఉపాయం చెప్పండి' అడిగా ఇద్దర్నీ ప్రాధేయపడుతూ.

'భారతమంతా విని, ఇంతకీ పాండవులకు ద్రౌపదేమౌతుంది? అన్నాట్ట నీలాంటోడు. అలా ఉంది నీ సంగతి. విన్నావుగా అంతా. అందులోనే సీక్రెట్ ఉంది. రోజూ రోడ్లమీద బండ్లదగ్గర, దుమ్మూధూళీ మధ్యలో, పానీపూరీలను నానాచెత్తా ఉన్న మసాలానీళ్ళ బకెట్లో ముంచుకొని తింటూ ఉన్నాసరే, ద్రౌపదీదేవిని భక్తిగా స్మరించి, ఆ తర్వాత అవన్నీ తింటే, కరోనా మీ జోలికి రాదుగాక రాదు. అదే విధంగా, వారంనాటి డేట్ ఎక్స్ ఫైర్ అయిన బ్రెడ్డూ, మురగబెట్టిన మైదాపిండీ, కుళ్ళిన మజ్జిగా, మురిగిపోయిన కూరలూ, ఫంగస్ పప్పూ, ఫ్రిజ్ లో పెట్టుకుని బాగా మెక్కుతున్నప్పటికీ, హిడింబిదేవిని భక్తిగా తలచుకుంటే, బ్లాక్ ఫంగస్ మీ దరిదాపులకే రాదు. ఎన్ని సార్లు చెప్పమంటావ్ నీ మొద్దు బుర్రా నువ్వూనూ' అంది కరోనా చాలా కోపంగా.

'ఆమ్మో కోపం వద్దు శాంతించండి. సరే రేపట్నించీ అలాగే చేస్తా. ప్రామిస్' అన్నా ఇద్దరికీ చేతులో చెయ్యేస్తూ.

చెయ్యి విదిలించుకుని, కోపంగా చూస్తూ మాయమైపోయారిద్దరూ.

అర్థమైందా నాయనలార ! పానీపూరి, బూజు బ్రెడ్డు, ప్రిజ్ లో మురగబెట్టిన కూరలు, బూజుపప్పు, కుళ్ళిన పెరుగు, మురిగిన మజ్జిగ, నెలనాటి సాంబారు, కుళ్ళిన మాంసం, పులిసిన చేపలు, కుళ్ళిపోయిన నానా జంతువులు, అన్నీ సుష్టుగా తినండి. ద్రౌపదీదేవినీ, హిడింబీదేవినీ మాత్రం తలుచుకోండి. ఈ ఒక్కటీ చెయ్యండి చాలు. అవన్నీ తినకుండా మీరెలాగూ ఉండలేరు. తినడం మానలేరు. కనుక ఈ ఒక్క ట్రిక్కు పాటించండి. వాతాపి జీర్ణం ! మీరు తిన్న నానా చెత్తంతా శుభ్రంగా అరిగిపోతాయి. ఏ మందూ అక్కర్లేదు. ఏ వాక్సినూ అక్కర్లేదు. మీకే రోగమూ రాదు.

ఏంటీ లోకం తగలబడుతుంటే నీ పరాచికాలు? నీరోకీ నీకూ పోలికలున్నాయే అంటారా? మనందరమూ నీరోలమే. ఎవడేం పాటిస్తున్నాడు గనుక? నేను చూస్తున్నంత వరకూ ఎవ్వడూ ఏదీ పాటించడం లేదు. హ్యాపీగా తిరుగుతున్నారు. వచ్చినపుడు ఎక్కడో చేరుతున్నారు. బ్రతికితే బ్రతుకుతున్నారు. పోతే పోతున్నారు. ఎవడికీ ఏ విధమైన లెక్కా లేదు. జమా లేదు. అంతా డ్రామా ! అంతే !

అర్థమైందా? ఉంటా మరి !

హ్యాపీ కరోనా ... హ్యాపీ బ్లాక్ ఫంగస్ !

ఎంజాయ్ యువర్ డేస్ !

read more " పానీ పూరీ - బూజు బ్రెడ్డు "

19, మే 2021, బుధవారం

తీరుతుంది...

వివరం సరిగ్గా వెల్లడైతే

ఆశ చచ్చిపోతుంది

సంసారమన్నా సన్యాసమన్నా

మనుగడన్నా మరణమన్నా


విషయం సరిగ్గా తెల్లమైతే

ఆకలణగి పోతుంది

తిండన్నా అండన్నా

గొప్పలన్నా తిప్పలన్నా


మొత్తం చూసేసినప్పుడు

మోజు తీరిపోతుంది

తనవారన్నా పగవారన్నా

దూరమన్నా దగ్గరన్నా


దారులన్నీ తెలిసినపుడు

దాహమారిపోతుంది

అమృతమన్నా గరళమన్నా

అకృత్యాలన్నా సుకృత్యాలన్నా


కర్మ ఎక్కువైపోయినపుడు

కాటు పడే తీరుతుంది

మోతుబరైనా సాగుబరైనా

మాయకుడైనా అమాయకుడైనా


మాట వినకపోయినపుడు

మూత పడే తీరుతుంది

నోటికైనా తేటికైనా

లోటేలేని చోటుకైనా...

read more " తీరుతుంది... "

16, మే 2021, ఆదివారం

టౌటే తుఫాన్ - శుక్ర రాహువుల ప్రభావం

14-5-2021 తేదీన కేరళదగ్గరలోని అరేబియా మహాసముద్రంలో ఒక వాయుగుండం పుట్టింది. 15 వ తేదీకల్లా అది తుఫానుగా మారింది. నేటికది ఇంకా తీవ్రరూపం దాల్చింది. గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నాయి. నూరు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. తుఫాన్ చేసే అల్లకల్లోలాన్ని సరిగ్గా ఎదుర్కోడానికి మూడురాష్ట్రాలూ సిద్ధపడుతున్నాయి. మంత్రులు వెస్ట్ కోస్ట్ లో మకాం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుని యంత్రాగమంతా సిద్ధమౌతోంది. లక్షద్వీప్ కు విమానాలు రద్దయ్యాయి. గత ఇరవై ఏళ్లలో ఇండియాలో ఇంతపెద్ద తుఫాన్ రాలేదని అంటున్నారు. మూడు రాష్ట్రాల పవర్ లైన్స్ కట్ అవుతున్నాయి.

జ్యోతిష్యదుర్భిణీ లోనుంచి ఏం జరుగుతున్నదో చూద్దాం.


శుక్ర రాహువుల పాత్ర

జలకారకుడైన శుక్రుడు ప్రస్తుతం రాహువును వేగంగా సమీపిస్తున్నాడు. రాహువుకూడా శుక్రుడినే సూచిస్తూ ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. అక్కడే మరొక జలగ్రహమైన చంద్రుడు కూడా ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. కనుక జలభూతం అమితమైన బలాన్ని సంతరించుకుంది. వీరి కోణదృష్టి మకరంలో ఉన్న శనిమీదున్నది. మకరరాశి భారతదేశానికి సూచిక. మన దేశపు స్వతంత్రసమయలగ్నం వృషభమే. అదే వృషభంలో ఇప్పుడు జలభూతం విజృంభించడం, టౌటే తుఫాన్ అదే సమయంలో తలెత్తడం కాకతాళీయమనుకుందామా?

శుక్రుడు రాహువుయొక్క 5 డిగ్రీల పరిధి (ఆర్బ్) లోకి రాగానే అరేబియా సముద్రంలో డిప్రెషన్ మొదలైంది. శుక్ర రాహువుల మధ్యన దూరం తగ్గుతున్న కొద్దీ తుఫాన్ బలపడుతున్నది. ఈ క్రింది పట్టికను గమనించండి.














తుఫాన్ దిశ ఎలా మారింది?

డిప్రెషన్ మొదలైన 14 వ తేదీన, అది తుఫాన్ గా మారిన 15, 16 వ తేదీలలో శుక్రుడు వృషభం 15 డిగ్రీలలోపలే ఉన్నాడు. అంటే, పశ్చిమదిశలో ఉన్నాడు. కనుక భారతదేశంలోని పశ్చిమ సముద్రంలో తుఫాన్ మొదలైంది. 17 వ తేదీనుంచి శుక్రుడు 15 డిగ్రీలను దాటి, ఉత్తరదిక్కులోకి ప్రవేశించాడు. కనుక తుఫాన్ ఉత్తరదిక్కుగా దిశను తీసుకుని, గోవా మీదుగా గుజరాత్ వైపు వెళ్లడం మొదలుపెట్టింది.

వృషభరాశిలో ఉన్న శుక్రుడు సవ్యదిశలో ముందుకు ప్రయాణిస్తున్నాడు. రాహువు దానికి వ్యతిరేకంగా అపసవ్యదిశలో ప్రయాణిస్తూ శుక్రుడిని మ్రింగబోతున్నట్లుగా కదులుతున్నాడు. వీరిద్దరి కంజక్షన్ ఎల్లుండి అంటే 18 వ తేదీన జరుగుతుంది. కనుక ఆ రోజున తుఫాన్ తీరాన్ని తాకుతుంది.ఆ తరువాత బలహీనపడిపోతుంది. 19 నుంచి శుక్రుడు రాహువును దాటి ముందుకు సాగిపోతాడు. కనుక తుఫాన్ బలహీనపడుతుందని ఊహిస్తున్నాను.

చూద్దాం ముందుముందు ఏం జరుగనున్నదో !

read more " టౌటే తుఫాన్ - శుక్ర రాహువుల ప్రభావం "

12, మే 2021, బుధవారం

రష్యా స్కూల్లో కాల్పులు - అమావాస్య ప్రభావం

11-5-2021 మంగళవారం ఉదయం 9. 20 నిముషాలకు రష్యాలోని కజాన్ సిటీలో ఒక స్కూల్లో, ఒక దుండగుడు జరిపిన కాల్పులలో తొమ్మిదిమంది విద్యార్థులు చనిపోయారు. 18 మంది విద్యార్థులు గాయపడ్డారు. దుండగుడు ఇంతకుముందు అదే స్కూల్లో చదివాడని అంటున్నారు. అతనికి మానసిక సమస్యలున్నాయని కూడా అంటున్నారు. జ్యోతిష్యపరంగా ఏం జరిగిందో చూద్దాం.

నిన్న నిండు అమావాస్య. అమావాస్యరోజున పిచ్చోళ్లకు పిచ్చి ఉద్రేకిస్తుందన్నది ప్రపంచవ్యాప్తంగా రుజువైన సత్యం. మరి అలాంటి అమావాస్య రోజున, మానసిక సమస్యలున్న యువకుడికి, అందులోనూ గన్ చేతులో ఉన్నవాడికి, ఇలాంటి బుద్ధి పుట్టడంలో ఆశ్చర్యమేముంది? 'పిచ్చోడి చేతిలో రాయి' అని మన దేశంలో ఒక సామెతుంది. మనకు తుపాకులు లేవుగనుక ఆ సామెత వచ్చింది. విదేశాలలో అయితే, 'పిచ్చోడి చేతిలో తుపాకీ' అని మార్చుకోవాల్సి వస్తుందేమో మరి !

ఆ సమయంలో కజాన్లో ఉదయిస్తున్న లగ్నడిగ్రీ మిథునం 16 అవుతూ, హింసకు, దుర్ఘటనలు, కోపాలకు ప్రేరకుడైన కుజునికి చాలా దగ్గరగా ఉంది. నిన్న మంగళవారం కూడా. కుజుని కోణదృష్టి కుంభంలో ఉన్న గురువు మీదున్నది. కుంభరాశి రష్యాను సూచిస్తుందని చాలామంది పాశ్చాత్య జ్యోతిష్కులు భావిస్తారు. ఇందులో నిజం ఉండి ఉండవచ్చు. 

కుంభరాశిని రష్యారాశిగా తీసుకుని చూచినప్పుడు, అక్కడనుంచి విద్యాస్థానమైన చతుర్దంలో రాహుబుధులు ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్ లో 17 వ డిగ్రీమీద, చంద్రనక్షత్రమైన రోహిణిలో ఉన్నారు. బుధుడు విద్యార్థులను సూచిస్తాడు. చంద్రుడు చిన్నపిల్లలను సూచిస్తాడు. రాహువు ప్రమాదాలను, ఘోరమైన చావును సూచిస్తాడు.

ప్రస్తుతం ఖగోళంలో ఉన్న ప్రమాదకరమైన యోగం శనిపైన ఉన్న అష్టమకుజదృష్టి. మకరం నుంచి ఈ దృష్టిప్రభావం  శనియొక్క కోణదృష్టి ద్వారా వృషభం మీద పడుతున్నది.  వృషభం, రష్యాకు విద్యాస్థానమైంది. అంటే, స్కూల్స్ ని సూచిస్తున్నది.  పైగా, వృషభం రెండువైపులా కుజునితోను, అమావాస్య యోగంతోనూ ఆర్గళదోషానికి గురైంది. అమావాస్య తిధి దీనికి ఆజ్యం పోసింది.

ఆ సమయంలో శుక్ర - రాహు - శుక్రదశ నడుస్తోంది. శుక్ర రాహువులిద్దరూ వృషభంలో ఉండటం చూడవచ్చు. కనుక వృషభరాశి ఈ సంఘటనకు కేంద్రస్థానంగా మారింది. అది, రష్యాలోని స్కూళ్లను సూచిస్తోంది. కనుక, రష్యాలోని స్కూల్లో ఈ దుర్ఘటన జరిగింది. అంతేగాక ఆ సమయంలో శుక్రహోర నడుస్తున్నది. కనుక శుక్రప్రాముఖ్యత ఉన్నది.

జ్యోతిష్య విద్యార్థులకు ఉపయోగపడుతుందని, లొకేషనల్ ఎస్ట్రాలజీలో మరొక్క సూత్రాన్ని ఇక్కడ  పరిచయం చేస్తున్నాను.

కుంభరాశి రష్యాను సూచిస్తుంది. ఇది పశ్చిమరాశి. రష్యాను మళ్ళీ నాలుగు ముక్కలు చేస్తే, మొదటి 7. 5 డిగ్రీలు పశ్చిమదిక్కునే సూచిస్తాయి. ఆ భాగంలోనే, అంటే రష్యా పశ్చిమభాగంలోనే కజాన్ సిటీ ఉన్నది. అక్కడే ప్రస్తుతం 5 డిగ్రీల మీద గురువున్నాడు. గురువు కూడా విద్యాకేంద్రాలను, ఉపాధ్యాయులను సూచిస్తాడు. ఈ సంఘటన ఇక్కడే ఎందుకు జరిగింది? అనేదానికి ఈ చిన్న క్లూ చాలనుకుంటాను. అర్ధం చేసుకోగలిగితే అర్ధం చేసుకోండి !

అమావాస్య ప్రభావానికి ఈ సంఘటన మరో నిదర్శనం !
read more " రష్యా స్కూల్లో కాల్పులు - అమావాస్య ప్రభావం "

11, మే 2021, మంగళవారం

ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ - జ్యోతిష్య విశ్లేషణ

జెరూసలేం అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ మళ్ళీ రాజుకుంది. చిలికి చిలికి గాలివానౌతోంది. ఇజ్రాయెల్ మీద పాలస్తీనా రాకెట్ దాడులు చేసింది. చాలామంది చనిపోయారు. ఇజ్రాయెల్ ప్రతీకారదాడులు మొదలుపెడితే ఏమౌతుందో  అన్ని దేశాలకూ తెలుసు. అందుకని అందరూ రంగంలోకి దిగి ఇజ్రాయెల్ ను ఆగమంటున్నారు. కానీ ఇజ్రాయెల్ ఆగదు. దెబ్బకు దెబ్బ తీస్తుంది. తియ్యకపోతే అన్ని ముస్లిందేశాల మధ్యన దాని మనుగడే ప్రశ్నార్థకమౌతుంది.

ముందు ముందు ఏం జరుగబోతోంది? ప్రపంచయుద్ధం ఇక్కడినుంచే వస్తుందని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడేనా? ఇంకా టైముందా? అనేదే అసలైన ప్రశ్న.

అక్కడసలేం జరుగుతోందో జ్యోతిష్యపరంగా చూద్దాం.

6-5-2021 న అక్కడ గొడవలు మొదలయ్యాయి. ఎందుకు మొదలయ్యాయి అన్నది నెట్లో ఉంటుంది గనుక మళ్ళీ నేను వివరించి చెప్పవలసిన పని లేదు. క్లుప్తంగా చెప్పాలంటే జెరూసలేం రెండు ముక్కలుగా విడగొట్టబడి ఇద్దరి అధీనంలో ఉన్నది. తూర్పువైపు పాలస్తీనా అదుపులో, పడమర వైపు ఇజ్రాయెల్ అదుపులో ఉంది. అక్కడ జరిగిన ఒక గొడవతో రెండుపక్షాలకూ యుద్ధం మళ్ళీ మొదలైంది.

అసలిదంతా బ్రిటిష్ వాడి చలవే. ఈనాడు మనం పాకిస్తాన్ తో, బాంగ్లాదేశ్ తో తంటాలు పడటమూ, ఇజ్రాయెల్ తన చుట్టూ ఉన్న ముస్లిం దేశాలతో గొడవలు పడుతూ దినదినగండంగా జీవిస్తూ ఉండటమూ ఇవి రెండూ తెల్లవాడి చలవలే. మన దేశాన్ని రెండు ముక్కలు చేసి రెండు పాకిస్థాన్ల మధ్యన మనల్ని ఇరికించి వాళ్ళు తప్పుకున్నారు. అదే విధంగా ముస్లిం దేశాల మధ్యలో ఒక చిన్న ముక్కని 'ప్రామిస్డ్ ల్యాండ్' అంటూ ఇజ్రాయెల్ అనేపేరుతో సృష్టించి రావణకాష్టానికి ఆజ్యం పోశారు. అలాంటి రావణకాష్ఠమే కాశ్మీర్ కూడా. 70 ఏళ్ళనుంచీ రగులుతున్న ఆ కాష్టం బీజేపీ పుణ్యమా అని, మోదీగారి పుణ్యమా అని, ఆరిపోయింది. ఈ ఒక్కపని చేసినందుకు భారతదేశం బీజేపీకి కలకాలం ఋణపడి ఉండాలి. ఇంకొక వెయ్యేళ్ళు మన దేశాన్ని బీజేపీనే పాలించాలనేది నా ఆకాంక్ష. సరే అది ఇంకో సబ్జెక్ట్ గనుక ప్రస్తుతం దానిని కొంచం ప్రక్కన ఉంచుదాం.

బ్రిటిష్ వాడు తన పాలించిన దేశాలన్నింటిలోనూ, దోచుకున్నంత దోచుకుని, ఆ తర్వాత చిచ్చుపెట్టి మరీ ప్రక్కకు తప్పుకున్నాడు. ఆ చిచ్చులు ఈ నాటికీ రగులుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ కీ మనకూ పక్కపక్క సంవత్సరాలలో స్వతంత్రం వచ్చింది. మన సమస్యలు కొన్ని తీరాయి. కానీ ఇజ్రాయెల్ సమస్య మాత్రం ఈనాటికీ రగులుతూనే ఉన్నది.

ఆ రోజున గ్రహస్థితిని పైన ఇచ్చాను చూడండి.

మిడిల్ ఈస్ట్ లోని ముస్లిం దేశాలలాగే, ముస్లిం దేశం కాకపోయినప్పటికీ ఇజ్రాయెల్ కూడా ధనూరాశిలోనే ఉంటుంది. ధనూరాశి ప్రస్తుతం శనికేతువుల మధ్యన దుర్ఘటనాయోగంతో బందీ అయ్యి ఉన్నది. శని 19 డిగ్రీలలో, కేతువు 18 డిగ్రీలలో ఉన్నారు.అంతేగాక వీరి మధ్యబిందువును యుద్ధకారకుడైన కుజుడు మిధునం 13 వ డిగ్రీ పైనుంచి బలమైన సప్తమదృష్టితో చూస్తున్నాడు. యురేనస్ కోణదృష్టి మేషం 16 డిగ్రీల నుండి ధనుస్సు 16 డిగ్రీలను చూస్తోంది. ధనుస్సులో ఇది శనికేతువుల మధ్యబిందువైంది. ఈ యోగం వల్ల ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యన మళ్ళీ గొడవలు మొదలయ్యాయి.

8-5-2021 నాడు మళ్ళీ గొడవలయ్యాయి. ఆరోజున ముస్లిముల పవిత్రరాత్రి అయిన లయలతుల్ కదర్. ముస్లిముల ప్రార్ధనల అనంతరమే వాళ్ళు అందరినీ ఎటాక్ చేస్తారన్నది జగమెరిగిన సత్యం. అలాగే ఆరోజున కూడా జరిగింది. అప్పటినుంచీ నేటివరకూ ప్రతిరోజూ అక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నేటికి రాకెట్ దాడులు చేసుకునే వరకూ పరిస్థితి పెరిగిపోయింది.

ముస్లిములు మెజారిటీగా ఉన్న దేశంలో మిగతా వారిని బ్రతకనివ్వరనేది పచ్చినిజం. కానీ వాళ్ళను మిగతా వాళ్ళు ఉండనిస్తారు. దానికి కారణం పోన్లేపాపం అనే మనస్తత్వం. కానీ, మెజారిటీగా మారేకొద్దీ, వాళ్లకు ఇస్లాం పిచ్చి ముదిరిపోతుంది. పక్కవాళ్ళను కూడా మతం మారమంటారు లేదా చావమంటారు. ఈ మౌలికలోపం ఇస్లాం బోధనలలోనే ఉంది. అలాంటి దేశాలను చుట్టూ పెట్టుకుని 72 ఏళ్లుగా ఇజ్రాయెల్ నెట్టుకొస్తూ, ఇంత ఎదిగిందంటే, నిజంగా ఆ దేశాన్ని ఎంతో అభినందించాలి. నావరకూ నేను ఇజ్రాయెల్ ను ఎంతో ఇష్టపడతాను. దానికి కారణం మనకూ వారికీ సమస్యలలోను, ఆలోచనా ధోరణిలోనూ పోలికలున్నందుకేనేమో !

శనికేతువులచేత ఏర్పడిన దుర్ఘటనాయోగం, రాహుశనులచేత ఏర్పడిన శపితయోగదృష్టి, కుజదృష్టులు ఈ పరిస్థితికి ప్రేరకాలు.జూన్ 2 వరకూ నవాంశలో మిధునంలో శపితయోగం కొనసాగుతుంది. దానిదృష్టి ధనుస్సుమీద ఉంటుంది. అంతవరకూ మిడిల్ ఈస్ట్ లో ఈ గొడవలు సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు.

read more " ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ - జ్యోతిష్య విశ్లేషణ "

కర్ణుడి చావు - కరోనోపాఖ్యానం

మొన్నొక రోజున కరోనా వైరస్ కలలో కొచ్చింది.

అదేంటోగాని నాకెప్పుడూ ఇలాంటి కలలే వస్తుంటాయి. ఏ అప్సరసైనా కల్లోకి రాకపోతుందా అని కళ్ళు కాయలు కాచేలా అర్ధరాత్రి దాకా ఎదురుచూచినా ఒక్కతీ కలలోకి రాదు. కరోనా లాంటివి కలల్లో కొస్తుంటాయి. ఖర్మ ! ఏం చేస్తాం?

'ఏంటి ఇలా వచ్చావ్?' అనడిగా నీరసంగా.

'చూశావా ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా కోటిమందిని లేపేశా' అంది గర్వంగా.

'అదేంటి? WHO లెక్కల ప్రకారం ఇప్పటిదాకా పోయినవాళ్లు 3.2 మిలియన్ మాత్రమే. అంటే 32 లక్షలు. నువ్వెంటి 100 లక్షలంటావు? అనడిగా.

పెద్దగా నవ్విందది.

'అవి కాకిలెక్కలు. నాది పిచ్చుకలెక్క. నాదే అసలైన లెక్క' అంది విలాసంగా కాలూపుతూ.

'ఏంటీ? నువ్వు చంపావా?' అడిగాను.

'ఏం? కాదా?' అంది.

'కాదు. అరయంగా కర్ణుడీల్గె ఆర్గురి చేతన్ ' అన్నా నవ్వుతూ.

'అదేంటి? నాకూ, తెలుగుపద్యాలు రావులే. కొంచం ఇవరించి చెప్పబ్బాయా' అంది తెనాలి యాసలో. అప్పుడు దానికొక పద్యం చదివి వినిపించా.

కర్ణుని చావుకు ఆరు కారణాలని సామెతున్నది కదా ! మహావీరుడైన కర్ణుని తాను చంపగలిగానని అర్జునుడు పొంగిపోతుంటే కృష్ణుడు దానికి సమాధానంగా చెప్పిన పద్యమని ఆంధ్ర మహాభారతంలో ఒక పద్యం ఉన్నది.

కం॥ నరవర నీచే నాచే
వరమడిగిన కుంతిచేత వాసవుచేతన్
ధరచే భార్గవు చేతను
అరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్ !

'ఓ మనుష్యులలో శ్రేష్టుడా ! అర్జునా ! నీచేత, నాచేత, కుంతిచేత, ఇంద్రునిచేత, భూదేవిచేత, పరశురామునిచేత - ఈ అరుగురిచేత కర్ణుడు హతుడైనాడు. నీ ఒక్కడి గొప్పదనం కాదు' అని కృష్ణుడు చెబుతాడు.

నీచే - నువ్వు అతనితో యుద్ధం చేసి చంపావు. కనుక నువ్వు ప్రత్యక్ష కారణానివి. అంటే డైరెక్ట్ కాస్ అన్నమాట.

నాచే - నేను నీ సారధిగా ఉంటూ రధాన్ని నడిపించాను గనుక నా పాత్ర కూడా ఉంది. అంటే ఇండైరెక్ట్ కాస్ అన్నమాట.

వరమడిగిన కుంతిచేత - పాండవులలో ఎవరినీ చంపకు అని వరం అడిగిన కుంతికూడా కర్ణుని చావుకు పరోక్ష కారకురాలైంది. 

వాసవుచేతన్ - మారువేషంలో వచ్చి కవచకుండలాలు ఎత్తుకుపోయిన ఇంద్రుడు కూడా పరోక్ష కారణం.

ధరచే - కర్ణుని రథచక్రాలు భూమిలో దిగబడి ఉన్నపుడు వాటిని వదలకుండా పట్టుకున్న భూదేవి కూడా పరోక్ష కారణమే.

భార్గవు చేతను - అవసర సమయంలో అస్త్రమంత్రాలు నీకు గుర్తుకురాకుండుగాక ! అని శాపమిచ్చిన గురువు పరశురాముడు కూడా  పరోక్ష కారకుడే.

"ఈ విధంగా ఒక ప్రత్యక్ష కారకుడు, అయిదుగురు పరోక్ష కారకులు వెరసి ఆరుగురి చేతులలో కర్ణుడు చనిపోయాడు గాని నీ ఒక్కడి వీరత్వం కాదురా అర్జునా" అని కృష్ణుడు చెబుతాడు.

అలాగే, కరోనా చావులకు కరోనా వైరస్ ఒక్కటే కారణం కాదు. ఆరు కారణాలున్నాయి. ఎలాగో చెప్పమంటారా? వినండి.

1. కరోనా వైరస్

ఇది ప్రత్యక్ష కారణం. అంటే direct cause అన్నమాట. కనుక ఇది అర్జునుడు. చస్తున్న ప్రతివాడూ కర్ణుడే. 

2. తిండి

ఇది భూదేవి. ఎందుకంటే, మనకొచ్చే తిండంతా భూమినుంచే వస్తుంది కాబట్టి. కరోనా చావులకు తిండి ఎలా కారణమౌతోంది? ఎలాగంటే, అతిగా మెక్కడం, అసలు తినకుండా ఉపవాసాలుండటం, వేళాపాళా లేకుండా తినడం, మనకే తిండి సరిపోతుందో చూసుకోకుండా ఏదిపడితే అది తినడం, సరిగ్గా నమలకుండా మింగడం, బలం బలం అంటూ నాన్ వెజ్ విపరీతంగా తిని నానారోగాలూ తెచ్చుకోవడం, త్రాగుడు, కూల్ డ్రింకులు, రోడ్లమీది జంక్ ఫుడ్ అతిగా తినడం, ఇత్యాది ఆహారపరమైన తప్పులవల్ల తప్పకుండా ఒళ్ళుగుల్ల అవుతుంది. అంటే ఇమ్యూనిటీ తగ్గుతుంది. అప్పుడు కరోనా ఏం ఖర్మ? ఏదైనా తేలికగా ఎటాక్ చేస్తుంది. కనుక ఇది భూదేవి శాపం.

3. నిద్ర

ఇది పరశురాముడు. ఎందుకంటే, నిద్రనుంచి లేచిన పరశురాముడే కర్ణుడికి శాపమిచ్చాడు. కాబట్టి నిద్రాపరంగా మానవులు చేసున్న తప్పులన్నీ పరశురామ శాపాలే. ఏంటా నిద్రాపరమైన తప్పులు?

అర్ధరాత్రి దాటి తెల్లవారుఝాము అవుతున్నా కూడా టీవీలు చూస్తూ, పార్టీలు చేసుకుంటూ, నిద్ర పోకుండా మేలుకుని ఉండటం, మర్నాడు పొద్దున్న బారెడు పొద్దెక్కినా లేవకపోవడం, సుష్టుగా తిని మధ్యాన్నం మళ్ళీ ఒక మూడుగంటలు  గురక పెట్టడం. ప్రకృతికి వ్యతిరేకంగా పనిచేసే నైట్ షిఫ్టులు ఇవన్నీ నిద్రాపరమైన తప్పులు. వీటివల్ల కూడా ఇమ్యూనిటీ దెబ్బతింటుంది.

పరశురాముని శాపం వల్ల అవసర సమయంలో అస్త్రమంత్రాలను కర్ణుడు మర్చిపోయాడు.  అలాగే, ఉత్తప్పుడు ఎవరు ఎన్ని రకాలైన మంచిమాటలు చెప్పినా, టీవీలలో యూట్యూబులలో ఎన్నెన్ని చూసినా, వినినా, చివరాఖరికి ఆచరించే సమయానికి అవన్నీ మరచిపోయి మళ్ళీ పాత పద్ధతిలోనే కొనసాగడం, మళ్ళీ అవే తప్పులు చేస్తూ ఉండటం వల్ల మనిషి రోగాలపాలౌతున్నాడు.

ఇది పరశురామ శాపం.

4. తప్పుడు లైఫ్ స్టైల్

ఇది ఇంద్రుడు. ఈయన మాయవేషంలో వచ్చి  మాయమాటలు చెప్పి కర్ణుడి కవచకుండలాలు కాజేశాడు. ఇదే విధంగా, విదేశీ జీవన విధానం కూడా దొంగచాటుగా, యాడ్స్ ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా, మనుషుల ఇళ్ళకొచ్చి, మాయచేసి, మితిమీరిన సుఖాలకు అలవాటు చేసి, మన జీవనవిధానాన్ని మనకు దూరం చేసి, సహజంగా పుట్టుకతోనే మనకొచ్చిన రోగనిరోధకశక్తిని (కవచకుండలాలను) ఎత్తుకుపోతోంది. కవచకుండలాలు లేని కర్ణుడు, శత్రువు ప్రయోగించిన అస్త్రాలకు తేలికగా పడిపోతున్నాడు. అదే విధంగా, ఇమ్యూనిటీ తగ్గిన మనిషి రోగాలకు తేలికగా లోనైపోతున్నాడు.

కనుక ఇది ఇంద్రశాపం.

5.  అనవసర మందుల వాడకం

ఇది కుంతీదేవి. ఎలాగంటే, యుద్ధంలో కర్ణుని గెలుపు తధ్యమని తెలుసుకున్న కుంతీదేవి, కర్ణుడిని బ్రతిమిలాడి, అతని జన్మరహస్యం చెప్పి, 'పాండవులు నీ తమ్ముళ్లే, కనుక వారిని చంపకు' అని బ్రతిమిలాడి మాటతీసుకుంటుంది. 

అదే విధంగా, నేటి కాలపు డాక్టర్లు, వారి వైద్యవిధానం, మనుషులను మాయచేసి, సెంటిమెంట్ తో కొట్టి, 'అందరూ వాడుతున్నారు గనుక నేనూ ఈ మందులు వాడాలి' అన్న భ్రమను మనుషులకు కల్పించి, మందుల కంపెనీల ఖాతాదారులుగా వారిని మార్చేసి, అనవసరమైన మందులన్నీ వాడించి వాళ్ళ ఒళ్ళు గుల్ల చేస్తున్నారు. కనుక మందుల కంపెనీలు, డాక్టర్లు, మెడికల్ రెప్ లు, ల్యాబ్ వాళ్ళు, వీళ్ళందరూ కుంతీదేవి స్వరూపాలు. మెత్తగా మాయమాటలు చెప్పి సెంటిమెంట్ తో చంపుతున్నారు.

కనుక ఇది కుంతీదేవి శాపం.

6. చివరిది మనసు.

ఇది కృష్ణశాపం. ఎలాగంటే, మనసే మనిషిని నడిపించేది. మనసే దేవుడు. అది దారితప్పితే మనిషి జీవితం మొత్తం దారితప్పుతుంది. అర్జునుడు వైరస్ అనుకుంటే, మనసు కృష్ణుడనుకుంటే, వైరస్ కి అనుగుణంగా జీవనరథాన్ని మనసు నడుపుతున్నది. కనుక కర్ణుడిలాంటి మనిషి చనిపోతున్నాడు.

ఆరోగ్యం బాగుపడే దిశగా నేటి మనిషి మనసు వెళ్లడం లేదు. ఒళ్ళు గుల్లచేసుకునే దిశగా  పోతోంది. ఎవరెన్ని చెప్పినా ఎవరూ వినే స్థితిలో లేరు. రోడ్లమీద తిరక్కండిరా అని నెత్తీనోరూ మొత్తుకుని ప్రభుత్వం చెబుతున్నా జనం వినకపోతుంటే చివరికి కర్ఫ్యూలు,  షూట్ ఎట్ సైట్ ఆర్దర్లు ఇవ్వాల్సి వస్తోందంటే మనుషులు ఎంత మొండిగా ఉంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. మనిషంటే మనసే గనుక మనసులు మొండిగా తయారౌతున్నాయి. చావువైపే వెళుతున్నాయిగాని బ్రతుకువైపు మళ్లటం లేదు. ఎంతమంది మంచి చెప్పినా ఎవరూ వినడం లేదు.

కనుక ఈ మొండివైఖరే కృష్ణ శాపం. అయితే దీనిలో చాలా ఛాయలున్నాయి. అవేంటో వినండి మరి.

1. 'నాకేం కాదులే' అని నిర్లక్ష్యంగా మాస్కుల్లేకుండా ఎక్కడబడితే అక్కడ తిరగడం.
2. 'నేను రెండు డోసులూ వాక్సిన్ తీసుకున్నాను. ఇక నాకేమౌతుంది?' అని ధీమాగా అందరిమధ్యనా తిరగడం.
3. 'నా దగ్గర డబ్బుంది. ఒకవేళ కరోనా వస్తే ' ఏ - క్లాస్ ' ట్రీట్మెంట్ చేయించుకోగలను' అన్న ధనమదంతో లెక్కలేకుండా తిరగడం.
4. 'దేవుడున్నాడు, నేను మహాభక్తుడిని, నాకేం కాదు' అనుకుంటూ గుళ్ళూ గోపురాలూ తిరిగి, తీర్ధాలూ, ప్రసాదాలూ తిని కరోనా తెచ్చుకోవడం.
5. కరోనా లక్షణాలు కనిపించిన తర్వాత కూడా 'నాకేం కాదు' అన్న ధీమాతో వారం రోజులు ముదరబెట్టుకుని బ్రీతింగ్ సమస్యలు వచ్చినపుడు లబోదిబో అంటూ ఆస్పత్రుల వెంట పెరిగెట్టడం.
6. తనకు పాజిటివ్ వచ్చిందని తెలిసినా, బయట తిరుగుతూ కావాలని మరికొందరికి అంటించడం.

కృష్ణశాపంలో ఇవన్నీ రకరకాలైన షేడ్స్.

అదన్నమాట సంగతి.

ఈ కధంతా కలలోనే కరోనాకు వివరించి చెప్పాను.

కరోనా చాలా సంతోషపడింది.

'అబ్బ ! ఎంత బాగా చెప్పావు. నువ్వు చెప్పినది నిజమే సుమీ !' అని ఎంతో హాచ్చర్యపోయి బోలెడు తుమ్ములు తుమ్మింది. చివరకు 'ఇంత మంచి వివరణ ఇచ్చావుగాబట్టి నీకొక మాంచి వరమిస్తాను' అంది.

'ఏంటది?' అడిగాను నేనూ తుమ్ముతూ.

'ఎవరైతే, మధ్యాన్నం పదకొండింటికి నిద్రలేచి, చన్నీళ్ళు తలస్నానం చేసి గజగజా వణికిపోతూ, తడిబట్టలతోనే ఏసీరూములో నిలబడి, ఈ కరోనోపాఖ్యానాన్ని లక్షసార్లు పారాయణం చేసి, బిరియానీ కోకాకోలాలు నాకు నైవేద్యంపెట్టి, వాటిని మెక్కి, మిగతా రోజంతా టీవీ చూస్తూ, మొబైల్లో మాట్లాడుతూ, ఇంటర్నెట్లో కాలం గడుపుతూ, ఉపవాసం ఉంటారో వాళ్ళ జోలికి నేను రానుగాక రాను' అంటూ మాయమైపోయింది. కరోనా.

'వార్నీ ! భలే కలొచ్చిందే? తప్పకుండా ఈ పారాయణం చెయ్యాల్సిందే' అని మళ్ళీ తుమ్ముకుంటూ లేచిన నేను బాత్రూంలోకి దారితీశాను చన్నీళ్ళ తలస్నానం చెయ్యడానికి.

ఇంకెందుకాలస్యం? మీరూ రంగంలోకి దిగి, పైన చెప్పిన విధంబుగా కరోనోపాఖ్యానం పారాయణం చేసుకోండి మరి !

శుభమస్తు ! హా ...........  చ్చ్ 
read more " కర్ణుడి చావు - కరోనోపాఖ్యానం "

9, మే 2021, ఆదివారం

ఆఫ్ఘనిస్తాన్ కారుబాంబు దాడి - జ్యోతిష్య విశ్లేషణ

8-5-2021 శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో ఒక స్కూల్ బయట జరిగిన కారుబాంబు దాడిలో 50 మంది స్కూలు పిల్లలు చనిపోయారు. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువమంది ఆడపిల్లలు.

ఏం జరిగిందో జ్యోతిష్యపరంగా చూద్దాం.

ఏయే రాశులు ఏయే దేశాలను సూచిస్తాయి అన్న విషయం మీద ఇప్పటివరకూ జ్యోతిష్య ప్రపంచంలో స్పష్టత లేదు. నేను చేస్తున్న ఈ రీసెర్చి ఆ లోటును పూరిస్తున్నది. గతంలో నన్ను చాలామంది గేలిచేశారు 'జరిగిపోయిన వాటిని చెప్పి ఏం ఉపయోగం? జరగబోయేది చెప్పాలిగాని?' అంటూ. అలాంటివారికందరికీ ఒకటే చెప్పదలచుకున్నాను. 

జరగబోయేవి నేను చెప్పగలనో లేదో ఎవరికీ రుజువు చేసుకోవలసిన ఖర్మ నాకు లేదు. వాటిని ఆపాల్సిన ఖర్మ అంతకంటే లేదు. నా ఇష్టం వచ్చిన దారిలో నేను నడుస్తూ పోతాను గాని మీ ఇష్టప్రకారం నేను నడవనన్నది ముందుగా గ్రహించండి. మీ అదృష్టం బాగున్నది గనుకనే నా పోస్టులు చదువుతున్నారన్న సత్యాన్ని ముందుగా తెలుసుకోండి. ఇంతకంటే ఇంకేమీ చెప్పలేను.

మకరం అనేది ఇండియా రాశి అని మనకు తెలుసు. అలాగే మిడిల్ ఈస్ట్ ముస్లిం దేశాలకు ధనుస్సు సూచికని కూడా తెలుసు. ఇంతకుముందు ఎన్నో సంఘటనలు ఈ రెండు సూత్రాలను రుజువు చేశాయి. మతఛాందస టెర్రరిస్టు దేశమైన పాకిస్తాన్ కూడా ధనుస్సులోనే ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ అనేది పాకిస్తానుకు ఇరాన్ కు మధ్యలో ఉన్నదేశం గనుక ఇది కూడా ధనుస్సులోనే ఉంటుంది. కనుక సంఘటన జరిగిన సమయానికి కన్యాలగ్నం ఉదయిస్తున్నప్పటికీ, ధనుర్లగ్నాన్నే లెక్కించవలసి ఉంటుంది. ఈ ఘటన జరిగినప్పుడు కన్య లగ్నమెందుకైందో ముందుముందు వివరిస్తాను.

ధనుర్లగ్నం నుంచి చూచినప్పుడు దశమైన కన్యారాశిమీద శనికుజుల బలమైన దృష్టి ఉన్నది. చతుర్థదృష్టిలో కుజుడు అతిబలవంతుడు. శని కోణదృష్టి కూడా కన్యమీదున్నది. ఇది దుర్ఘటనాయోగాన్ని సృష్టిస్తుందని గతంలో ఎన్నో పోస్టులలో నేను నిరూపించాను. నా పుస్తకాలలో కూడా వ్రాశాను. కనుక స్కూలు బయట కారుబాంబుదాడి జరిగింది. 50 మంది పిల్లలను చంపేసింది. పైగా, రాహుబుధుల పంచమదృష్టి కూడా కన్యమీదున్నది. ఇది చిన్నపిల్లల చావుకు కారణమైన యోగం.

అసలిదేం ఖర్మ? చనిపోయినవాళ్లు కూడా ముస్లిములే కదా? అందులోనూ 10 నుంచి 20 లోపున్న స్కూలు పిల్లలు. అందులోనూ ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు. ఎందుకని ముస్లిం తీవ్రవాదులు ఇలా చేస్తున్నారు? విచక్షణ కూడా లేకుండా, మానవత్వం లేకుండా, జనాన్ని చంపుతున్నారేమిటి?అన్న అనుమానం మనకు వస్తుంది. దీనికి కొన్ని కారణాలున్నాయి వినండి.

1. చంపబడిన పిల్లలందరూ షియా ముస్లిములు. ఆ ప్రాంతంలో వారే ఎక్కువగా ఉంటారు. టెర్రరిస్టు ముస్లిములలో సున్నీలు ఎక్కువ.  షియాలు కూడా ముస్లిములే అయినప్పటికీ కూడా, సున్నీలకు షియాలంటే పడదు. అందుకని వాళ్ళని చంపుతూ ఉంటారు. చంపడానికి ఎవరో ఒకరు లేకపోతే వాళ్లలో వాళ్ళే చంపుకోవడం ముస్లిముల నైజం. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.

అసలీ షియాలు సున్నీల గోల ఏమిటి? అనే అనుమానం వస్తోందా? క్లుప్తంగా చెప్తా వినండి. అదొక  వారసత్వ యుద్ధం. ఆస్తికోసం తగాదా లాంటిది. మహమ్మద్ చనిపోయిన తర్వాత కొంతమంది ఆయన మామ పక్షాన చేరారు. ఇదొక వర్గం. కొంతమంది ఆయన అల్లుడి పక్షాన చేరారు. ఇదొక వర్గం. మామ వర్గం షియాలు. అల్లుడి వర్గం సున్నీలు. రెండు వర్గాలూ కొట్టుకు చచ్చారు. ఇప్పటికీ చస్తున్నారు. పక్కవాళ్ళని చంపుతున్నారు. వెరసి మామాఅల్లుళ్ళ సవాల్ అన్నమాట ! ఇది ప్రపంచనాశనానికి దారి తీస్తోంది. ఇంతకంటే సినిమా ఇంకేమీ లేదక్కడ.

2.  అమెరికా ఆఫ్ఘనిస్తాన్ల మధ్యన కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా సైన్యం, విడతలవారీగా ఆఫ్ఘనిస్తాన్ను వదలి వెళ్ళిపోతున్నది. ఇన్నాళ్లూ రక్షణగా ఉన్న అమెరికా సైన్యం వెళ్లిపోవడం మొదలయ్యే సరికి, ఇస్లామిక్ స్టేట్ వంటి టెర్రరిస్టు గ్రూపులు విజృంభిస్తున్నాయి. అందరూ చదువుకోవడం, అందులోనూ ఆడపిల్లలు చదువుకోవడం, ఉద్యోగాలు చెయ్యడం, ముస్లిం తీవ్రవాదులు ఇష్టపడరు. వాళ్ళ దృష్టిలో ఆడవాళ్లంటే చదువుకోకుండా వంటింటిలో మగ్గిపోతూ పిల్లల్ని కంటూ, వాళ్ళ సెక్స్ అవసరాలకి పనికొచ్చే బానిసలు మాత్రమే. అంతేగాని వాళ్ళు కూడా మోడర్నైజ్ అవడం, ప్రశ్నించడం, వారికస్సలు ఇష్టముండదు. కనుక స్కూలు బయట కారుబాంబు పేల్చేశారు. విద్యార్థులను, అందులోనూ ఆడపిల్లలను చంపేశారు. 

చరిత్ర చదివితే ఒక విషయం తెలుస్తుంది.

3. ఇతర దేశాలను ముస్లిములు ఎలా జయించారు? అంటే, ఒకటే జవాబు. రాక్షసత్వంతో, పైశాచికత్వంతో, క్రూరంగా జనాన్ని చంపి, భయభ్రాంతులను చేసి జయించారు. ఏ దేశంలోనైనా  సరే జనాన్ని భయపెట్టి మాత్రమే వాళ్ళు ఇప్పటిదాకా నెగ్గుకొస్తున్నారుగాని ప్రేమతో ఎవరినీ జయించడం ఇస్లాం చరిత్రలోనే లేదు.. ఛాందసఇస్లాంని నూరిపోస్తూ, మనుషులని ఎదగనివ్వకుండా, నోరెత్తనివ్వకుండా, ప్రశ్నించనివ్వకుండా చేస్తూ, పేదరికంలో నిరక్షరాస్యతలో ఉంచుతూ ముస్లిములు ఏ దేశంలోనైనా సరే నెగ్గుకొస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఇదే చేస్తున్నారు. అక్కడి ప్రజలు చదువుకుని ఎదిగి ఛాందస ఇస్లాం ను ప్రశ్నించడం వారికి  సుతరామూ ఇష్టం లేదు. అమెరికా సైన్యం ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోవడం తోనే ఆఫ్ఘనిస్తాన్లో సివిల్ వార్ ఖచ్చితంగా వస్తుంది.  దానికివన్నీ ముందు ఘట్టాలు.

నిన్న సాయంత్రం 4 గంటలకు ఆఫ్ఘనిస్తాన్లో కుజహోర జరుగుతున్నది. కుజుడు బాంబుదాడులకు హింసాత్మక సంఘటనలకు సూచకుడు. సప్తమంలో ఉంటూ ధనుస్సును బలమైన దృష్టితో చూస్తున్నాడు. చిన్నపిల్లలకు సూచకుడైన చంద్రుడు అష్టమాధిపతిగా, విద్యాకేంద్రమైన చతుర్దంలో ఉంటూ, 6 గ్రహాలతో తీవ్ర ఆర్గళత్వానికి గురై ఉన్నాడు. దశమకేంద్రం కన్య అయింది. కన్య అంటే వయసులో ఉన్న ఆడపిల్లలు. చదువుకునే విద్యార్థినులు. ప్రస్తుత సంఘటనలో వాళ్ళే ఎక్కువగా చనిపోయింది. లెక్క సరిపోయిందా మరి?

దశమాధిపతి అయిన బుధుడు కూడా విద్యార్థులకు సూచకుడే. అతడు యాక్సిడెంట్లకు సూచికైన వృషభంలో శుక్రరాహువులతో కలసి ఆర్గళదోషంలో బంధింపబడి ఉన్నాడు. బుధ రాహువులిద్దరూ కలసి చంద్రనక్షత్రమైన రోహిణిలో ఉంటూ చిన్నపిల్లల దారుణమైన చావును సూచిస్తున్నారు.

ఈ కుండలిలో ఆ సమయంలో బుధ - బుధ - బుధ దశ జరుగుతూ బుధునిమీద ఉన్న ఫోకస్ ను చూపిస్తున్నది. బుధుడు చిన్నపిల్లలకు సూచకుడని జ్యోతిషశాస్త్రంలో ఎల్కేజీలో ఉన్నవారికి కూడా తెలుసు ! 

నవాంశలో చూద్దామంటే, రాహుశనులిద్దరూ కలసి శపితయోగాన్నిస్తూ అమెరికాకు సూచికైన మిధునంలో ఉంటూ, ఆఫ్ఘనిస్తాన్ కు సూచికైన ధనుస్సులో ఉన్న చంద్రకేతువులను బలమైన దృష్టితో చూస్తున్నారు. ఇది గ్రహణయోగం.. ఈ యోగం ఏమి చెబుతున్నదో తెలుసా? అమెరికా బలగాలు వెళ్లిపోవడం ఆఫ్ఘనిస్తాన్ కు శాపమని, దీనివల్ల ఆ దేశంలో మనశ్శాంతి కరువౌతుందని, ముఖ్యంగా బలయ్యేది చిన్నపిల్లలు, ఆడవాళ్లే నని చెబుతున్నది. దీనికారణం 'శాంతి శాంతి' అని గొంతు చించుకునే ఇస్లాం తీవ్రవాదం. రాబోయే రోజుల్లో, ముఖ్యంగా సెప్టెంబర్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నరకం అవబోతున్నది.

ఇదీ ఆఫ్ఘనిస్తాన్ భవిష్యదర్శనం !

చూస్తూ ఉండండి ముందు ముందు నేను చెబుతున్నది నిజమౌతుందో లేదో !

ఇండియాలో ఏం జరిగినా గొల్లుమని ప్రతిదానికీ మతరంగు పూస్తూ, బీజేపీ మీదా, మోదీగారి మీదా బురదచల్లాలని చూస్తున్న టెర్రరిజం సపోర్టర్లు, పాకిస్తాన్ సపోర్టర్లు, కమ్యూనిస్టులు, మిగతా  దేశద్రోహులందరూ ఇప్పుడేమంటారో మరి? మాట్లాడరా ఇప్పుడు? నోరెత్తాలంటే భయంగా ఉందా? ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఎందుకు ఏమీ అనలేకపోతున్నారు?  పిరికిపందల్లారా !

read more " ఆఫ్ఘనిస్తాన్ కారుబాంబు దాడి - జ్యోతిష్య విశ్లేషణ "

7, మే 2021, శుక్రవారం

కరోనా ఎందుకొస్తోంది? ఎవరికొస్తోంది?

ప్రతిరోజూ ఎంతోమంది తెలిసినవాళ్లు పోతున్నారు. ప్రతిరోజూ ఎన్నో చావు వార్తలు వింటున్నాం. ఎక్కడ చూసినా భయం రాజ్యమేలుతోంది. రేపేం జరుగుతుందో ఎవరికీ తెలియడంలేదు. ఇదంతా చూస్తూ, "అసలు కరోనా ఎందుకొస్తోంది?" అన్న ప్రశ్న ఎవరినడిగినా ఒకటే చెబుతారు.

'వైరస్' వల్ల వస్తున్నది'

చాలామంచి జవాబు.

'మరి వైరస్ అందర్నీ  కాటేయడం లేదేంటి?'

'ఇంట్లో జాగ్రత్తగా ఉంటే రాదు'

 ఇది కూడా చాలామంచి జవాబే. 

'మరి ఇంట్లో ఉన్నవాళ్లకు కూడా చాలామందికి వస్తోంది కదా? ఇదేంటి?'

'గాలిలో వస్తోంది'

అదే గాలిని అందరూ పీలుస్తున్నారు కదా? మరి అందరికీ రావడం లేదెందుకు?

'రోగనిరోధకశక్తి లేనివాడికి వస్తోంది'

'రోగనిరోధకశక్తి ఎందుకు తగ్గుతోంది?

'తెలియదు'

ఇప్పుడు ఇంకో కోణం చూద్దాం. 

'మా మామయ్య కూరగాయలకని మార్కెట్టుకి వెళ్ళొచ్చాడు. అక్కడ సోకింది'

మరి అక్కడే ఉంటూ, రోజంతా కూరగాయలు అమ్ముతున్నవాడికి ఎందుకని రావడం లేదు?

నో ఆన్సర్

'మా బాబాయి పాలప్యాకెట్ కని బయటకెళ్ళి వైరస్ కొనితెచ్చుకున్నాడు'

'మరి రోజంతా అదే షాపులో పాలప్యాకెట్లు అమ్ముతున్నవాడికి ఎందుకని రాలేదు?'

మళ్ళీ నో ఆన్సర్

'మా నాన్న వద్దంటున్నా వినకుండా బయటకెళ్ళి మామిడిపండ్లు కొన్నాడు. అక్కడ సోకి ఉంటుంది'

'రోజంతా ఎండలో రోడ్డుపక్కన కూచుని పండ్లు అమ్ముతున్న ఆమెకు ఎందుకని కరోనా సోకలేదు?'

మళ్ళీ నో ఆన్సర్

చివరకు ఇలా జవాబు వస్తుంది.

'కాయకష్టం చేసేవాళ్లకు రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్లకు రాదు'

ఏతావాతా తేలిందేమిటి? ఎవడికైతే రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటున్నదో వాడికి కరోనాయే కాదు.  ఏ వైరసూ సోకదు. ఏ బాక్టీరియా సోకదు. ఏమీ కాదు. డా || హన్నేమాన్ ఈ మాటను రెండు వందల ఏళ్ళక్రితం చెప్పాడు. ఆయుర్వేద సృష్టికర్తలైన ఋషులు వేల ఏళ్ళనాడే ఈ మాటను చెప్పారు. అంతేగాక ఏమేం చేస్తే, ఎలా బ్రతికితే, రోగనిరోధకశక్తి బాగుంటుందో కూడా చెప్పారు. ఏం చేస్తుంటే అది క్షీణిస్తుందో కూడా చెప్పారు. వినేవారేరీ? వింటే, జనం పోగుచేసుకుంటున్న చెడుకర్మను ఎవడనుభవిస్తాడు? అందుకే మంచి చెప్పినా ఎవడూ వినడు. వినలేడు. విన్నట్టు విని వదిలేస్తాడు గాని ఆచరించలేడు. కనుక వాడి ఖర్మ వాడిని వెంటాడుతుంది. గొంతు పట్టుకుంటుంది. తీసుకుపోతుంది. అదంతే !

ఇప్పుడు విషయంలోకొద్దాం.

నేనింతవరకూ ఓవెన్ ను కొనలేదు. ఎందుకో తెలుసా? దానివల్లనే అమెరికాలో పెద్దప్రేగు కాన్సర్ వస్తున్నదని గ్రహించాను గనుక. నేనమెరికాలో ఉన్నపుడు ఒక విషయం గ్రహించాను. అమెరికాలో పొట్ట కేన్సర్లు చాలా ఎక్కువ. ఎందుకని?

వినండి మరి.

స్టోర్స్  లో ఉన్న మాంసం ఎన్నో రోజులనుంచీ డీప్ ఫ్రిజ్ లో ఉంటుంది. మైనస్ డిగ్రీలలో ఉంటుంది.  దాన్ని తెచ్చి, ఓవెన్లో పడేసి ఒకేసారి 160 ఫారెన్ హీట్ దాకా వేడిచేసెసి తింటారు. ఒకేసారి అంత టెంపరేచర్ తేడా వస్తే ఆ మాంసంలో ఏమౌతుంది? పైగా, మంటపైన, కుండలో వండితే జరిగే ప్రక్రియ వేరు. అక్కడ ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది.  ఓవెన్ లో ఏ ఆక్సిజన్ ఉంటుంది? ఒక ఉదాహరణ చెప్తాను, వినడానికి అసహ్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. 

చనిపోయిన శవాన్ని మార్చురీలోని కోల్డ్ స్టోరేజిలో ఉంచడానికి, మాంసాన్ని, కూరగాయలను ఫ్రిజ్ లో ఉంచడానికి తేడా ఏంటి? అలాంటి శవాలను తెచ్చి, కనీసం వాటిని కట్టెలమీదకూడా ఉడికించకుండా, ఆక్సిజన్ లేని, అదసలు అవసరంలేని, మైక్రో వేవ్స్ క్రింద ఓవెన్లో ఉడికిస్తే ఏమౌతుంది? వాటిల్లో ఏయే మార్పులొస్తాయి? తినేవాడికి   కాన్సర్లు రాక ఏమౌతుంది? చెప్పండి.

ఈరోజుల్లో, ఏ పూటకాపూట, ఏరోజు కూరగాయలను ఆరోజున వేడివేడిగా వండుకుని, ఏపూట అన్నం ఆపూట వేడిగా వండుకుని ఎవరు తింటున్నారు? చెప్పనా? రోజుకూలీలు తింటున్నారు. కాయకష్టం చేసుకునేవాళ్ళు తింటున్నారు. వాళ్ళు ఏరోజుకు ఆరోజున కూరగాయలు తెచ్చుకుంటారు. మంటమీద వండుకుని తింటారు. ఓవెన్ వాడరు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. సుఖానికిపోయే సంపన్నులు, ఫ్రిజ్ లో వారాల తరబడి ఆహారాన్ని మురగబెట్టుకుని తినేవాళ్లు, ఓవెన్లు వాడేవాళ్లు రోగాల పాలౌతున్నారు. ఇన్ని సౌకర్యాలున్నప్పటికీ వంట చెయ్యదానికి బద్ధకిస్తూ, పొద్దున్నే ఒకేసారి అన్నీ వండిపారేసి, వాటినే రాత్రికి పెట్టుకుని తినేవాళ్లు రోగాలపాలౌతున్నారు.

జొమాటోలో ఆర్డర్ చేసి తెప్పించుకుని లొట్టలేసుకుంటూ మింగే తిండిలో ఏముంటుందో మీకు తెలుసా? అదెప్పటి ఆహారమో మీకు తెలుసా? ఈ రోజున మిగిలిపోయిన ఫుడ్ ని ఏ హోటలువాడూ పారెయ్యడు. రేపు, ఎల్లుండి, ఎంతవరకూ దానిని ఉంచగలిగితే అంతవరకూ ఫ్రిజ్ లో ఉంచి, ఓవెన్లో ఇన్స్టంట్ గా వేడిచేసి మీకు పంపిస్తాడు. ఆ కుళ్లిపోయిన వేడివేడి ఆహారాన్ని లొట్టలేసుకుంటూ మీరు మింగుతారు. దానికితోడు, వాడు ఫ్రీగా ఆఫర్లో పంపించే కూల్ డ్రింక్ ఉండనే ఉంటుంది. అది యాసిడ్. ఇక మీకు రోగాలు రాక ఏమౌతాయి మరి?

యాసిడ్ తో కడగాల్సింది టాయిలెట్ ని. పొట్టని కాదు. ఆఫ్కోర్స్, ఈ రోజుల్లో టాయిలెట్ కమోడ్ కీ మన పొట్టకీ పెద్ద తేడా ఉండటం లేదనుకోండి. ఇంకా చెప్పాలంటే కమోడే శుభ్రంగా ఉంటోంది. ఎప్పటికప్పుడు క్లిన్ చేస్తాం కాబట్టి.  మన పొట్టే దానికంటే అసలైన దరిద్రం !

ప్రతిరోజూ చెమటపట్టేలాగా వ్యాయామం ఎవరు చేస్తున్నారు? ఏసీ జిమ్ముల్లో అమ్మాయిలూ అబ్బాయిలూ ఒకరినొకరు చూసుకుంటూ కులుక్కుంటూ ఎగరడం కాదు. చక్కటి ఎండలో, ఆరుబైట గాలిలో ఎవరు వ్యాయామాలు చేస్తున్నారు? ఆ చేసే వ్యాయామాలు మాత్రం ఏమిటి? కండలు పెంచే జిమ్ము వ్యాయామాలు. అవి రోగనిరోదకశక్తిని పెంచగలవా? లేవు. ఏడాదిపాటు పెంచిన కండలు, ఒక్క జ్వరంతో కరిగి వేలాడటం మొదలుపెడతాయి. మరెందుకవి? మనదైన యోగాభ్యాసాన్ని శుద్ధంగా చేస్తున్నవారెందరు?

అసలు కనీస వ్యాయామమంటూ ఏదో ఒకదాన్ని ఏడుస్తున్నవారెందరు? ఎవరూ లేరు. పొద్దున్న పదింటికి నిద్ర లేవడం, ఆ సోఫాలోనో, బెడ్ మీదనో రోగిష్టిలాగా పడుకుని, టీవీనో, మొబైల్ నో చూస్తూ, ఫోన్లో సొల్లు వాగుతూ  ఉండటం, టైమైతే జొమాటో ఆర్డర్ పెట్టడం, తిని మళ్ళీ మొబైల్లోకి చూస్తూ పడుకోవడం. లేకపోతే ఆ ఫ్రిజ్ లో కుక్కిన పదిరోజులనాటి చెత్తను మింగడం.  ఇది మన దినచర్య. ఇక రోగాలు రాక మరేమొస్తాయి?

ఏదో రోగం వచ్చినపుడు కూడా ప్రకృతిసిద్ధమైన మందులు వాడకుండా, సింథటిక్ ముందులు వాడటం. అక్కడకూడా డబ్బులు పారేసి పెద్ద ఆస్పత్రిలో చేరి దేహాన్ని వారికి అప్పజెప్పడం. అదృష్టం బాగుంటే ప్రాణంతో తిరిగి రావడం, లేదా శవంగా బయటకు రావడం. దహనం కూడా ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో. ఇదీ మన బ్రతుకు.

వినడానికి అసహ్యంగా ఉంటుందని ముందే చెప్పాను. ఎప్పుడైనా చూశారా మీరు? మామూలుగా దహనం చేసిన  శవం బూడిద ఎలా ఉంటుందో? తెల్లగా ఉంటుంది. ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో వచ్చే బూడిదను ఎప్పుడైనా చూశారా? నల్లగా ఉంటుంది. ఆక్సిజన్ లేకుండా పెనంమీద అట్టు మాడినట్లు శవం అందులో మాడిపోతుంది. అది అసహజ ప్రక్రియ . బ్రతికున్నపుడూ అసహజంగా బ్రతకడం, చావులో కూడా అసహజమే. ఇది మానవజాతి  చేతులారా చేసుకుంటున్న ఖర్మ కాకపోతే మరేంటి? 

సినిమాలు చూసి, ఫుడ్ కంపెనీల యాడ్స్ మాయలో పడి, మోడరన్ లైఫ్ ఉచ్చులో ఇరుక్కుని మనుషులు సర్వనాశనం అవుతున్నారు. అవండి. మిమ్మల్ని ఎవడూ కాపాడలేడు.

అసలు మన దేశంలో ఫ్రిజ్ ఎందుకు? అవసరమా? మనకు ఓవెన్లెందుకు? అవసరమా? మనకు జొమాటోలెందుకు? అవసరమా? అమెరికావాడి తిండి మనకెందుకు? అవసరమా? రోజంతా కదలకుండా పందుల్లాగా పడుకుని టీవీలు, మొబైళ్ళు చూడటం మనకెందుకు? అవసరమా? అర్ధరాత్రిళ్ళు, తెల్లవారుఝామున నానాచెత్త తిండి తినడం అవసరమా? ఏదీ అవసరం లేదు. ఇదేదీ సహజం కాదు. మరి ఇన్ని అసహజములైన పనులు, ప్రకృతికి వ్యతిరేకమైన పనులు ప్రతిరోజూ చేస్తూ, మన రోగనిరోధకశక్తి గట్టిగా ఉండాలంటే ఎలా ఉంటుంది?

పోనీ మనసన్నా శుద్ధంగా ఉంటున్నదా మనకు?

ఓర్వలేనితనం, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, కోపాలు, అహంకారాలు, గర్వాలు, ధనమదం, కులగర్వం, ఆశ, నాటకాలు, వేషాలు, పొగరు, లెక్కలేనితనం, అన్నీ నాకే తెలుసన్న మదం ఇలా చెప్పుకుంటూ పోతే  ఎన్నో ఎన్నెన్నో మన మనస్సులో ఉన్న దయ్యాలు.

ఒళ్ళూ కుళ్లిపోతూ, మనసూ కుళ్లిపోతూ, పైకిమాత్రం 'అంతా భలేబాగుంది' అనుకుంటూ  మొహానికి మాత్రం క్రీములు పూసుకుంటూ, ఒళ్ళు అందరికీ చూపించుకుంటూ బ్రతుకుతున్న  ఇలాంటి స్థితిలో కరోనా ఎందుకు? గట్టిగా ఒక చిన్న గాలివీస్తే చాలు మనం నేలకూలిపోవడానికి.

ఏవిధంగా మనం ఆరోగ్యవంతులం అసలు?

మనల్ని చంపడానికి కరోనాయే అవసరం లేదు. చిన్న సూది గుచ్చుకుంటే కూడా, కుప్పకూలిపోయి, ప్రాణాలు పోయే రోజులు ముందున్నాయి. కూచున్నవాడు కూచున్నట్టు, నుంచున్నవాడు నుంచున్నట్టు, నడుస్తున్నవాడు నడుస్తూనే చనిపోయే రోజులు ముందున్నాయి. బ్రహ్మంగారు వ్రాసినది అబద్ధం కాదు ! కాకపోతే బ్రహ్మంగారి గుడి కట్టించి పూజించేవాడు కూడా ఆయన చెప్పినట్టు బ్రతకడం లేదు. ఆయన ఏదైతే వద్దన్నాడో అదే చేస్తున్నాడు. మళ్ళీ ఆయన భక్తుడినని చెప్పుకుంటున్నాడు. అదీ అసలైన వింత !

బుద్ధి కర్మానుసారిణి. ఎవడాపగలడు? ఎవడెన్ని చెప్పినా, ఎంత మంచిని చెవిలో వినిపించినా, ఎవడూ వినడు. ఆచరించడు. పోగాలం వచ్చినపుడు ఇలా ఉండక ఇంకెలా ఉంటుంది?

కానివ్వండి. చావండి !

read more " కరోనా ఎందుకొస్తోంది? ఎవరికొస్తోంది? "