“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, మే 2010, శనివారం

కుజునికి నూతనోత్సాహం వచ్చింది


నవగ్రహాలలో కుజగ్రహం చాలా బలీయమైనది. ఒక జాతకంలో బలం ఉండాలంటే దానికి కుజుడు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాడు. ఎందుకనగా మనిషిలోని పట్టుదలకు, రోషానికి, విధ్వంస ప్రవృత్తికీ కుజునికీ సంబంధం ఉన్నది.కుజుడు బలహీనంగా ఉన్న జాతకాలలో చూస్తే, జీవితంలో ఎదగడానికి అవసరమైన పట్టుదల లోపిస్తుంది. కుజదోషం ఉన్న వాళ్ళలో వివాహ జీవితంలో అనేక ఒడిదుడుకులు కలుగుతాయి. మేదినీ జ్యోతిషంలో చూస్తే, దుర్ఘటనలు, ప్రమాదాలు,రక్తం చిందించే సంఘటనలు,గొడవలు,యుద్ధాలు మొదలైనవి జరగడానికి, కుజుని గోచారానికి చాలా సూటి సంబంధం ఉంటుంది. కుజ గోచారం మానవ జీవితాలమీద గట్టి ప్రభావాన్ని చూపిస్తుంది. దీనికి అనేకానేక రుజువులున్నాయి. గత నాలుగురొజులుగా జరుగుతున్న సంఘటనలవల్ల ఈ విషయం మళ్ళీ రుజువైంది.

27-5-2010 న కుజుడు తన 8 నెలల కర్కాటక రాశి సంచారంలో ఎదుర్కొన్న అనేక ఒడిదుడుకులనూ, నీచపరిస్థితిని తొలగించుకుని తన మిత్రుడైన సూర్యుని సింహరాశిలోకి అడుగుపెట్టాడు. విధ్వంసాన్ని ప్రేమించే కుజునికి ఇన్నాళ్ళ కర్కాటకరాశిలోని జైలు జీవితం ముగిసేసరికి మహదానందం కలిగినట్లుంది. ఇక విజృంభిద్దామనుకున్నాడు. అదేరోజు ప్రజల ఖర్మకాలి పూర్ణిమ అయ్యింది. మానవులలో భావోద్వేగాలు రెచ్చగొట్టటానికి ఇంతకంటే మంచి ముహూర్తం దొరకదు. ఇంకేముంది రంగం సిద్ధం అయ్యింది. అందుకే ఒక రెండురోజుల ముందునుంచే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. లైలా తుఫాను వచ్చి మూడు రోజులలో వందల కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చి పోయింది.

దీనినుంచి తేరుకునే లోపు, బుధవారం శ్రీకాళహస్తి రాజగోపురం కూలిపోవడం జరిగింది. ఇది ఒక చెడుశకునం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాని దీనికి కుజ గోచారానికి అతిదగ్గర సంబంధం ఉండటమే ఆశ్చర్యకరంగా ఉంది. ఇక అప్పటినుంచి ఎక్కడచూచినా విధ్వంసకర సంఘటనలు వరుసగా కనిపిస్తున్నాయి.గురువారం రాత్రి బెంగాల్ లో ఊహించని ఘోర రైలు ప్రమాదం జరిగింది. వందకు పైగా ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. అంతకు మూడు రెట్లు గాయాల పాలయ్యారు. మావోయిష్టులు మేము కాదు అంటున్నారు. వాళ్ళకు ప్రజలను పెద్ద ఎత్తున ఇలా చంపిన చరిత్ర లేదు. వారు కాకపోతే మరి ఎవరు? పాకిస్తాన్ జిహాదీలా? అసలు దోషులు ఎప్పటికైనా బయటికి వస్తారా? న్యాయం జరుగుతుందా? ఎక్స్ గ్రేషియాలతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అన్నీ ప్రశ్నలే. ఈ లోపు, శుక్రవారం నాడు మహబూబాబాద్ స్టేషన్ లో గొడవలు, కాల్పులు జరిగాయి. ప్రజల భావోద్వేగాలు భగ్గుమని రెచ్చగొట్టబడ్డాయి. రోడ్డు ప్రమాదాలు, రహదారులు రక్తమయం కావడం మళ్ళీ ఎక్కువౌతున్నాయి. అదేరోజు తిరుపతి దగ్గర ఇంకొక రైలులో బోగీలకు ఎవరో నిప్పు పెట్టారు.

ప్రపంచ వ్యాప్తంగా చాలా విధ్వంసకర సంఘటనలు ఈ నాలుగు రోజులలో జరిగాయి. ఉదాహరణకు గుటెమలాలో అగ్నిపర్వతం 27-5-2010 తేదీన పూర్ణిమా గురువారం మరియు కుజుడు రాశిమారిన రోజే బ్రద్దలైంది. శుక్రవారం రెండో అగ్ని పర్వతం పగిలింది. మూడోరోజున, అనగా ప్రస్తుతం అక్కడ భయంకర తుఫాన్ ఒకటి ఎటాక్ చేసి తన విశ్వ రూపం చూపిస్తున్నది. పదిహేను రోజులు అత్యవసర పరిస్తితి విధించారు. నదులు పొంగి వంతెనలు బద్దలవుతున్నాయి. జనం పరిస్థితి భీతావహంగా ఉన్నది. ఇటువంటివి ప్రతిరోజూ జరగవు. ఒకవేళ జరిగినా ఈ స్థాయిలో జరగవు. వీటికి కుజుని సింహ రాశి ప్రవేశానికి ఖచ్చితమైన సంబంధం ఉన్నది. కుజుడు అసలే అగ్ని తత్వ గ్రహం, అగ్ని తత్వ రాశియగు సింహంలోకి, అందులోనూ అగ్ని గ్రహమూ తన మిత్ర్రుడూ అయిన సూర్యుని రాశిలోకి అడుగుపెట్టాడు. నీచ స్థితిని వదిలించుకున్నాడు. ఇక ఎంత బలాన్ని పుంజుకుని ఎన్ని రకాలుగా విజృంభిస్తాడో చూడవలసిందే.

ఇక జ్యోతిశ్శాస్త్ర విమర్శకుల వాదనలు మామూలే. ఇదంతా ముందే తెలిస్తే బాహాటంగా అందరికీ చెప్పి, తరుణోపాయాలు సూచించి, ప్రజలచేతా ప్రభుత్వం చేతా చేయించి, ఈ ఘోర విపత్తులను నివారించవచ్చుగా? అంటారు. ఒక చేదువాస్తవం ఏమిటంటే, ప్రస్తుత సమాజంలో ఎవరు చెప్పినా ఎవరూ వినడానికి సిద్ధంగా లేరు. మామూలు మనిషే వినడు. ఇక ప్రభుత్వాలు వింటాయా? ఒకవేళ నూటికి నూరుశాతం సరిగా చెప్పగలిగిన జ్యోతిశ్శాస్త్రవేత్తలు ఉన్నప్పటికీ వారినుంచి తమ వ్యక్తిగత జాతకం దాని రెమెడీలు మాత్రమే కోరే నాయకులు కొల్లలు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనేవారు బహు తక్కువ. ఒకవేళ నాయకులలో అటువంటి వారున్నప్పటికీ వారి చేతిలో పవర్ ఉండదు. స్వార్ధం ,ధనమదాలతో కళ్ళు పొరలు కమ్మినవారికి మంచి చెబితే వినిపించుకుంటారా? కళ్ళ ఎదురుగా పదేళ్ళనుంచీ ఒక ప్రాచీన హెరిటేజ్ కట్టడం బీటలు వారి, రోజురోజుకూ కూలిపోడానికి సిద్ధమౌతుంటే నిద్ర పోతున్న ఆ శాఖలకు అధికారులకు మంచి మాటలు చెబితే తలకెక్కుతాయా? వారందరూ వారివారి వ్యక్తిగత జాతకాలు ప్రముఖ జ్యోతిష్కులకు వారానికొకసారి చక్కగా చూపించుకుని పరిహారాలు పాటిస్తూనే ఉంటారు. కాని ధార్మిక కట్టడాల బాధ్యతా, ప్రజల ఆస్తులైన రవాణా సాధనాలు వగైరాల బాధ్యతా వారికెందుకుంటుంది?

అరణ్య రోదన అని ఒక పదం ఉన్నది. అరణ్యంలో సాయం కోసం ఏడుస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఆ శబ్దం విని ఏ పులో వచ్చి చక్కగా భోంచేసి పోతుంది. దాని కంటే మౌనంగా ఉండటం మేలు. ప్రజల గోడు కూడా అలాగే ఉంది. పబ్లిక్ ప్రాపర్టీ నాశనం అయితే ఎవరికి పడుతుంది? ఒక ధార్మిక, హెరిటేజ్ కట్టడం ఇలా కుంగి కూలిపోతుంటే చూస్తూ ఊరుకున్న ప్రభుత్వ శాఖలు మన దేశంలో మాత్రమే చెల్లుబాటు అవుతుంటాయి. ముఖ్యంగా మన తెలుగుసమాజంలో ఏం జరిగినా మూడో రోజుకు చక్కగా మరిచిపోవడం మనకు అలవాటు అయింది. అదే మనపక్కనే ఉన్న తమిళనాడులో దేవాలయాలను ఎంత చక్కగా పరిరక్షిస్తారో చూస్తే మన ప్రభుత్వం సిగ్గుపడాలి. పైగా అక్కడ ముఖ్యమంత్రి నాస్తికుడు.

ఏం జరిగినా ఎవరికీ పట్టని మనస్తత్వం చాలా భయంకరమైనది. దురదృష్టవశాత్తూ ఇదే ప్రస్తుతం అన్నిచోట్లా ఎక్కువైతున్నది. ఎవరికీ ఇక్కడ ఎకౌంటబిలిటీ లేదు. కనుక ఏం జరిగినా ఎవరికీ ఏమీ కాదు. కాకపోతే పేపర్లు టీవీలు కాసేపు గోలపెడతాయి. ఎలాగూ అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోతుంటాయి. పోతే పోతాయి. జనాభా ఇప్పటికే ఎక్కువగా ఉంది. కాస్త తగ్గుతుంది. అనామకులు పోతే ఎవరికి కావాలి. దేశాన్ని ఉద్ధరిస్తున్న ప్రస్తుత నాయకులుంటే చాలు. ఏం జరిగినా అసలు నేరస్తులను గాలికొదిలేసి ఎవడో ఒక సత్యంబాబును అడ్డం పెట్టుకొని కథ నడిపించవచ్చు.


పిట్టకధనొదిలి మన అసలు కధకొద్దాం. కుజుడు సింహ రాశిలో జూలై 21 వరకూ ఉంటాడు. ఈ లోపల ఇంకా ఎన్ని విధ్వంసాలు జరుగుతాయో? అనుమానం లేదు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు నాందీవాచకాలు మాత్రమే. భూకంపాలు, అగ్నిప్రమాదాలు, అగ్ని పర్వతాల పేలుడు ఇత్యాదులు ముందున్నాయి. ఒక ప్రముఖ ఆలయ రాజగోపురం అలా కుప్పకూలడం వల్ల దేశానికి ఖచ్చితమైన అరిష్టం కలుగుతుంది. జూలై 21 తరువాత కుజుడు కన్యారాశిలో ప్రవేశించి, అక్కడె ఉన్న శనితో కలుస్తాడు. కన్యారాశిలో సంభవిస్తున్న గ్రహయుద్ధం అనబడే ఈ యుతితో ఇంకెన్ని దారుణాలు జరగబోతున్నాయో?

శని కుజుల యుతి విస్ఫోటనాలకు దారి తీస్తుంది. అది భూతత్వ రాశిలో జరుగబోతున్నది. కనుక భూకంపాలు రావడానికి, అగ్నిపర్వతాల పేలుడుకు ఇది అనువైన కాంబినేషన్. వారికి ఎదురుగా మీన రాశిలో గురువున్నప్పటికీ ఆయన పెద్దగా ఈ పరిణామాలను అదుపు చెయ్యలేడు.

ఏది ఏమైనా రాబోయే మూడునెలలు మేదినీ గోచారరీత్యా చాలా గడ్డురోజులని చెప్పవచ్చు. నేను ఇంతకు ముందు సూచించినటుగా అమావాస్య, పౌర్ణమి రోజులకు అటూ ఇటూగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఇది గమనించదగ్గ విషయం.


కుజుడు ఏ జాతకాలలో చెడు చెయ్యగలడో, ఆయా జాతకాలవారంతా ఈ మూడు నెలలూ జాగ్రత్తగా రెమెడీస్ పాటిస్తే మంచిది.
read more " కుజునికి నూతనోత్సాహం వచ్చింది "

22, మే 2010, శనివారం

ఆది శంకరుల జీవితం - జాతకం (రెండో భాగం)


















మొదటగా 19-4-788 తేదీనాటి వైశాఖ శుక్ల పంచమి జాతకాన్ని పరిశీలిద్దాము. ఇది చరిత్ర కారులు ఇప్పటివరకూ నమ్ముతున్న తేదీ. వారి నమ్మకానికి కొన్ని మూఢవిశ్వాసాలు కారణాలయ్యాయి. శంకరుడు క్రీస్తు పూర్వం ఉండటం వాళ్ళకు మింగుడు పడలేదు. శంకరులు క్రీస్తుపూర్వంలో ఉన్నారని ఒప్పుకుంటే, బుద్ధుని ఇంకా వెనుకకు ఉంచవలసి వస్తుంది. అది బుద్ధునికి ఇంకా ప్రాచీనతను ఆపాదిస్తుంది. రెండూ ఒప్పుకోటానికి వారికి మనసు రాలేదు. కనుక క్రీ.శ 788 లో శంకరుల జననం జరిగింది అని వారి వాదన. వారి వాదనను సమర్ధించుకోడానికి కంచి మఠ 38 ఆచార్యులైన అభినవ శంకరుల జననతేదీని ఆధారంగా తీసుకున్నారు. మధ్యన బయటపడుతున్న నిజాల ద్వారా వాదన ఎలాగూ వీగిపోయింది. కాని జ్యోతిష్య పరంగా కొంత పరిశీలిద్దాము.

శంకరుల గురించి ఒక ప్రసిద్ధ శ్లోకం ఇలా చెప్తుంది.

శ్లో|| అష్టవర్షే చతుర్వేదీ ద్వాదశే సర్వశాస్త్రవిత్
షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరభ్యగాత్ ||

భావం: ఎనిమిది ఏళ్ళకు నాలుగు వేదాలను అధ్యయనం చేశాడు. పన్నెండేళ్ళకు సర్వ శాస్త్రవిదుడయ్యాడు. పదహారేళ్ళకు వ్యాస భగవానుని బ్రహ్మ సూత్రములు, దశ ఉపనిషత్తులు,భగవద్గీతలకు భాష్యం వ్రాశాడు. ముప్పై రెండేళ్ళకు జీవితాన్ని చాలించాడు.

వివరాలతో జాతకం సరిపోతుందో లేదో పరిశీలించాలి.

లగ్న చంద్రులు యధావిధిగా కర్కాటక,మిధున రాశులలోనూ, రాహువు కన్యలో,కుజుడు మకరంలో,గురువు కుంభంలో, బుధ శుక్ర శని కేతువులు మీనంలో, రవి మేషంలోనూ ఉన్నారు. ఆధ్యాత్మికతను చూపించే, వింశాంశ చక్రంలో లగ్నం వృషభంలో,రవి చంద్రులు మిధునంలో, రాహుకేతువులు తులలో, వృశ్చికంలో శని శుక్రులూ, మకరంలో బుధుడూ,మీనంలో కుజుడూ,మేషంలో గురువూ ఉన్నారు.

ఈ జాతకానికి ఆది శంకరుల స్థాయి ఉన్నదా?

మంత్ర స్థానాధిపతి యగు కుజుని ఉఛ్చ స్థితివల్ల మహామంత్ర సిద్ధి సూచితం అవుతున్నది. కాని బుధుని నీచ స్థితి, ఆది శంకరుల స్థాయి కలిగిన మహా మేధావిని చూపటం లేదు. మూడింట రాహువు వల్ల ఎక్కువగా దగ్గరి ప్రయాణాలు సూచితం వుతున్నాయి. కాని శంకరులు దేశం అంతా పర్యటించారు.

వింశాంశలో పంచమాధిపతి నవమ స్థితివల్ల ఆధ్యాత్మిక ఔన్నత్యం సూచితం అయినప్పటికీ, ఆది శంకరుల అంతటి మహోజ్జ్వలస్థాయి కనపడటం లేదు. వింశాంశ చక్రంలో ఆది శంకరుల స్థాయిని సూచించే గొప్ప యోగాలు లేవు.

శని,కేతు,శుక్రుల యుతి సంన్యాస యోగాన్నిస్తుంది. నవమంలో ఈ యోగం వల్ల ఆధ్యాత్మిక ఔన్నత్యం కనిపిస్తున్నది. ఈ జాతకం ఒక గొప్ప మతాధిపతినీ మరియు సంన్యాసినీ చూపిస్తున్నది.

జాతక విశ్లేషణ

>>
మొదటగా అల్పాయుర్యోగం ఉందా లేదా అనేది పరిశీలించాలి. లగ్నం చరరాశిలోనూ, అష్టమాధిపతి శని ద్విస్వభావ రాశిలోనూ ఉండటం అల్పాయువును ఇస్తుంది. లగ్న చంద్రులకూ, లగ్న హోరా లగ్నాలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. కేంద్రాలలో శుభ గ్రహాలు లేకపోవడము,అష్టమంలో శుభగ్రహం ఉండటమూ అల్పాయు యోగాన్నిస్తుంది. కానీ కొన్ని ఇతర విషయాలు పరిశీలించాలి. లగ్నానికి పరమ యోగకారకుడైన కుజుడు ఉఛ్చ స్థితిలో ఉండి అల్పాయు యోగాన్ని రద్దు చేస్తున్నాడు. అలాగే చతుర్ధ కేంద్రాధిపతియగు శుక్రుడు ఉఛ్చ స్థితిలో ఉండి అల్పాయు యోగాన్ని రద్దు చేస్తున్నాడు. కనుక జాతకానికి అల్పాయు యోగం పోయి, మధ్యాయు యోగం పడుతుంది. అనగా 32-64 ఏళ్ళ మధ్యన ఆయువు సమాప్తి అవుతుంది. కాని శంకరులు 32 ఏళ్ళకే దేహాన్ని చాలించారు. కనుక జాతకం ఆది శంకరులది కాదు.

>>
ఇప్పుడు అంశాయుర్దాయ విధాన రీత్యా ఆయుర్గణన చేయగా 51 సంవత్సరాల ఆయువు వచ్చింది. కనుక జాతకం ఆది శంకరులది కాదు. అభినవ శంకరులు క్రీ.శ 788 లో పుట్టి 839 లో దేహాన్ని చాలించారని మనకు తెలుసు. అనగా ఆయన సరిగ్గా 51 సంవత్సరాలు జీవించారు. ప్రస్తుత జాతకుని ఆయువు 50.9 ఏళ్ళుగా వచ్చింది కనుక జాతకం అభినవ శంకరులది అని తేలుతున్నది.


>> తేదీ ప్రకారం జననకాల రాహు దశా శేషం 5 ఏళ్ళ 8 నెలలుంది.. కనుక నాలుగేళ్ళ వయస్సులో రాహు/చంద్రదశ జరిగింది. పితృస్థానమైన మీనానికి రాహువు మారక స్థానంలో ఉన్నాడు. కాని చంద్రునికి విధంగానూ పితృ మారక స్థానంతోగాని సంబంధం లేదు. కనుక నాలుగవఏట తండ్రి మరణం సూచింపబడటం లేదు.

>>
అయిదవ ఏట రాహువులో కుజ అంతరం జరిగింది. కుజుడు మంత్ర స్థానాధిపతిగా ఉఛ్ఛ స్థితిలో ఉన్నాడు. రాహువుకు పంచమంలో ఉన్నాడు. కనుక ఉపనయనం జరగాలి. కాని నవమాధిపతియగు గురుని స్పర్శ ఎక్కడాలేదు. రాహువుకు చతుర్ధ, మంత్ర స్థానాలతో సంబంధం లేదు. కనుక సమయంలో ఉపనయనం జరిగే అవకాశం లేదు.

>>
ఎనిమిదవ ఏట గురువులో గురు అంతరం జరిగింది. అప్పటికి చతుర్వేదాల అధ్యయనం పూర్తి అయింది. కాని గురువుకు విద్యాధిపతి అయిన శుక్రునికి సంబంధం లేదు. అప్పుడే సన్యాస దీక్ష తీసుకోవడం జరిగింది. కాని గురువుకు జాతకంలో నవమంలో ఉన్న సన్యాస యోగానికి సంబంధం లేదు. సమయంలోనే దేశ సంచారానికి బయలుదేరాడు. కాని స్థిర రాశిలోని గురువు దేశ సంచారాన్నివ్వడు. కనుక ఇదీ సూచితం కావడం లేదు.

>>
పన్నెండవ ఏట గురువులో బుధుని అంతరం జరిగింది. బుధుడు నీచస్థితిలో ఉన్నాడు. విద్యా స్తానంతో ఆయనకు సూటి సంబంధం లేదు. కనుక సమయంలో విద్యాభ్యాసపరంగా చెప్పుకోదగ్గ ఫలితం ఉండదు. కాని స్వామి వయస్సులో సర్వ శాస్త్రాలూ ఔపోసన పట్టాడు. కనుక ఈ సంఘటన కూడా సరిపోవడం లేదు.

>>
పదహారవ ఏట గురువులో చంద్ర దశ జరిగింది. ఇది యోగకారక దశ అయినప్పటికీ,విద్యా స్థానమయిన చతుర్ధసంబంధంగాని, గ్రంధరచనను ఇచ్చే తృతీయ స్థాన సంబంధంగాని లేకపొవడం చేత, ప్రస్థానత్రయ భాష్యం వ్రాయించదగ్గ మహిమాన్విత దశ కాదు. కాని వయస్సులో స్వామి అసాధారణమైన భాష్యం వ్రాశాడు. ఇది మామూలు విషయం కాదు. సంఘటన కూడా సరిపోవడం లేదు.

>>
ముప్పై రెండవ ఏట స్వామికి శనిలో రవి అంతరం జరిగింది. శని లగ్నానికి మారకుడే. రవి ద్వితీయాధిపత్యం ఉన్నప్పటికీ మారకుడు కాదు. పై పెచ్చు దశమంలో ఉఛ్చ స్థితిలో ఉండి మహిమాన్వితమైన వాక్కును ఇస్తున్నాడు. కనుక అంతరంలో మారకం జరగడం కుదరదు. అనగా జాతకునికి ముప్పై రెండో ఏట మరణం లేదు. కనుక జాతకం ఆది శంకరులది కాదు అని చెప్పవచ్చు.

అందరూ నమ్ముతున్న క్రీ.శ 788 శంకరుల జనన సంవత్సరం కాదు అని పై జ్యోతిష్య విశ్లేషణ ద్వారా తెలుస్తున్నది. అందులోని సంన్యాస యోగం, రవి శుక్ర కుజుల ఉచ్చ స్థితుల వల్ల
ఇది ఒక మహిమాన్వితుల జాతకమే అని అర్ధం అవుతున్నది.

మిగిలిన
రెండు జాతకాలను మున్ముందు పరిశీలిద్దాం.
read more " ఆది శంకరుల జీవితం - జాతకం (రెండో భాగం) "

19, మే 2010, బుధవారం

హోమియోపతి భూతవైద్యమా? లేక అలా అనేవాళ్ళు పిశాచాలా?

హోమియోపతి భూతవైద్యంతో సమానమని దానిని నిషేధించాలని బ్రిటన్ లో డాక్టర్లు డిమాండ్ చెయ్యడం చూస్తే చాలా వింత అనిపించింది. మూఢ నమ్మకాలు సామాన్య ప్రజలలోనే కాదు బాగా చదువుకున్న వారిలో కూడా ఉంటాయి.

హోమియోపతి అనేది వైద్య శాస్త్రంలో ఒక కొత్త విప్లవం. ముడి పదార్ధం తో కాకుండా పొటెన్ టైజ్ చెయ్యబడిన శక్తితో రోగాన్ని ఎదుర్కొనే విధానం. రోగం అనేది శరీరం యొక్క బయో ఎనర్జీలో వచ్చిన తేడాలవల్లే వస్తుందని నేడు నవీన వైద్య శాస్త్రం కూడా ఒప్పుకుంటున్నది. కనుక క్రూడ్ స్టేట్ లో ఉన్న మందులు ఎనర్జీ లెవెల్ లో ఉన్న రోగాన్ని నయం చేయలేవు అన్నది చాలా సింపుల్ విషయం. పని పొటెన్సీ లోనికి మార్చబడిన ఔషధాలు సమర్ధవంతంగా చెయ్యగలవు అనేది కూడా రుజువైన సత్యం.

శామ్యుల్ హాన్నెమాన్ అల్లోపతి వైద్యంలో 200 ఏళ్ళ క్రితమే ఎమ్. డి చేసిన మహామేధావి. ఆయన నేటి డాక్టర్ల వలె డబ్బుసంపాదనే జీవిత పరమావధి అనుకోలేదు. వైద్యశాస్త్రంలో ఆయనకు కనిపించిన లొసుగులను, మందుల వల్ల వస్తున్న సైడ్ఎఫెక్ట్ల్ లను చూచి విసుగుచెంది తన జీవితమంతా శ్రమించి కనిపెట్టిన కొత్త విధానమే హోమియోపతి. ఇది భూత వైద్యంఎంతమాత్రం కాదు. తెలిసీ తెలియక ఎవరు ఏమైనా మాట్లాడవచ్చు. కాని వైద్య విజ్ఞానం ఉన్న డాక్టర్లు ఇలా మాట్లాడటంవిడ్డూరం.

నాకు తెలిసిన అనేక మంది అల్లోపతి డాక్టర్లు వారి ఇళ్ళలో హోమియోపతి వాడటం నాకు తెలుసు. నా స్నేహితుడైన ఒకడాక్టర్ నాతో ఇలా చెప్పాడు. "మేం ఇస్తున్న మందుల వల్ల ఎంతటి సైడ్ ఎఫెక్ట్ లు వస్తాయో మాకు బాగా తెలుసు. అందుకనే మా ఇళ్ళలో మందులు వాడం. నిరపాయకరమైన హోమియో మందులే వాడతాం. ఆహార నియమాలుపాటిస్తూ యోగా చేస్తూ సాధ్యమైనంతవరకూ రోగాలు రాకుండా చూచుకుంటాం". మరి రోగులతో మీరు ఎలా చెలగాటంఆడుతున్నారు అని అడిగాను. "లక్షలు ఖర్చు పెట్టి చదివాము. మరి డబ్బు వడ్డీతో సహా సంపాదించాలిగా?" అనిఆయన సమాధానం చెప్పాడు.

మధ్యనే జరిగిన ఒక సంఘటన. ఒక అమ్మాయి తలనెప్పితో గిలగిల లాడుతున్నది. రాత్రిపూట చన్నీళ్ళతో తలస్నానం చేసినతర్వాత ఉన్నట్టుండి తలనొప్పి ఎత్తుకున్నది. మెడుల్లా ప్రాంతంలో రెండువైపులా కొద్దిగా పైన తీవ్రమైన నొప్పి అనిచెబుతున్నది. లైట్ చూడలేకపోతున్నది. చిరచిర విసుగు చికాకు బాగా ఉన్నాయి. నొప్పి హఠాత్తుగా పెద్దఎత్త్తున మొదలైంది. లక్షణాలకు సామాన్యంగా బెల్లడోనా ఇవ్వాలి. కాని కళ్ళు ఎర్రగా లేవు. ముఖం ఉబ్బరించి లేదు.
So congestion of brain is ruled out. కనుక బెల్లడోనా సూచింపబడటం లేదు. కనుక నక్స్ వామికా ఒక్క డోస్ ఇచ్చాను. అయిదు నిమిషాలలో నొప్పి మంత్రం వేసినట్లు మాయం అయింది. నవ్వుతూ మామూలు మనిషిఅయింది. ఇది భూత వైద్యం ఎలా అవుతుంది?

ప్రతి దానికీ స్కానింగులంటూ వేలకు వేలు గుంజటం, చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలని ప్రతి దానికి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఏంటీ బయోటిక్స్ వాడకం, నిర్లక్ష్యంగా ట్రీట్మెంట్ ఇవ్వటం, డయాగ్నసిస్ సరిగా చెయ్యకుండా ఉజ్జాయింపుగా మందులు వాడి రోగాన్ని ముదరబెట్టి చివరకు చేతులెత్తెయ్యటం అల్లోపతి వైద్యులకు సర్వ సాధారణాలు. నా దృష్టిలో ఇదే అసలైన భూతవైద్యం.నూటికి తొంభై శాతం అల్లోపతి డాక్టర్లు లైసెన్సుడ్ కిల్లర్స్ అని నా నిశ్చితాభిప్రాయం. ఇటువంటి చెత్తవైద్యం చేసే అల్లోపతీ వైద్యులు హోమియోని భూతవైద్యం అనడం పిశాచాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది.

హోమియో పొటెన్సీలు ఎలా పని చేస్తున్నాయో ఇంకా పూర్తిగా ఋజువు కాలేదు. కాని అంతమాత్రాన ఇది అసలు వైద్యమేకాదు అనడం తార్కికం కాదు. హోమియోపతికి పెరుగుతున్న ఆదరణ చూచి ఓర్వలేని వారే ఇటువంటి చెడు ప్రచారాలుచేస్తున్నారు. ఆరోపణల వెనుక ఉన్నది అసూయ మాత్రమే గాని సైంటిఫిక్ స్పిరిట్ కాదు. ఈ ఆరోపణలు చేసినవారు అల్లోపతిలో జూనియర్ డాక్టర్లుట. వారికి హోమియోపతిలో ఏం అనుభవం ఉందని ఈ ఆరోపణలు చేస్తున్నారు?

హోమియోపతి అనేది వైద్యం కాదు అనేవారికి నేను ఒక్కటే సవాల్ విసురుతాను. చిన్న పని చేసి చూడండి. హోమియో వైద్యవిధానంలో అతి చిన్న మందు అయిన "ఎకోనైట్ ౩౦" నిపావుగంటకొకసారి చొప్పున ఒక నాలుగు డోసులు వేసుకోండి. ఏమి జరుగుతుంతో చూడండి. 6 పొటెన్సీ దాటితే అందులో పదార్ధం ఉండదు అని సైన్స్ కూడా ఒప్పుకుంటున్నది. అప్పుడు సైన్స్ దృష్టిలో అవి ఉత్త పంచదార మాత్రలు మాత్రమే. అలా వేసుకుంటే ఏం జరుగుతుందో నేను ముందే చెబుతాను.

విపరీతమైన దడ, భయం, ఆదుర్దా, ఆందోళన, చికాకు మనిషిలో కలుగుతాయి. హటాత్తుగా టెంపరేచర్ పెరుగుతుంది. అసహనంగా ఉంటుంది. విపరీత దాహం అవుతుంది. ఆ లక్షణాలు ఖచ్చితంగా ఆ మనిషిలో కనిపిస్తాయి. మరి అవి ఉత్త పంచదార మాత్రలే అయితే ఈ లక్షణాలు ఎలా వస్తాయి? అన్న ప్రశ్నకు అల్లోపతి సమాధానం చెప్పలేదు. ఇవే లక్షణాలు ఉన్న జ్వరం కేసులలో ఇదే ఎకోనైట్ వాడి ఈ లక్షణాలను నిమిషాలలో తగ్గించవచ్చు. హోమియో పతి నిదానంగా పని చేస్తుంది అనేవారికి కూడా ఇదే సమాధానం. ఇది కూడా అవగాహనా రాహిత్యంతో ఏర్పరచుకున్న అభిప్రాయమే అని నేను నా అనుభవం నుంచి గట్టిగా చెప్పగలను.

హోమియోపతి చక్కగా పనిచేస్తుంది. హోమియో పొటెన్సీలు పనిచేస్తాయి. అయితే అవి ఎలా పనిచేస్తున్నాయో శాస్త్రపరంగా ఇంకా నిర్ధారణగా చెప్పలేక పోతున్నాము. ఆ పని పరిశోధకులు చెయ్యాలి. ఈనాడు అణువులోనికి మనం తొంగి చూడ గలుగుతున్నాం. ప్రస్తుతం మన దగ్గర ఉన్న అత్యాధునిక పరికరాలతో రీసెర్చి చేసి, పొటెన్సీలోకి మార్చినపుడు మందులోని మాలిక్యులర్ ఎనర్జీ లెవెల్స్ ఎలా మారుతున్నాయో పరిశోధకులు నిర్ధారించి వివరించాలి. అంతేగాని మనకు అర్ధం కానంత మాత్రాన హోమియోపతి అసలు వైద్యమే కాదు అనడం సరికాదు. నాకు అర్ధం కాలేదని ఫిజిక్స్ అసలు సైన్సేకాదు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఈ జూనియర్ డాక్టర్ అజ్ఞానుల ధోరణీ అలాగే ఉంది.వీరి చిత్త శుద్ధిని శంకించక తప్పదు. అసూయా, అజ్ఞానాలతో నిండిన వీళ్ళు ముందు ముందు విలువలతో కూడిన వైద్యాన్ని ఎంతవరకూ అందించగలరు అనేది ప్రశ్నార్ధకమే.
read more " హోమియోపతి భూతవైద్యమా? లేక అలా అనేవాళ్ళు పిశాచాలా? "

18, మే 2010, మంగళవారం

ఆది శంకరుల జీవితం- జాతకం
















శంకర శ్శంకర స్సాక్షాత్ (శంకరుడు సాక్షాత్తూ పరమేశ్వరుడే)

శ్లో||శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ||
(వేద వేదాంత పురాణజ్ఞానమునకు ఆలయమైన వాడును, కరుణామూర్తియు, లోకమునకు శుభము చేకూర్చువాడును, భగవంతుని పాదములయొక్క రూపమైనవాడును అగు శంకరులకు నమస్కరించెదను.)

ఈరోజు వైశాఖ శుక్ల పంచమీ పర్వదినం. ఆది శంకరుల పవిత్ర జన్మ దినం.

సనాతన వేద ధర్మం దాదాపు డెబ్బై రెండు శాఖలుగా విడిపోయి, గందరగోళంలో మునిగి, విపరీత వాదనలు చేష్టలతో కునారిల్లుతూ, మహత్తరమైన వేదజ్ఞానాన్ని మరచి ఎవరికి తోచిన సిద్ధాంతాలు వారు అనుసరిస్తూ, ఇదే సరియైన మతం అని భావిస్తూ భారతదేశమంతా రకరకాలైన మతాలతో నిండి, సత్యం మరుగున పడి, వేదధర్మం కొడిగట్టిన సమయంలో, పదహారేళ్ళు శ్రమించి ఒక్క చేతితో పరి్స్థితినంతా చక్కదిద్ది, భారతదేశాన్నంతా ఒక్కత్రాటిపైన నిలిపి, వేదానికి ఉపనిషత్తులకు అసలైన భాష్యం చెప్పి, తన జీవితాన్ని ధర్మ రక్షణకు ధారపోసి, ఘోర తమస్సులో నిద్రిస్తున్న భారతజాతికి వెలుగు బాటతో దిశానిర్దేశం చేసిన మహాపురుషుడు ఆది శంకరులు జన్మించిన మహత్తరమైన రోజు ఇది.

ప్రపంచంలో అవతార మూర్తులు, మహాప్రవక్తలు, కారణ జన్ములు, ఎప్పుడో ఒకసారి మాత్రమే తళుక్కుమని మెరిసి మాయం అవుతుంటారు. వారి కాలానికి వారు కొన్ని వందల వేల ఏళ్ల ముందుంటారు. వేల సంవత్సరాలు గడచిన తరువాత కూడా వారి మహత్వానికి ప్రపంచం సాష్టాంగ ప్రణామం చేస్తూనే ఉంటుంది. వారిలో కొందరు సాక్షాత్తు భగవంతుని అవతారముగా భావింపగల స్థాయి ఉన్నటువంటి వారుంటారు. అటువంటి మహోన్నత స్థాయి కలిగిన మహాపురుషులలో ఆదిశంకరులు ప్రధమ స్థాయికి చెందినవారు. జగద్గురువు అన్న బిరుదు వ్యాసభగవానుని తర్వాత ప్రపంచంలో శంకరులకే చెల్లుతుంది. తరువాతనే మాటను ఇంకెవరికైనా వాడగలుగుతాము.

అసాధారణ జీవితం

మూడేండ్ల వయస్సులో అక్షరాభ్యాసము, అయిదేళ్ళ వయస్సులో భిక్షగా తనకు ఒక ఉసిరికాయను తప్ప ఏమీ ఇవ్వలేని పేదరాలిమీద జాలితో ఆశువుగా కనకధారాస్తోత్రం చెప్పటం, బంగారు ఉసిరికాయల వర్షం కురిపించడం, తల్లి నడవలేకపోతున్నదని తన ప్రార్ధనతో పూర్ణానదిని దారి మళ్ళించి తన ఇంటిపక్కగా ప్రవహించేలా చెయ్యటం, ఎనిమిదేళ్ళకే వేదవేదాంతములను ఔపోసన పట్టి అఖండ పాండిత్యము సంపాదించడం, చిట్టివయసులో వైరాగ్య పరిపూర్ణుడై ప్రపంచాన్ని త్యజించి సంన్యాసమును స్వీకరించడం, అంత చిన్న వయసులోనే రవాణా సౌకర్యములు లేని క్రీపూ 509 లో కేరళ నుండి హిమాలయాలకు ఒక్కడే పయనమై ఇల్లువదలి పోవడం, పదహారేళ్ళకే ప్రస్థానత్రయం అనబడే బ్రహ్మ సూత్రములు, పది ఉపనిషత్తులు, భగవద్గీతలకు అద్భుతమైన భాష్యం వ్రాయడం( భాష్యాన్ని అర్ధం చేసుకోడానికి ఈనాటికీ మహాపండితులైనవారు కూడా తల్లకిందులుగా తపస్సు చేయవలసి వస్తుంది), కేరళ నుంచి టిబెట్ లోని కైలాస పర్వతం వరకూ,ద్వారక నుంచి అస్సాంవరకూ,అక్కడనుంచి తిరిగి కన్యాకుమారి వరకూ కాలినడకన పర్యటించి భారతదేశం అంతటా 72 రకాలైన భిన్న మతస్థులలో కొమ్ములు తిరిగిన మహా పండితులతో వాదించి గెలిచి ఆసేతుహిమాచల పర్యంతం అద్వైత స్థాపన చెయ్యడం, కాశీలో పరమేశ్వరుని దివ్య దర్శనాన్ని పొందడం,అక్కడే వ్యాస భగవానుని దర్శనాన్ని పొంది తన వేదాంత భాష్యం అన్ని భాష్యములలోనికి అత్యుత్తమమైనదన్న మాట ఆయన నోట వినడం, అద్భుత యోగ శక్తులను అవలీలగా ప్రదర్శించడం, ఆరు మతములను ధృవీకరించి "షణ్మత స్థాపనాచార్య" అన్న బిరుదును పొందడం, కాశ్మీరంలోని సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించి సర్వజ్ఞుడు (సమస్త జ్ఞానమూ తెలిసినవాడు) అన్న సార్ధక నామధేయమును పొందడం, దేశం మొత్తంమీద గల అనేక దేవాలయాలలో మహిమాన్విత యంత్రములు స్థాపించి ఉగ్ర దేవతలను శాంత మూర్తులుగా మార్చడం, ధర్మ రక్షణకై భారతదేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్థాపించి తన శిష్యులను అక్కడ ఉండమని ధర్మరక్షణ చెయ్యమని ఆదేశించి తాను కంచి మఠానికి చేరి తన 32 ఏట దేహ త్యాగం చెయ్యటం -- ఇవన్నీ ఒక మామూలు మనిషి చెయ్యగలడా అని ప్రశ్నించుకుంటే, ముమ్మాటికీ చెయ్యలేడు గాక చెయ్యలేడు అని జవాబు వస్తుంది.

మహోత్తమ విశిష్ట దివ్య పురుషుడైనవాడే ఘనకార్యాలను సాధించగలడు,ఇంతటి మహాపాండిత్యము, ఉత్తమసంస్కారము, అపార మేధాసంపత్తి, కరుణాహృదయము, దివ్యశక్తులు, సదాచారపరాయణత్వము, వివేక వైరాగ్యములు, బ్రహ్మజ్ఞానసంపద, ధర్మస్థాపనా దక్షత ఒక్క మనిషిలో చూడాలంటే ప్రపంచం మొత్తం మీద మానవ చరిత్రలో ఎంత వెతికినా ప్రవక్త లోనూ స్థాయిలో లక్షణాలు కనిపించవు. అందుకనే "శంకర శ్శంకర స్సాక్షాత్" అని అన్నారంటే మాటను ఊరకనే అనలేదు. మహనీయుని కన్నటువంటి "శివగురు, ఆర్యాంబ"లు ఎంతటి ధన్యాత్ములో ఎంతటి పుణ్యాత్ములో కదా అని అనిపిస్తుంది.

శంకరుల జనన తేదీ

ఇతర మహాపురుషుల వలెనే శంకరుల జనన తేదీమీద కూడా ఖచ్చితమైన వివరాలు లేవు. మన జాతి ఎంతటి దౌర్భాగ్య స్థితికి దిగజారిందంటే, సాక్షాత్తూ భగవంతుడే మన మధ్యన జన్మించినా ఆయన జనన సమయాన్ని మనం భద్రపరచం. ఆయన జీవితాన్ని మనం లెక్కలోకి తీసుకోం. ఆయన పుట్టిన భూమిని ప్రదేశాన్ని జాగ్రత్త చెయ్యం.

అదేమంటే ఆయన చెప్పినది ఆచరించాలి కాని చిన్న చిన్న విషయాలు పట్టించుకోవటం అనవసరం అని కబుర్లు చెబుతాం. కాని మన పుట్టిన రోజులు మాత్రం చక్కగా జరుపుకుంటాం. మన జాతకాలు, ఇళ్ళు ,భూములు మాత్రం చాలా జాగ్రత్తగా పదిలపరుచుకుంటాం. మరి వేదాంతం అప్పుడేమైతుందో? పొనీ వారు చెప్పినది ఏదన్నా ఆచరిస్తామా అంటే అదీ ఉండదు. వాళ్ళను ఉపయోగించుకోని మన వ్యాపారాలు చేసుకుంటాం. ఇదీ మనకు చేతనైన విద్య. వ్యాపారానికి వీలు పడడు అనుకున్న గౌతమ బుద్ధ్హుని వంటి మహాపురుషులను మనదేశం నుంచి వెలివేస్తాం. లేదా అవతారాలలో కలిపేసి పూజా పునస్కారాలకు పరిమితం చేస్తాం. కాని ఆయన చెప్పినది మాత్రం ఆచరించం. ఇదీ మన పరిస్థితి. మనలో ఆత్మవిశ్వాసం ఎప్పుడు పెరుగుతుందో, ఇటువంటి తమస్సూ, స్వార్ధం ఎప్పుడు తగ్గుతాయో భగవంతునికే ఎరుక.

ఆంగ్లేయులిచ్చిన తప్పుడు చరిత్ర

ప్రస్తుతానికి ఆ విషయాలు అలా ఉంచుదాం. మన చరిత్రను పూర్తిగా అస్తవ్యస్తం చేసి పోయిన ఆంగ్లేయులు శంకరులనూ వదలలేదు. ఆయన జననతేదీ క్రీ శ 788 అని తేల్చి చెప్పారు. దానికి ఏవేవో కారణాలు వారు చూపారు. కాని దేశంలో ఉన్న శంకర సాంప్రదాయ మఠాలైన బదరీ,పూరీ,ద్వారకా,శృంగేరీ,కాంచీ మఠాలలో ఉన్నటువంటి గురుపరంపరను పరిశీలిద్దామని వారికి తోచలేదు. శంకరులు దేశం నాలుగుమూలలా నాలుగు మఠాలను స్థాపించి ధర్మ పరిరక్షణ చెయ్యమని చెప్పి తన శిష్యులను వాటికి గురువులుగా నియమించి ఆదేశించారు. ఆయా మఠాలలో మొదటి నుంచి ఇప్పటిదాకా గురుపరంపర వ్రాసిపెట్టబడుతూ వస్తున్నది. రికార్డులను బట్టి శంకరులు క్రీ పూ 509 లో జన్మించారని నాలుగు మఠాల రికార్డులూ ముక్తకంఠంతో చెబుతున్నాయి.అప్పటినుంచి వరుసగా వస్తున్న గురుపరంపర యొక్క వివరాలు వారి వద్ద ఉన్నవి. ఒక్క శృంగేరీ మఠం మాత్రం క్రీ పూ 44 గా తేదీని భావిస్తున్నది.

మరి ఆంగ్లేయుల తేదీకి ఆధారాలు ఏమిటి? క్రీ శ 788 లో అభినవ శంకరులనే ఒక ఆచార్యులు కంచి పీఠాన్ని అధిష్టించారు. ఆయన ఆదిశంకరుల స్థాయి కలిగిన వక్తా, యోగీ మరియు మహా పండితుడూ. అనేక దేవీ దేవతా స్తోత్రాలు భక్తి ప్రబోధకంగా వ్రాసినది అభినవ శంకరులే. ఈయనే ఆది శంకరులని ఆంగ్లేయులూ, వారిని గుడ్డిగా అనుసరించిన భారతీయ చరిత్ర కారులూ నమ్మారు. ఇక్కడే చరిత్ర మొత్తం బోల్తా కొట్టింది. చరిత్రలో 1296 సంవత్సరాలు చెరిగిపోయాయి. క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దిలోఉన్న ఆది శంకరులు క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దంలోకి వచ్చికూర్చున్నారు. అదే నిజమని ఇన్నాళ్ళూ మనం నమ్ముతూ వచ్చాము.

ఆదిశంకరుల అసలైన జనన వత్సరం- జ్యోతిశ్శాస్త్ర ఋజువులు

శంకరుల జననతేదీని ఆధారాలతో నిరూపించే ప్రయత్నం ఎందరో మహాపండితులూ పరిశోధకులూ చేశారు. అదంతా నేను మళ్ళీ వ్రాయదలుచుకోలేదు. అంతర్జాలంలో వెదికితే బోలెడంత సమాచారం దొరుకుతుంది. ప్రస్తుతం జ్యోతిషశాస్త్ర రీత్యా మాత్రమే నేను పరిశీలన చేశాను. నా పరిశీలనలో తేలిన విషయాలను ఇక్కడ ఉంచుతున్నాను.

ఆచార్యుల జనన తిధి గురించి వివాదాలు లేవు. ఆయన వైశాఖ శుక్ల పంచమి రోజున జన్మించారు అన్నది అందరూ అంగీకరిస్తున్నారు. నక్షత్రం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఆర్ద్రా నక్షత్రమని, కొందరు పునర్వసు నక్షత్రమని వ్రాశారు. అసలు వివాదం సంవత్సరం దగ్గరే ఉన్నది. ఇంగ్లీషువారు, వారిని అనుసరించే భారతీయ రచయితలు చెప్పిన సంవత్సరం క్రీ.శ 788 అనేది తప్పు అని ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు. వత్సరం కంచి మఠ ఆచార్యులైన అభినవ శంకరులది. అంతేగాని ఆది శంకరులది కాదు.

పరిశోధకులు తేల్చినవి రెండు సంవత్సరాలున్నాయి. ఒకటి- శృంగేరి మఠం తప్ప మిగిలిన నాలుగు శంకర మఠాలూ (అనగా బదరీనాధ్ లోని జ్యోతిర్మఠం, పూరీలోని గోవర్ధన పీఠం, ద్వారకా పీఠం, మరియు కంచి కామకోటి పీఠం) ఒప్పుకున్న కలియుగాది సరియగు క్రీ.పూ 509 , రెండవది శృంగేరి మఠం రికార్డుల ననుసరించినది-కలియుగాది సరియగు క్రీ.పూ 44 మూడవది ఇప్పటివరకూ అందరూ నమ్ముతున్న క్రీ. 788 .

మూడు కుండలులనూ జ్యోతిశ్శాస్త్ర రీత్యా తులనాత్మక పరిశీలన చేయగా ఏది సరియైన జనన తేదీగా వస్తుందో చూద్దాము.
read more " ఆది శంకరుల జీవితం- జాతకం "