“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, జనవరి 2011, బుధవారం

బ్రాహ్మణ ద్వేషం-మన దేశానికి శాపం

దేశంలోని ప్రతి సమస్యకూ బ్రాహ్మణుల్ని కారణాలుగా చూపిస్తూ వాదించే ఒక మూర్ఖ వాదం చాలా రోజులనుంచికనిపిస్తూనే ఉంది.ఇది కొత్త కాదు. దానికి ముఖ్య కారణం అకారణ ద్వేషం, అసూయా, ఓర్వలేనితనం తప్ప ఇంకేమీ కావు.

తరతరాలుగా సాగుతున్న దుష్ప్రచారానికి తెరపడాలంటే బ్రాహ్మణులు వాదానికి ఎదురు తిరగాలి. అదే జరగాలంటేముందుగా తమ మీద జరుగుతున్న దుష్ప్రచారానికి ఎంతవరకు ప్రామాణికత ఉన్నదో బ్రాహ్మణులు తెలుసుకోవాలి. ప్రచారంలో ఎంత నిజం ఉందో కూడా వాళ్ళు గ్రహించాలి. దానికోసం తమ పురాణాలనూ శాస్త్రాలనూ తిరిగి చదవాలి. అప్పటి సామాజిక పరిస్థితుల్ని చక్కగా అర్ధం చేసుకోవాలి. అప్పుడే ఈ ద్వేషపూరిత దాడిని సమర్దవంతంగా ఎదుర్కొగలుగుతారు.

ఎవరు ఎన్ని విధాలుగా బురద చల్లాలని చూచినా బ్రాహ్మణులవల్లనే భారతదేశ సంస్కృతి నిలబడిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. వారిని విమర్శించే ఒకే ఒక్క విషయం. అంటరానితనం పాటించారని. మరి నాదొక్క సందేహం. నిమ్న కులాలని చెప్పుకుంటున్నవారిలో ఏదైనా ఒక కులం కొంచెం ఎదిగితే తమకన్న నిమ్న కులాలను వారితో సమంగా చూస్తున్నారా? లేదుకదా. నిమ్నకులాల మధ్యనకూడా ఎక్కువాతక్కువా తేడాలున్నాయి కదా. మరి వాళ్ళుకూడా తమ మధ్యలోనే వివక్షతను పాటిస్తూ ఒక్క బ్రాహ్మణులను మాత్రమే ఈ విషయంలో తరతరాలుగా విమర్శించడం ఎందుకో? ఎందుకంటే- ఎవరు ఏమన్నా బ్రాహ్మణులు నోరుమూసుకుని పడిఉంటారని, పోనీలే వాడి ఖర్మకు వాడే పోతాడు అని కర్మ సిద్ధాంతానికి కట్టుబడి ఊరుకుంటారనీ అందరికీ తెలుసు కాబట్టి.

కాని ప్రస్తుతం పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే- తమపైన మోపబడుతున్న నిందలను అన్నింటినీ నిజాలేనని బ్రాహ్మణులే నమ్మే స్థాయికి పరిస్తితి దిగజారింది. దానికి కారణం ప్రాచీన సమాజం లోని పరిస్థితులు, కట్టుబాట్లు, వ్యవస్థలను ఇప్పటి తరంవాళ్ళు అధ్యయనం చెయ్యకపోవటం. ప్రస్తుత సామాజిక సిద్ధాంతాలను పరిస్తితులను దృష్టిలో పెట్టుకుని, ప్రాచీన కాలపు పరిస్తితులు సరిగా అర్ధం చేసుకోకుండా, ప్రతిదానికీ బ్రాహ్మణులను బాధ్యులను చేస్తూ వ్యాఖ్యానాలు చేయ్యబోవటమే ఈ అపార్ధాలకు కారణం. అసలు నిజమేమంటే, ఆ అపవాదులన్నీ నిజాలు కావు. వాటిల్లో అవగాహనా రాహిత్యమూ, అసూయాద్వేషాలపాళ్ళే ఎక్కువ. అప్పటి సామాజికన్యాయాన్నీ, కాలమాన పరిస్థితులనూ, వ్యవస్థనూ అర్ధం చేసుకోకుండా మాట్లాడే పిచ్చివాగుడే ఈ విమర్శలకు కారణం.

మొదటినుంచీ దేశాన్ని దోచుకున్నది, నేరాలు చేసింది , విదేశీరాజులను ఆహ్వానించి మన గుట్లు వాళ్లకుచెప్పి రాజ్యాలు కట్టబెట్టింది బ్రాహ్మణులు కాదు. వెయ్యిసంవత్సరాల బానిసత్వానికి కారకులు బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణులను ఇప్పుడు విమర్శిస్తున్న వారివల్లే
ఖచ్చితంగా ఇవన్నీ జరిగాయి. కాని తెలివిగా దోషాన్ని ఒక్క బ్రాహ్మణులమీదే మోపుతున్నారు. బ్రాహ్మణులెప్పుడూ సమాజ హితాన్నే కోరుకున్నారు. అందరూ బాగుండాలన్న ప్రార్ధనతోనే వారి దినచర్య మొదలవుతుంది, ముగుస్తుంది.

బ్రాహ్మణులు అధికారంలో ఉన్నపుడు ఎన్నడూ అధికార దుర్వినియోగం చెయ్యలేదు. సమాజాన్ని విచ్చలవిడిగా దోచుకోలేదు. ఆస్తులు వెనకేసుకోలేదు. అడ్డగోలుగా అవినీతిని ప్రోత్సహించలేదు. కనీసం వాళ్ల కులాన్ని వాళ్ళు బాగుచేసుకోలేదు. అది వాళ్ళు చెయ్యలేరు. వాళ్ళు సహజంగానే ధర్మాన్ని అనుసరిస్తారు ఆచరిస్తారు. దైవానికి భయపడతారు. ధర్మానికి భయపడతారు. నీతికి నిజాయితీకి తలొగ్గుతారు. దురలవాట్లకు దూరంగా ఉంటారు. ఇహం కంటే పరానికి ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు. ఈ గుణాలు సహజంగానే తరతరాలుగా వాళ్లలో ఉంటాయి.

బ్రాహ్మణుల్లో దుర్మార్గులు దుర్నీతిగలవారూ లేరా? అంటే లేరని నేను చెప్పను. తప్పకుండా ఉన్నారు. కాని స్వార్ధం పాళ్ళు వాళ్ళలో బాగా తక్కువనే చెప్పాలి. బ్రాహ్మణుడు దారితప్పితే అది స్వతహాగా జరుగదు. అదికూడా ఇతరస్నేహితుల సాంగత్యంతోనూ, ప్రోద్బలంతోనే, జరుగుతుంది గాని సహజంగా అతడు ధర్మాన్ని తప్పటానికి ఇష్టపడడు. ఇంకొకళ్లని దారితప్పమని ప్రోత్సహించడు. అవసరమైతే పస్తుంటాడుగాని ఇంకోణ్ణి దోచుకోని ఆస్తులు కూడబెట్టాలని, పైరవీలు చెయ్యాలనీ, పక్కవాడి నోరుకొట్టి విలాసంగా బతకాలనీ అతడు ఆశించడు. నిరాడంబరంగా బతకటం, పేదరికంలో బతకటం వాళ్లకు కొత్తేమీ కాదు.

బ్రాహ్మణజాతి దేశాన్ని దోచుకోవాలని ఎన్నడూ అనుకోలేదు.అక్రమంగా ఆస్తులు కూడబెట్టాలని ఎన్నడూ అనుకోలేదు. దేశాన్ని పరాయిపాలకులకు తాకట్టుపెట్టాలనీ అనుకోలేదు. దొంగతనాలు, దోపిడీలు, నేరాలు, చేసి బ్రతకలేదు. వాళ్ల బ్రతుకు వాళ్లు బ్రతుకుతూ తమ సంఘంలోనే తిరస్కరణకు గురవుతూ, చెయ్యని నేరాలకు తిట్లు భరిస్తూ, ఎదురుగా నమస్కారం పెట్టినవాళ్ళే వీపు చాటున హేళనగా మాట్లాడినా తిట్టినా మౌనంగా సహిస్తూ, సమాజ హితాన్ని కోరుకుంటూ, ఎవరి సపోర్టూ లేకుండానే
ఈదేశపు సంస్కృతిని తరతరాలుగా పోషిస్తున్నది వాళ్ళుగాక ఇంకెవరు?

వేదాలు వింటే చెవుల్లో సీసం పొయ్యమన్నారనీ, వర్ణవ్యవస్థను రూపకల్పన చేశారనీ, అంటరానితనాన్ని పోషించారనీ, సామాన్యంగా వారిపైన వేసే నేరారోపణలు. ఈ నేరారోపణలు చేసేవారికి ఏ మాత్రం జ్ఞానం లేదన్న విషయం ముందుముందు నేను వ్రాసే పోస్ట్ లలో తేటతెల్లంగా నిరూపిస్తాను. శ్రీరాముడు శంబుకుణ్ణి వధించడం తప్పనీ అందువల్ల అతడు అవతారం కాదన్న వాదనకూడా తెలివితక్కువ-ద్వేషపూరిత-అజ్ఞానజనిత వాదనే. ఎలాగో ముందుపోస్ట్ లలో వ్రాస్తాను.

బ్రాహ్మణద్వేషం ఇతర రాష్ట్రాలకంటే తమిళనాడులో మహా ఎక్కువ. దానికి ప్రత్యేక కారణాలేమీ కనిపించవు. సాధారణంగా తమిళులకుండే అతిపైత్యమూ, పెడసరపు ధోరణులే దీనికి కారణం.

ప్రజాస్వామ్యం అరవైఏళ్ళుగా పరిఢవిల్లుతున్నా కూడా ఇంకా ఒకకులాన్ని పాతకాలపు లోపాలు చూపి ఆడిపోసుకోవటం ఎంతవరకు న్యాయం?
read more " బ్రాహ్మణ ద్వేషం-మన దేశానికి శాపం "

16, జనవరి 2011, ఆదివారం

శబరిమల ప్రమాదం- ప్రశ్న జ్యోతిష్యం-పూర్వజన్మ కర్మ

మొన్న శబరిమలలో తొక్కిసలాట జరిగి షుమారు నూరుమంది అయ్యప్ప భక్తులు చనిపోయారు. దైవదర్శనానికి వెళ్ళిసరాసరి దేవుని దగ్గరకే వెళ్లారని కొందరు అనుకుని బాధపడ్డారు,కొందరు సరిపెట్టు కున్నారు.సామాన్యంగా ఇలాటి నిత్యప్రళయాలను నేనంతగా పట్టించుకోను.వీటి వెనుక ఉన్న కారణాలేమిటో నేను ఊహించగలను.

కాని ఈ సంఘటనమీద ప్రశ్నజ్యోతిష్యం ఏమి చెబుతుందో చూద్దామని నిన్న రాత్రి నాకు అనిపించింది.ఈ విధంగా అనిపించటం చాలా అరుదుగా జరుగుతుంది.ఇంపల్స్ చాలా బలంగా ఉండటంతో ప్రశ్నచక్రం వేసి చూఛాను.ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.

తేదీ:15-1-2011
సమయం:20.02 గంటలు
ప్రదేశం: గుంటూరు.

లగ్నం సింహం:౦.48 డిగ్రీలు

సింహం వనచరరాశి కనుక కొండల్లో అడవుల్లో జరిగిన సంఘటనను సూచిస్తున్నది.లగ్నడిగ్రీలు రాశిసంధిలో పడి బలహీనంగా ఉన్నాయి.దీనివల్ల జరిగిన సంఘటన సరిగానే సూచింపబడుతున్నది.లగ్నాధిపతి రవి ఆరింట శత్రుస్థానంలో ఉండి వీరందరూ మృత్యువాత పడడాన్ని చూపుతున్నాడు. నవమాధిపతి ఐన కుజుడు ఆరింట ఉఛ్ఛస్థితిలో ఉండి ధార్మికమైన కార్యక్రమమే వీరికి మృత్యుగండాన్ని ఇస్తుందని చూపిస్తున్నాడు. పంచమాధిపతి గురువు అష్టమంలో ఉండి ఆధ్యాత్మికపరమైన కార్యక్రమమే వీరి చావుకు కారణం అవుతుందని సూచిస్తున్నాడు.

ఆత్మారూఢం నుంచి రవికుజుల కాంబినేషన్ అష్టమరాశిలో పడి ఈ విశ్లేషణ కరెక్ట్ అనీ వారికి బలవంతమైన మృత్యువు రాసిపెట్టి ఉన్నదనీ చూపిస్తున్నది.

ఇంతవరకూ అంతా బాగానే ఉంది.కాని ఈ సామూహిక మరణానికి కారణాలు ఏవై ఉండవచ్చు?మనకు కనిపించే కారణాలు చాలా ఉంటాయి. ఏదో వాహనం దూసుకొచ్చి బోల్తా పడటం తద్వారా తొక్కిసలాట జరగటం ఇలా అనేకకారణాలు బాహ్యంగా కనిపిస్తాయి. కాని ఆ వాహనం అదే సమయానికి ఎందుకు అలా దూసుకురావాలి? అంతమంది మనుషులు ఆ సమయానికి అక్కడే ఎందుకుండాలి? అక్కడే ఎందుకు తొక్కిసలాట జరగాలి? అని ఆలోచిస్తే ఈ సంఘటన వెనుక బలీయమైన సామూహిక పూర్వకర్మ కనిపిస్తుంది.

మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు అనేక విషయాలను చెబుతూ సామూహిక మరణాలకు కారణాలను వివరిస్తాడు. సామూహికంగా చేసిన బలీయమైన దుష్కర్మ ఇలాటి సంఘటనలకు కారణం అవుతుంది. ఉదాహరణకు, ఏ కాశీకో గుంపుగా పోతున్న యాత్రికులను మార్గమధ్యంలో దారికాచి చంపి దోచుకునే అడవిదొంగల గుంపులు పూర్వకాలంలోఉండేవి. వారు సామూహికంగా బలవత్తరమైన దుష్కర్మను చేస్తారు. ఎందరిదో ఉసురు పోసుకుంటారు. కనుక తరువాతిజన్మలలొ వారందరూ ఒకేచోట,ఒకేసమయంలో ఇలా గుమిగూడి ఏక్సిడెంట్లలో మరణిస్తారు.

ప్రస్తుతం మన ప్రశ్న చక్రంలో ఏం కనిపిస్తున్నదో చూద్దాం.

పూర్వకర్మను సూచించే నవమాధిపతి కుజుడు.ఇతడు బలమైన ఉఛ్ఛస్థితిలో శత్రుస్థానంలో ఉన్నాడు. కుజుడుహింసకు కారకుడు. కనుక పూర్వజన్మలలొ వీరందరూ బలీయమైన హింసాకాండకు పాల్పడ్డారు అనిసూచింపబడుతున్నది. అది ఎటువంటి హింసాకాండ అయి ఉంటుంది?

కుజుడు రవి నక్షత్రంలో ఉన్నాడు. రవి లగ్నాధిపతి. రాజులకు ఉన్నతాధికారులకు సూచకుడు. కనుక రాజకార్యంనిమిత్తమై పోతున్న అనేకమందిని వీరు సామూహికంగా మట్టుబెట్టటం జరిగింది.ఈసంఘటన ఎక్కడ జరిగి ఉంటుంది?ప్రస్తుత సంఘటనను సూచించే రాశి మకరం.మొసలి నదులలోనూ అడవులలోని మడుగులలోనూ ఉంటుంది. కనుక నదీతీరంలోని అడవులలో ఈసంఘటన జరిగింది.

ఇంకా లోతుగా పరిశీలిద్దాం. దానికి ప్రత్యెక లగ్నాలద్వారా , అంశ చక్రాలు,దశల ద్వారా పరాశరమహర్షి విధానంలో విశ్లేషణ చెయ్యవచ్చు.కాని కొంత విభిన్నత కోసం దీనికి కృష్ణమూర్తి పద్దతి సహాయం తీసుకుందాం.

కుజుడు బుధుని సబ్ లో ఉన్నాడు. ఆ బుధుడు పంచమంలో రాహువుతో కలిసి ఉన్నాడు. పంచమం ధార్మికకార్యక్రమాలకు సూచిక. రాహుబుధుల కాంబినేషన్ కుట్రలకు సూచిక. లగ్నాధిపతియగు రవికి బుధుడు అత్యంతసమీపంలోనే ఉంటాడు. కనుక రాజాజ్ఞ నిమిత్తమై దైవకార్యంమీద పోతున్న బృందాన్ని వీరు అడవిలో దారికాచి కుట్రపూర్వకంగా చంపటం జరిగింది.అది కూడా నమ్మించి హతమార్చటం జరిగింది. దాని ఫలితంగా ఇప్పుడు అదే అడవిలో దైవకార్యక్రమమైన దీక్షలో ఉండగా వీరికీ చావు మూడింది. వీరు కూడా వీరు నమ్మిన దైవం సన్నిధిలోనే,ఏ ప్రమాదాలూ రావని నమ్ముతున్న దీక్షా సమయంలోనే హతం అయ్యారు.కర్మ ఫలితాలు ఇలా ఉంటాయి. దీన్నిబట్టి ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి. మనం చేసే తూతూ దీక్షలవల్ల మన కర్మ ఏమీ తొలగదు. మనం పెట్టె అరటిపండ్లకు, కొట్టే కొబ్బరికాయలకు భగవంతుడు కరిగిపోయి మనపాపాలు క్షమించడం జరుగదు.దానికి మార్గాలు వేరే ఉన్నాయి.

కర్మగతి ఎంత విచిత్రమైనది?కర్మ ఎటువంటి బాకీనీ ఉంచుకోదు. సృష్టి ఎంత గొప్పవారినీ ఉపేక్షించదు. కాకపోతే కర్మ పరిపక్వం కావటానికి కొంతసమయం పడుతుంది. కాయ పండుగా మారి రాలిపడటానికి కొంతసమయం తీసుకుంటుంది.ఈ లోపు మనిషి విర్రవీగుడు జరుగుతుంది.

మరి ఇప్పుడు చేస్తున్న మంచికర్మ వల్ల పాతదైన చెడుకర్మ పోదా? అన్నప్రశ్న వస్తుంది.పూర్వకర్మ దృఢమైనదైతే చెరిగిపోదు.దాని ఫలితం అనుభవించవలసిందే.వీరి సంగతే తీసుకుందాం. ప్రస్తుతం చేస్తున్న అయ్యప్పదీక్ష వీరికి ఏ విధంగా సాయపడినట్లు?మరి ఎటువంటి ఫలితాన్నీ ఇవ్వని దీక్షలు చేస్తూ వీళ్ళు ఇన్నాళ్ళుగా భ్రమల్లో ఉన్నట్లేగా?కనుక ఏతావాతా తేలేదేమంటే కర్మకు, భగవంతునికీ పక్షపాతం ఉండదు. వారూ వీరూ అన్న భేదం ఉండదు. చేసినకర్మ అనుభవించక ఎవరికైనా తప్పదు.ఒక్కొక్కసారి వడ్డీతోకూడా అనుభవించవలసి వస్తుంది.

మరి వీరిలో ఎవరైనా ఈ విషయాలు ముందుగానే తెలుసుకొని వాటిని పరిహారాల ద్వారా మార్చుకునే ప్రయత్నం చెసిఉంటే ఈ చావును తప్పించుకోగలిగేవారా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది.

కర్మ బలీయం అయినప్పుడు ఆబుద్ధి పుట్టనివ్వదు. పరిహారాల వైపు దృష్టి పోదు.అవి పిచ్చిపనులని లెక్కించటమూ వాటిని ఎగతాళి చెయ్యటమూ జరుగుతుంది.అప్పుడేగా మరి కర్మ ఫలితం అనుభవించగలిగేది.అలా ముందుగానే తెలుసుకొని మార్చుకుంటే కర్మగతి సాగేదెలా?అందుకే వారికి బుద్ది పుట్టదు. ఫలితం వైపు కర్మ లాక్కెళుతుంది. వారుమాత్రం అంతా తమ ఇఛ్ఛానుసారమే చేస్తున్నాము అనుకుంటారు.

ఇవన్నీ తెలిసేనేమో భగవద్గీత ఇలా చెప్పింది.

గహనా కర్మణో గతి: (కర్మ గతి అర్ధం చేసుకోవటం చాలా కష్టం)

గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితా: (గతాన్ని గురించిగాని ప్రస్తుతాన్ని గురించిగాని పండితులైనవారు శోకించరు)

మొత్తం నాటకంలో ఒక సీనుమాత్రమే తెలిసిన ప్రేక్షకుడు ఆయా సీన్లను బట్టి ఆనందానికీ, భయానికీ, బాధకూ లోనవుతాడు. కాని అన్ని సీన్లవెనుక ఉన్న కంటిన్యూటీ తెలిసిన దర్శకుడు మాత్రం ఏ భావానికీ లోనవ్వడు. అంతా చిద్విలాసంగా చూస్తూ ఉంటాడు.
read more " శబరిమల ప్రమాదం- ప్రశ్న జ్యోతిష్యం-పూర్వజన్మ కర్మ "

14, జనవరి 2011, శుక్రవారం

వివేకానందుని జాతకం- కొత్త కోణాలు

వివేకానంద స్వామి జాతకాన్ని ఇంతకు ముందు కూడా విశ్లేషించాను. ఇప్పుడు విమ్శాంశ కుండలిని మరొక్కసారి పరిశీలిద్దాం.

పట్టుదలకు ప్రతిరూపం అయిన మకరం లగ్నం కావడమూ, లగ్నాధిపతి మంత్ర స్థానం లో మిత్రస్తానంలో ఉండటమూ వల్ల తీవ్రమైనసాధనతోనూ అచంచలమైన దీక్షతోనూ పొందిన యోగసిద్ధి సూచితం అయింది.

లగ్నాధిపతి దృష్టి మనః కారకుడైన చంద్రునిపైన ఉండటం వల్ల ఆయన మనస్సు ఎల్లప్పుడూ ఉన్నతమైన ఆధ్యాత్మిక భావాలతో నిండిఉండేదని తెలుస్తున్నది.

సప్తమాధిపతి అయిన పూర్ణ చంద్రుడు స్వస్తానంలో ఉండటం వల్ల ఆయన మనస్సు ఎల్లప్పుడూ లోకానికి మేలు చెయ్యాలని తపించేదని సూచింప బడుతున్నది.

నవమాధిపతి అయిన బుధుడు లాభ స్థానం లో ఉండి శనిచేత చూడబడుతూ, స్వామికి లౌకికచింతలు లేవని, ఆయనబుద్ధి అంతా ఆధ్యాత్మిక మార్గంలో నిమగ్నమై ఉండేదని చూపిస్తున్నాడు. అయితే బుధుడు కుజ స్థానంలో ఉండటంవల్ల, ఆయన మంచి బుద్ధి శాలి అనీ, తనకోసం కాక లోకం కోసం తపించేవాడనీ సూచితం అవుతున్నది.

శని దృష్టి వాక్స్థానంలో ఉన్న రాహుకేతువుల పైన ఉండటం వల్ల ఆయన వాక్కులలో వైరాగ్యపూరితములైన ఆధ్యాత్మికతరంగాలు ప్రసరించేవని తేటతెల్లం అవుతున్నది.

అష్టమంలోని శుక్ర కుజుల వల్ల, ఆయనలోని కామవాసనలు యోగశక్తి గా మార్పు చెందినాయనీ, పశువాంఛలు ఆయనలో పూర్తిగా నశించాయనీ క్లియర్ గా కనిపిస్తున్నది.

శుక్రకుజుల బలీయమైన ఓజోదృష్టి బుధుని మీద ఉండటం వల్ల, ప్రచండయోగశక్తి ఆయన తీక్ష్ణమైన బుద్ధి ద్వారా లోకాన్ని ప్రబావితం చేసిందని తెలుస్తున్నది.

అదే దృష్టి ద్వితీయం లోని రాహుకేతువుల పైనా తృతీయం లోని రవి పైనా ఉండటం వల్ల, ఆయన వాక్కులకు, భావాలకు అంత అద్భుతమైన ఆధ్యాత్మికశక్తి ఎలా వచ్చిందో మనకు అర్ధం అవుతున్నది.

ఇటువంటి మహత్తరమైన యోగజాతకం కనుకనే ఆయన శ్రీ రామకృష్ణుని కృపకు పాత్రుడు కాగలిగాడు. ఆధునికరుషిపుంగవునిగా తన దివ్య వాక్కులతో భారతదేశానికి దిశానిర్దేశం చెయ్యగలిగాడు. వెయ్యి సంవత్సరాలుగా బానిస బ్రతుకుతో నిద్రపోతున్న దేశాన్ని తన విద్యుత్స్పర్శతో తిరిగి జాగృతం చెయ్యగలిగాడు.

భారతీయ జ్యోతిర్విజ్ఞానం విధంగా ఒక మనిషి యొక్క జీవన గమనాన్ని మాత్రమేగాక అతని వ్యక్తిత్వంలోని విభిన్నకోణాలను కళ్ళఎదుట చూపగలుగుతుంది. ఇది ఒకఅద్భుతమైన సైన్స్ అని నిస్సందేహం గా చెప్పవచ్చు.
read more " వివేకానందుని జాతకం- కొత్త కోణాలు "

12, జనవరి 2011, బుధవారం

లోకం వివేకానందుని అర్ధం చేసుకుందా?

తేదీల ప్రకారం నేడు వివేకానంద జయంతి.

ఆయన గతించి నూరేళ్ళు దాటింది. కాని ఇప్పటికీ ఆయన్ను లోకం సరిగ్గా అర్ధం చేసుకోలేకపోతున్నది. ఆయన్ను ఒక సంఘ సంస్కర్తగా టీవీ చానళ్ళూ, పేపర్లూ ప్రచారం చేస్తున్నాయి. యువతకు ధైర్యాన్ని నూరిపోసినవానిగానూ, సంఘాన్ని సంస్కరించాలనుకున్నవానిగానూ ఆయన్ను చూపిస్తూ, పాజిటివ్ థింకింగ్ క్లాసుల్లోనూ, మేనేజిమెంట్ క్లాసుల్లోనూ ఆయన సూక్తులు కొన్నింటిని వాడుకుంటున్నారు. మంచిదే. కాని ఆయన గురించి అదే పూర్తి అవగాహన మాత్రం కాదు.

బుద్ధుడు కూడా ప్రాధమికంగా ఒక సంస్కర్తగా ప్రజల్లో ప్రచారం జరిగింది. వేమన గురించి కూడా అలాగే ప్రచారం జరిగింది. వివేకానందుని గురించి కూడా నేడు అదే ప్రచారం జరుగుతున్నది. కాని సత్యం అదికాదు. అసలు మన మీడియాకు నిజాలు వ్రాయడం, చెప్పటం చేతకాదేమో అన్న నా అభిప్రాయం రోజురోజుకూ బలపడుతున్నది. ఆ మహనీయులు పుట్టిన దేశంలోనే వారిగురించి సరైన అవగాహన ఉన్నవారు అరుదుగా కనపడుతూ సమాజం అంటే అసహ్యాన్ని కలిగిస్తున్నారు.

వివేకానందుడు ప్రాధమికంగా ఒక దైవప్రేమికుడు. ఒక జ్ఞాని. ఒక మహర్షి. అంతేగాక ఆయన దర్శించిన పరిపూర్ణత్వాన్ని సమాజంలో చూడాలని తపించిన ఒక స్వాప్నికుడు. తాను పొందిన జ్ఞానాన్ని అజ్ఞానంతో ఆవరింపబడిన లోకానికి అందించాలని శ్రమించిన బోధిసత్త్వుడు. హిమాలయ గుహల్లో ఉన్న యోగాన్ని సమాజ జీవనానికి ఆవశ్యకం అయిన కర్మతో ఎలా మిళితం చెయ్యాలో చూపించి, కర్మను యోగంగా మార్చి చూపిన యోగిపుంగవుడు. ఆధ్యాత్మికవాదులకు సమాజం పట్ల ఉన్న బాధ్యతను వేలెత్తి చూపిన మహాప్రవక్త.

ఆయన తర్వాత ఇప్పటివరకూ వచ్చిన ఏ మహాపురుషుడైనా సరే ఆయన చూపిన బాటనే నడుస్తున్నారు. నడవక తప్పదు. వారు ఏ గురుపరంపర వారైనా సరే, ఏ మహనీయుని భక్తులమని చెప్పుకునేవారైనా సరే, ఆయన మార్గాన్నే అనుసరించక తప్పదు. వారు వివేకానందుని పేరు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా, "కర్మను సేవాభావంతో పరమేశ్వరార్చనగా చెయ్యి" అన్న వివేకానంద వాణిని ఇప్పటికీ ఎప్పటికీ అనుసరించక తప్పదు.

సేవాభావం అన్న ఈ కోణం వివేకానందుని అనేక బోధనలలో ఒకటి మాత్రమే. మిగిలిన కోణాలను అర్ధం చేసుకునే ప్రయత్నం ఎవ్వరూ సరిగా చెయ్యటం లేదు. ఆయన్ని మాత్రం వక్రదృష్టితో చూపిస్తున్నారు. రానురాను వివేకానందుడంటే హిందువులలో తీవ్రవాదులు ఆరాధించే ఒక సంఘ సంస్కర్త అన్న భావం ప్రచారం కాబడుతున్నది. ఇది పూర్తిగా తప్పు భావన.

వివేకానందుడితో సమానమైన ప్రతిభావంతుడైన ప్రవక్త బుద్దుని తర్వాత పుట్టలేదు అని నేను ఘంటాపధంగా చెప్పగలను. "ఐదువేల సంవత్సరాలకు సరిపడా సందేశాన్ని లోకానికి ఇచ్చివెళుతున్నాను" అని ఆయనే చెప్పాడు. కాని ఆయన్ని చదివేవారూ అర్ధం చేసుకునేవారూ మాత్రం కనపడటం లేదు. మన మహాపురుషులను పటాలు కట్టి పూజించే మనం వారు చెప్పినవి అర్ధం చేసుకునే ప్రయత్నం మాత్రం చెయ్యం. అదే మన దేశపు విచిత్ర లక్షణాలలో ఒకటి.

మా సంస్కృతి గొప్పది, మా మతం గొప్పది, మా ప్రవక్తలు, మహాపురుషులూ గొప్పవారు అని చెప్పుకునే మనం వారిని చదవాలనీ అర్ధం చేసుకోవాలనీ ప్రయత్నం మాత్రం చెయ్యం. వాళ్ళు చెప్పినవి ఆచరించటం ఇక మనవల్ల ఏమవుతుంది?

వివేకానందుడు ఒక వైరాగ్యమూర్తి. ఒక విశ్వప్రేమికుడు. బ్రహ్మానుభూతిని పొందిన ఒక జ్ఞాని. జీవన్మరణపు అంచులు దాటిన ఒక యోగి. ప్రపంచానికి మార్గం చూపడానికి అప్పుడప్పుడూ వచ్చిపోయే ఒక వెలుగు. లోకపు కష్టాలతో మమేకం చెంది అవి తీర్చడానికి తపించిన మృదుహృదయుడు. వెరసి ఒక మహాప్రవక్త. అటువంటి మహనీయుని జన్మదినం నాడైనా ఆయన చెప్పినది ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నం చేద్దామా? లేక ప్రసార మాధ్యమాలు చూపుతున్నదే నిజం అన్న భ్రమలోనే ఉందామా?
read more " లోకం వివేకానందుని అర్ధం చేసుకుందా? "

11, జనవరి 2011, మంగళవారం

విశ్వాత్మ తత్త్వం ( చివరి భాగం )

"మరి అరవిందుల సంగతి ఏమిటంటారు ? ఆయనా చివరకు అనుకున్నది సాధించలేక నిరాశతోనే పోయారనుకుంటాను. " అడిగాను నేను.

"అవును. ఆయనా దారి తప్పినట్లే. ఫ్రెంచి వనిత అయిన మదర్ కు ప్రముఖ స్థానం ఇవ్వటం అంత సరి అయిన పని కాదు. ఆమె శక్తివంతురాలని మేమూ ఒప్పుకుంటాము. కాని అంతగా స్థాయిలో ఆమెను కూచోపెట్టటం సరికాదు. అరవిందులకూ రమణ మహర్షికీ కొన్ని అభిప్రాయ భేదాలుండేవి. శిరస్సుపైన ఉన్న వెలుగును హృదయంలోకి దించాలని అరవిందులన్నారు. ఇదే విషయాన్ని ఎవరో రమణ మహర్షిని అడిగితే " మరి శిరస్సుకూ హృదయానికీ మధ్యలో ఏముందిట? " అని ఆయన ప్రశ్నించారు. విషయాన్ని మళ్ళీ అరవిందులకు ఎవరో చేరవేశారు. తదుపరిఅరవిందులు తన ఒకానొక శిష్యుని ద్వారా రమణ మహర్షిని ప్రశ్నింప చేసారు .

"ఏమని ప్రశ్నించారు" అడిగాను నేను.

"మధ్యలో ఏమున్నది అని ప్రశ్నిస్తున్నది ఎవరు? " అని అడిగించారు.దానికి మహర్షి మౌనం వహించారు. మాటకుజవాబు లేదు. అది అనుభవైక వేద్యం. అంతే. విధంగా వారిమధ్యకూడా కొంత మాటలయుద్ధం నడిచిందనిచెప్పవచ్చు. గొడవలలో కపాలిశాస్త్రివంటి కొందరు శిష్యులు రమణమహర్షిని వదిలిపెట్టి అరవిందుల వద్దకు చేరారు. రకంగా ఎవరి లోపాలు వారివద్ద ఉన్నాయి.

విశ్వాత్మ గారు సాలోచనగా నవ్వారు.

"క్రియాయోగం పరిస్థితి పైన మీ అభిప్రాయం ఏమిటి?" అడిగాను నేను.

" అదీ అంతే. ప్రస్తుతం ఉన్న క్రియా యోగం అసలైనదని చెప్పలేము. దానిలో కూడా ఏన్నోశాఖలు ఉపశాఖలు తయారైనాయి. ఎందఱో కొత్త గురువులు పుట్టుకొచ్చారు. నేను హిమాలయాలలో ఉన్నపుడు బాబాజీ కలిశారు. మాటల మధ్యలో ఆయనిలా అన్నారు. " నేను లాహిరీకి క్రియా యోగాన్ని చెప్పాను. తర్వాత ఏమి జరిగిందో నాకుతెలియదు. నాకు లాహిరీ వరకే తెలుసు. తరువాతి వారు తెలియదు " అన్నారు. మరి ఇప్పటి క్రియాయోగం ఎవరిసృష్టి? ఇన్ని రకాల శాఖలు ఉపశాఖలు ఎక్కణ్ణించి వచ్చాయి? అసలైన క్రియాయోగం లో ఇన్నిరకాల క్రియలు, శాఖలు ఉండవు. బాబాజీ దృష్టి మీమీద పడితే మీ సాధన పూర్తి అయినట్లే. ఆయన దృష్టితోనే సాధన అంతా జరుగుతుంది. అది అసలైన క్రియాయోగం. కాని నేటి క్రియాయోగం ఎలా ఉందొ మీకు తెలుసు కదా. నేటి క్రియాయోగం లో మీరు చేసే క్రియలు ఎక్కువగా ఉంటాయి. కాని అసలైన క్రియాయోగంలో బాబాజీదృష్టి మాత్రమే అంతా చేయిస్తుంది. మనం చెయ్యాల్సినది ఏమీ ఉండదు. నేను ఇదే మాటను దయామాతగారితో చెప్పాను. ఆమె మౌనంగా విని "కంగ్రాచ్యులేషన్స్" అని క్లుప్తంగా అని ఊరుకున్నారు. నిజం ఆమెకూ తెలుసు. కాని అంతకన్నాఎక్కువ ఆమె మాట్లాడితే సంస్థ దెబ్బ తింటుంది.అలా మాట్లాడటం ఇప్పటి క్రియాయోగవ్యవస్థకు వ్యతిరేకం. కనుక ఆమె అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు.

ప్రపంచం లో ఏదీ స్వచ్చంగా ఉండలేదు. జనం ఉండనివ్వరు. లోకులు దేన్నైనా కలుషితం చేస్తారు. దిగజారుస్తారు. షిర్డీసాయిబాబాకు గతి పట్టిందో చూస్తున్నారుగా. చివరికి కోరికలు తీర్చే యంత్రంగా ఆయన్ని దిగజార్చి కూచోపెట్టారు. నేటి లోకంలో ఆయన ఒక వ్యాపార వస్తువైనాడు. జనానికి మహిమలు కావాలి. వారివారి కోర్కెలు తీరటం కావాలి. మహిమలు చూపించే వారు లోకుల దృష్టిలో గొప్పవాళ్ళు. వాళ్ళ చుట్టూనే పిచ్చిజనం మూగుతారు.

మేడం బ్లావేత్స్కీ నేటి బాబాల కంటే ఎన్నో గొప్ప మహిమలు చేసింది. ఒకసారి ఆమె తన శిష్యులతో ఎడారిలో ప్రయాణంచేస్తున్న సమయంలో చీకటి పడింది. చీకటి రాత్రి ఎడారిలో చలిలో ఎక్కడ ఉండాల్రా దేవుడా అని వారంతా భయపడుతున్న సమయంలో ఎడారిలో ఒక పెద్ద భవనాన్ని సృష్టించింది బ్లావేత్స్కీ. అందరూ తెల్లవార్లూ భవనంలో హాయిగా ఉన్నారు. తెల్లవారిన తరువాత చూస్తె భవనం లేదు ఏమీ లేదు. మళ్ళీ ఎడారిలో అందరూ నిలబడిఉన్నారు. మరి రాత్రంతా విశ్రాంతినిచ్చిన భవనం ఎక్కడికి పోయింది? ఇలాటి మహిమలు ఎన్నో చేసి చూపింది ఆమె. ఒక ఆవును సృష్టించి తానే పాలుపితికి తాగమని అందరికీ ఇచ్చేది. కాసేపటి తరువాత చూస్తె ఆవూ ఉండదు ఏమీఉండదు. మరి కాసేపు ఆవు ఎక్కణ్ణించి వచ్చేదో ఎవరికీ తెలిసేది కాదు. పాలు తాగినట్లు చారికలు కనిపిస్తూనే ఉండేవి. సంఘటనలను ఎలా వివరించగలం? ఇలాటి మహిమలు ఎన్నో ఆమె చేసింది. ఇవన్నీ నేటి బాబాల మహిమలకంటే చాలా రెట్లు గొప్పవి. జనానికి ఇలాటి మహిమలు చేసేవాళ్ళూ కోరికలు తీర్చేవాళ్ళూ కావాలి. అంతే గాని శుద్ధ జ్ఞానం ఎవరికీ అక్కర్లేదు.

టిబెట్ లో నేను కళ్ళారా చూచాను. గాలిలో తేలే యోగులున్నారు. గాలిలో పైకి లేచి శూన్యంలో పడుకొని ఉయ్యాల బల్లమీద ఊగినట్లు ఊగుతారు. నాటికీ ఉన్నారు. ఒక అయిదారుగురు లామాలు గుండ్రంగా నేలమీద కూచుంటారు. కూచున్న వాళ్ళు కూచున్నట్లే గాలిలోకి తేలిపోయి చాలా ఎత్తులో శూన్యంలో కూచుని, అక్కడ ఆసనాలు అభ్యాసం చేస్తారు. సత్సంగం శూన్యంలోనే జరుగుతుంది. తరువాత నిదానంగా కిందికి దిగి వస్తారు. ఇదంతా నేను చూచాను. కాని వాళ్ళు మన హిందూయోగుల కాళ్ళకు నమస్కారం పెడతారు. మనల్ని గౌరవిస్తారు. కారణం? ఎన్ని విద్యలు ప్రదర్శించినా వాళ్లకు దేహ స్పృహ ఉన్నది. దేహ స్పృహ లేని మన యోగులు వీరికంటే ఉన్నతస్థాయిలో ఉన్నట్లే. " మీకు యోగవిధానాలు తెలియవు. కనుక మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇవి అభ్యాసం ద్వారా సాధించవచ్చు. కాని దేహస్పృహ లేని స్థితి అత్యుత్తమం. అది సాధించటం అతి కష్టం. అది మాకు లేదు. మీకుంది" అని వారంటారు.

వారిని ఇక్కడకు జనం మధ్యలోకి తేవాలని నేను ప్రయత్నం చేసాను. మొదట్లో వస్తామని వాళ్ళూ ఒప్పుకున్నారు. తరువాత మేము రామన్నారు. ఇక్కడకొస్తే ఏముంది? మొదట్లో జనమందరూ వేలంవెర్రిగా ఎగబడి చూస్తారు. తరువాత తమ కోరికలు తీరే చిట్కాలు చెప్పమని వేధిస్తారు. చెప్పకపోతే తాటాకులు కడతారు. కొన్నాళ్ళు పోయిన తరువాత,మొదట్లో బ్రహ్మరధం పట్టిన ఇదే జనమే బురద చల్లుతారు. గారడీ విద్యలని పేరుపెట్టి తరిమితరిమి కొడతారు. తతంగాలు జరుగుతాయని వారికి తెలుసు. అందుకే జనం మధ్యకు వారు రారు.

కనుకనే మనలో మనం ఉండటం అన్నింటిలోకీ శ్రేష్టం. ఆలోచనలు కూడా మనకు ప్రతిబంధకాలే. నిజానికి ప్రపంచం ఒక భావన. అది ఆలోచనకూడా కాదు. అంతకంటే క్రిందిదైన ఒక భావనామాత్రం. భావనలోనే అంతాఉంది. భావన ఎలా ఉంటె మనకు అలా కనిపిస్తుంది.

దేవుళ్ళు పూజలు అవసరం లేదా అంటే అవసరమే. కాని వాటి అవసరం ఎంతవరకో తెలుసుకోవాలి. ఒకటోతరగతి రెండోతరగతి ఈ విధంగా తరగతులు అవసరమే. మనం ఎంత వరకు వచ్చామో అవి తెలియచేస్తాయి. కాని ఎప్పటికీ ఒకటో తరగతి లోనే ఉంటే అదేమి విద్యాభ్యాసం? బాగా చదువుకున్నవాడు ప్రతిరోజూ అ, ఆ, లు దిద్దుకోడు. కాని అంతమాత్రాన ఇవి దిద్దకుండా ఆ స్తితికీ చేరలేడు. అలాగని అ, ఆ, లు దిద్దటమే చదువుకదా అని ఎప్పుడూ అవే దిద్దుకుంటూ ఉండకూడదు. ముందు క్లాసులకు ఎదగాలి. ఇది కూడా అంతే.

వివేకానందులు సేవా భావాన్ని ప్రచారం చేశారు. ఎందుకని అలా చేసారు? అప్పట్లో బ్రిటిష్ పరిపాలన ఉండేది. పేదరికం ఉండేది. దోపిడీ ఉండేది. అందుకని ఒకరికి ఒకరుగా సేవా భావం అవసరం అని వారు భావించారు. కాని అదే సర్వస్వంకాదు. ఆ కాలానికి అది అవసరం. ఇప్పుడు అంతగా అవసరం లేదు.

"అవును. ప్రస్తుతం సేవ ఎవరికీ అవసరం లేదు. ప్రస్తుత సమాజంలో అందరి దగ్గరా డబ్బు బాగానే ఉంది. నూరేళ్ళక్రిందటి పరిస్తితులు ఇప్పుడు లేవు. కనుకనే సేవ అనే పదానికి అర్ధం లేకుండా పోయింది." అన్నాను నేను.

విశ్వాత్మ గారు అవునన్నట్లు తలాడించారు.

"సామాన్యంగా నేను ఇంతసేపు మాట్లాడను. ఒక్కొక్కసారి అలా చెప్పాలనిపిస్తుంది. చెప్తాను. నేను ఏదీ ఇలా చెయ్యాలి అనుకోని చెయ్యటంఉండదు. సమయానికి దానంతట జరిగితే ఏదైనా జరుగుతుంది. అదే విధంగా మీరు కలవటం ,ఇంతసేపు మాట్లాడుకోవటం అనుకోకుండా జరిగింది." అన్నారు ఆయన.

అర్ధమైంది అన్నట్లు నేనూ చిరునవ్వు నవ్వాను.

దాదాపు గంటన్నర పైగా అందరం నిలబడే ఉన్నాము. చీకటి పడింది. బాగా చలి మొదలైంది. లోపల తమ్ముడుసుబ్రహ్మణ్యం, ఇక నిలబడలేక కొంచం దూరంలో కుర్చీలో కూచుని ఉన్నాడు. అతనికి కొంచం విసుగ్గా ఉన్నది. ఎంతసేపు ఇలా ఆయన చుట్టూ నిలబడి శిలా ప్రతిమలలాగా వింటూ ఉంటారు వీళ్ళు? అని అనుకున్నాడో ఏమో మరి. బయలుదేరుదాం రమ్మని
అక్కణ్ణించి నాకు సెల్ ఫోన్ చేస్తున్నాడు. రెండు మూడు సార్లు అలా ఫోన్ చేసాడు. అది నాజేబులోనే ఉన్నది కాని విశ్వాత్మగారి మాటలు వింటున్న ఏకాగ్రతలో నాకు సెల్ మోగిన చప్పుడు వినబడలేదు. అందుకని పక్కనే ఉన్న తమ్ముడు అంజిబాబుకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. అంజిబాబు కదిలి వారివద్దకు వెళ్ళాడు. నాకు పరిస్తితి అర్ధమైంది. వాళ్ళు విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్ళాలి. గుంటూరు నుంచి ఇంకా రెండు గంటలు ప్రయాణం చెయ్యాలి. కనుక బయలుదేరకతప్పదు. లేకపోతె ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి అవుతుంది. వాతావరణంకూడా బాగాలేదు. అదీ గాక హై ఫ్రీక్వెన్సీభావాలను గంటలుగంటలు వినడం తట్టుకోవడం చాలా కష్టం.

సరే నని విశ్వాత్మ గారికి నమస్కరించి సెలవు తీసుకున్నాము. ఆయనకు కూడా పరిస్తితి అర్ధమైంది. "అలాగే" అంటూచిరునవ్వుతో కదిలి ముందుకెళ్ళి పోయారు. ఎంత హటాత్తుగా మొదలైందో అంత హటాత్తుగానే సంభాషణ ముగిసింది. మామూలుగా సాగే పరిచయాలు, మీరెక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు వగైరా మాటలు లేవు. సంభాషణలో పడి "లగ్ననాడి" నా కాపీని శ్రీకాంత్ గారి వద్దనే మరచి పోయాను.
ఎవరి దారిన వాళ్ళం బయలుదేరాము.
read more " విశ్వాత్మ తత్త్వం ( చివరి భాగం ) "

7, జనవరి 2011, శుక్రవారం

విశ్వాత్మ తత్త్వం

శ్రీకాంత్ గారు నన్ను విశ్వాత్మ గారికి పరిచయం చేసారు. నేను కొంచం పక్కగా ఉండి ఆయన ఏమి పరిచయం చేస్తున్నారో సరిగా వినలేదు. పైగా పక్కనే మైకొకటి. దాంట్లో ఎగ్జిబిషన్ వారి ప్రకటనలోస్తున్నాయి. కానీ మధ్యలో మాత్రం "అఘోరీ బాబా జాతకాన్ని విశ్లేషణ చేసింది వీరే" అన్న శ్రీకాంత్ గారి మాట వినిపించింది. మైకు బారినుండి తప్పుకోటానికి అందరంకొంచం పక్కగా జరిగాము.

విశ్వాత్మ గారు మంచి స్పురద్రూపి. ఆరడుగుల ఎత్తుంటారు. బవిరి గడ్డం. వయస్సు చూస్తె ఏభై -ఏభై అయిదు మధ్యలోఉండవచ్చు అనిపిస్తుంది. గట్టి శరీరం. మోకాళ్ళవరకు కాషాయలుంగీ లాటిది కట్టుకొని పైన ఒక కాషాయ ఉత్తరీయం కప్పుకున్నారు. యోగుల కళ్ళలో ఉండే ప్రత్యేకత ఆయన కళ్ళలో కనిపించింది. అప్పటికే ఆయన కొన్ని పుస్తకాలుకొనుక్కుని ఒక స్టాల్లోనుంచి బయటకు వస్తున్నారు.

నాకొక విద్య తెలుసు. ఏళ్ల తరబడి ధ్యానాభ్యాసం వల్ల నాకా విద్య పట్టుబడింది. ఒక వ్యక్తి హృదయంతో నేను సరాసరి తాదాత్మ్యం చెందగలను. తద్వారా వ్యక్తి మనసులో భావాలు నాకు ముందే తెలిసిపోతుంటాయి. ఇదంతా మౌనంగా జరుగుతుంది. బయటి వాళ్లకు అర్ధం కాదు. అలాటి సమయంలో ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే నాతో నేను మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. ధ్యానాభ్యాసంలో ఇది చిన్నటెక్నిక్. కాని చక్కని అనుభూతినిస్తుంది. బాగా ఉపయోగపడుతుంది. విశ్వాత్మ గారి సమక్షంలో ఇదే స్తితిలోకి ప్రవేశించాను. దానివల్ల ఆయన భావప్రవాహాన్ని తేలికగా రిసీవ్ చేసుకోగలిగాను.

ఆయన మాట్లాడుతున్నంతసేపూ మిగిలినవాళ్ళం దాదాపు శ్రోతలుగానే మిగిలాము. మధ్యలో నావి ఒకటో రెండో ప్రశ్నలుతప్పించి రెండుగంటల పాటు ఆయన వాగ్ధాటి కొనసాగింది. పరిచయం అయింది అప్పుడే అయినా ఎప్పటినుంచో తెలిసినవాళ్ల లాగా సంభాషణ మొదలైంది.

రెండుగంటలపాటు ఆయన మాట్లాడినమాటలను ఒక్కమాటలో కుదించి చెప్పవచ్చు. దానిని వేదాంతపరిభాషలో "దృగ్-దృశ్య-వివేకం" అంటారు. అంటే, చూడబడుతున్న దృశ్యం- చూస్తున్న ద్రష్టకంటే భిన్నం అన్నస్పృహలో నిరంతరమూ ఉండటం. ఇది వేదాంత సాధన. జ్ఞాన మార్గం. శంకర భగవత్పాదులు పేరుతొ ఒక చక్కని గ్రంధాన్ని వ్రాశారు. జ్ఞానులంతా ఇదే స్థితిలో ఉంటారు. అందుకే వారిని ప్రపంచపు మాయలు లొంగతీసుకోలేవు.

యోగుల కళ్ళలోనే కాదు, స్వరంలోనూ ఒక ప్రత్యెక మాధుర్యం ఉంటుంది. అది యోగులు తేలికగా గుర్తించగలుగుతారు. ప్రత్యేకత ఆయన గొంతులో ధ్వనించింది. ఆయన వాగ్ధాటి మంద్ర స్వరంలో ఇలా సాగింది.

"నేననేది నాకు ముఖ్యం. నేను చూచేదృశ్యం ముఖ్యం కాదు. వినే శబ్దం ముఖ్యం కాదు. అలాగే ఇతర ఇంద్రియాల ద్వారా తెలియబడుతున్న విషయపరంపర ముఖ్యం కాదు. పంచేంద్రియాల ద్వారా బాహ్యవిషయాలను తెలుసుకొంటున్న ఎరుక ఏదైతే ఉన్నదో అదేనేను. నేనన్న భావనలో నిరంతరమూ ఉండాలి. అదే నిత్యం. ప్రపంచం మొత్తం నశించినా ఎరుక నశించదు.

ప్రపంచం మీద "నేను" ఆధారపడి లేదు. ప్రపంచమే "నేను" మీద ఆధారపడి ఉన్నది. మనం నిద్రిస్తున్నపుడూ ప్రపంచం ఉన్నది. సూర్యుడూ చంద్రుడూ ఉన్నారు. కాని సమయంలో మాత్రం మనవరకు వారు లేనట్లే. కనుక ప్రపంచమంతా "నేను" దాన్ని గుర్తించటం మీదే ఆధారపడి ఉన్నది. కాని దానికి ప్రత్యెక ఉనికి లేదు. నేను ఉన్నది అనుకుంటే ప్రపంచం ఉన్నది. దాన్ని నేను గుర్తించకపోతే అది లేదు. కనుక ప్రపంచాన్ని గుర్తిస్తున్న "నేను" ముఖ్యం. కాని ప్రపంచం నాకు ముఖ్యం కాదు.

సూర్యుడు లేకుంటే నువ్వు లేవు. అని అంటారు. కాని సూర్యుడు అలాగే ఉంటున్నాడు. మనిషి మాత్రం మరణిస్తున్నాడు. కనుక మాట నిజం కాదు. నిజానికి " నేను " లేనప్పుడు ప్రపంచం లేదు. అలాగే సమస్త ప్రకృతీనూ. కనుక మనిషి ఉనికి అనేది బయట వస్తువులపైన ఆధారపడి లేదు. ఉందని అనుకుంటే అది మన భ్రమ. కాని మనిషి తనను తాను మరిచి బాహ్య వస్తువులకోసం, వ్యక్తుల కోసం పరిగెత్తుతున్నాడు. అదే అతను చేస్తున్న తప్పు.

సాధకుడనేవాడు ముందుగా ప్రపంచాన్ని వదలాలి. తరువాత దేవుణ్ణి వదిలిపెట్టాలి. తరువాత గురువుని వదిలిపెట్టాలి. ముగ్గురినీ పట్టుకొని ఉన్నంత వరకూ అతను అజ్ఞానం లోనే ఉన్నట్లు లెక్క.

లోకమంతా దేవుళ్ళ పూజలతో నిండి ఉంది. లోకులు వాళ్ళ జీవితమంతా పూజలు చేస్తూనే ఉంటారు. కాని అంతరికంగా వారికి ఎదుగూ బొదుగూ ఉండదు. అలాగే ఇంకొందరు, రకరకాల గురువులను పట్టుకొని వేల్లాడుతూ ఉంటారు. వాళ్ళూఅంతే. నేను తక్కువ వాణ్ని. మా గురువు గొప్పవాడు అనుకుంటూ జీవితమంతా అలాగే బ్రతుకుతూ ఉంటారు. అంతేగానితత్వాన్ని గ్రహించలేరు. గురువులూ చెప్పరు. గురువు గురువుగానే ఉంటాడు. శిష్యుడు శిష్యుడుగానే ఉంటాడు.

ఒక ప్రసిద్దబాబా గారున్నారు. ఆయన శిష్యుడొకాయన తన చిన్నప్పటినుంచి బాబా వద్దకు వస్తున్నాడు. ప్రస్తుతంశిష్యుడు బాగా పెద్దవాడయ్యాడు. ఇప్పుడు ఆయనకొక మనవడు ఉన్నాడు. మనవడితో పాటు ఇప్పటికీ ఇంకా బాబాగారి వద్దకువచ్చి అదేచోటిలో ఆయనకాళ్ళవద్ద కూచుంటున్నాడు. అంటే అతను ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా ఏమి తెలుసుకున్నట్లు? ఏమి ఎదిగినట్లు? పోనీ బాబాగారు సత్యాన్ని తన శిష్యులకు చెబుతున్నారా అంటే అదీ లేదు.

నిజానికి, నాలో ఏమున్నదో, అదే శిష్యుడవైన నీలోనూ ఉన్నది. నేను గురువునూ కాను, నీవు శిష్యుడవూ కావు. నేనేదో నీవూ అదే. అన్న స్థితికి తన శిష్యులను తెచ్చేవాడే నిజమైన గురువు. ఇదే అసలైన వేదాంత బోధ.

అటువంటి బోధ చేసే గురువులూ ప్రస్తుతం లేరు. ఒకవేళ గురువులు ఉన్నా, వినే శిష్యులూ లేరు. జిడ్డు కృష్ణమూర్తి తన జీవితమంతా చెప్పి చూచాడు. ఎవరికీ అర్ధం కాలేదు. విన్నంత సేపూ బాగానే వింటారు. కానీ ఆచరణ ఉండదు. జిడ్డుగారు అదే చెప్పేవాడు. " గురువుతోనూ అవసరం లేదు" అని తన జీవితమంతా చెబుతూనే ఉన్నాడు. ఆయన చెబుతున్నవిషయాన్ని అర్ధం చేసుకోకుండా తిరిగి ఆయన్ను ఎదురు ప్రశ్నించేవారు.

"మీరు చెబుతున్నది నిజమే అయితే, గురువు అవసరం లేకపోతే, మరి మీ అవసరం మాత్రం ఏముంది? మీరెందుకు మాకు చెబుతున్నారు?" అని.

దానికి ఆయన ఇలా జవాబిచ్చాడు. "నా అవసరం మీకు లేదు అన్నవిషయం మీకు అర్ధంకావాలనే ఇంత వివరంగా చెబుతున్నాను" అనేవాడు. కాని ఎంతమంది అర్ధం చేసుకోగలిగారు? ఎంతమంది ఆచరించగలిగారు? చాలా కొద్దిమంది ఉంటారు. వేళ్ళమీద లెక్కించవచ్చు.

దాదాపు ఎనభైఏళ్ల క్రితం, కొన్ని వేలకోట్లరూపాయల సామ్రాజ్యాన్ని తృణీకరించి, తన మీద మోపబడిన "ప్రవక్త" టైటిల్నితృణప్రాయం గా త్యజించిన మహా వ్యక్తి ఆయన. ఆయన్ని "ఆర్డర్ ఆఫ్ ది స్టార్" అన్న దియసాఫికల్ సంస్థ కు తిరుగులేని నాయకునిగా ఎన్నుకొని, ఒక దేవుడుగా, ప్రవక్తగా, గుర్తిస్తున్న కొన్ని వేల మంది ఎదుట " నేను మీరనుకుంటున్న ప్రవక్తను కాను. నాలో ప్రత్యేకతా లేదు " అని సత్యాన్ని తేటతెల్లంగా చెప్పిన మనిషి. నేను ఆయనతో చాలా రోజులు కలిసి ఉన్నాను. చివరి రోజులలో ఆయన నిరాశతో చనిపోయాడు. తన జీవితమంతా శ్రమించి చెప్పినదేదీ ఎవరికీ ఎక్కలేదని, మనుషులలో మార్పు రాదనీ, తన జీవితం వృధాగా గడిచిందని ఆయన బాధపడ్డాడు.

రజనీష్ కూడా ఇలాగే నిరాశతో చనిపోయాడు. మీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే రజనీష్ గారితో మాట్లాడాను. ఆయనతో కలిసి తిరిగాను. ఆయన మహావేదాంతి, విజ్ఞానఖని. ఎన్ని పుస్తకాలు, గ్రంధాలు చదివాడో లెక్కే లేదు. ఫిలాసఫీలో పండిపోయాడు. ఆయన కూడా చివరకు నిరాశతో పోయాడు. " ప్రపంచం కుక్కతోక వంటిది. దీని వంకర ఎన్నటికీ మారదు. కాని నా వాణి వృధా పోదు. దీనిని భద్రపరచండి. కారణం? వాణి నాది కాదు. ఇది పైనుంచి వచ్చింది. ముందుతరాలలో ఎవరికి ఇది చేరుతుందో? ఎవరిని మేల్కొలుపుతుందో?" అనేవాడు. అమెరికాలో "ఒరెగాన్" స్టేట్ లోని వందల ఎకరాల పనికిమాలిన బీడు భూమిని రెండేళ్లలో నందనవనంగా మార్చి చూపించాడు. ఆయనక్కడుంటే కొన్నేళ్లలో అమెరికా మొత్తం ఆయనకు దాసోహం అంటుందని భయపడి ప్రభుత్వం ఆయన్ను దొంగ కేసులో ఇరికించి తరిమేసింది. ప్రపంచంలో ఎక్కడైనా ఒకద్వీపాన్ని కొనుక్కుని ఉండిపోదామని చూస్తె ఎక్కడా అమ్మకుండా నిలువ నీడ లేకుండా చేసింది. చివరికి అమెరికావాళ్ళు చేసిన విషప్రయోగంతోనే ఆయన చనిపోయాడు.

మహానీయులందరూ ఇక్కడే ఫెయిల్ అయ్యారు. ఊబిలో ఉన్నవాడిని బయటకు తియ్యాలంటే తాను ఒడ్డున ఉండి, వాణ్ని ఏదన్నా తాడుతో బయటకు లాగాలి. అంతేకాని తానుకూడా ఊబిలోకి దిగితే ఏమౌతుంది? ఇద్దరూ మునుగుతారు. మహనీయుల పరిస్తితి కూడా ఇలాగే తయారైంది. నేలబారున ఉన్న తన శిష్యుణ్ణి పైకేత్తాలంటే తాను ఒంగవచ్చు. కాని పాకరాదు. దేకరాదు. తాను వాని స్థితికి దిగజారకూడదు. కాని ప్రస్తుతపు గురువులందరూ చేస్తున్నది పాకుడే. శిష్యుల్నిఉద్దరించబోయి, వాళ్ళు కూడా దిగజారుతున్నారు. ఊబిలోకి దిగుతున్నారు.

రమణ మహర్షి కూడా ఇక్కడే ఫెయిల్ అయ్యాడు. చిన్నప్పుడు ఈశ్వరాన్వేషణలో ఇల్లు వదిలి వచ్చాడు. కాని చివరకు అదేసంసారంలో చిక్కుకున్నాడు. ఆయన అతి మామూలు మనిషిలా బతికాడు. కాని ఇప్పుడు ఆయనకు ఉన్నవీ లేనివీ అంటగడుతున్నారు. చివరిలో ఆయనకు కాన్సర్ వచ్చినపుడు కొందరు శిష్యులు లండన్ తీసుకు వెళతామన్నారు. అక్కడ మంచి ట్రీట్మెంట్ చేయిస్తామన్నారు. వారి కుటుంబసభ్యులు దానికి ఒప్పుకోలేదు. ఒకవేళ మహర్షి అక్కడే చనిపోతే అప్పుడు అక్కడే సమాధి చెయ్యవలసి వస్తుంది. అప్పుడు ఇండియాలో ఆశ్రమం దిక్కులేనిదౌతుంది అని తలచి విదేశీయ శిష్యులను రౌడీలతో కొట్టించారు.

విదేశీ శిష్యులు అడిగారు " స్వామి. మీరు మాతో వస్తారా?. ఇక్కడే ఉంటారా? అని.

దానికాయన " శరీరం ఇక్కడినుంచే వచ్చింది. ఇక్కడే ఉండనివ్వండి." అని అన్నాడు. వారు వెళ్ళిపోయారు. కనుక చివరిదశలో ఆయనకూడా ఫెయిలయ్యాడు.

వింటున్న నేనడిగాను " లండన్ అయినా ఒక్కటే, తిరువన్నామలై అయినా ఒక్కటే అనుకుని ఆయన అలా అన్నారేమో? ఆత్మజ్ఞానికి ఎక్కడైతే నేమి?"

"ఆయన అలా అనలేదు. తన కుటుంబ సభ్యులను ఆయన సపోర్ట్ చేసాడు. తాను వదిలివచ్చిన సంసారంలోనే చివరకు ఆయన ఇంకోరకంగా చిక్కుకున్నాడు." అని విశ్వాత్మ గారన్నారు.

"ఇవన్నీ పుస్తకాలలో ఎక్కడా వ్రాసి లేవే?" అన్నాను నేను.

"ఎందుకుంటాయి? ఇలాటివి
ఎవరూ వ్రాయరు. కాని కొందరు నిజాయితీ ఉన్న శిష్యులు వ్రాశారు. వాళ్ళు ఆయన్ని వదిలి అప్పట్లోనే వెళ్ళిపోయారు" అన్నాడు విశ్వాత్మగారు.

"ఇప్పుడున్న ఒక ప్రసిద్ధ బాబాగారు కూడా అంతే. చిన్నప్పుడు స్కూల్ దశలోనే -నా భక్తులు నన్ను పిలుస్తున్నారు- అంటూ ఇల్లొదిలి వచ్చేసారు. చివరకి తన బంధువర్గం చేతిలోనే మళ్ళీ బందీ అయ్యారు. ఆయనతోకూడా మీతో వలెనె మాట్లాడాను. ఇప్పటికీ సరాసరి ఆయన వద్దకు వెళ్ళగలిగే స్వాతంత్ర్యం నాకుంది. "సేవాకార్యక్రమాలలోకి వస్తూ మీస్థాయి తగ్గుతున్నారు." అని కూడా హెచ్చరించాను. దానికాయన ఇలా అన్నారు. " మీరు చెప్పిన స్థాయి శిష్యుల వద్ద మీరు చెప్పిన స్థాయిలోనే ఉండగలను. కాని నాచుట్టూ ఉన్నవారు నేలబారు మనుషులు. వీరికోసం వీరిస్థాయికి నేను దిగిరాక తప్పటం లేదు." అన్నాడు. ఆ దిగిరావటమే దిగజారటం. అంటే పతనం అయినట్లేగా మరి. తన స్థాయికి వాళ్ళని ఉద్దరించాల్సింది పోయి, వాళ్ళ స్థాయికి తను దిగజారితే ఇంకేముంది?

ఇంకొక ఉపన్యాసకస్వామి ఉన్నారు. వేలాదిమందిని సమ్మోహితుల్ని చేస్తూ ఉపన్యాసం ఇవ్వగలడు. కాని స్థితిలో దాదాపు అయిదారేళ్ళు మాత్రమె ఉండగలిగాడు. ఒకప్పుడు ఆయన ఉపన్యాసం వింటూ వేలాదిమంది ట్రాన్స్ లోకి పోయేవారు. ఇప్పుడో, వెకిలి చేష్టలు చేస్తున్నాడు. ఉపన్యాసాలలో మునుపటి పటుత్వం లేదు. ఇక ఆయన శిష్యులో? ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లున్నారు. ఒక్కడికీ ఆచరణ లేదు. మరి ఇన్నేళ్ళ ఉపన్యాసాలవల్ల ఏమి సాధించినట్లు? ఇది దిగజారుడు కాక మరేమిటి?

ఇంకొక స్వామి ఉన్నాడు. ఆయనది మరీ నేలబారు వ్యవహారం. మొదట్లో ఏదో కొంత వేదాంతం చెప్పేవాడు. ప్రస్తుతం మాత్రం సంగీతఆర్కెష్ట్రాతో కాలం గడుపుతున్నాడు. ఆయనకు తగిన శిష్యులే ఆయన చుట్టూ చేరుతున్నారు.

కనుక ఎవరైనా సరే. ప్రపంచపు మాయలో పడితే దిగజారినట్లే. వేషానికి పటాటోపానికి విలువిస్తే పతనమే. శిష్యులకు ఎక్కువ విలువిస్తే నాశనమే. తన స్వస్థితి నుంచి దిగజారినట్లే. నేను న్యూయార్కు వెళ్ళినప్పుడు అక్కడి వీధుల్లోనూ ఇదే డ్రస్సుతో నడిచాను. అక్కడి వారు " ఏమిటీ డ్రస్సు?" అన్నట్లు చేతితో సైగ చేస్తే, " మీ డ్రస్సు ఎందుకలా ఉంది?" అని నేనూ సైగ చేశాను. వారిదే ప్రమాణం అని మనం ఎందుకనుకోవాలి? వారి డ్రస్సు వారికి గొప్ప. నా డ్రస్సు నాకు గొప్ప. వారిభాషలో మాట్లాడాలని మనం ప్రయత్నిస్తే వారు పైచేయి తీసుకుంటారు. నేను నా భాషలోనే వారికి సమాధానం చెప్తాను. వారిభాష నాకు రానట్లే నా భాష వారికీరాదు. వారిభాష వారికి గోప్పైతే నాభాష నాకుగొప్ప. నేను నడిచి రోడ్డున పోతుంటే కారులో పోతున్నవాళ్ళు ఎగతాళిగా చెయ్యాడిస్తారు. నేనూ వారి కాళ్ళ వైపు చూపిస్తాను. "మీ స్థాయి అక్కడే ఉంది"అన్నట్లు. పరిస్థితి అలా ఉంటుంది.

( తరువాతి భాగం త్వరలో)

read more " విశ్వాత్మ తత్త్వం "

5, జనవరి 2011, బుధవారం

విశ్వాత్మగారితో పరిచయం

మొన్న రెండో తేదీన విజయవాడ పుస్తక మహోత్సవానికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఏడాది అదొక అలవాటు అయింది. కొన్నా కొనకపోయినా పుస్తకాభిమానుల మధ్యన తిరుగుతుంటే ఆనందంగా ఉంటుంది. ఏడాది అనుకోకుండా ఒక విశిష్టవ్యక్తి పరిచయం కలిగింది. ఆయనే విశ్వాత్మ గారు.

పుస్తక మహోత్సవానికి నేను, మాధవ్, తమ్ముడు సుబ్రహ్మణ్యం కలిసే వెళ్ళాము. అక్కడ నవ్వులాట శ్రీకాంత్, హేమచంద్ర కలిశారు. అనుకోకుండా తమ్ముడు రామాంజిబాబు కూడా కలిశాడు. అనుకోకుండా జరిగేవే ఆనందాన్ని ఎక్కువగాఇస్తాయి. అందరం చక్కగా మాట్లాడుకుంటూ కాలం గడిపాము. ఎవరికి కావలసిన పుస్తకాలు వారు కొనుక్కున్నారు. శ్రీకాంత్ గారు వ్రాసిన " నవ్వులాట " పుస్తకం కూడా రిలీజ్ అయ్యి స్టాల్స్ లో ఉన్నది. హైదరాబాద్ పుస్తక మహోత్సవంకంటే విజయవాడ మహోత్సవం చాలా పెద్దది. స్టాల్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. నేను మొన్నీ మధ్యనే హైదరాబాద్ పుస్తక మహోత్సవానికి వెళ్లి వచ్చాను గనుక తేడా బాగా కనిపించింది.

కీ.శే. దివాకరుని వెంకట సుబ్బారావు గారు గొప్ప జ్యోతిష పండితులు పరిశోధకులూను. మనకు ఇప్పుడు వస్తున్న ఎన్నోజ్యోతిష్యసందేహాలను ఆయన గతతరంలోనే పరిశోధించి, పరిశీలించి, పరిష్కరించారు. ఆయన చాలా పుస్తకాలు వ్రాశారు. కాని అవి ఇప్పుడు ముద్రణ లో లేవు. ఆయన నాడీ విధానం మీద కూడా బాగా పరిశోధన చేశారని అంటారు. మధ్యనే ఆయన వ్రాసిన ' లగ్న నాడి' అనే పుస్తకం మళ్ళీ ముద్రణలోకి వచ్చింది అని శ్రీకాంత్ గారు చెప్పారు. ఏ స్టాల్ లో ఉందొ కూడా ఆయనే చెప్పారు. ఆయనకు చాలా మంది పబ్లిషర్స్ తెలుసు. మేమిద్దరం చెరొక కాపీ కొనుక్కున్నాము.

కొద్దిసేపు తిరిగిన తర్వాత గ్రౌండ్ మధ్యలో కూచుని టీలు తాగుతూ మాట్లాడుకుంటున్నాం. శ్రీకాంత్, హేమచంద్రలు టీలు తాగరు. కాని ఆ సంగతి తెలియక ఆర్డర్ చేసాము. సరే చేసేదేముంది అని నేను రెండు టీలు తీసుకున్నాను. రెండుచేతులతో రెండు టీలు తాగుతుంటే నాకొకవిషయం గుర్తొచ్చింది. చువాన్ జు అనే తావోఇస్ట్ మాస్టర్ తానొక సీతాకోక చిలుకగా మారినట్లు కలగని, మేలుకున్నతర్వాత అసలు తాను మనిషినా సీతాకోక చిలుకనా అన్న సందేహానికి లోనయ్యాడు. అలాగే నేనూ చేత్తో టీని ముందుగా తాగుతున్నానా మర్చిపోయి సందిగ్ధం లో పడ్డాను. అదే విషయం సరదాగా పైకి చెప్పాను. "అసలు తాగుతున్నది నేను కాదు అనుకుంటే సరి" అని తమ్ముడు రామాంజిబాబు సలహా ఇచ్చాడు. ఇది అమనస్క యోగంలోని భావన. వేదాంత పరంగా అది నిజమేగా మరి. అందరూగట్టిగా నవ్వుకున్నాం.

సందర్భంగా నాకింకొక సంఘటన గుర్తుకొచ్చింది. శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులైన తురీయానందగారి జీవితం లోనో లేక ప్రేమానందగారి జీవితంలోనో అనుకుంటాను చివరిలో ఒకసంఘటన జరిగింది. ఆయన మరణశయ్య మీదున్నారు. శిష్యుడు గొంతులో నీరుపోస్తున్నాడు. అప్పుడు స్వామి" బ్రహ్మాన్ని బ్రహ్మంలో పొయ్యి " అన్నారు. సర్వం బ్రహ్మమే అన్న ఉత్కృష్టభావనాస్థితిలో ఆయన సమయంలో ఉన్నారు. సంఘటనను అన్వయించుకుంటూ- "తాగుతున్న నేను, తాగబడుతున్న టీ అన్నీ బ్రహ్మమే అన్న భావన ఇంకా శ్రేష్టం కదా" అని నేనన్నాను. ఇది పూర్ణయోగంలోని భావన. ఇదీ బాగానే ఉందని అనుకున్నాం.

"తెనాలి రామకృష్ణుని తలచుకొని రెండు గ్లాసులూ ఒకేసారి తాగమని" శ్రీకాంత్ గారు తన సహజహాస్యధోరణిలో అన్నారు. అందరం మళ్ళీ నవ్వుకున్నాం. కాని నేను బయటకుచెప్పని ఇంకొకభావన నాలోనే ఉండిపోయింది. అసలు టీని ఇంకొక పదార్ధమని ఎందుకు అనుకోవాలి? టీ అనేది టీ నే. నేను నేనే. చేత్తో తాగితే ఏమైంది? నేను సమయంలో టీతాగుతున్నాను. అంతే. అప్పుడు ఇంకొక ఆలోచన ఎందుకు ? దానికి అన్వయాలు ఎందుకు? ఇలా అనుకుంటూ రెండు టీగ్లాసులూ రెండు చేతులతో పట్టుకుని తాగేశాను. ఇది జెన్ భావన.

ఇలా చక్కగా వేదాంతభావాలలో ఆనందంగా తేలుతూ ఉండగా 'విశ్వాత్మ గారొచ్చారు' అని శ్రీకాంత్ గారు గబగబా నడుచుకుంటూ ఒకవైపుగా వెళ్ళారు. ఎవరా అని చూడగా దూరంగా ఒక స్టాల్ లో ఒక ఆజానుబాహువైన కాషాయ వస్త్రధారి ఏవో పుస్తకాలుచూస్తూ కనిపించారు. మేమూ నిదానంగా నడుస్తూ ఆయన ఉన్న చోటికి వెళ్ళాము. ఆయనే విశ్వాత్మ గారు.

తరువాత విశ్వాత్మ గారితో జరిగిన ఉత్తేజకరమైన చర్చలో రెండు గంటల సమయం ఎలా గడిచి పోయిందో తెలియలేదు. వివరాలు తరువాతి పోస్ట్ లో.
read more " విశ్వాత్మగారితో పరిచయం "