“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

2, అక్టోబర్ 2024, బుధవారం

దేవాలయాలనుంచి సాయిబాబా విగ్రహాల తొలగింపు మంచి పరిణామం !

సనాతన హిందూధర్మానికి మరో విజయం !

వారణాశిలోని దాదాపు పది ఆలయాలనుంచి షిరిడీసాయిబాబా విగ్రహాలను నిన్న తొలగించారు. ఇది చాలా మంచి న్యూస్ !

గత పదేళ్లనుంచి అనేకమంది అసలైన హిందువులు చేస్తున్న పోరాటం కొద్దిగా ఫలితాన్ని చూపించడం మొదలైంది. నిద్రపోతున్న అమాయక హిందువులను మేలుకొలుపుతోంది. సత్యాన్ని వారికి అర్ధమయ్యేలా చేస్తోంది. కనీసం కొంతమంది హిందువులు ఇప్పటికైనా మేల్కొంటున్నారు. నార్త్ లో చైతన్యం వస్తోంది. సౌత్ లో మాత్రం ఇంకా రావడంలేదు. మన సౌత్ అంతా దండకారణ్యం కదా. ఇది రావణుని రాజ్యం. అడవిమనుషులకు జ్ఞానోదయం కలగడానికి టైం పడుతుంది మరి !

మెజారిటీ హిందువులు చాలా అమాయకులు. ఎవరేది చెబితే అది నమ్మేస్తారు. అందులోనూ, 'అనుకున్న పనులన్నీ జరుగుతాయి'  అన్న ఆశను చూపిస్తే చాలు, ఎవరినైనా నమ్మేస్తారు. మతాలు మారిపోతారు. చివరకు కన్నతల్లిని కూడా మర్చిపోతారు. వేరే ఎవరినో తన తల్లి అనడం మొదలుపెడతారు. అంత అమాయకులు ! అమాయకత్వం అన్నమాట సరికాదేమో, స్వార్థపరత్వం అంటే సరిపోతుంది. 

పచ్చి స్వార్ధపరులు మాత్రమే మాతృభూమికి, మాతృధర్మానికి ద్రోహం చేస్తారు. 

సాయిబాబాను దేవునిగా మార్చి, హిందువులను తమ మతానికి దూరంచేసి, హిందూసమాజాన్ని చీల్చే కుట్ర గత నలభైఏళ్లుగా చాలా తెలివిగా అమలు చేయబడుతోంది. దీనిని చేసినది మళ్ళీ కొందరు సోకాల్డ్ సాంప్రదాయ హిందువులే. దేవుడు కాని సాయిబాబాను దేవునిగా చిత్రిస్తూ ప్రచారాలు చేసినది, గుళ్ళు కట్టించినదీ హిందువులే. వీరిలో మహారాష్ట్ర మరియు తెలుగు బ్రాహ్మణులే ఎక్కువమంది ఉన్నారు. తమ స్వార్థంకోసం, గురువులుగా సమాజంలో చెలామణీ కావడం కోసం హిందూమతాన్ని నాశనం చేయడంలో వీళ్ళు తమ పాత్రను పోషించారు.

వేదవేదాంతాలలో ఉన్న సారాన్ని వివరించి ప్రజలకు చెప్పవలసిన బాధ్యత బ్రాహ్మణులది. వారిది ఆచార్యస్థానం. అలాంటి స్థానాల్లో ఉన్నవారు దారితప్పి, సాయిబాబా వంటి తురకలను సాక్షాత్తు దేవునిగా మార్చి, అమాయకులైన తమ హిందూ అనుచరులను ఏమారుస్తూ వచ్చారు. గురువులది స్వార్ధం. ప్రజలది అమాయకత్వం. అందుకే వీరిద్దరిని  చూస్తుంటే నాకు చాలా జాలి కలుగుతుంది. కొండొకచో అసహ్యం కూడా వేస్తుంది.

నిజమైన హిందూమతం, సనాతనధర్మం వేదాలలో ఉపనిషత్తులలో ఉన్నది. వాటి సారం భగవద్గీత. వీటిని చదివి అర్ధం చేసుకున్నవారు, సాయిబాబా లాంటి ముస్లిం పకీర్లను ఎన్నటికీ పూజించరు.

మరొక్క వింత విషయం చెప్పనా ?

అసలైన ముస్లిములు కూడా ఫకీర్లను, దర్గాలను పూజించరు, అది ఘోరమైన పాపమని ఖురాన్ అంటుంది. ఏ ముస్లిమూ సాయిబాబాను పూజించడు. ఆయన ఒక ఫకీర్ మాత్రమే అని వారు నమ్ముతారు. అది నిజం కూడా. అంటే, ముస్లిములు కూడా చెయ్యని పాపాన్ని హిందువులు నిస్సిగ్గుగా చేస్తున్నారన్నమాట ! వినడానికి భలే ఉంది కదూ ! ఇదీ మెజారిటీ హిందువుల అమాయకత్వం !

ఎన్నో హిందూసంఘాలు ఏళ్ల తరబడిగా చేస్తున్న పోరాటం ఇప్పటికైనా కొంత ఫలితాలు చూపిస్తున్నది.  హిందువులలో కనీసం ఇప్పటికైనా కొంత చైతన్యం వస్తోంది. సంతోషం !

హిందువులారా ! కళ్ళు తెరవండి ! చీకట్లో నడవకండి ! వెలుగులోకి రండి ! మీ మతమేంటో, మీ గ్రంధాలేమి చెబుతున్నాయో, మీరేం చెయ్యాలో తెలుసుకోండి ! ఎవరేది చెబితే అదే నిజమని భ్రమించకండి ! మతాలు మారకండి ! ఎవరిని పడితే వారిని గుడ్డిగా పూజించకండి. మీ దేవతలను వదలకండి ! మీ ఆచారాలకు తిలోదకాలను ఇవ్వకండి. శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు, నారాయణుడు, ఈశ్వరుడు, అమ్మవారు, ఆంజనేయస్వామి మొదలైన దేవతలు చాలరా? ఒక ముస్లిం ఫకీర్ ను దేవునిగా చేసి కూచోబెట్టి పూజించవలసిన ఖర్మ మీకేంటి?

వారణాశి హిందూసోదరులు తమలో కొంతైనా ఆత్మాభిమానం మిగిలి ఉందని నిరూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ అన్ని దేవాలయాలలోనూ ఇదే పని జరగాల్సిన అవసరం గట్టిగా ఉంది !

మన తెలుగురాష్ట్రాల బండనిద్ర ఎప్పటికి వదులుతుందో మరి ?

read more " దేవాలయాలనుంచి సాయిబాబా విగ్రహాల తొలగింపు మంచి పరిణామం ! "

20, సెప్టెంబర్ 2024, శుక్రవారం

తిరుపతి లడ్డులో ఎద్దుమాంసం, పందిమాంసం, చేపనూనె

గొర్రె కసాయినే నమ్ముతుంది అని ఒక సామెత !

హిందువులు నిజంగా గొర్రెలే.

క్రైస్తవులను గొర్రెలని బైబిల్ అంటుంది. బైబులు చెప్పింది తప్పు. నిజమైన గొర్రెలు హిందువులే.

గత ప్రభుత్వహయాంలో తయారైన తిరుపతి లడ్డులో ఎద్దుమాంసం, పందిమాంసం, చేపనూనె ఉన్నాయని గుజరాత్ లోని CALF (Center for Analysis and Learning in Livestock & Food) సంస్థ నిర్ధారించింది. ఇది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు అనుబంధమైన అత్యాధునికమైన పరికరాలున్న ల్యాబ్. ఇదిచ్చిన రిపోర్ట్ లో ఆధారాలతో సహా ఈ విషయం స్పష్టంగా తెలిసిపోయింది.

అంటే, గత అయిదేళ్లుగా, వెంకన్నదీక్షలు చేసి తిరుమలకు వెళ్లినవారూ, మడీ ఆచారం పాటిస్తూ, ముహూర్తాలు చూసుకుని మరీ తిరుమలలో స్వామి దర్శనానికి వెళ్లినవారూ, అనేక నియమనిష్టలు పాటిస్తూ వస్తున్న ఆచారపరాయణులూ అందరూ కలసి తిరుమల ప్రసాదమంటూ భక్తిగా కళ్ళకద్దుకుని తినినది ఎద్దుమాంసం, పందిమాంసం, చేపనూనె, ఇంకా నానాచెత్త కలిసిన ఒక స్వీట్ మాత్రమేనన్నమాట !

భలే ఉంది కదూ రుచి ! 

మన కాపీ పేస్ట్ రాజ్యాంగంలోని, ప్రభుత్వవ్యవస్థలోని భయంకరమైన లోపాలను ఈ వార్త మరొక్కసారి లేవనెత్తుతోంది.

నాయకులు నీతి తప్పితే ఏం జరుగుతుంది? ప్రమాణస్వీకారసమయంలో చేసిన ప్రమాణాలను మర్చిపోయి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఏమౌతుంది? నోటికొచ్చిన అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తే ఏమౌతుంది? హిందూదేశాన్ని 'సెక్యులర్' అని రాజ్యాంగంలో వ్రాసుకుని హింసాత్మక ఎడారిమతాలకు వంతపాడితే ఏమౌతుంది? మెజారిటీ హిందువులలో చైతన్యం రాకపోతే ఏమౌతుంది?

ఇదే అవుతుంది. ఇంకా కూడా అవుతుంది. చూస్తూ ఉండండి. చేతగానివాళ్ళు అంతకంటే ఇంకేం చేయగలరు మరి?

డబ్బుకోసం అడ్డదారులు తొక్కడం రాజకీయపార్టీలకు మామూలే. కానీ తిరుమల ఆలయవిషయంలో కూడా ఇటువంటి నీచమైన పనికి పాల్పడటం, ఇలా చేస్తూ పైశాచికానందాన్ని పొందటం గతప్రభుత్వం నీచత్వంలో క్రొత్త రికార్డులు సృష్టించినట్లు అయింది.

మసీదులు చర్చిలు వక్ఫ్ బోర్డులు ప్రభుత్వహయాంలో ఉండవు. ఆలయాలు మాత్రం ఎండోమెంట్ బోర్డు పరిధిలో ఉంటాయి. వాటిలో ఎడారిమతాల అధికారులు ఉద్యోగులు ఉంటారు. హిందూమతంపైన వారి ద్వేషాన్ని తీర్చుకోవడానికి అనేక అవకాశాలు వారికి ప్రతిరోజూ ఎన్నో ఉంటాయి. 

రోటీలలో ఉమ్మేసి, జ్యుసులో మూత్రం కలిపి అమ్మడం ఇస్లాం వంతు. ఆగమశాస్త్రాల ప్రకారం నడిచే పరమపవిత్రమైన తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామివారి నైవేద్యంలో ఎద్దుమాంసం, పందిమాంసం, చేపనూనె ఇంకా నానా చెత్తలు కలిపి, భగవంతుని పట్ల, కోట్లాది హిందువుల పట్ల ఘోరమైన పాపాన్ని చేయడం క్రైస్తవమతానికి చెందిన గత ప్రభుత్వపు వంతు.

క్రైస్తవం, ఇస్లాం మతాలు ఈ దేశాన్ని సర్వనాశనం దిశగా తీసుకుపోతున్నాయి.

హిందువులేమో 'అన్ని మతాలూ ఒకటే', 'మనమందరం భాయీ భాయీ' అని చెక్కపాటలు పాడుకుంటూ ఎగురుతూ ఉంటారు. ఇతర మతాలు వారి ప్రభుత్వాలు మాత్రం ఇలాంటి నీతిలేని పనులు చేస్తూ, మన ఆచారాలకు తూట్లు పొడుస్తూ, తిన్న ఇంటికే నిప్పు పెడుతూ పైశాచికానందాన్ని పొందుతూ గుడారాల పండగలు చేసుకుంటూ ఉంటారు.

మనమేమో అలాంటివారికే ఓట్లు వేసి గెలిపించుకుంటాం !

గొర్రె కసాయి సామెత ఇదేగా మరి !

ఇలాంటి పాపపుతిండి తిన్నందుకు హిందూధర్మశాస్త్రాల ప్రకారం హిందువులు ఏం చేయాలో తెలుసా? నాలుకలు కాల్చుకోవాలి. ఏడాది పాటు ఉపవాసాలుంటూ, చన్నీళ్ళ స్నానం, నేలపడకలు ఆచరిస్తూ, మంత్రజపం ద్వారా తమను తాము శుద్ధిచేసుకోవాలి. మీరాపని చేస్తుంటే వారు కూడికలు తీసివేతలు చేసుకుంటూ నవ్వుతూ ఉంటారు. కానివ్వండి మరి ! 

కనీసం ప్రాయశ్చిత్తం చేసుకునే ధైర్యమూ తెగువా కూడా హిందువులలో లేవు. వీరిలో చైతన్యం ఎప్పటికి వస్తుందో ఆ దేవుడికే తెలియాలి !

దేశం నాశనం దిక్కుగా ప్రయాణిస్తోందిరా బాబూ, కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి. ప్రతిఘటించడం ప్రశ్నించడం నేర్చుకోండి. దద్దమ్మల్లాగా కూచుంటే సమీప భవిష్యత్తులో మీ ధర్మమూ ఉండదు, మీరూ ఉండరు.

ఇప్పుడు మిమ్మల్ని కాపాడటానికి ఛత్రపతి శివాజీ లేడు, సుభాష్ చంద్ర బోస్ లేడు. నిరంతర జాగరూకతతో మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి.

ఇప్పుడు మీకు బోధించడానికి సమర్ధరామదాసు, విద్యారణ్యస్వామి, వివేకానందస్వామి లేరు, రాజకీయతొత్తులై, ధర్మద్రోహులై, అవినీతికి వంతపాడే విలువలులేని నకిలీ స్వాములున్నారు. మీకు మీరే బోధించుకోవాలి.

ఉమ్మి, ఉచ్చ, పందిమాంసం ఎద్దుమాంసం తింటున్నపుడైనా హిందూగొర్రెలకు బుద్ధి రాకపోతే ఎలా?

read more " తిరుపతి లడ్డులో ఎద్దుమాంసం, పందిమాంసం, చేపనూనె "

14, సెప్టెంబర్ 2024, శనివారం

ఫ్రూట్ జ్యూస్ లో మూత్రం

ఉత్తరప్రదేశ్ లోని  ఘజియాబాద్ లో నిన్న ఒక అసహ్యకరమైన సంఘటన జరిగింది. 'ఖుషి జ్యూస్ కార్నర్'  అనే షాపులో ఫ్రూట్ జ్యూస్ లో మూత్రం కలిపి కస్టమర్ల చేత త్రాగిస్తున్న షాపు ఓనర్ ఆమిర్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

యూట్యూబ్ లో ఈ వీడియో వైరల్ అవుతోంది.

జ్యూస్ కలుపుతున్నపుడే ఈ సంఘటనను గమనించిన కస్టమర్లు అతన్ని చితకబాది పోలీసులకు ఫోన్ చేశారు. యోగిగారి రాజ్యం కదా, అందుకని అక్కడి పోలీసులు చాలా ఎలర్టుగా ఉండి, చురుకుగా పని చేస్తున్నారు. వాళ్ళు వెంటనే షాపు దగ్గరకు వచ్చి చూస్తే, ఒక లీటర్ బాటిల్ మూత్రం షాపులో దొరికింది. అంటే, నిమ్మరసం బదులు మూత్రాన్ని ఆ బాటిల్లోంచి కలిపి కస్టమర్లకు ఇస్తున్నాడు ఆమిర్ ఖాన్. బహుశా షాపులో బాత్రూం లేదేమో? అందుకని తెలివిగా ఇలా చేస్తున్నాడన్నమాట ! ప్రత్యేకంగా బాత్రూం కట్టించుకోవాల్సిన పని లేదు. కౌంటర్ వదిలి బయటకు పోవాల్సిన పనీ లేదు. ఐడియా భలే ఉంది.

రోటీలలో ఉమ్మేసి కాల్చి కస్టమర్లకు పెడుతుంటే, వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటున్న ధాబాలు మన దేశంలో లక్షలున్నాయి. టీ లో ఉమ్మేసి కస్టమర్లకు ఇవ్వడం హైద్రాబాదు టీ స్టాళ్లలో మామూలే. కిచెన్ లోపలగా ఉంటే, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు. కనీసం మన ఎదురుగా కలిపే టీలో కూడా, అలా కలుపుతున్నట్టు నటిస్తూ, ఒక్క క్షణం అటువైపు తిరుగుతాడు. అందులో ఉమ్మేసి, నవ్వుకుంటూ ఇటు తిరిగి, మీకు ఇస్తాడు. మీరు లొట్టలేసుకుంటూ టీ త్రాగుతారు. హైద్రాబాద్ లో JNTU దగ్గరున్న ఫుట్ పాత్ మీద టీ అమ్మే టీ టైం, టీ హెవెన్ మొదలైన ఫ్రాంచైసీ టీ షాపులలో స్వయానా నేనే దీనిని చూశాను.

అసలు ముస్లిములు ఇలా ఎందుకు చేస్తారు? ఇది  తప్పు కదా? అని ఎవరికైనా ఆలోచన వస్తుంది. ఒకరు మనల్ని నమ్మి మనం పెడుతున్నది తింటున్నప్పుడు, దానిలో ఉమ్మి ఉచ్చ కలపడం ఎంత నీచం? అసలలాంటి పని చెయ్యాలని ఎలా అనిపిస్తుంది? వాళ్ళ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది?

దీనికి మూలాలు ఖురాన్ లో ఉన్నాయి. ముల్లాల రెచ్చగొట్టుడు బోధలలో ఉన్నాయి. అందుకే, ముస్లిములు కొందరు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అదేదో గొప్ప పని అని, ఇస్లాం చెప్పినట్టు నడుచుకుంటున్నామని, తమకు స్వర్గం ఖాయమని వారనుకుంటారు. కానీ, తిండిలో విషం కలపడం ఎంత దారుణమో ఇదీ అంత దారుణమే. ఇలాంటి పనికి శిక్ష భయంకరమైన నరకమే అని మన ధర్మశాస్త్రాలు అంటున్నాయి.

శత్రువైనా సరే, మన ఇంటికి వచ్చినపుడు, ఆదరించి, చక్కగా భోజనం పెట్టమని మన హిందూమతం చెబుతుంది. నీ దుకాణంలో కొనుక్కుంటున్న వస్తువులలో ఉమ్మి, ఉచ్చ కలిపి ఇవ్వమని వారి మతం చెబుతోందా? ఒకవేళ ఎవరూ అలా చెప్పకపోతే వారలా ఎందుకు చేస్తున్నారు? ఇదేదో కేవలం ఒక్కడి ఉన్మాదచర్య అనుకోవడానికి లేదు. ఎక్కడ చూచినా ఇవే కేసులు మీడియాలో కనిపిస్తున్నాయి. అంటే, బయటకు రానివి ఎన్నున్నాయో?

బయట ఫుడ్ ఆర్డర్ చేసి తింటున్నామంటే, ఎవడి ఉమ్మి, ఉచ్చ తింటున్నామో అని భయపడాల్సిన పరిస్థితిలోకి ఆల్రెడీ వచ్చేశాము. పోనీ రెస్టారెంట్ కి వెళ్లి తిన్నప్పటికీ, కిచెన్లో ఏమి జరుగుతుందో మనకు తెలీదు. ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలియదు.

బయటకెళ్ళి ఒకచోట టీ కాఫీ త్రాగాలన్నా, లేదా బయట హోటల్లో తినాలన్నా, లేదా బయటనుండి ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకోవాలన్నా ఒకటికి వందసార్లు ఆలోచించే పరిస్థితులు వస్తున్నాయి. కలికాలమంటే ఇదేనా?

ఇలాంటి పరిస్థితులలో ఏమిటి కర్తవ్యం?

పాతకాలంలో సాంప్రదాయ బ్రాహ్మణులు బయటి తిండి తినేవారు కారు. వారు వండుకున్న వంటనే వారు తినేవారు. ఎవరి చేతిమీదుగానూ వారు బయటి తిండిని తీసుకునేవారు కారు. ఎందుకు? బహుశా ఇటువంటి పనులు విపరీతంగా జరగడం వల్లనే అటువంటి జాగ్రత్తలు పుట్టుకొచ్చి ఉంటాయి. క్రమేణా అవే ఆచారాలుగా మారి ఉంటాయి.

అంటరానితనం పాటించడానికి, ఇతరుల ఇళ్లలో గాని, బయట హోటళ్లలో గాని ఆహారం తినకుండా పాతకాలంలో చాలామంది ఉండటానికి వెనుక చూడబోతే ఇలాంటి కొన్ని బలమైన కారణాలున్నట్లే అనిపిస్తోంది.

అరబ్ దేశాలలో, చైనాలో, అమెరికాలో లేదా ఇతర దేశాలలో ఇలాంటివి ఎందుకు జరగవు? మన దేశానికే ఏంటి ఈ దరిద్రం? దీనికి కారణం మన న్యాయవ్యవస్థ, మన కాపీ పేస్ట్ రాజ్యాంగం, ఇటువంటి నేరాలకు చిన్న చిన్న శిక్షలుండటం, భారతీయులలో ఐకమత్యం లేకపోవడమే కాదా?

ముస్లిమ్స్ ఎందుకింత ఛండాలంగా తయారౌతున్నారు? వారి మతం వారికి బోధిస్తున్నది ఇదా? ఒక మతం చెప్పినంత మాత్రాన ఇటువంటి పనులు చెయ్యడానికి వారి మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది?

మనస్సాక్షి అంటూ ఒకటి ఏడిస్తేగా అంటారా?

అంతేనేమో  మరి !

read more " ఫ్రూట్ జ్యూస్ లో మూత్రం "

24, ఆగస్టు 2024, శనివారం

మా 67 వ పుస్తకం 'భారతీయ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రము' విడుదల

మా 67 వ పుస్తకంగా 'భారతీయ జ్యోతిష్య సంఖ్యాశాస్త్రము' నేడు విడుదల అవుతున్నది. ఇది నా జ్యోతిష్యశాస్త్ర పరిశోధనలో వెలుగుచూచిన న్యూమరాలజీ విధానం.

'సంఖ్యాజ్యోతిష్యం' అంటే బాగుంటుంది కదా? అని కొందరు సందేహం వెలిబుచ్చారు. అనడానికి, వినడానికి బాగానే ఉంటుంది. కానీ, జ్యోతిష్యశాస్త్రం లేకుండా సంఖ్యాశాస్త్రం లేదు. గ్రహాలతో ముడిపెట్టకుండా ఉత్త అంకెలు మిమ్మల్ని ఎంతోదూరం తీసుకుపోలేవు. జ్యోతిష్యశాస్త్రం ముందు, సంఖ్యాశాస్త్రం తరువాత.  అందుకే 'జ్యోతిష్య సంఖ్యాశాస్త్రము' అని పేరుపెట్టాను. 

నా 61 వ పుట్టినరోజు సందర్భంగా జూలై నెలాఖరులో మా ఆశ్రమంలో జరిగిన సాధనాసమ్మేళనంలో ఈ విధానాన్ని శిష్యులకు వివరించాను. ఆ తరువాత ఈ విధానాన్ని గ్రంధస్థం చేయాలన్న సంకల్పంతో, కేవలం రెండువారాలలో ఈ పుస్తకాన్ని వ్రాసి విడుదల చేస్తున్నాను. ఇందులో నాదైన న్యూమరాలజీ విధానం వివరించబడింది. దీనిని 'భారతీయ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర పధ్ధతి' లేదా క్లుప్తంగా 'BJS పద్ధతి' అని పిలుచుకోవచ్చు.

వెస్టర్న్ న్యూమరాలజీ మీద మార్కెట్లో వేలాది పుస్తకాలున్నాయి. అవన్నీ తప్పుల తడికలేనని నేనంటాను. నేనిలా అనడానికి తర్కబద్ధమైన కారణాలున్నాయి.

అంకెలను ఏ బీ సీ డీ లతో పోల్చి మీ నేమ్ నంబర్ రాబట్టడం, లేదా మీ జననతేదీతో పోల్చి మీ డెస్టినీ నంబర్ రాబట్టడాలు సరియైన విధానాలు కావు. కారణం? ఇవన్నీ నిన్నగాక మొన్న మనం కృత్రిమంగా ఏర్పరచుకున్న గ్రెగోరియన్ కాలెండర్ ను అనుసరిస్తూ ఉంటాయి.

లౌకికమైన లావాదేవీలకు తప్ప మీ 'డేట్ ఆఫ్ బర్త్'  కు ప్రకృతిపరంగా ఎటువంటి విలువా లేదు. అదే విధంగా, ప్రకృతికీ గ్రెగోరియన్ కాలెండర్ కూ ఎటువంటి సంబంధమూ లేదు. కాబట్టి దాని ఆధారంగా లెక్కించబడే వెస్టర్న్ న్యూమరాలజీకి తర్కబద్ధత లేదు. అది సత్యాన్ని ప్రతిబింబించదు. దీనికి పూర్తిగా విభిన్నమైనది  మన భారతీయ సంఖ్యాశాస్త్రము. ఇది ప్రకృతిపైన, నవగ్రహాలపైన ఆధారపడినది. కనుక సత్యమైన ఫలితాలనిస్తుంది.

నా పరిశోధనలో వెలుగుచూచిన ఈ సులభమైన విధానాన్ని 52 మంది ప్రముఖుల జాతకాల సహాయంతో తేలికగా సోదాహరణంగా ఈ పుస్తకంలో వివరించాను.

రామకృష్ణ పరమహంస, వివేకానందస్వామి, సిస్టర్ నివేదిత, పరమహంస యోగానంద, రమణ మహర్షి, జిల్లెళ్లమూడి అమ్మ, మెహర్ బాబా, అరవిందయోగి, ఓషో, జిడ్డు కృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తి, ఆనందమయి మా వంటి మతప్రముఖుల జాతకాలతో బాటు, సుభాష్ చంద్ర బోస్, మోహన్ దాస్ గాంధీ, నాధూరాం గాడ్సే, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ పటేల్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు, నరేంద్రమోదీ, యోగి ఆదిత్యనాథ్, బెంజమిన్ నెతన్యాహు, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు, విక్రమ్ సారాభాయ్, హరగోబింద్ ఖోరానా, సత్యేన్ద్రనాథ్ బోస్, యల్లాప్రగడ సుబ్బారావు, శ్రీనివాస రామానుజం, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, బ్రునీ సుల్తాన్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, వెంపటి చినసత్యం, శ్రీపాద పినాకపాణి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ రవిశంకర్, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, లతా మంగేష్కర్, కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, తిరుమలై కృష్ణమాచార్య, బీకేఎస్ అయ్యంగార్, కృష్ణ పట్టాభి జాయిస్, కోడి రామ్మూర్తినాయుడు, దారాసింగ్, బ్రూస్ లీ, మాస్ ఒయామా, మైక్ టైసన్ మొదలైన సెలబ్రిటీల జాతకాలను ఈ సంఖ్యాశాస్త్ర పరంగా విశ్లేషించి చూపించాను.

ఈ విధానాన్ని అనుసరిస్తే, మీ జాతకాన్ని మీరే తేలికగా అర్ధం చేసుకోగలుగుతారు.

ఈ పుస్తకం వ్రాయడంలో నాకు సహాయపడిన నా శ్రీమతి సరళాదేవి, శిష్యులు అఖిల, లలిత, ప్రవీణ్, చావలి శ్రీనివాస్, మూర్తి, సంధ్యలకు నా ఆశీస్సులు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మా ఇతర పుస్తకాలలాగే ఈ పుస్తకం కూడా ఇక్కడ లభిస్తుంది.

చదివి చూడండి మీకే అర్ధమౌతుంది.

read more " మా 67 వ పుస్తకం 'భారతీయ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రము' విడుదల "

18, ఆగస్టు 2024, ఆదివారం

ప్రశ్నశాస్త్రం - కలకత్తా డాక్టర్ హత్యకేసులో ఏం జరిగింది?

ఈరోజు మధ్యాహ్నం 12.56 నిముషాలకు వేసిన ప్రశ్నచక్రం ఇది. 

కలకత్తా డాక్టర్ మరణం వెనుక అసలు ఏముంది? అన్నది తెలుసుకోవడమే ఈ ప్రశ్న ఉద్దేశ్యం.

9 వ తేదీన ఈ సంఘటన జరిగింది. కానీ ప్రశ్న చూడాలని నాకు అనిపించలేదు. ఈరోజు మధ్యాహ్నంపూట ఆదేశం వచ్చింది. అందుకని ప్రశ్న జాతకం చూడటం జరిగింది.

రహస్యాలకు నిలయమైన వృశ్చికం లగ్నమౌతూ దీనివెనుక చాలా రహస్యాలు దాగున్నాయని, ఇది సింపుల్ కేసు కాదని చెబుతోంది. 

చంద్రుడు 3 లో ఉంటూ స్నేహితులు, సహచరుల పాత్ర ఉందని చెబుతున్నాడు.

శని 4 లో వక్రించి ఉంటూ, 3 లోకి వచ్చి చంద్రుని కలుస్తూ తన క్లాసుమేట్లు, ఇంటిదొంగలు దీనివెనుక ఉన్నారని చెబుతున్నాడు.

లగ్నాధిపతి కుజుడు 7 లో గురువుతో కలసి శుక్రస్థానమైన శత్రురాశిలో ఉంటూ, ప్రొఫెసర్లు మొదలైన గురుస్థానంలో ఉన్నవాళ్ల పాత్ర కూడా ఉందని, ఈ అమ్మాయి వారి వలలో పడిందని చెబుతున్నాడు.

గురుకుజులతో యురేనస్ కూడా అక్కడే ఉంటూ సంఘవిద్రోహశక్తులు దీని వెనుక ఉన్నారని ఈ అమ్మాయిని చంపింది వారేనని, గురువులకు వారికీ  స్నేహం ఉందని, వారందరూ ఒక గ్రూపని చెబుతున్నాడు.  

పంచమాధిపతి గురువు 7 లో కుజ యురేనస్ లతో కలసి ఉండటం, ఈ పని చేసినది తెలియని మనుషులు కాదని, ఈ అమ్మాయికి వారికీ బాగా పరిచయం ఉందని స్పష్టంగా చెబుతోంది.

రాహువుతో నెప్ట్యూన్ కలసి 5 లో ఉంటూ, డ్రగ్ మాఫియాను సూచిస్తున్నాడు. ఆ ముఠా  సభ్యులతో ఈ అమ్మాయికి స్నేహంగాని, కనీసం గట్టి పరిచయం గాని ఉందని. వారు ఈ అమ్మాయికి బాగా పరిచయస్తులే అని సూచిస్తున్నాడు. రాహువు గురురాశిలో ఉండటం ముస్లిములను సూచిస్తుంది. కనుక వారిలో వీరు కూడా ఉండవచ్చు.

10 లో రవి బుధ శుక్రులున్నారు.  వీరిలో రవి బలంగా ఉంటూ నాయకుల అధికారుల హస్తాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు.

రవితో ఉన్న బుధుడు వక్రించి, ఆ నాయకుల, అధికారుల బుద్ధి వక్రించిందని చూపిస్తున్నాడు.

లగ్నము, శని, గురుకుజులు, రవిబుధశుక్రులు ఒకరికొకరు కేంద్రస్థానాలలో ఉంటూ, వీరిమధ్యన జరిగిన తీవ్రమైన ఘర్షణను సూచిస్తున్నారు.

గురుశుక్ర శని కుజులు డిగ్రీ దృష్టులలో చాలా దగ్గరగా ఉన్నారు. వీరిలో శుక్ర శనులు నీచమైన సెక్స్ నేరాలను సూచిస్తారు. గురుశుక్రులు ఈ నేరంలో గురువుల పాత్రను సూచిస్తారు. శని కుజులు హింసాత్మక సంఘటనకి సూచకులు. గురుశనులు దృఢకర్మను సూచిస్తారు. గురుకుజులు అధికార దుర్వినియోగాన్ని సూచిస్తున్నారు.

నవాంశలో శని 6 లో నీచలో ఉంటూ నీచులైన స్నేహితులను, తక్కువస్థాయి పనివారిని శత్రువర్గంగా సూచిస్తున్నాడు.

సూర్యుడు 6 లో ఉఛ్చస్థితిలో ఉంటూ అధికారులతో ఈ అమ్మాయికి శత్రుత్వం వచ్చిందని స్పష్టంగా చూపిస్తున్నాడు.

నవాంశలో గురువు ఉఛ్చస్థితిలో ఉన్నందున ఈ కేసు ఇంత సంచలనాన్ని సృష్టించి, దేశవ్యాప్త ఉద్యమాన్నిరేకెత్తించి, సుప్రీంకోర్టు సూమోటోగా తీసుకునేవరకూ తెచ్చింది. లేకపోతే, గతంలో జరిగిన ఎన్నో వందల రేప్ /మర్డర్ కేసులలాగే ఇది కూడా వెలుగులోకి రాకుండా ఉండిపోయేది.

ఈ కేసులో నేరస్థులకు శిక్ష పడుతుందా? అన్నది అసలు ప్రశ్న.

లగ్నాధిపతి కుజుడు 7 లో శత్రుస్థానంలో ఉండటం, దశమాధిపతి రవి దశమస్థానంలో బలంగా ఉండటం, ఇద్దరికీ కేంద్రదృష్టి ఉండటాలను బట్టి, లాభాధిపతి బుధుడు 9 లోకి వస్తూ, కుజునితో 3/11 దృష్టిలోకి రావడాన్ని బట్టి, కొంత హడావుడి జరుగుతుంది గాని, పూర్తి న్యాయం మాత్రం జరగదని, అసలైన నేరస్థులు తప్పించుకుంటారని ప్రశ్నశాస్త్రం చెబుతోంది.

ప్రశ్న సమయంలో చంద్ర రాహు రాహు గురు బుధదశ నడిచింది. రాహు-గురు -వక్రబుధులు సంఘవిద్రోహ మాఫియాను, అధికారులు మాఫియాతో కుమ్మక్కు అవడాన్ని సూచిస్తున్నారు.  లగ్నము, చంద్రుడు, రాహువు, గురువు, బుధుడు ఒకరికొకరు తృతీయాలలో ఉన్నారు. అంటే, ఇదంతా ఒక పెద్ద నెట్ వర్క్ అని స్పష్టంగా కనిపిస్తున్నది.

ఇది మామూలు రేప్ కేసు కాదు. దీని వెనుక చాలా పెద్ద నెట్ వర్క్, డ్రగ్ మాఫియా, అధికారుల పాత్ర అన్నీ ఉన్నాయి. దీనిని ఛేదించాలంటే నాయకులకు, అధికారులకు  చాలా చిత్తశుద్ధి, నిజాయితీలు ఉండాలి. ప్రస్తుతకాలంలో అవి ఎంతమందిలో ఉన్నాయి?

అదీగాక దీనివెనుక ఉన్న మాఫియా ముఠాను కదిలించడం అంత సులభం కాదు. వారికి నాయకుల అధికారుల అండదండలున్నాయి గనుక అసలు నేరస్థులు దొరకరని చెప్పవచ్చు.

పైగా, రోజులు గడిచేకొద్దీ ఎంత పెద్ద న్యూసైనా సరే పాతబడిపోతుంది. పబ్లిక్ మర్చిపోతారు. కనుక ఈ కేసులో న్యాయం జరుగుతుందా లేదా అనేది ఎవరికైనా తేలికగా అర్థమౌతుంది.  

ప్రసన్నలక్ష్మి, మీరాజాస్మిన్, ప్రత్యూష, సుశాంత్ సింగ్ ఇలా గతంలో ఎన్ని జరగలేదు ! వారిలో ఎందరికి న్యాయం జరిగింది? ఇప్పుడు  మాత్రం ఎలా జరుగుతుంది? పాత రికార్డును బట్టే కదా ప్రస్తుత ఇమేజి ఏర్పడేది !

వ్యవస్థలు కుప్పకూలినపుడు ఎవరి రక్షణబాధ్యత వారిదే అవుతుంది. అందుకే రైల్వే ఎప్పుడో చెప్పింది, ' మీ లగేజికి మీరే బాధ్యులు ' అని.
read more " ప్రశ్నశాస్త్రం - కలకత్తా డాక్టర్ హత్యకేసులో ఏం జరిగింది? "

10, ఆగస్టు 2024, శనివారం

బాంగ్లాదేశ్ సంక్షోభం - యురేనస్ సైకిల్స్

బాంగ్లాదేశ్ సంక్షోభంలో కూరుకుపోయింది.

దీనిని వాళ్ళు 'రెండవ స్వతంత్రం' గా వర్ణించుకోవచ్చు గాక. కానీ విధ్వంసం దిశగా వాళ్ళు వెళుతున్నారనడానికి గత వారంరోజులుగా అక్కడ హిందువులపైన జరుగుతున్న మారణకాండలే సాక్ష్యాలు.

దీనివెనుక అమెరికా, పాకిస్తాన్, చైనాల కుట్ర అనుమానం లేకుండా ఉంది. ఇస్లామిక్ తీవ్రవాదుల కుట్ర ఉంది.

దీనివల్ల మన దేశానికి కూడా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అటు బర్మాలో కొన్ని భాగాలు, ఇటు ఇండియాలో సెవెన్ సిస్టర్స్, అస్సాం, వేస్ట్ బెంగాల్, బీహార్ వరకూ ఇస్లామిక్ రాజ్యమంటూ క్రొత్త నినాదం ముందుకొస్తుంది. దానికి అల్ ఖైదా, ఇరాన్ లు ఆజ్యం పోస్తాయి. మనదేశంలో ఉన్న ఇస్లామిక్ స్లీపింగ్ సెల్స్ లోపలనుంచి సహకరిస్తాయి. ఇంటా బయటా సమస్యలు  చుట్టుముడతాయి. వెరసి ఇండియా పెను ప్రమాదంలో పడబోతోంది.

ఇప్పటివరకూ జమ్మూకాశ్మీర్లో  మాత్రమే తీవ్రవాదాన్ని ఎదుర్కొంటున్న మన ప్రభుత్వం ఇక తూర్పునుండి కూడా చొరబాటులను, అల్లర్లను, తీవ్రవాదాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అస్సామ్, వేస్ట్ బెంగాల్ లు ప్రధానంగా టార్గెట్ అవుతాయి.

ఈ విషయంలో గ్రహాలేమంటున్నాయి?

ఇదంతా యురేనస్ గ్రహం యొక్క ప్రభావం. జూన్ నెలలో యురేనస్ గ్రహం, భారతదేశాన్ని సూచించే వృషభరాశిలోకి అడుగుపెట్టింది. ఒక్క నెలలోనే మన దొడ్డివాకిలి లాంటి బాంగ్లాదేశ్ లోని ప్రజాప్రభుత్వం కూలిపోయింది.

84 ఏళ్ల కొకసారి యురేనస్ గ్రహం రాశిచక్రాన్ని ఒక చుట్టు చుట్టి వస్తుంది. అంటే, ఒక్కొక్క రాశిలో అది 7 ఏళ్ళు ఉంటుంది. గతంలో 1940-48 మధ్యలో యురేనస్ వృషభరాశిలో సంచరించింది. మళ్ళీ ఇప్పుడు అదే స్థితిలోకి వచ్చింది.

ఏయే విషయాలు యురేనస్ అదుపులో ఉన్నాయి?

తిరుగుబాట్లు, విప్లవాలు, పెద్ద ఎత్తున అల్లర్లు, ప్రభుత్వాలు కూలిపోవడాలు, దేశాలమధ్యన యుద్ధాలను ఈ గ్రహం కంట్రోల్  చేస్తుంది.  ఇది చరిత్ర చెబుతున్న నిజం ! 

కనుక అప్పటి పరిస్థితులే అటూ ఇటూగా మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఎదురౌతాయి.

1940-48 మధ్యలో ఏం జరిగింది?
-----------------------------------------------
1939-45 మధ్యలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది.
 
అప్పుడే భారత స్వతంత్రపోరాటం కూడా జరిగింది. 1947 లో మనకు స్వతంత్రం వచ్చింది.

రెండో ప్రపంచయుద్ధంలో ఏడున్నర కోట్ల మంది ప్రపంచప్రజలు + సైనికులు చనిపోయారు. 

భారత విభజన సమయంలో జరిగిన సరిహద్దు అల్లర్లలో 5 నుండి 10 లక్షల మంది చనిపోయారు.

2024-2030 మధ్యలో మళ్ళీ అవే పరిస్థితులు రాబోతున్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం, చైనా - తైవాన్ సంక్షోభం, బాంగ్లాదేశ్ లో తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వ ఏర్పాటు ఇవన్నీ ముదిరి ముదిరి మూడవ ప్రపంచయుద్ధంగా మారబోతున్నాయి. 

రోహిణీ శకట భేదనం
-----------------------------
రోహిణీ నక్షత్రంలో యురేనస్ 1943-45 మధ్యలో సంచరించాడు. అప్పుడే రెండవ ప్రపంచయుద్ధం ముదిరి పాకాన పడింది. జపాన్ పైన అణుబాంబు ప్రయోగం జరిగింది కూడా అప్పుడే.

మళ్ళీ ఇప్పుడు 2026-28 మధ్యలో యురేనస్ రోహిణీ నక్షత్రంలో సంచరించబోతున్నాడు. 84 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులను ప్రపంచం మళ్ళీ చూడబోతోంది.

మేషరాశిలో శని స్థితి
-----------------------------
మేషరాశి శనికి నీచస్థితి. ప్రస్తుతం శనీశ్వరుడు 2027-30 మధ్యలో మేషరాశిలో సంచరించబోతున్నాడు.  ఈ సమయంలో ప్రపంచదేశాల ప్రజలకు, ముఖ్యంగా భారత ఉపఖండపు ప్రజలకు నానాకష్టాలు తప్పవు.

యురేనస్ సంచారం + శని మేషరాశి సంచారం రెండూ కలిసి, 2026 నుండి 2029 వరకూ నాలుగేళ్లు ప్రపంచదేశాలకు చుక్కలు కనిపించబోతున్నాయి.

ఇదే సమయంలో భారతదేశం కూడా కనీవినీ ఎరుగని గడ్డు పరిస్థితులను, సంక్షోభాన్ని ఎదుర్కొనబోతోంది.

కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు, ప్రజలు, ముఖ్యంగా హిందువులు ఐకమత్యంగా ఉంటూ దేశభద్రతకు, దేశప్రయోజనాలకు పెద్దపీట వెయ్యకపోతే మాత్రం, ఆ తరువాత ఏ పీటా వేసుకోవడానికి ఎవరూ మిగలరు.

ఈ హెచ్చరికను ఆషామాషీగా తీసుకోకండి.

బ్రహ్మంగారు వ్రాసిన కాలజ్ఞానం ఇదే కావచ్చు, కలియుగాంతం ఇదే కావచ్చు. ఇప్పటినుండి ఏడేళ్లలో మన కళ్ళముందే మనం వాటన్నింటినీ చూడబోతున్నాం. తస్మాత్ జాగ్రత !

ఈ సబ్జెక్ట్ పైన చేసిన వీడియోను ఇక్కడ చూడండి.

జైహింద్ !  
read more " బాంగ్లాదేశ్ సంక్షోభం - యురేనస్ సైకిల్స్ "

28, జులై 2024, ఆదివారం

4 వ సాధనా సమ్మేళనం విజయవంతం

ఆషాఢపూర్ణిమ గురుపూర్ణిమ. ఆనాడు సనాతన భారత సాంప్రదాయానికి పరమగురువైన వ్యాసభగవానుని స్మరించి మనమందరం ఆరాధిస్తాం. కనుక అది వ్యాసపూర్ణిమ అయింది. అదేసమయంలో, వ్యాసభగవానుని ప్రతిరూపాలుగా భావిస్తూ ఎవరి గురువులను వారు పూజించడం కూడా మన సంప్రదాయం.

వ్యాసపూర్ణిమ తరువాత వచ్చే సప్తమి నేను పుట్టినరోజు గనుక, ఈ నెల 26, 27, 28 తేదీలలో వచ్చిన వీకెండ్ లో మా ఆశ్రమంలో గురుపూర్ణిమ ఉత్సవాలను జరిపాము.

ఈ మూడురోజులపాటు మా ఆశ్రమంలో 4 వ ఆధ్యాత్మిక సాధనాసమ్మేళనం జరిగింది. పంచవటి సాధనామార్గానికి చెందిన ఉన్నతదీక్షలను సభ్యులకు ఇవ్వడం, వాటి లోతుపాతులు నేర్పించడం, సాధన చేయించడం, సందేహనివారణ చెయ్యడం, ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం చెయ్యడం జరిగింది. జ్యోతిష్యశాస్త్రం, సంఖ్యాశాస్త్రం, యోగసాధన, హోమియోపతి వైద్యాలలో నాదైన విధానాన్ని సభ్యులకు నేర్పించడం జరిగింది.

ఆ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.




 


read more " 4 వ సాధనా సమ్మేళనం విజయవంతం "

14, జులై 2024, ఆదివారం

మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదల

ఈరోజు మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదలౌతున్నది. ఇది మా సంస్థ నుండి వెలువడుతున్న 66 వ పుస్తకం, మరియు మొదటి హిందీ పుస్తకం.

ఇది నా తెలుగు పుస్తకం 'మధుశాల' కు హిందీ అనువాదం. తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఆదరణను పొందడంతో. దీనిని హిందీ లోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నాం.

ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ నుండి హిందీలోకి చాలా త్వరగా అనువాదం చేసిన నా శిష్యురాలు పూజా బగాడియాకు కృతజ్ఞతలు మరియు ఆశీస్సులు తెలుపుతున్నాను. శుద్ధమైన, సరళమైన హిందీలోకి ఈ అనువాదం జరిగింది.

ప్రస్తుతం 'ఈ-బుక్' గా విడుదల అవున్నప్పటికీ, త్వరలో ఇది ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.

హిందీ అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.

read more " మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదల "

5, జులై 2024, శుక్రవారం

The Wine House ఇంగ్లీష్ పుస్తకం విడుదల


ఈరోజు మా క్రొత్తపుస్తకం The Wine House విడుదలౌతున్నది. ఇది మా సంస్థ నుండి వెలువడుతున్న 65 వ పుస్తకం.

ఇది నా తెలుగు పుస్తకం 'మధుశాల' కు ఇంగ్లీష్ అనువాదం. తెలుగుపుస్తకం మంచి పాఠకాదరణను పొందింది. అందుకని దానిని ఇంగ్లీష్ లోకి అనువాదం చేద్దామన్న సంకల్పం కలిగింది.

కేవలం రెండునెలల లోపే 'మధుశాల' ను ఇంగ్లీష్ లోకి అనువాదం చేసిన నా శిష్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  అంతేకాదు, ఈ పుస్తకం హిందీ అనువాదం కూడా అయిపోయింది. పదిరోజులలో అది కూడా मधुशाला అనే 'ఈ బుక్' గా హిందీరాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.

నా పుస్తకాలన్నీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడుభాషలలోనూ వస్తాయని ఇంతకు ముందు చెప్పాను. అది నేడు The Wine House తో మొదలుపెట్టబడింది.

ప్రస్తుతం 'ఈ-బుక్' గా విడుదల అవున్నప్పటికీ, త్వరలో ఇది ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.

ఏకాంత ధ్యానసాధనను ఇష్టపడేవారికి ఈ పుస్తకంలోని 140 చిన్నికధలు ఎంతో సహాయపడతాయి. అంతేకాదు, నా ఫిలాసఫీ మొత్తం ఈ పుస్తకంలో అతి తేలికమాటలలో చెప్పబడింది. ప్రయత్నించండి.

read more " The Wine House ఇంగ్లీష్ పుస్తకం విడుదల "

24, జూన్ 2024, సోమవారం

ప్రపంచ యోగ దినోత్సవం - 2024

జూన్ 21 2024 న వేసవి అయనాంతపు రోజు. ఆ రోజున  ప్రపంచమంతా యోగదినోత్సవాన్ని జరుపుకుంది. పంచవటి సాధనామార్గాన్ని అనుసరించేవారందరూ, ఆనాడు మా శైలిలో యోగవ్యాయామాన్ని చేసి ఈ పర్వదినాన్ని జరుపుకున్నారు. 

మాకిది ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే చేసే మొక్కుబడి తంతు కాదు. ఇది మా రోజువారీ దినచర్యలో భాగం.

యోగసాధనలో ఆసనాలు, ప్రాణాయామాలు మొదటిమెట్లు మాత్రమే. కనీసం వీటి విలువనైనా ప్రపంచం నేడు గుర్తిస్తోంది. రోగాలకు భయపడి కొందరైనా యోగాన్ని చేస్తున్నారు. కొంతలోకొంత నయం.

మన ప్రధానమంత్రి మోదీగారు మన దేశానికి చేసిన గొప్ప మేళ్లలో ఇదీ ఒకటి. మనం మర్చిపోతున్న మన విజ్ఞానాన్ని మనకు, ప్రపంచానికి గుర్తుచేసిన ఈ మహానుభావుడికి దేశం మొత్తం ఋణపడి ఉంది. కానీ ఆయనకు మనం ఓట్లు వెయ్యం. మెజారిటీ ఇవ్వం. మనకు మేలు చేసేవాడు మనకు అక్కర్లేదు. మనల్ని నాశనం చేసేవాళ్ళే మనకు కావాలి. వాళ్లనే గెలిపించుకుంటాం. నాశనమౌతూనే ఉంటాం. ఇది మెజారిటీ ఇండియన్స్ పరిస్థితి.

అదలా ఉంచితే, పంచవటి సభ్యులందరూ ఎవరి ఇళ్లలో వారు చేస్తున్న యోగసాధనా కొలేజ్ ను ఇక్కడ చూడవచ్చు. 






read more " ప్రపంచ యోగ దినోత్సవం - 2024 "

19, మే 2024, ఆదివారం

మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది

మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది ఇది నా కలం నుండి వెలువడుతున్న
64 వ పుస్తకం. ఆశ్రమం ప్రారంభించిన తర్వాత నేను విడుదల చేస్తున్న రెండవ పుస్తకం.

ఈ పుస్తకంలో 140 సంఘటనలు, సంభాషణలు ఉన్నాయి. అవి చిన్నవే. నిత్యజీవితంలో మనకు రోజూ ఎదురయ్యేవే. కానీ అవే మనల్ని ఆలోచింపజేస్తాయి. జీవితపు లోతులను స్పృశింపజేస్తాయి. వాటిలో ప్రధాన పాత్రధారి సాకీ. వీటన్నిటిలోనూ, సాకీ అడుగుతుంది. నేను చెబుతూ ఉంటాను. నేనెవరో మీకు తెలుసు.

ఈ ‘సాకీ’ ఎవరు?

ఉమర్ ఖయ్యాం పేరును వినని సాహిత్యపిపాసి ఉండడు. ఆయన వ్రాసిన "రుబాయత్" ను, దువ్వూరి రామిరెడ్డిగారు, ‘పానశాల’ అనే పేరుతో తెలుగులో పద్యాలుగా వ్రాశారు. అది చదవని సాహిత్యాభిమాని కూడా ఉండడు. ఇదే రుబాయత్ ను, హిందీకవి హరివంశరాయ్ బచ్చన్ ‘మధుశాల’ అనే పేరుతో హిందీలో వ్రాశాడు. హిందీ అభిమానులు దానిని తప్పకుండా చదివి ఉంటారు. పరమహంస యోగానంద గారు కూడా దీనిపైన వ్యాఖ్యానించారు.

ఉమర్ ఖయ్యాం స్వప్నసుందరి సాకీ. ఈ సాకీ అనే పాత్ర, మధుశాలలో మధువును పొసే అమ్మాయి. అనేకమంది కవులు అనేకవిధాలుగా సాకీని తీసుకున్నారు. ఒక మంచి స్నేహితురాలిని, ప్రియురాలిని, ఊహాసుందరిని, ఆత్మసహచరిని, సమాధిస్థితిలో కలిగే మత్తును, చివరకు దైవానుభూతిని కూడా ‘సాకీ’ అంటూనే కొందరు మార్మికవాదులు పిలిచారు.

ఏతావాతా, ఈ సాకీ, ఒక మానవవనిత కాదు. కల్పితభావన మాత్రమే. సాకీ అనే పేరులోనే ఏదో గమ్మత్తుంది. బహుశా మన 'సఖి' కి ఇది పార్సీ రూపమై ఉంటుంది. మన తెలుగుకవులలో కూడా ఎవరి సాకీ వారికుంది.

వారందరినీ వదిలేసి, ఉమర్ ఖయ్యాం స్వప్నసుందరిని నేను కాజేసినందుకు ఆయనకు క్షమార్పణలు చెబుతున్నాను. కాకపోతే, మేమంతా ఒకటే కాబట్టి, ఆయన ఏమీ అనుకోడనే నా భావన.

కవి చెప్పాలనుకున్నదానిని, కల్పితపాత్రల ద్వారా చెప్పడం, చెప్పించడం, సాహిత్యప్రక్రియలో సర్వసాధారణం. ప్రాచీన కవులందరూ అదే చేశారు. నేనొక కవినని చెప్పను గాని, నేనూ అదే చేశాను.

ఉమర్ ఖయ్యాం సాకీ ఎవరో అందరికీ తెలుసు. మరి, నా రచనలో ప్రత్యక్షమయ్యే ‘సాకీ’ ఎవరు? అని చాలామంది నా శిష్యులు, అభిమానులు అడిగారు. దీనికి జవాబును ఎలా చెప్పాలి?

నా నిత్యజీవితంలో ఎదురైన, ఎదురౌతున్న అనేక సంఘటనలలో పాత్రధారులైన మనుషులందరూ సాకీలే. వారిలో నా శిష్యులున్నారు, పరిచయస్తులున్నారు, స్నేహితులున్నారు. దారిలో ఎదురయ్యే సంబంధంలేని మనుషులున్నారు. అందరూ సాకీలే.

ఏమంటే, ప్రతివారినుంచీ నాకొక వెలుగు కనిపిస్తుంది. ఒక క్రొత్త దృక్కోణం గోచరిస్తుంది. ఒక క్రొత్త మెరుపు దర్శనమిస్తుంది. నేను నేర్చుకున్నదంతా జీవితం నుంచే నేర్చుకున్నాను. అవన్నీ వ్రాయాలంటే కొన్ని వేలున్నాయి. కానీ వాటన్నిటి సారం మాత్రం ఒకటే. వాటినే, దానినే, ఈ 140 చిన్న చిన్న సంభాషణలుగా ఈ పుస్తకంలో మీకందిస్తున్నాను.

నా మిగతా పుస్తకాలు చిక్కటి వేదాంతగ్రంధాలు. వాటి భాష చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇబ్బంది పెట్టవచ్చు కూడా. కానీ వాటిల్లో ఏముందో ఈ చిన్న పుస్తకంలో కూడా అదే ఉంది. చాలా తేలికైన భాషలో ఉంది.

చిక్కటి వేదాంతాన్ని అతి సులభమైన తేలికభాషలో చెప్పడం రామకృష్ణులు, జిల్లెళ్ళమూడి అమ్మగార్ల విధానం. మామూలు మాటలను కూడా అర్థంకాని కవితాధోరణిలో చెప్పడం జెన్ సాధువుల, మార్మికకవుల విధానం. ఈ పుస్తకంలో నేనీ రెంటినీ అనుసరించాను.

‘మధువు’ అనే పదానికి కొంచెం వివరణ అవసరం. మధువంటే తేనె. మధువంటే సారాయి. అదే విధంగా, మధువు అంటే బ్రహ్మానుభూతి కూడా. ఉపనిషత్తులలో ‘మధువిద్య’ అనే విద్య ఉన్నది. కనుక మధువు అనే పదానికి చాలా అర్థాలున్నాయి.

మధువంటే మనకందరికీ తెలిసిన సారాయి కాదు. మధువంటే అనుభూతి. ఆ అనుభూతి భౌతికం కావచ్చు, అంతరికం కావచ్చు. చాలాసార్లు అది అంతరికమైనదే అయి ఉంటుంది.

భావప్రపంచంలో లీనుడై కవి బాహ్యప్రపంచాన్ని మరచిపోతాడు. ఇంద్రియప్రపంచాన్ని అధిగమించిన యోగి మనుషులకు తెలియని ఏదో చోట తన ఆత్మను లీనం చేస్తాడు. సారాయికి బానిసైన చవకబారు మనిషి ఆ మత్తులో కొద్దిసేపు తన బాధలను మరచిపోతాడు. మౌలికంగా ఇవన్నీ ఒక్కటే అనడం సాహసమే అయినప్పటికీ, ‘మత్తు’గా ఇవన్నీ ఒక్కటే అని చెప్పాలి. ఆ మత్తు యొక్క గుణంలోనూ, జీవితానికి అదిచ్చే పరిణతిలోనూ తేడాలుండవచ్చు. కానీ మౌలికంగా చూచినపుడు, అన్నీ మత్తులే.

జీవితమే మధుశాల అనేది నా అభిప్రాయం. ఏమంటే, లౌకికులైనా, వేదాంతులైనా, సామాన్యులైనా, అసామాన్యులైనా, ఎవరైనా ఇక్కడ బ్రతకవలసినవారే. అందరికీ అదే రంగస్థలం. దీనిని విడచి ఎవరూ సాము చెయ్యలేరు. ఎవరికి కలిగే అనుభవాలైనా ఇక్కడనుంచే కలుగుతాయి. కనుక, దీనికంటే వేరే మధుశాల లేదని నా ఉద్దేశ్యం. దీనిని విడచి వేరే మధుశాలకు పోవలసిన పని కూడా లేదని నేనంటాను.

నీ నిత్యజీవితాన్ని విడచి, ఆధ్యాత్మికమంటూ వేరే ఎక్కడా లేదు. ఇదే నా అభిప్రాయం. జీవితాన్ని 50 ఏళ్లపాటు పరిశీలించినమీదట నేనీ నిశ్చితాభిప్రాయానికి వచ్చాను. ఇదే మాటను జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా అనేవారు.

ఇందులో నేనొక త్రాగుబోతుగా మీకు కనిపిస్తాను. సరదాగా నేను వేసిన నాటకాలలో చాలా పాత్రలు ధరించాను. అలాగే, ఇదికూడా ఒక పాత్ర. ఈ పాత్రపోషణ ద్వారా లోతైన జీవితసత్యాలను తేలికైన మాటలలో మీకు వివరించే ప్రయత్నాన్ని చేశాను. ఈ నాటకంలో నా సహపాత్రధారిణి సాకీ. నా జీవితంలో నాకెదురైన అందరూ సాకీలే. అసలు నా జీవితమే పెద్ద నాటకం.  అందులో అన్నీ పాత్రలే.

త్రాగుడును నేనస్సలు సమర్ధించను. మనిషి జీవితానికి అది అవసరమైనది కాదు. దాని జోలికి పోవద్దని మీకందరికీ సలహా ఇస్తాను కూడా. ఈ పుస్తకంలో చెప్పబడిన మధుసేవనం అంతర్మధనమే గాని, సారాయిని త్రాగడం కాదు.

జీవితమే మధుశాల. అందులో, మనకిష్టమైనవారు, మనతో వారి మనస్సును అరమరికలులేకుండా పంచుకునే వారు, ఆత్మీయంగా మనతో మాట్లాడేవారు, అందరూ సాకీలే. ఈ కోణంలో మాత్రమే మీరు ఈ పుస్తకాన్ని, ఇందులో కనిపించే సాకీని అర్థం చేసుకోవాలి.

జీవితంలో ప్రతి సన్నివేశమూ మనల్ని అలౌకికమైన అనుభూతి మత్తులో ముంచుతున్నపుడు వేరే మధువు యొక్క అవసరం మనకు ఏముంటుంది?

మనసు పెట్టి చదివితే, ఈ చిన్నపుస్తకం మీ జీవితాన్ని ఎంతో ఉన్నతంగా మార్చివేస్తుంది. ఈ మాట మాత్రం గట్టిగా చెప్పగలను.

ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నాకు తోడుగా ఉన్న నా శ్రీమతి సరళాదేవి,  శిష్యులు, శిష్యురాళ్ళు, అఖిల. లలిత, ప్రవీణ్, శ్రీనివాస్ చావలి లకు, పంచవటి సభ్యులందరికీ నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

సాకీలకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. వారెందరో ఉన్నారు, అందరి పేర్లూ వ్రాయలేను. అందుకే సాకీ పేరుతోనే వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

యధావిధిగా ఈ 'ఈబుక్' ఇక్కడ నుండి మీకు లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.
read more " మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది "

12, మే 2024, ఆదివారం

బ్లాగు పోస్టుల తొలగింపు

ఈ మధ్యన నా బ్లాగులో వ్రాతలను చాలావరకూ తగ్గించిన విషయం మీకందరికీ తెలుసు. దానికి కారణం ఆశ్రమ జీవితం.

అర్హులైనవారికి వ్యక్తిగత బోధన, సాధన మాత్రమే ప్రస్తుతం ఎక్కువౌతుంది. వ్రాతలు తగ్గుతాయి.

త్వరలో రాబోతున్న 'మహనీయుల జీవితాలు - జాతకవిశ్లేషణలు' అనే నా లేటెస్ట్ గ్రంధం దృష్ట్యా, ఇప్పటివరకూ నా బ్లాగులో ఉన్న మహనీయుల జాతక విశ్లేషణలనన్నింటినీ (దాదాపు నూరు పోస్టులను) తొలగిస్తున్నాను.

గమనించండి. 

read more " బ్లాగు పోస్టుల తొలగింపు "

21, ఏప్రిల్ 2024, ఆదివారం

UAE లో విపరీత వర్షాలు వరదలు - హిందూ దేవాలయ ప్రతిష్ఠాపనా మహత్యమా?

'బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ' అని  మనకొక సామెతుంది. 'కోడలు అడుగుపెట్టినవేళ' అని కూడా ఇంకొకటుంది. అంటే, కొంతమంది ఇంటిలో అడుగుపెడితే, మంచో చెడో కొన్ని సంఘటనలు తప్పకుండా జరుగుతాయని అర్ధం. ఈ సామెతల వెనుక చాలా అనుభవము, పరిశీలన, చరిత్ర ఉన్నాయి. ఇవన్నీ నిజాలే. 

మన పల్లెటూరి సామెతలను మనం ఏమాత్రమూ నమ్మం. కానీ ఇంగ్లీష్ వాడొచ్చి, Coming events cast their shadows అంటే మాత్రం 'అబ్బా  ఎంత బాగా చెప్పాడో తెల్లోడు?' అని తెగ మురిసిపోతాం. మన సారాయి అయినా సరే, తెల్లసీసాలో ఉంటే దాని విలువ ఒక్కసారిగా మారిపోతుంది మరి !

అలాంటిదే 'UAE లో విపరీత వర్షాలు వరదలు' అనే న్యూస్.

ఏడాది మొత్తం ఎంత వర్షం పడుతుందో అంతకు ఒకటిన్నర రెట్ల వర్షం ఒక్క రోజులో అక్కడ పడింది. దుబాయ్ విమానాశ్రయమూ, సిటీ అన్నీ నీళ్లలో మునిగిపోయాయి. ఇదంతా ఇప్పటిదాకా UAE చరిత్రలో లేదు.

క్లౌడ్ సీడింగ్ చెయ్యడం వల్లే ఈ వర్షాలని కొందరంటే, ఉత్త క్లౌడ్ సీడింగ్ ఒక్కటే ఇంత పని చెయ్యలేదు, మారుతున్న వాతావరణం కూడా కారణమని మరికొందరి మాట ! 

ఇదంతా ఇలాగుంటే, దుబాయ్ లో హిందూదేవాలయం కట్టడం వల్లే ఈ వర్షాలు వరదలు వచ్చాయని కొందరు తురుష్కులు తెగ బాధపడిపోతున్నారని ఉవాచ.

దానికి మనవాళ్ళు, 'ఇంకా మరిన్ని హిందూ దేవాలయాలు కట్టండి. నెలకొక వర్షం చొప్పున వర్షాలు పడి మిడిల్ ఈస్ట్ అంతా సస్యశ్యామలం అవుతుంది' అని సలహాలిస్తున్నారు.

నిజమే కదా. మొన్న ఫిబ్రవరిలో అక్కడ హిందూదేవాలయం కట్టబడింది. వేదఘోష అక్కడ ప్రతిధ్వనిస్తున్నది. మరి వర్షాలు పడకుండా ఎలా ఉంటాయి? రెండు నెలలు తిరక్కుండా, ఆ దేశాల చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత వర్షం పడింది. దీన్నేమనాలి మరి ! 

ఈ మొత్తం విషయానికి మన పురాణాలతో లింకుంది.

సీతాన్వేషణలో లంకా నగరానికి వెళుతుంటే సముద్రం అడ్డుగా ఉందని, దానిని ఎండగట్టడానికి ఆగ్నేయాస్త్రం ప్రయోగించబోయాడు శ్రీరామచంద్రుడు. దానికి సముద్రుడు గడగడలాడి, వేదవిరోధులు, ధర్మవిరోధులు ఉన్న వాయవ్యదిశగా దానిని ప్రయోగించమని సూచించి, లంకకు వెళ్ళడానికి దారినిచ్చాడు. మనకు వాయవ్యమంటే భూమికి మిడిల్ ఈస్ట్ అవుతుంది. శ్రీరాముని ఆగ్నేయాస్త్ర ప్రభావం చేత సౌదీ ప్రాంతాలలో అంతా చెట్లూ చేమలూ నశించి ఎడారిగా మారిపోయింది. ఇది పురాణవచనం. ఇదంతా రామాయణంలో రికార్డ్ కాబడి ఉంది.

ఇన్ని వేల ఏళ్లకు మళ్ళీ మన దేవాలయం అక్కడ కట్టబడటం వల్ల మళ్ళీ ఆ ప్రాంతానికి శాపవిమోచనం కలిగి, శ్రీరాముని ఆగ్నేయాస్త్ర ప్రభావం నశించి, అక్కడ వర్షాలు పడుతున్నాయని మరికొందరి ఊహ. ఈ ఊహ చాలావరకూ సత్యానికి దగ్గరగానే ఉంది.

అజ్ఞాతవాస సమయంలో పాండవులు ఎక్కడ దాక్కున్నారో తెలుసుకోవడానికి దుర్యోధనుడు ఒక ప్లాను వేస్తాడు. ధర్మరాజు సత్యాన్ని తప్పడు గనుక, ఆయన ఎక్కడుంటే అక్కడ నెలకు నాలుగు వానలు ఖచ్చితంగా పడతాయి గనుక, ఏ రాజ్యంలో (ఏ రాష్ట్రంలో) వర్షాలు సక్రమంగా పడుతూ, పంటలు బాగా పండుతూ, ప్రజలు సుఖసంతోషాలతో హాయిగా ఉన్నారో అక్కడ పాండవులు దాక్కున్నారని భావించాలని ఆయన సహచరులు ఆయనకు సలహా ఇస్తారు. ఇదీ నిజమే ! ఇదంతా లాజికల్ గానే ఉంటుంది.

ఎక్కడ దేవాలయాలు, దేవతా విగ్రహాలు కూలగొట్టబడతాయో అక్కడ వర్షాలు పడవని, పంటలు పండవని, కరువు కాటకాలు తాండవిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దీనికి నిదర్శనాలు ఎన్నో చరిత్రలో మనకు కనిపిస్తాయి. భారతదేశాన్ని ఏకచత్రాధిపత్యంగా 50 ఏళ్లపాటు పరిపాలించి, లెక్కలేనన్ని దేవాలయాలను కూలగొట్టిన ఔరంగజేబు, చివరకు తన సైన్యానికే కాదు, తన బాడీగార్డ్స్ కు కూడా నెజీతాలు  ఇవ్వలేని కటిక నిరుపేద పరిస్థితిలో చనిపోయాడు. అతను రాసిన చివరిలేఖలో ఇది స్పష్టంగా ఉంది.

ఇప్పుడు మన కాంగ్రెస్ వాదులకు, లెఫ్టిస్ట్ లకు, నాస్తికులకు, హేతువాదులకు ఒక ధర్మసందేహం వస్తుంది.

'ఇదంతా నిజమైతే, మరి హైదరాబాద్ లో నీటికరువు ఎందుకు రాబోతోంది? కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే ఎందుకు వచ్చేసింది?బెంగుళూర్ లో బిందెడు నీటికి కొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చేసింది. జనాలంతా మాల్స్ కి వెళ్లి అక్కడ టాయిలెట్స్ లో స్నానాలు చేస్తున్నారు. ఇదంతా ఎవరి శాపం? ఏ అస్త్రం ప్రభావం? చెప్పండి?' అని వారు అడుగుతారు.

దానికి మన దగ్గర ఆన్సర్ రెడీ గా ఉంది.

ఇదంతా కాంగ్రెసాస్త్ర ప్రభావం. కమ్యూనిష్టాస్త్ర ప్రభావం. బీజేపీతో విభేదించే పార్టీ అస్త్రాల ప్రభావం.

దేశాభివృద్ధిని ముఖ్యంగా  చూడకుండా, సరిహద్దు రక్షణను ప్రధానంగా చూడకుండా, కులమతాలను రెచ్చగొట్టి, ఉచితపథకాలను అమలుచేస్తూ, దేశాన్ని  ప్రాంతాల పరంగా చీల్చి, అప్పుల ఊబిలోకి నెట్టి, లా అండ్ ఆర్డర్ ను నీరుగార్చి, వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేసిన ఘనత ఈ ప్రభుత్వాలదే. అందుకే ఈ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనే నీటి కరువు వచ్చింది. అవి అల్లకల్లోలాలు అవుతున్నాయి.

మరోప్రక్కన, యోగి ఆదిత్యనాధ్ వంటి నిజమైన మహనీయులు పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతూ, అప్పులరాష్ట్రం అనే బిరుదు నుండి బయటపడి, బడ్జెట్ సర్ ప్లస్ రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. 

ప్రపంచదేశాల మధ్యన 75 ఏళ్ళనుంచీ నవ్వులపాలౌతున్న భారతదేశం, మోదీగారి రామరాజ్య పరిపాలనలో కేవలం 8 ఏళ్లలో ఊహించలేని అభివృద్ధిని సాధించి, అగ్రదేశాలతో సమానంగా గర్వంగా తల ఎత్తుకుని నిలబడే స్థితిలో నేడు ఉంది.  ఇదే సమయంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం కూడా జరిగింది. ఇదంతా కాకతాళీయం ఎలా అవుతుంది? 

ధర్మస్వరూపుడైన శ్రీరాముని దేవాలయం ఉన్నచోట, ప్రజలు ధర్మాన్ని తప్పకుండా ఉన్నచోట, ప్రకృతి కూడా తన ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తుంది. వర్షాలు ఖచ్చితంగా పడతాయి. ఇది తిరుగులేని సత్యం ! ఇప్పుడు UAE లాంటి దేశాలలో కూడా ఇది రుజువైంది.

ఇప్పుడు చెప్పండి. ఏ శాపం వల్ల కర్ణాటకలో నీళ్లు లేని పరిస్థితి వచ్చింది? తెలంగాణాలో ఎందుకు ఇప్పటికే రాబోతోంది? ఏ పార్టీ ప్రయోగించిన అస్త్రాలివి? ధర్మస్వరూపుడైన శ్రీరాముడిని, శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ద్వేషించే ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో వర్షాలు ఎలా పడతాయి? అవి సస్య శ్యామలంగా ఎలా ఉంటాయి?

రామబాణం మహిమ అంటే ఇలా ఉంటుంది. అది రాక్షసభూములను ఎడారిగా మార్చగలదు. బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాపపడితే, ఎడారిలో కూడా వర్షాలను కురిపించగలదు.   UAE ఉదాహరణ చాలదా? ఇంకా చాలకపోతే మరిన్ని ఉదాహరణలు భవిష్యత్తులో చూద్దురుగాని సిద్ధంగా ఉండండి !

'గ్రహబలమేమి రామానుగ్రహ బలము గాని? (What can planets do if there is Lord Rama's grace?)'  అని త్యాగరాజస్వామి వంటి మహనీయులు ఊరకే అన్నారా?

read more " UAE లో విపరీత వర్షాలు వరదలు - హిందూ దేవాలయ ప్రతిష్ఠాపనా మహత్యమా? "

1, ఏప్రిల్ 2024, సోమవారం

విజయవంతంగా ముగిసిన 3 వ సాధనా సమ్మేళనం




గత మూడురోజులపాటు మా చండ్రపాడు ఆశ్రమంలో జరిగిన మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ నిన్న విజయవంతంగా ముగిసింది. 

పాత క్రొత్త శిష్యులందరూ మూడు రోజులపాటు ఆశ్రమంలో ఉండి, వారి  జీవితానికి మరింత నిండుదనాన్ని అద్దుకుని, ఆనందంతో నిండిన మనసులతో వారివారి ఇండ్లకు తిరిగి వెళ్లారు.

క్రొత్తవారికి పంచవటి సాధనామార్గంలో ప్రాధమిక దీక్షనివ్వడం జరిగింది. పాత శిష్యులకు ఉన్నతస్థాయికి చెందిన యోగసాధనా మార్గాలను ఉపదేశించడం జరిగింది.  పంచవటి సాధనా మార్గంలో పాటించవలసిన నియమాలను, విధివిధానాలను, జీవితంలో తెచ్చుకోవాల్సిన మార్పులను వారికి స్పష్టంగా వివరించడం జరిగింది.

దేహాన్ని నిర్లక్ష్యం చెయ్యడం ఎంతమాత్రమూ మా విధానం కాదు. కనుక, మా యోగసాధనా మార్గాన్ని అనుసరిస్తూ, గత రెండు నెలలలో 15 కేజీలనుండి 5 కేజీల వరకూ ఆరోగ్యవంతంగా బరువును తగ్గినవారికి బహుమతులు ఇవ్వడం జరిగింది.

అదేవిధంగా, బరువు పెరగవలసిన కేటగిరీలో, 4 నుండి 9 కేజీల వరకూ బరువు పెరిగిన వారికి కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది.

జ్యోతిష్యశాస్త్రపు లోతుపాతులను అందరికీ పరిచయం చేస్తూ, 1887 BCE కి చెందిన గౌతమబుద్ధుని అసలైన జాతకచక్రాన్ని వారికి వివరించడం జరిగింది. నా విశ్లేషణా విధానాన్ని బుద్ధుని జాతకచక్రం యొక్క విశ్లేషణతో వారికి అర్ధమయ్యేలా వివరించడం జరిగింది. బుద్ధుని యొక్క ఈ అసలైన జననతేదీని వెలుగులోకి తెచ్చినవారు ప్రఖ్యాత భారతీయ చరిత్ర పరిశోధకులు కోట వెంకటాచలం గారు.

త్వరలో వెలువడబోతున్న 'మహనీయుల జాతకాలు - జీవిత విశ్లేషణలు' అనే 500 పేజీల మా జ్యోతిష్యశాస్త్ర పరిశోధనా గ్రంధంలో ఈ జాతక విశ్లేషణను మీరు చూడవచ్చు.

ఇకపోతే, పదేళ్ళనుండీ నేను చెబుతూ వస్తున్న రీతిలోనే మా ఆశ్రమం నేడు ఎదుగుతున్నది. అసలైన హిందూమతాన్ని కులానికతీతంగా ఆచరణాత్మకంగా అందరికీ బోధిస్తూ, అజ్ఞానపు మురికిని వదిలిస్తూ, శిష్యుల దేహ-ప్రాణ-మానసిక స్థాయిలను సరిచేస్తూ, ఆధ్యాత్మిక మార్గదర్శనం ద్వారా నిజమైన హిందువులను, నిజమైన మనుషులను తయారు చేస్తూ,  అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది.

తిరిగి, మూడు నెలల తర్వాత, జూలైలో వచ్చే నా పుట్టినరోజు సందర్భంగా గురుపూర్ణిమా రిట్రీట్ జరుగుతుంది. ఇప్పటివరకూ ఉపదేశించిన సాధనలలో మంచి పరిపక్వతను అందుకుని, అసలైన హిందువులుగా అసలైన యోగులుగా తయారై ఆ రిట్రీట్ కు రావలసిందిగా శిష్యులనందరినీ కోరుతున్నాను.

క్రొత్తగా మా వద్ద దీక్షాస్వీకారం చేసి మా సాధనామార్గంలో నడవాలనుకునేవారు ఈ క్రింది 5 పుస్తకాలను తప్పకుండా చదివిన తర్వాత మాత్రమే మమ్మల్ని సంప్రదించగలరు. లేనిచో మా మార్గంలో ప్రవేశం లభించదు. గమనించండి.

1. శ్రీవిద్యా రహస్యం

2. లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక

3. తారా స్తోత్రం

4. ధర్మపథం

5. వెలుగు దారులు లేదా MUSINGS

read more " విజయవంతంగా ముగిసిన 3 వ సాధనా సమ్మేళనం "

8, మార్చి 2024, శుక్రవారం

శివరాత్రి అంతరార్ధం

కాదేదీ వ్యాపారానికనర్హం

శివరాత్రి నవరాత్రి

సంకురాత్రి తొలిరాత్రి

ఏదైనా సరే


వాళ్ళు చూద్దామా అంటే ...


శివరాత్రి వైపు జనాన్ని పోనివ్వకుండా

'దేవుడితో ఒక రాత్రి' అంటాడొకడు

నవరాత్రులు చేసుకోనివ్వకుండా

'దేవతతో ఒక రాత్రి' అని ఆహ్వానిస్తాడొకడు


శివరాత్రి అంటే

రాత్రంతా డాన్సులంట

'దేవుడితో ఒక రాత్రి' అంటే

రాత్రంతా ఛాన్సులంట

కాదేదీ వ్యాపారానికనర్హం


పోనీ వీళ్ళు చూద్దామా అంటే...


శివరాత్రి అంటే

శివుడికి నీళ్లు పోస్తారంట

వీళ్ళు పోసుకోవడం ఎప్పుడో?


శివరాత్రి అంటే

జాగారం చేస్తారంట

జాగృతం ఎప్పుడో?


శివరాత్రి అంటే

ఉపవాసం ఉంటారంట

సహవాసం ఎప్పుడో?


శివరాత్రి అంటే

పూజలు చేస్తారంట

పూనకం ఎప్పుడో?


శివరాత్రి అంతరార్ధం

ఎవరికి కావాలి?

అసలు శివరాత్రి ఎలా జరపాలో

ఎవరికి తెలియాలి?


కాదేదీ వ్యాపారానికనర్హం

శివరాత్రి నవరాత్రి

సంకురాత్రి తొలిరాత్రి

ఏదైనా సరే

read more " శివరాత్రి అంతరార్ధం "

7, మార్చి 2024, గురువారం

మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ (ఈ నెల 29, 30, 31 తేదీలలో)

ఎన్ని ప్రవచనాలు వినినా, ఎన్ని పుస్తకాలను చదివినా, ఎన్ని యూట్యూబ్ వీడియోలు చూచినా, ఎన్ని కబుర్లు చెప్పినా, అసలైన ఆధ్యాత్మికమార్గంలో ప్రాక్టికల్ గా నడవనిదే దమ్మిడీ ఉపయోగం కూడా ఉండదు. మిగతావన్నీ టైం వేస్ట్ పనులు మాత్రమే.

ఇది సత్యం.

అందుకే 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ఉద్భవించింది. తపన ఉన్న జిజ్ఞాసువులకు, సాధకులకు అసలైన ఆధ్యాత్మికలోకపు దారులు చూపిస్తుంది. నడిపిస్తుంది.

అందుకే ఈ ఆహ్వానం.

ఈ నెల 29, 30, 31 తేదీలలో మా ఆశ్రమంలో మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ (పంచవటి సాధనా సమ్మేళనం) జరుగుతుంది.

ఈ మూడు రోజులు, ఉదయం 4 నుండి రాత్రి 7 గంటల వరకు. మధ్యాహ్నం భోజనవిరామం తప్ప, మిగిలిన సమయమంతా వివిధరకాల సాధనలలో మీరు సమయాన్ని గడపవలసి ఉంటుంది. ఆ వివరాలన్నీ, ఇక్కడకు వచ్చిన తర్వాత చెప్పబడతాయి. నేర్పబడతాయి.

ఎదురుచూస్తున్నవారికి ఇదే ఆహ్వానం.

ఈ రిట్రీట్ లో రెండు విభాగాలు ఉంటాయి.

ఇప్పటివరకూ ఆశ్రమానికి రాని క్రొత్తవారికి, మొదటిరోజున అంటే మార్చి 29 తేదీన, అవగాహనా సమ్మేళనం ఉంటుంది.  ఈ ఒక్క రోజు మాత్రమే వారికి ఆశ్రమంలో మాతోబాటు ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పంచవటి సాధనామార్గం గురించి వారికి వివరించబడుతుంది. మీ మీ సందేహాలను తీర్చుకునే అవకాశం కలుగుతుంది.

పాతవారికి మరియు గతంలో అటెండ్ అయినప్పటికీ, దీక్షాస్వీకారం చెయ్యని క్రొత్తవారికి ఈ సారి ఆశ్రమంలో  మూడు రోజులు ఉండే అవకాశం ఇవ్వబడుతుంది. వారు సీనియర్ సభ్యులతో కలసి మూడు రోజులు ఆశ్రమంలో ఉండవచ్చు, కలసి సాధనలు చెయ్యవచ్చు. మా మార్గం యొక్క లోతుపాతులను మీ శక్తిమేరకు గ్రహించవచ్చు.

ఆశ్రమంలో మినిమమ్ సౌకర్యాలు మాత్రమే ఉంటాయి. కంఫర్ట్స్ ఉండవు. వేసవి ఎండలు బాగా ఉంటాయి. వాటికి తట్టుకునే సంసిద్ధత ఉన్నవారు మాత్రమే రాగలరు. ఆశ్రమంలో ఉన్నపుడు ఆశ్రమ నియమాలను పాటించవలసి ఉంటుంది. మీరు ఏవైనా మందులను వాడుతూ ఉంటే, వాటిని తెచ్చుకోవడం మరచిపోకూడదు. 

రాదలచుకున్నవారు 98493 - 89249 అనే నంబర్ లో పంచవటి ఫౌండేషన్ సెక్రటరీ శ్రీ రామమూర్తి గారిని సంప్రదించగలరు.

read more " మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ (ఈ నెల 29, 30, 31 తేదీలలో) "

27, ఫిబ్రవరి 2024, మంగళవారం

R.I.P Pankaj Udhas




నిన్న పంకజ్ ఉదాస్ చనిపోయాడు. ఈయన 72 ఏళ్ళు బ్రతికాడు. కొద్ది నెలలుగా పాంక్రియాస్ కేన్సర్ తో బాధపడుతున్నాడు.

ఘజల్స్ పాడటంలో ఈయనదొక ప్రత్యేకశైలి.  ఈయన తండ్రిగారు, ఇద్దరు అన్నలు ఆందరూ గాయకులే. వీరిది గుజరాత్ లోని రాజకోట్ దగ్గరలో ఒక జమీందారీ కుటుంబం. ఫరీదా అనే పార్శీ వనితను ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

ఈయన మే 17, 1954 న గుజరాత్ లో పుట్టాడు. ఈయన జనన, మరణ జాతకాలను ప్రక్కన చూడవచ్చు. 

ఈయన గాయకుడే  గాక, తబలా, వయోలిన్, పియానో, గిటార్ లను వాయించడంలో ప్రావీణ్యం ఉన్న బహుముఖ కళాకారుడు.

ఈయన పౌర్ణమినాడు పుట్టాడు. రాహుకేతువులు నీచ స్థితులలో ఉన్నారు. వేరే కులం, వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వివాహజీవితం బాగానే నడిచింది.

ఈ రెండు చార్ట్ ల పరిశీలన కొన్ని జ్యోతిష్య రహస్యాలను తెలియజేస్తుంది.

ఈయన వివాహజీవితం, కెరీర్, చివరకు పాంక్రియాస్ కేన్సర్ ఇవన్నీ ఈ చార్ట్ లు  స్పష్టంగా చూపిస్తున్నాయి.

read more " R.I.P Pankaj Udhas "

21, ఫిబ్రవరి 2024, బుధవారం

మీ దగ్గర చేతబడి ఉందా?

హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగిసింది.  అన్ని స్టాల్స్ లాగే మా స్టాల్ కూడా మూసేసి ఇంటిదారి పట్టాము.

'ఎలా ఉంది ఈ పదిరోజుల అనుభవం?' మూర్తిని ఫోన్ లో అడిగాను

'చాలా దారుణంగా ఉంది. ఒక పక్కన ఎండలు, మరోప్రక్కన జనాల విచిత్ర మనస్తత్వాలు, మైండు బ్లాంక్ అయిపొయింది' అన్నాడు.

ఈసారి కూడా మాకు పడమర వైపు స్టాలే వచ్చింది. మధ్యాహ్నం నుండి అందరికీ ఎండ పేలగొట్టింది.

'ఏమైంది? వింతమనుషులందరూ కనిపించారా?' అడిగాను.

'అవును. చాలామంది మాకు బోధలు చెయ్యడానికే స్టాల్ దగ్గరకు వచ్చినట్లుగా ఉన్నారు' అన్నాడు.

'ఇప్పుడు అందరూ యూట్యూబ్ యూనివర్సిటీ పీ హెచ్ డీ లే. అందులో చూడటం, ఇక కనిపించిన వారికందరికీ బోధలు చెయ్యడం. ఇదే ప్రస్తుతం నడుస్తున్నది' అన్నాను.

'కొందరైతే, 'ఈయనొక క్రొత్త గురువా? ఇప్పటికి ఉన్నవాళ్లు చాలరా? ఈయనను మేమెందుకు నమ్మాలి? రామాయణం భారతాలలో లేనిది క్రొత్తదేమైనా ఈయన చెబుతున్నాడా? అవి చాలవా? కొత్తకొత్తవి ఎందుకు?' అన్నారు.

'రామాయణ భారతాలకంటే ముందు వేదాలున్నాయి. మరి వేదాలలోనే అంతా ఉంది కదా? ఇవెందుకు?' అని నువ్వు అడిగి ఉండాల్సింది' అన్నాను.

మరి కొంతమంది, 'బుద్ధుడు మాకు నచ్చడు' అంటూ ధమ్మపదం పుస్తకాన్ని అటూ ఇటూ తిప్పి అవతలపడేశారు' అన్నాడు.

'అవును. సాంప్రదాయ చాదస్తపు హిందువులకు బుద్ధుడు నచ్చడు. మనకు నచ్చుతాడు. మనకే కాదు, బుద్ధుని తత్త్వాన్ని అర్ధం చేసుకుంటే ఎవరికైనా నచ్చుతాడు' అన్నాను.

ఇంకొకాయనైతే మీ ఫోటోను చూస్తూ, ' నేనుకూడా ఇలా ఒక గ్రూపు మెయింటెయిన్ చేద్దామని చాలాకాలం నుండి అనుకుంటున్నాను. కుదరడం లేదు. ఈ లోపల ఎవరు పడితే వాళ్ళు ఆశ్రమాలు పెట్టేస్తున్నారు' అంటూ తెగ ఫీలై పోయాడు. తన జెలసీని కనీసం లోపల దాచుకోవడం కూడా అతనికి కుదరడం లేదు' అన్నాడు మూర్తి.

'పాపం ! అంత కుతకుత ఉందన్నమాట లోపల. కూల్ డ్రింక్ ఒకటి ఆఫర్ చెయ్యకపోయావా. కొంచెం చల్లబడేవాడు' అన్నాను.

'ఒకామె అయితే, 'నేను గురువుల దగ్గరకు వెళ్ళను. వాళ్లే నన్ను వెతుక్కుంటూ రావాలి' అంది మన స్టాల్ దగ్గర కొచ్చి.' అన్నాడు మూర్తి.

'చాలా కరెక్ట్ గా చెప్పింది. ఎవడికి అవసరమైన దానిని వాడు వెతుక్కుంటాడు, తప్పేముంది?' అన్నాను.

'ఇంకొకడైతే రావడం రావడం 'చేతబడి ఉందా?' అని అడిగాడు. కనీసం 'చేతబడి మీద బుక్స్ ఉన్నాయా' అని కూడా అడగలేదు. 'చేతబడి ఉందా' అంట, ఐస్ క్రీమ్ ఉందా అన్నట్టు' అన్నాడు మూర్తి.

'లోపలుంది పిలుస్తా ఉండండి' అని మన రమేష్ ని పిలిచి ఉండాల్సింది. వాడికి స్పాట్లో చేతబడి చేసి ఉండేవాడు' అన్నాను.

'మరీ ఇంత దరిద్రంగా ఉన్నారేంటి మనుషులు?' మూర్తికి అనుమానం వచ్చింది.

'అంతే. 'పాపట్లో నెరిసిన తర్వాత పాప పతివ్రత అయింది' అని సామెతుంది. అలాగే, అన్ని రకాలుగా భ్రష్టు పట్టిన తర్వాతే ఆధ్యాత్మికంలోకి వస్తారు. అదంతే' అన్నాను.

' అసలైన తత్త్వం ఎవరూ అడగడం లేదు. ఎవరిని చూసినా, పూజలు, మంత్రాలు, కుండలిని, తంత్రం, రెమెడీలు, క్షుద్రవిద్యలు, ఇదే గోల ! ఇదేం ఖర్మ గురూజీ. లోకం ఇలా తయారైంది?' అన్నాడు 

' ఇలాగే ఉంటుంది. అసలు విషయం చెప్తా విను. ఆధ్యాత్మికులమని చెప్పుకునేవారిలో 50 శాతం మంది నిజానికి మెంటల్ పేషంట్లు, వారికి సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్లకు ట్రీట్మెంట్ అవసరం. మరొక 45 శాతం మంది విజ్ఞానప్రదర్శకులు, మోసగాళ్లు. ఆ 50 మందిని ఈ 45 మంది మోసం చేస్తుంటారు. ఎక్కడో విని, లేదా చదివి, వీరికి చెబుతుంటారు. అనుభవం ఉండదు. వారికి ఆసరా కావాలి. వీరికి గొప్పలు కావాలి.  మిగతా ఒక్క అయిదు శాతం మాత్రమే నిజమైన జిజ్ఞాసువులు, సాధకులు ఉంటారు. ఎక్కడైనా ఇంతే' అన్నాను.

'ఆ అయిదు శాతం ఎక్కడుంటారు?' అడిగాడు.

'మన పంచవటిలో ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే, బయట అంతా నకిలీనే. కాకపోతే ఆ 95 శాతం కూడా 'మేమే అసలైన వాళ్ళం ' అని చెబుతారు. అసలైన అయిదు శాతాన్ని నకిలీ అంటారు. అదే కలిమాయ' అన్నాను.

'అర్ధమైంది గురూజీ, మరి ఇదంతా తెలిసికూడా మాచేత స్టాల్ ఎందుకు పెట్టించారు?' అడిగాడు.

'జస్ట్ ఫర్ ఫన్. మెంటల్ పేషంట్లలో ఎన్ని రకాలుంటారో మీకు ప్రాక్టికల్ గా అర్ధం కావడం కోసం పెట్టించాను. ఈ పదిరోజులలో బాగా అర్థమైందా?' అడిగాను.

'అయింది, ఇప్పుడు మమ్మల్నేం చెయ్యమంటారు?'

'ఏమీ చెయ్యద్దు. జస్ట్ ఎంజాయ్ లైఫ్. కొన్నాళ్లపాటు హాయిగా వేళకు తిని, నిద్రపొండి. మళ్ళీ వచ్చే నెలలో మన స్పిరిట్యువల్ రిట్రీట్ ఉంది. దానికి రెడీ అవ్వండి' అని ఫోన్ కట్ చేశాను.

read more " మీ దగ్గర చేతబడి ఉందా? "

19, ఫిబ్రవరి 2024, సోమవారం

అబూదాబీలో అతిపెద్ద హిందూమందిరం - జయహో మోడీ జీ !

స్వామి నారాయణ్ సంస్థచేత నిర్మించబడిన అతిపెద్ద  హిందూమందిరం అబూధాబిలో ఈ నెల 14 న ప్రారంభం అయింది. ఇది మోడీజీ ప్రభుత్వపు ఘనవిజయాలలో మరొకటి

దీనిపేరు BAPS Hindu Mandir.

మోడీజీ ప్రభుత్వపగ్గాలు చేపట్టిన ఇన్నేళ్ళలో మన దేశచరిత్రను తిరగవ్రాస్తూ సాధించిన ఘనవిజయాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటినీ వ్రాస్తూ పోతే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది. గత 75 ఏళ్లుగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలు చేసిన దుర్మార్గాలను, అరాచకాలను, దేశద్రోహాలను సరిద్దుతూ ఈ విజయాలు సాగుతూ వస్తున్నాయి. 

అలాంటిదే ఈ విజయం కూడా !

ఒక అరబ్ దేశంలో హిందూదేవతలు అనేకమంది పూజింపబడే ఒక  అతి పెద్ద దేవాలయం కట్టబడటం ఊహకే సాధ్యం కాని పని. కానీ సాధ్యం అయింది.

గత వెయ్యేళ్ళుగా మన దేశంలోని వేలాది చిన్నా పెద్దా దేవాలయాలను తుర్కులు, అరబ్బులు, మొఘలులు, కూలగొట్టారు. మన గ్రంధాలను వేలాదిగా తగులబెట్టారు. లక్షలాదిమంది హిందువులను, ముఖ్యంగా బ్రాహ్మణులను, గురువులను చంపేశారు. చరిత్రలో వీటికి సాక్ష్యాలున్నాయి.

అటువంటిది చరిత్రలో మొదటిసారిగా ఒక అరబ్ దేశంలో హిందూదేవాలయం కట్టబడింది. ఇది కుహనా ముస్లిములకు, ముఖ్యంగా ఇండియా, బాంగ్లాదేశ్, పాకిస్తాన్ ముస్లిములలో చాలామందికి, ముఖ్యంగా జాకీర్ నాయక్ బ్యాచ్ కి అస్సలు మింగుడుపడదు. కానీ UAE ఒప్పుకుంది. వారి దేశంలో ఒక హిందూదేవాలయాన్ని ఆహ్వానించింది. అరబ్బులందరూ దుర్మార్గులు కిరాతకులు కారని ఈ విషయం రుజువు చేస్తున్నది. 

నిజానికి మతపిచ్చి, తీవ్రవాద క్రిమినల్ ధోరణులు అందరు ముస్లిమ్స్ లో ఉండవు.  ముల్లాలు, మౌల్వీలు, కాంగ్రెస్ పార్టీ సహాయంతో, ఇంకా కొన్ని ప్రాంతీయపార్టీల సహాయంతో ముస్లిములను రెచ్చగొడుతుంటారు. అంతేగాని ముస్లిములందరూ దుర్మార్గులు కారు. నా స్నేహితులలో ఎంతోమంది మంచి ముస్లిములున్నారు. వాళ్ళూ కొన్ని తరాల క్రితం హిందువులేగా. పేర్లు మార్చుకున్నా, DNA మారదుగా.

ఈ బృహత్తర ఆలయం గురించి కొన్ని వివరాలను చూద్దాం.

  • ఈ ఆలయం కట్టడానికి ప్రాసెస్ 1997 లో మొదలైంది.
  • 2019 లో 27 ఎకరాలను ఈ ఆలయనిర్మాణం కోసం ఇస్తూ UAE యువరాజైన షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యా ఒక ఆర్డర్ ఇచ్చాడు.
  • ఈ ఆలయనిర్మాణానికి కావలసిన గులాబీరంగు ఇసుకరాయిని రాజస్థాన్ నుంచి, మార్బుల్ ను ఇటలీ నుంచి తెచ్చారు.
  • బ్రిటన్, అమెరికా, ఇండియా, ఆఫ్రికా, గల్ఫ్, UAE ల నుండి 200 మంది వాలంటీర్లు ఈ నిర్మాణంలో పనిచేశారు.
  • ఈ ఆలయంలో 402 స్తంభాలున్నాయి. 
  • నగిషీలు చెక్కిన రాతిపలకలు 25,000 పైనే ఉన్నాయి.
  • ఈ ఆలయం ప్లాన్ వేసింది ఒక కాథలిక్ క్రిస్టియన్.
  • నిర్మాణ పర్యవేక్షణ చేసినది ఒక పార్సీ సంస్థ.
  • మే 2023 లో 30 దేశాల రాయబారులు ఈ ఆలయాన్ని దర్శించారు.
  • జనవరి 2024 లో 42 దేశాల ప్రతినిధులు ఈ ఆలయాన్ని దర్శించారు.
  • ఫిబ్రవరి 14, 2024 న ఒక వైదిక హోమం తో ఈ ఆలయం ప్రారంభమైంది.
  • నిన్నటినుంచి పబ్లిక్ కోసం తెరవబడింది.

వెయ్యి ఏళ్లుగా, మిడిల్ ఈస్ట్ దేశాల చేతిలో తన్నుడు, చంపుడు, విధ్వంసం, ఇవి మాత్రమే మనం చవిచూచాం. కానీ నేడు UAE లో మనదైన అతిపెద్ద దేవాలయాన్ని కట్టగలిగాం.

ఇది చరిత్రను తిరగవ్రాయడం కాదా ?

దేశద్రోహపార్టీలు ఏవైనా ఈ పనిని చేయగలిగాయా? అవి జాతీయ పార్టీలైనా సరే, ప్రాంతీయ పార్టీలైనా సరే.

ఇది మోదీజీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాలలో మరొకటి.

ఇప్పుడు చెప్పండి. వచ్చే ఎన్నికలలో మనం ఎవరిని ఎన్నుకోవాలి?

మన దేశప్రతిష్ఠను హిమాలయశిఖరాలపైన నిలబెట్టిన బీజేపీ నా?

దేశాన్ని ముక్కలు చేయాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్న ఇతర పార్టీలనా?

ఆలోచించండి.

read more " అబూదాబీలో అతిపెద్ద హిందూమందిరం - జయహో మోడీ జీ ! "