“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, ఏప్రిల్ 2016, శనివారం

Ye Dil Na Hota Bechara - Kishore Kumar



Ye Dil Na Hota Bechara

అంటూ కిశోర్ కుమార్ మధురంగా ఆలపించిన ఈ పాట 'Jewel Thief' అనే చిత్రంలోనిది.ఈ చిత్రం 1967 లో రిలీజైంది.దేవానంద్ తన నవకేతన్ ఫిలిమ్స్ పతాకం క్రింద దీనిని నిర్మించాడు.సోదరుడు విజయ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు.S.D.Burman తనదైన శైలిలో ఈ పాటకు మధురమైన బీట్ రాగాన్ని సమకూర్చాడు.

అమెరికా గడ్డ మీద నుంచి పాడిన రెండో పాట ఇది. నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి.

Movie:--Jewel Thief (1967)
Lyrics:--Majrooh Sultanpuri
Music:--S.D.Burman
Singer:--Kishore Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
----------------------

Hummm zoo zu zoo zoo zu zoozu
Dirideeyee yee -3

Yeh dil na hota bechara, kadam na hote aawara
Jo khubsurat koyee apana humsafar hota

Oho ho...

Yeh dil na hota bechara, kadam na hote aawara

Jo khubsurat koyee apana humsafar hota

Suna jabse jamane hain bahar ke
Ham bhee aaye hain rahee banke pyar ke
Koyee na koyee bulayega, khade hain ham bhee raaho me

Arey mana usko nahee mai pehchanta
Banda uska pata bhee nahee jaanta
Milna likha hain toh aayega, khade hain ham bhee raaho me

Uskee dhun me padega dukh jhelna
Seekha ham ne bhee pattharo se khelna
Surat kabhee toh dikhayega, pade hain ham bhee raaho me

Yeh dil na hota bechara, kadam na hote aawara
Jo khubsurat koyee apana humsafar hota

Oho ho

Yeh dil na hota bechara, kadam na hote aawara
Jo khubsurat koyee apana humsafar hota


Meaning

This heart, will never feel helpless
This step, will never go in vain
When a lovely soul happens to be
my co-traveler on the path

When the spring season entered the world
I came here as a traveller,full of love
Some one will certainly recognize me and call me
So, I am waiting on the path

Agreed, I dont know who she is
Alas..neither do I know her address
If fate wills, she will certainly come to me
So I am waiting on the path

In search of her, I have to suffer
In this process,I have to learn
how to play with stone-hearts
One day she will certainly show her face
So I am waiting on the path

When the spirng season entered the world
I came here as a traveller,full of love
Some one will certainly recognize me and call me
So, I am waiting on the path


తెలుగు స్వేచ్చానువాదం

ఈ హృదయం ఎన్నటికీ నిరాశకు లోనుకాదు
ఈ అడుగు ఎప్పటికీ వృధా కాబోదు
ఒక అందమైన సఖి నాకు తోడుగా
ఈ దారిలో ఉన్నంతవరకూ...

వసంతం ఈ లోకంలో అడుగుపెట్టినపుడు
నేనూ ఒక ప్రేమ బాటసారిగా ఈ లోకంలోకి వచ్చాను
ఎవరో ఒకరు నన్ను తప్పక గుర్తిస్తారు
ఎవరో ఒకరు నన్ను తప్పకుండా పిలుస్తారు
అందుకే ఈ దారిలో నేను వేచి ఉన్నాను

సరే !! ఆమెవరో ఇప్పటిదాకా నాకు తెలియదు
కనీసం ఆమె చిరునామా కూడా తెలియదు
కానీ నన్ను కలవాలని వ్రాసి ఉంటే
ఏదో ఒకరోజున తప్పకుండా ఎదురౌతుంది
అందుకే ఈ దారిలో నేను వేచి ఉన్నాను

తనకోసం నేనెంతో వెదకాలి
ఈ మార్గంలో ఎన్నో బాధలు పడాలి
ఈలోపల ఎంతోమంది రాతిగుండెలతో వేగాలి
కానీ ఏదో ఒకరోజున తను నాకు కనిపిస్తుంది
ఆ నమ్మకం నాకుంది
అందుకే ఈ దారిలో నేను వేచి ఉన్నాను

ఈ హృదయం ఎన్నటికీ నిరాశకు లోనుకాదు
ఈ అడుగు ఎప్పటికీ వృధా కాబోదు
ఒక అందమైన సఖి నాకు తోడుగా
ఈ దారిలో ఉన్నంతవరకూ...
read more " Ye Dil Na Hota Bechara - Kishore Kumar "

28, ఏప్రిల్ 2016, గురువారం

మా అమెరికా యాత్ర -5

శ్రీమతి పగడాల నాగమణిగారు నన్నూ నా కవితలనూ చాలా అభిమానించే మంచి వ్యక్తులలో ఒకరు.ఆమె TORI Online Radio లో ప్రయోక్తగా అనేక ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు.

26-4-2016 న TORI (Teluguone Radio.Com) రేడియోలో - భావవీచిక శీర్షిక క్రింద - నార్త్ కెరొలినా షార్లోట్ నుంచి శ్రీమతి పగడాల నాగమణి గారు - మే ఆరవ తేదీన పాంటియాక్ పరాశక్తి టెంపుల్ లో నేను ఇవ్వబోతున్న 'శ్రీవిద్యా రహస్యం' ప్రసంగం గురించి - శ్రీమతి ఆకెళ్ళ పద్మజ,శ్రీ ఆనంద్ కుమార్ లతో చేసిన రేడియో ఇంటర్వ్యూ  ప్రోగ్రాం ఈ లింక్ లో వినండి.


I am grateful to Smt.Nagamani Pagadala,Smt Padmaja Akella and Shri Anand Kumar (MIIndia.com) for their love and affection for me.I feel I am greatly honored.May the Great Mother bless these three souls is my prayer.
read more " మా అమెరికా యాత్ర -5 "

26, ఏప్రిల్ 2016, మంగళవారం

Ye Sham Mastani - Kishore Kumar



యే షామ్ మస్ తానీ మద్ హాష్ కియే జా... అంటూ కిషోర్ కుమార్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1970 లో వచ్చిన 'కటీ పతంగ్' అనే సినిమాలోది.ఇది కూడా కిషోర్ ఆలపించిన ఆల్ టైం హిట్స్ లో ఒకటి.అందుకే 46 ఏళ్ళు గడచినా ఇది ఈనాటికీ మరపురాని మధురగీతమే.

అమెరికా వచ్చాక ఆధ్యాత్మిక రసాస్వాదన ఎక్కువైంది. గానరసాన్ని కూడా ప్రవహింప చెయ్యమని అంతరాత్మ ప్రబోధించింది. నేను ఎప్పుడూ కూడా అంతరాత్మ మాటే వింటాను, మనుషుల మాట వినను గనుక, ఈ పాటను పాడి రికార్డ్ చెయ్యడం జరిగింది.

సో -- అమెరికా నేలమీద నుంచి పాడిన పాటల్లో ఇది మొదటిదన్న మాట.

వినండి మరి.

Movie:--Kati Patang (1970)
Lyrics:--Anand Bakshi
Music:--R.D.Burman
Singer:--Kishore Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------
Ye shaam mastaanee, madahosh kiye jaaye
Muze dor koee khinche, teree or liye jaaye

Door rahatee hain too, mere paas aatee nahee
Hothhon pe tere, kabhee pyaas aatee nahee
Ayesaa lage jaisai ke too, has ke jahar koee piye jaaye

Baat jab main karu, muze rok letee hain kyon
Teree mithhee najar, muze tok detee hain kyo
Teree hayaa, teree sharam teree kasam mere hothh siye jaaye

Yek ruthhee huyee, takadeer jaise koee
Khaamosh ayese hain too, tasaweer jaise koee
Teree najar, ban ke jubaan lekin tere paigaam diye jaaye

Meaning

This evening is lovely
It is intoxicating
An unseen string is pulling me
towards you

You like to keep away from me
and never come near
No thirst of passion
ever comes onto your lips
It seems you are really drinking poison
but laughing while doing it

When I talk to you, why do you stop me?
Your sweet looks, why do they reprimand me?
Your shyness,your delicacy
I swear, they leave me speech less

Like a sulking destiny
You are silent
silent like a picture
But your stare keeps calling me
towards you

This evening is lovely
It is intoxicating
An unseen string is pulling me
towards you

తెలుగు స్వేచ్చానువాదం

ఈ సాయంత్రం ఎంతో మనోహరంగా ఉంది
ఇది నన్ను మత్తులో ముంచుతోంది
ఏదో తెలీని బంధం
నన్ను నీవైపు లాగుతోంది

నువ్వెప్పుడూ దూరంగానే ఉంటావు
నా దగ్గరకు రానేరావు
నీ పెదవులకు ఎప్పుడూ దాహం వెయ్యదు
నిజానికి నువ్వు విషం త్రాగుతున్నావు
అయితే దాన్ని నవ్వుతూ త్రాగుతున్నావు

నేను నీతో మాట్లాడబోతే ఎందుకు నన్ను ఆపెస్తావు?
నీ తియ్యని చూపులు, ఎందుకు నన్ను మందలిస్తున్నాయి?
నీ సిగ్గు,నీ బిడియం
నా నోటిని కట్టేస్తున్నాయి

నిశ్శబ్దంగా ఉన్న విధిలాగా
చలనం లేని ప్రతిమలాగా
మౌనంగా నువ్వున్నావు
కానీ నీ చూపులే నాకు
మౌన సందేశాలను అందిస్తున్నాయి

ఈ సాయంత్రం ఎంతో మనోహరంగా ఉంది
ఇది నన్ను మత్తులో ముంచుతోంది
ఏదో తెలీని బంధం
నన్ను నీవైపు లాగుతోంది
read more " Ye Sham Mastani - Kishore Kumar "

మా అమెరికా యాత్ర - 4

"ఆధ్యాత్మికత ఇండియాలో కంటే ఇక్కడే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. నిజమేనా?" అని ఒకరు ప్రశ్నించారు.

"ఒక రకంగా చూస్తే నిజమే" - అన్నాను.

ఆధ్యాత్మికత అంటే ఎటు చూచినా గుడులూ గోపురాలూ ఉండటం కాదు.బొట్లు పెట్టుకుని వేషాలు వేయడం కాదు.పొద్దున్నే గుడికి వెళ్లి మొక్కడం కాదు.లేదా రోజూ స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవడమూ,స్తోత్రాలు చదవడమూ కాదు.ఇవి మాత్రమే నిజమైన ఆధ్యాత్మికత అని ఎవరైనా అంటే నాకు బాగా నవ్వొచ్చేస్తుంది.

అలా అనేవారికి ఆధ్యాత్మికత అంటే ఏమీ అవగాహన లేదని నా అవగాహన చెబుతోంది.

ఇవేవీ చెయ్యకుండానే నీవు ఆధ్యాత్మిక శిఖరాలను అందుకోవచ్చు.ఇవన్నీ చేస్తూకూడా నీవు ఆధ్యాత్మిక లోకపు పొలిమేరను కూడా ఇంకా చూచి ఉండకపోవచ్చు.రెండూ సాధ్యమే.

నిజమైన ఆధ్యాత్మికత అంటే - తనలోనూ తన చుట్టూ అందరిలోనూ అన్నింటిలోనూ దైవాన్ని ఫీల్ అవడం.ఆ స్థాయిలో అందరితోనూ డీల్ చెయ్యడం మాత్రమే. ఇదే నిజమైన ఆధ్యాత్మికత.

"ఆత్మవత్ సర్వభూతాని" (నీ ఆత్మవలె అందరినీ చూడు), "జీవో దేవస్సనాతన:" (ఈ జీవుడే ప్రాచీనుడైన దైవం), "సర్వం ఖల్విదం బ్రహ్మ:" (ఇక్కడున్న సమస్తమూ దైవమే) వంటి వేదవాక్యాలు ఈ భావాన్నే ఎలుగెత్తి చాటుతున్నాయి.కానీ అర్ధం చేసుకునే వారూ, ఆచరించేవారూ ఏరీ?

ఆధ్యాత్మికతకు అమెరికా అనీ, ఇండియా అనీ, భేదం ఏమీ లేదు.అది ఆకలి లాంటిది.ఆకలి ఎక్కడైనా వేస్తుంది.ఏ దేశంలో ఉన్నా వేస్తుంది.లేదా అది గాలి వంటిది.మనం బ్రతకాలంటే ఎక్కడున్నా సరే గాలిని పీల్చక తప్పదు.ఇదీ అంతే.

కాకుంటే కొన్ని భేదాలున్నాయి.

ఇండియాలో అయితే - సంపాదించడానికీ సుఖంగా బ్రతకడానికే మనిషి జీవితం అంతా ఆవిరైపోతుంది.ఒకవేళ డబ్బు అనేది చేతిలో ఉన్నప్పటికీ, అతని జీవితం సుఖంగా ఉంటుందని గ్యారంటీ ఏమీ లేదు.అన్ని వైపులనుంచీ ఎన్నో ఒత్తిళ్ళు అతనిమీద పడిపోతూ ఉంటాయి.పొద్దున్న లేచిన దగ్గరనుంచీ అతని జీవితంలో ఎంతోమంది అనవసరంగా జోక్యం చేసుకుంటూనే ఉంటారు. దేనిలోనూ ఒక పద్ధతీ పాడూ ఏమీ ఉండదు.ప్రతివాడూ రూల్సు ఇతరులకు చెబుతూ తాను మాత్రం అనుక్షణం వాటిని బ్రేక్ చేస్తూనే ఉంటాడు.

ప్రాధమికంగా చూస్తే - ఇండియాలో మనిషికి ఇన్సెక్యూరిటీ ఎక్కువ.భయం ఎక్కువ.ప్రతిదానికీ భయమే.ప్రతిదానికీ అపనమ్మకమే.ఏదీ గ్యారంటీ లేదు.న్యాయానికి తప్ప మిగతా అన్నిటికీ మనిషి అక్కడ భయపడుతూనే ఉంటాడు. అందుకే - మోసం కూడా అన్ని రంగాలలోనూ ఎక్కువే.ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడే స్వార్ధం ఉంటుంది.ప్రతివాడూ చెప్పేదొకటి చేసేదొకటి. అక్కడ ప్రతివాడూ ఎన్నో సైకలాజికల్ కాంప్లెక్సులతో సతమతమౌతూ ఉంటాడు. అలాంటి సమాజంలో - వీధికొక గుడి ఉన్నప్పటికీ - నిజమైన ఆధ్యాత్మికత ఎక్కడనుంచి వస్తుంది? ఎలా వస్తుంది?

అమెరికాలో చూద్దామా అంటే - ఇక్కడ సుఖంగా బ్రతకడం చాలా సులభం.నీ జీవితంలో అనవసరంగా ఎవడూ జోక్యం చేసుకోడు.ప్రతిదీ ఒక పద్దతి ప్రకారం జరుగుతుంది.కష్టపడి ఒక పద్ధతిని నీ చుట్టూ నువ్వు సృష్టించుకోనవసరం లేదు.నీ చుట్టూ అది సహజంగానే ఏర్పరచబడి ఉంది.కనుక ఉన్నంతలో జీవితం హాయిగా సాగిపోతుంది.ఇండియాలో కూడా - ఉన్నంతలో బ్రతుకుదాం అనుకునేవాడికి జీవితం బాగానే ఉంటుంది.కానీ అలాంటి వాడిని కూడా సుఖంగా బ్రతకనివ్వని సామాజిక పరిస్థితులు అక్కడ ఎక్కువగా ఉన్నాయి.అలా ఉన్నంతలో బ్రతకడానికి కూడా వాడు చాలా కష్టపడాల్సి ఉంటుంది.

ఇక్కడ పరిస్థితి అది కాదు.ఇక్కడ నీ జీవితంలో ఎవడూ జోక్యం చేసుకోడు.నీ జీవితం నీది.లా అండ్ ఆర్డర్ చక్కగా ఉంది గనుక,సామాజికంగా నువ్వు సృష్టించుకోవలసినదేదీ కొత్తగా లేదు.కనుక ఇక్కడ సుఖం ఎక్కువ.

జీవితంలో సుఖాల శిఖరాలు అన్నీ చూచాకే మనిషికి నిజమైన ఆధ్యాత్మిక తపన అనేది మొదలౌతుంది.అన్నీ చూసేశాను.ఆ తర్వాత ఏంటి? ఇంకేమీ లేదా? జీవితం ఇంతేనా? అన్న అన్వేషణ అప్పుడు మాత్రమే మనిషికి మొదలౌతుంది.అప్పుడు మాత్రమే మనిషికి నిజమైన ఆధ్యాత్మిక ద్వారాలు తెరుచుకుంటాయి.అంతవరకూ అతను ఎన్నో గుడులూ గోపురాలూ తిరగవచ్చు.ప్రపంచంలోని పుణ్యక్షేత్రాలు అన్నీ దర్శించి ఉండవచ్చు.వాటివల్ల దమ్మిడీ కూడా ఉపయోగం ఉండదు.ఆ యాత్రలన్నీ అతను చేసేది - భయంతోనూ - దురాశతోనూ - మాత్రమే.ఇవి రెండూ మనిషి గుండెలో తిష్ట వేసుకుని ఉన్నంతవరకూ అతనికి నిజమైన ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశం దొరకనే దొరకదు.

సుఖాన్ని పొందాలన్న తపనలో మనిషి ఇంకా ప్రాకులాడుతూ ఉన్నంతవరకూ అతనికి ఆధ్యాత్మికత ఆమడదూరంలో ఉంటుంది.ఆ ప్రాసెస్ పూర్తికానివాడికి ఆధ్యాత్మికత దక్కదు.

అందుకే నేనెప్పుడూ ఒక మాట అంటూ ఉంటాను. "వీధిలో అడుక్కుండే బెగ్గర్ ఏనాటికీ ఒక బుద్ధుడు కాలేడు. అన్నీ అనుభవించిన రాజే బుద్ధుడు కాగలడు" - అని.

అయితే ఇక్కడ ఒక మెలిక ఉన్నది.

ఈ అనుభవించడం అనేది చిన్నవయసులోనే అయిపోవాలి.వెనువంటనే, సాధన అనేది కూడా చిన్నవయసులోనే మొదలు కావాలి. అలా కాకుండా, మధ్యవయసు దాటే వరకూ కూడా 'జీవితాన్ని అనుభవించడం' ఇంకా పూర్తి కాకపోతే. అలాంటివాడికి ఈ జన్మ వృధా అయినట్లే అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే అతనికి అన్నీ అర్ధమై,దైవం కోసం సాధన మొదలుపెట్టే సమయానికి, దానికి కావలసిన శక్తి వంట్లో ఉండదు. రోగాలు చుట్టుముడుతూ ఉంటాయి.మిగిలిన శేషజీవితం అంతా ఎవరో ఒకరి మీద ఆధారపడి మందులు మ్రింగుతూ బ్రతకడమే సరిపోతుంది. ఈ లోపల మరణం తలుపు తడుతూ ఉంటుంది.నిజమైన ఆధ్యాత్మికత అనేది ఏమిటో తెలియకుండానే ఆ జీవితం ముగిసిపోతుంది. ఇలాంటి జీవితాలు ఇండియాలో ఎక్కడ చూచినా మనకు వేలూ లక్షలలో కనిపిస్తాయి.

ఇండియాకూ అమెరికాకూ - సామాజికంగా చూచినా,ఆధ్యాత్మికంగా చూచినా చాలా భేదాలున్నాయి.

ఇండియాలో ఎక్కడ చూచినా గుళ్ళూ గోపురాలూ కనిపిస్తాయి.ఇక్కడ కనిపించవు.ఇండియాలో జనం పోలో మంటూ గుళ్ళకు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ తిరగరు.ఇండియాలో మనకు ఎందఱో గురువులున్నారు. ఇక్కడ లేరు.కానీ ఇండియాలో కంటే ఇక్కడే నిజమైన ఆధ్యాత్మికతకు అవకాశం ఎక్కువని నా అభిప్రాయం.

ఇక్కడి జీవితంలో యవ్వనం వచ్చేసరికే అన్నీ అనుభవించడం జరిగిపోతుంది.అన్ని సుఖాల శిఖరాలూ చూసేయడం జరుగుతుంది.ఇక ఆ తర్వాత ఏమిటి? అన్న ప్రశ్న ఉదయిస్తుంది.ఒక రకమైన అసంతృప్తి ఒక అగ్నిలా లోపలనుంచి బయలుదేరుతుంది.ఆ అసంతృప్తాగ్ని నుంచి నిజమైన అన్వేషణ కలుగుతుంది.అదే మనిషిని అసలైన ఆధ్యాత్మిక ఆవరణలకు చేరుస్తుంది.

కనుక ఆధ్యాత్మికత అనేది ఇండియన్ సొసైటీలో బాహ్యంగా చాలా ఎక్కువగా ఉన్నట్లు కనిపించినప్పటికీ నిజానికి అక్కడ ఏమీ లేదు.ఇక్కడ బయటకు ఏమీ లేనట్లు కనిపించినప్పటికీ నిజమైన ఆధ్యాత్మిక ద్వారాలు ఈ సమాజంలో ఎక్కడ బడితే అక్కడే రెడీగా ఉన్నాయి.వాటిని తెరవడమే తరువాయి.కానీ వాటిని తెరుస్తున్నవారు తక్కువగా ఉన్నారు.

ఇండియాలోని ఈ పరిస్థితికి ఇంకొక ముఖ్యమైన కారణం - హిపోక్రసీ.

ఇండియన్ సొసైటీ అంతా హిపోక్రసీ మయం.ఇక్కడ అది లేదు.ఎక్కడైతే హిపోక్రసీ ఎక్కువో అక్కడ ఆధ్యాత్మికత ఒక్కక్షణం కూడా ఉండలేదు.అందుకే మనకు ఇండియాలో కనిపించే ఆధ్యాత్మిక గురువులూ ఆ వాతావరణమూ అదంతా కూడా మోసంతోనే ఎక్కువగా నిండి ఉంటుంది.

అయితే ఇంకొక్క విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.

ఇండియాలోని ప్రస్తుత కాలపు మనుషులలో ఆధ్యాత్మికత మృగ్యమైనప్పటికీ, అక్కడి మట్టిలో గాలిలో ఆధ్యాత్మికత సమృద్ధిగా నిండి ఉన్నది.అది ప్రాచీన మహర్షులు, జ్ఞానులు, యోగులు మనకిచ్చిపోయిన వరం.సరిగా స్వీకరిస్తే,ఇండియాలో అది మనకు తేలికగా దొరుకుతుంది.కానీ నిజంగా దానిని స్వీకరించేవాళ్ళు తక్కువ.మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ.

అమెరికాలోని వాతావరణంలో చూద్దామా అంటే, మన వాతావరణంలో ఉన్నట్లు ఇక్కడ ఆధ్యాత్మికత పోగుపడి లేదు.మనకిచ్చినట్లు ఇక్కడెవరూ ఆస్తులిచ్చి పోలేదు.ఇక్కడంతా భోగం ఎక్కువ.నిజమైన ఆధ్యాత్మికత కోసం ఇక్కడ చాలా వెదకవలసి వస్తుంది. దారిచూపించే వారికోసం, గైడ్ చేసే వారికోసం ఇక్కడ ఎంతో కష్టపడి సెర్చ్ చెయ్యవలసి వస్తుంది.

ఇండియాలో అయితే, అది ఎక్కడబడితే అక్కడే దొరుకుతుంది.కానీ స్వీకరించే వాళ్ళు లేరు.ఇక్కడేమో అది అలా దొరకదు.కానీ దానికోసం తపించేవాళ్ళు ఇక్కడే ఎక్కువ.ఇదే సృష్టి విచిత్రాలలో ఒకటి.అమ్మ చేసే వింతమాయలన్నీ ఇలాగే ఉంటాయి.

పెద్దలు సంపాదించిన ఆస్తి ఎంతో ఉంది.దానిని ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు.కానీ దానిని క్లెయిం చేసుకోవడం, సరిగా దానిని అనుభవించడం, క్రింది తరాలకు తెలియదు.ఇండియాలో పరిస్థితి అది.

అమెరికాలో అయితే -  పెద్దలూ లేరు.వాళ్ళిచ్చి పోయిన ఆస్తీ లేదు.కానీ ఆస్తికోసం మనిషిని వెదికింపజేసే పరిస్థితులు ఇక్కడ నిండుగా ఉన్నాయి.ఆ ఆస్తికోసం ఇక్కడి వారు వెదుకవలసి వస్తుంది.

ఇండియా అయినా - అమెరికా అయినా - జీవితాన్ని సక్రమంగా జీవించేవాడికి ఆధ్యాత్మికత అతి సమీపంలోనే ఉంటుంది.కానీ అలా 'సక్రమంగా' జీవించడం కోటికి ఒక్కడికి కూడా సాధ్యం కాదు.అలా జీవించనివ్వకుండా మాయ అనేది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా వలలు సెట్ చేసి ఉంచుతుంది.ఆ వలలను బ్రేక్ చెయ్యగలిగినప్పుడు మాత్రమే "సక్రమంగా" జీవించడం అంటే ఏమిటో తెలుస్తుంది. అలా జీవించగలగడమే అసలైన "సాధన" అని నేనంటాను. నేనే కాదు. వేల సంవత్సరాలనుంచీ అసలైన యోగులూ జ్ఞానులూ ఇదే చెప్పారు.వారివారి జీవితాలలో ఆచరించి చూపించారు కూడా.

ప్రతివారూ తాము సక్రమంగానే జీవిస్తున్నామని అనుకుంటూ ఉంటారు.కానీ అది నిజం కాదు.నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో వారికి అనుభవంలో తెలియకపోవడమే నేను చెబుతున్నది సత్యం అనడానికి రుజువు.

శ్రీ రామకృష్ణుల ప్రసిద్ధవాక్యం ఒకటి నాకు ఈ సందర్భంగా గుర్తుకు వస్తున్నది.

'అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు.కానీ అందరూ భగవంతునిలో లేరు.' అని ఆయన తరచూ అనేవారు.

ఇదే మనిషి దురవస్థకు గల ఏకైక కారణం.ఇదే మనిషిలోని అసంతృప్తికి గల ఏకైక కారణం.

భగవంతునితో కనెక్షన్ ఏర్పరచుకోగలిగితే - అది ఇండియా అయినా అమెరికా అయినా ఒక్కటిగానే ఉంటుంది.కానీ అలా ఏర్పరచుకోడానికి చేసే ప్రయత్నంలో ఎదురయ్యే సహాయకాలూ ఆటంకాలూ దోహదాలూ ఇండియాలో వేరుగా ఉన్నాయి.అమెరికాలో వేరుగా ఉన్నాయి.సాధకునికి అక్కడైనా ఘర్షణ తప్పదు.ఇక్కడైనా తప్పదు.ఆ అంతరిక ఘర్షణ అనే అగ్నిలో నడిచి నెగ్గి బయటకు రాగలిగిన వాడే ఆద్యాత్మిక శిఖరాలను అందుకోగలడు.ఈ ప్రాసెస్ ఏ దేశంలోనైనా ఒకే విధంగానే ఉంటుంది.

ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా భగవంతుని సృష్టిలో భాగమేగా? అణువణువులోనూ సర్వే సర్వత్రా నిండి ఉన్న దైవం ఒక దేశానికి పరిమితం అవుతుందా?అమ్మ ఒడిలో కూచుని ఉన్నవాడికి ఈ దేశాలూ ప్రాంతాలూ కులాలూ మతాలూ వేషాలూ మోసాలూ ఎలా హద్దుల్ని సృష్టించగలవు?

ఈ ప్రపంచంలో సామాన్యంగా ఏమౌతుందంటే - దాహంతో ఉన్నవాడికేమో నీరు దొరకదు.నీరు ఎదురుగా ఉన్నవాడికేమో దాహం ఉండదు.కానీ "నిజమైన దాహం" ఉన్నవాడి దగ్గరకు మాత్రం నీరే వెదుక్కుంటూ వస్తుంది.ఇండియా అయినా అమెరికా అయినా ఈ ప్రాసెస్ ఒకే విధంగానే జరుగుతుంది. ఆధ్యాత్మిక జీవన రహస్య నియమాలు ఏ దేశంలోనైనా ఒకే రకంగానే ఆపరేట్ అవుతూ ఉంటాయి.ఎందుకంటే అవి విశ్వనియమాలు గాబట్టి.

రకరకాల దేశాలలో, రకరకాల మతాలతో, రకరకాల మనుషులతో,రకరకాల పరిస్థితులు సృష్టిస్తూ, అమ్మ ఆడే ఆటలు చిత్రవిచిత్రాలుగా ఉంటాయి.వాటిని సక్రమంగా అర్ధం చేసుకోవడమూ అమ్మ చూపిన దారిలో కిమ్మనకుండా నడవడమే మనం చెయ్యవలసిన అసలైన పని.

అలా నడిచేవాడికి ఇండియా అయినా ఒకటే, అమెరికా అయినా ఒకటే.

నడవలేనివాడికి కూడా - ఇండియా అయినా ఒకటే, అమెరికా అయినా ఒకటే.

నిజంగా ఆకలి ఉన్నవాడు ఆహారం కోసం వెదుక్కుంటాడు.అది లేనివాడు ఎదురుగా ఆహారం ఉన్నా తినలేడు.

సింపుల్ గా చెప్పాలంటే ఇంతే.
read more " మా అమెరికా యాత్ర - 4 "

25, ఏప్రిల్ 2016, సోమవారం

మా అమెరికా యాత్ర -3

నాలుగో రోజున మన పంచవటి మెంబర్స్ తో ఈ సంభాషణ జరిగింది.

ఆనంద్ ఇలా అన్నారు.

'అరిజోనా స్టేట్ లో చాలా మంది మిస్టిక్స్ ఉన్నారు.అమెరికాలో ఉన్న అందరు హీలర్స్, మిస్టిక్స్, ఆస్ట్రాలజర్స్ వీళ్ళంతా అక్కడకే చేరుతూ ఉంటారు.అక్కడ 'సెడోనా' అని ఒక ప్రదేశం ఉన్నది.ముఖ్యంగా ఆ ప్రదేశంలో గనుక మీరు వెళ్లి చూస్తె అక్కడ భౌతికానికీ ఆస్ట్రల్ ప్లేన్స్ కూ మధ్యన ఉన్న గీత చాలా పలుచగా ఉంటుంది.ఆ ప్రదేశంలో ఉంటే  other planes of existence ను కాంటాక్ట్ చెయ్యడం చాలా తేలిక. మీరక్కడకు వెళితే ఆ ప్రదేశాన్ని చాలా ఎంజాయ్ చెయ్యగలుగుతారు. నేను కొన్ని ఏళ్ళ క్రితం అక్కడకు వెళ్లాను.ఉద్యోగపని మీద ఒక రాత్రి అక్కడ ఉండవలసి వచ్చింది.ఆ రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు.అక్కడ స్పిరిచ్యువల్ వైబ్రేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.రెడ్ ఇండియన్ సెటిల్ మెంట్స్ కూడా అక్కడ ఉన్నాయి.వాళ్ళలో పాతతరం మనుషులు చాలా మిస్టికల్ గా ఉంటారు.మీరు వాళ్ళను కలిస్తే చాలా ఎంజాయ్ చెయ్యగలరు.ఈసారి వచ్చినపుడు అక్కడకు వెళదాము.' 

'అలాగే' అన్నాను.

అమెరికాలో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏమంటే ఎక్కడ చూచినా లాన్స్, గ్రీస్ పాచెస్, చెట్లు బాగా ఉన్నాయి.ఎవ్వరూ చెట్లను నరకడం లేదు.లాన్స్ పాడు చెయ్యడం లేదు.గార్బేజ్ లిట్టరింగ్ ఎక్కడా లేదు.రోడ్ల పక్కన మలమూత్ర విసర్జన అనేది లేనేలేదు.ఇళ్ళకు ప్రహరీ గోడలు లేవు.ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కడా పోలీసు అనేవాడే లేడు.ఎలక్ట్రానిక్ ఐ మాత్రం ఉంటుంది.సిగ్నల్ ను పాటించకపోతే చలాన్ ఇంటికి వచ్చేస్తుంది.లేదా మన ఎకౌంట్ లోనుంచి ఫైన్ కట్ అయిపోతుంది.ఇది నాకు చాలా బాగా నచ్చింది.మన దరిద్రపు దేశంలో ఇలాంటి పద్ధతులు ఎప్పటికి వస్తాయా అని నాకు చాలా బాధ కలిగింది.నేనీ మాట అంటే చాలామందికి కోపాలు వస్తాయి.దరిద్రపు దేశం అంటే నా ఉద్దేశ్యం - మనదేశం దరిద్రపుది  అని కాదు. 'దరిద్రపు మనుషులు' - అని అర్ధం.తమ దేశాన్ని గౌరవించలేని వాళ్ళూ దాన్ని బాగుచేసుకుందామని ప్రయత్నం చెయ్యనివాళ్ళూ, పైగా దొంగలలాగా దానిని దోచుకునేవాళ్ళూ దరిద్రులు కాకుంటే మరెవరు? అలాంటివారిని అలా కాకుంటే ఇంకెలా పిలవాలి మరి?

ఆలోచనల్లోంచి తేరుకుని ఇలా అన్నాను.

"ఇండియాకు మూడు శాపాలున్నాయి ఆనంద్. వీటినే three 'P' s అంటారు.

First P is Population
Second P is Pollution
Third P is Politics "

"నిజమే"- అన్నట్లుగా ఆనంద్ తలాడించాడు.

'అవును.ఈ మూటిల్లో మళ్ళీ పాలిటిక్స్ అనేది అతి పెద్ద క్రైం అని నా ఉద్దేశ్యం. దానంత దరిద్రం ఇంకోటి లేదు.రాజకీయ నాయకుడు పొద్దున్న లేచిన దగ్గరనుంచీ పడుకోబోయే వరకూ చేసేవన్నీ డర్టీ పనులే.ఎంత చెడుఖర్మను పోగుచేసుకుంటారో ప్రతిరోజూ వాళ్ళావిధంగా?' - అన్నాడు సాలోచనగా.

'అందుకేగా ప్రాచీనులు - "రాజ్యాన్తే నరకం ధృవం"- అన్నది" అన్నాను.

 వింటున్నవారు - "అవునా?" అన్నారు.

"అవును.నాయకులు అందరూ చనిపోయాక నరకానికే పోతారు.అందులో ఏమీ అనుమానం లేదు.భూలోకంలోనేమో వాళ్ళ శిలావిగ్రహాలు పెట్టి దండలు వేసి పాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు.అక్కడ నరకంలో చూస్తె వీళ్ళను కాగుతున్న నూనె బాండీలలో పడేసి శనగపిండి బజ్జీలలాగా వేయిస్తుంటారు. సృష్టిలోని ఈ చిత్రవిచిత్రాలు ఇలాగే ఉంటాయి" - అన్నాను..

"మరి మన దేశంలోని ఈ మూడు శాపాలకూ సొల్యూషన్ ఏమీ లేదా"- వింటున్నవారు అడిగారు.

"ఉంది.ఏదైనా మితిమీరిపోతే ప్రకృతే దానిని తుంచి పారేస్తుంది.ప్రస్తుతం మన జనాభా 125 కోట్లు.ఏవైనా ఉపద్రవాలు యుద్ధాలు జరిగి ఈ జనాభాలో 100 కోట్ల జనం చచ్చి 25 కోట్ల జనాభా మిగలాలి.అప్పుడే మన దేశం బాగుపడుతుంది.వినడానికి చాలా క్రూరంగా దయారహితంగా కనిపించినా ఇదే దీనికి అల్టిమేట్ సొల్యూషన్.ఇది నా ప్లాన్ కాదు.అమ్మ ప్లాన్.భవిష్యత్తులో జరగబోయే దానినే నేను చెబుతున్నాను.ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అప్పటికి మీరూ నేనూ ఉండకపోవచ్చు.దానిని చూడకపోవచ్చు.కానీ ఇది జరిగి తీరుతుంది.మనిషి విచ్చలవిడిగా ప్రకృతిని పాడుచెయ్యడం కూడా ఈ జరగబోయే విలయానికి ఇంకొక కారణం" - అన్నాను.

వింటున్న ఆనంద్ ఇలా అన్నారు.

"ఇక్కడ ప్రకృతిని రక్షించడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.అనవసరంగా ఒక గడ్డిపోచను కూడా ధ్వంసం చెయ్యరు.అందుకేనేమో వీరిని ప్రకృతి కూడా పరిరక్షిస్తున్నది.ఇక్కడ టైముకు చక్కగా వానలు పడతాయి.వాటర్ ప్రాబ్లం అనేది అస్సలు లేనేలేదు.ఉప్పునీళ్ళు మంచినీళ్ళు కాన్సెప్ట్ లేదు.అన్నీ మంచినీళ్ళే.ఎంత కావాలంటే అంత నీరు సమృద్ధిగా ఉంటుంది.కానీ ఏ వాటర్ బాడీనీ వీళ్ళు పొల్యూట్ చెయ్యరు.మన దేశంలో అయితే సమస్త దరిద్రాలనూ నదుల్లోనేగా కలిపేది.ఒక నదిలో మనం గార్బేజ్ కలుపుతున్నామంటే అది నా దృష్టిలో దైవద్రోహం క్రింద లెక్క" - అన్నాడు.

"అవును.ప్రకృతిలోని దైవత్వాన్ని విస్మరించడమే ఇండియా పతనానికి గల మూలకారణాలలో ఒకటి.నదులు దైవస్వరూపాలని మన గ్రంధాలు చెప్పాయి. మనం కూడా నదులకు పూజలు చేసి హారతులు ఇస్తాం.కానీ వాటిని శుభ్రంగా ఉంచాలనీ వాటిని గౌరవించాలనీ ఆ వనరును జాగ్రత్తగా మర్యాదగా వాడుకోవాలన్న జ్ఞానం ఎవడికీ ఉండదు.ఊరకే పూజలు మాత్రం చేస్తారు.ఇదే మనకు పట్టిన అసలైన దరిద్రం.దీనినే నేను "హిపోక్రసీ" అంటాను.

ఈ సందర్భంలో - వివేకానందస్వామి జీవితంలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుకు వస్తున్నది.

ఆయన లండన్లో ఉన్న సమయంలో ఒకరు ఇలా అడిగారు.

"మీరు ఇంత గొప్ప వేదాంతం చెబుతున్నారు కదా? కానీ మీదేశం బానిసత్వంలో మగ్గుతున్నదెందుకు? మీకు నిరక్షరాస్యతా దారిద్ర్యమూ అశుభ్రతా అంత ఎక్కువగా ఉన్నాయెందుకు? మీ గ్రంధాలలో ఇంత జ్ఞానసంపద ఉన్నప్పుడు మీ స్థితి మరి ఇలా ఘోరంగా ఉన్నదెందుకు?"

దానికి వివేకానంద స్వామి ఇలా జవాబిచ్చారు.

'మేము వేదాంతాన్ని ఊరకే చదువుతాం.ఊరకే వల్లె వేస్తాం.ఇతరులకు బోధిస్తాం.కానీ ఆచరించం.మీకు వేదాంతం తెలియదు.కానీ మీరు దానిని నిత్యజీవితంలో మీకు తెలీకుండానే ఆచరిస్తున్నారు.అదీ మీకూ మాకూ తేడా. అందుకే మీరు ఇలా ఉన్నారు.మేము అలా ఏడుస్తున్నాం.వేదాంతాన్ని చదివితే ఫలితం రాదు.ఆచరిస్తే వస్తుంది.అనుష్టాన వేదాంతం కావాలి. ఉపన్యాస వేదాంతం ఎందుకూ పనికిరాదు.పుస్తకాలు మా దగ్గరున్నాయి. అనుష్ఠానం మీ దగ్గరుంది.అందుకే మీరు బాగున్నారు."

నూట పదహారు సంవత్సరాల క్రితం స్వామి చెప్పిన మాటలు నేటికీ సజీవ సత్యాలే.ఈనాటికీ మన గతి అప్పటిలాగే ఉన్నది.వివేకానందస్వామి చెప్పినది మనం ఆచరించినప్పుడే మన దేశం బాగుపడుతుంది.అలా కాకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దేశాన్ని భ్రష్టు పట్టిస్తే దాని గతి అధోగతే అవుతుంది.ఇది తప్పదు." - అన్నాను.

సంభాషణ "నైతికత - అనైతికత" ల వైపు మళ్ళింది.

"మానసికంగా ఒక స్థాయికి చేరాక ఇక నైతికత అనైతికత అంటూ ఉండవేమో అనిపిస్తున్నది" - అని ఒకరన్నారు.

'అవును.ఆ రెండూ రిలేటివ్ కాన్సెప్ట్స్.ఇవి మూడు విషయాల మీద ఆధారపడి ఉంటాయి. అవేమిటంటే దేశం-కాలం-నిమిత్తం.అంటే Place-Time-Cause(reason).ఈ మూటిని బట్టి నీతీ అవినీతీ అనేవి మారిపోతూ ఉంటాయి.

ఉదాహరణకు ఒక దేశంలో నీతి అయినది ఇంకొక దేశంలో నీతి అవ్వదు. అలాగే చరిత్రలో ఒకానొక సమయంలో నీతిగా పరిగణింపబడినది ఇంకొక కాలంలో నీతిగా నిలవదు.మన జీవితంలో కూడా ఒక సమయంలో నీతి అయింది ఇంకొక సమయంలో నీతి కాలేదు.అలాగే మనం చూచే దృష్టిని బట్టి - అంటే మనం తీసుకునే రీజన్ ను బట్టికూడా వీటికి అర్ధాలు మారుతూ ఉంటాయి.

అసలు విషయం ఏమంటే - మనం మన చుట్టూ భౌతికంగా మానసికంగా కొన్నికొన్ని గిరులు గీసుకుని బ్రతుకుతూ ఉంటాము.ఆ గిరులు అనేక రకాలుగా ఉంటాయి.మనం అనుకునే నీతీ అవినీతీ అనేవి ఆ గిరులకే పరిమితం.అవి రిలేటివ్ కాన్సెప్ట్స్.ఆ గిరి దాటితే ఆ కాన్సెప్ట్స్ పనిచెయ్యవు.

మనిషి ఎలాంటి వాడంటే - మూడు concentric circles మధ్యలో ఉన్న బిందువు లాంటివాడు.ఈ సర్కిల్స్ లో లోపలది తన చుట్టూ తను గీసుకున్న మానసిక గిరి.ఆ తర్వాత ఉండే రెండోది సమాజం తన చుట్టూ గీసిన గిరి.ఆ తర్వాత ఉండే మూడోది ప్రకృతి మన చుట్టూ గీసిన గిరి.ఈ మూడింటికీ వేర్వేరు నీతీ వేర్వేరు అవినీతీ - వేటికవే విడివిడిగా - ఉంటాయి.ఈ మూడు గిరుల(domains)కూ మధ్యన సంఘర్షణ లేకుండా ఉన్నంతవరకూ మనిషి జీవితం సుఖంగా హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది.వీటిమధ్యన ఉన్న సంఘర్షణలలో గల తేడాలను బట్టి మనిషి జీవితంలో రకరకాలైన అసంతృప్తులు ఉంటాయి.

నిజమైన సాధకుడు ఈ మూడు గిరులనూ దాటాలి.తన మానసిక పరిమితులనూ భయాలనూ మొదటగా అధిగమించాలి.ఆ తర్వాత సంఘం తన చుట్టూ బలవంతంగా గీచిన గిరిని బ్రేక్ చేసి బయటకు రావాలి.ఆ తర్వాత ప్రకృతి తన చుట్టూ గీచిన గిరిని కూడా బ్రేక్ చెయ్యాలి.అప్పుడే మానవుడు దైవాన్ని 'అనుభవం ద్వారా' తెలుసుకోగలుగుతాడు.ఈ మూడు గిరులలో అఘోరిస్తూ ఉన్నంతవరకూ వాడు అధముడిగా బ్రతికి అధముడిగానే చస్తాడు.అందుకే, నిజమైన మిస్టిక్ అన్నవాడు ఈ మూడు గిరులనూ దాటాలి. ఈ మూడు గిరుల గురించే నేను - 'మూడుగిరులు దాట ముంచెత్తు నొకముప్పు ముగియునింక నీదు మూలధనము' అంటూ "శ్రీ విద్యారహస్యం" లో వ్రాశాను.

అందుకే మిస్టిక్స్ అనేవాళ్ళు మనుషులనూ లెక్కచెయ్యరు.సమాజాన్నీ లెక్కచెయ్యరు.ప్రకృతిని కూడా లెక్క చెయ్యరు.తలచుకుంటే వారు ప్రకృతిని కూడా మార్చగలుగుతారు.అవే మిరకిల్స్ అంటే.ఈ పనిని వాళ్ళు ఎలా చెయ్యగలుగుతారో చెప్తాను వినండి.ప్రకృతికి అతీతంగా ఉన్న పరమసత్యాన్ని వాళ్ళు టచ్ చేసి ఉంటారు.ఆ స్థాయికి వాళ్ళు వెళ్లి దానిని దర్శించి దానిలో కరగిపోయి ఉంటారు కనుక వాళ్లకు ఆ శక్తి వస్తుంది.ఎలాగంటే - ప్రకృతికి అతీతంగా ఉన్నదేదో అదే ఈ ప్రకృతిని సృష్టించింది.దానిని టచ్ చెయ్యగలిగితే అప్పుడు అలాంటివాడి మాటను ప్రకృతి శిరసావహిస్తుంది.అతని విల్ ప్రకారం ప్రకృతి తనను తాను మార్చుకుంటుంది.అదే మిరకిల్ అంటే.' అన్నాను.

'అంటే మిస్టిక్స్ కు నీతీ అవినీతీ అనేవి ఉండవా?'- అని వింటున్నవారు అడిగారు.

'నిజమైన మిస్టిక్ కు మీరనుకునే నీతీ అవినీతీ ఉండవు."నీతి-అవినీతి" గురించి అతని నిర్వచనమూ మీ నిర్వచనమూ వేర్వేరుగా ఉంటాయి.అందుకే అతని చర్యలు మీకు వింతగా అనిపిస్తాయి.అతను మీ స్థాయినుంచి ప్రపంచాన్ని చూడడు.అతని యాంగిల్ వేరుగా ఉంటుంది.అప్పటి అవసరాన్ని బట్టి అతని దృక్కోణం అనుక్షణం మారిపోతూ ఉంటుంది.కానీ దానిలో అనుస్యూతంగా ఒక అద్భుతమైన దైవనీతి దాగి ఉంటుంది.అయితే అది మీరు అనుకునే - మీకు తెలిసిన - పరిమితమైన నీతి అయి ఉండదు.అతనికి ఒక స్థిరమైన అభిప్రాయం అంటూ ఏదీ ఉండదు.అలా ఉండనంత మాత్రాన అతను అవకాశవాదీ కాడు.అందుకే అతను మీకు పరస్పర విరుద్ధ విషయాల సమాహారం లాగా కనిపిస్తాడు.అతనిలో ఎన్నో దృక్కోణాలు ఉంటాయి.ఒక్క దృక్కోణమే తెలిసిన మీకు అందుకే అతను అర్ధం కాడు.ఈ విషయాలన్నీ నా పుస్తకంలోని 'గుణాతీత జీవన్ముక్త స్థితి' అనే అధ్యాయంలో వ్రాశాను.

ఇదంతా మీకిప్పుడు అర్ధం కాదు.మీరు మీ చుట్టూ ఉన్న మూడు గిరులను దాటి ఆ పైన ఉన్నదానిని టచ్ చేసినప్పుడే నేను చెబుతున్నది మీకు 'అనుభవంలో' అర్ధం అవుతుంది.అలా చెయ్యాలంటే సాధన అవసరం.ఊరకే కూచుని మాట్లాడుకుంటూ ఉంటె మీరు ఆ పనిని ఎన్నటికీ చెయ్యలేరు.మీరా 'మిస్టిక్ పాత్' లో నడవాలి.అప్పుడే అది సాధ్యం అవుతుంది.అందుకే సాధన అనేదానిని నేనింతగా నొక్కి చెప్పేది." -  అన్నాను.

(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర -3 "

మా అమెరికా యాత్ర - 2

































































 







 


ఇక్కడకొస్తూనే చేసిన ముఖ్యమైన పని జగన్నాధ హోరా సాఫ్ట్ వేర్ లో డిఫాల్ట్ సెట్టింగ్స్ ను ఆబర్న్ హిల్స్ కు సెట్ చేసి పెట్టడం.ఎందుకంటే పొద్దున్న లేస్తూనే తిథి వార నక్షత్రాలు తెలియాలిగా మరి.అవి తెలియకపోతే ఏ పనీ ముందుకు సాగదు.

ఇక్కడ సూర్యోదయం ఉదయం 6.45 కి అవుతున్నది అస్తమయం రాత్రి 8 గంటలకు అవుతున్నది.రాత్రి ఎనిమిదికి కూడా సూర్యుడు ఉండటం వింతగా అనిపించింది.

వాతావరణం చాలా హాయిగా ఉన్నదని మా వాడితో అంటే - "మీరు వింటర్ లో వచ్చినట్లయితే ఆ మాట అనేవాళ్ళు కారు.అప్పుడు కనిపిస్తుంది నరకం  అంటే ఎలా ఉంటుందో"- అని నవ్వేశాడు.

పొద్దున్న లేస్తూనే ఆ తొమ్మిది డిగ్రీల చలికి తోడు జల్లులుగా చిరువాన పడుతూ ఉన్నది.బాల్కనీలో కొచ్చి నిలబడితే బాగా చలిగా ఉన్నది.కానీ వాతావరణం ఆహ్లాదంగా ఉండటంతో అక్కడే కాసేపు నిలబడ్డాము.

ఇంతలో ఎక్కడనుంచో ఒక పిచ్చుక వచ్చి ఇంటి మీద కూచుని కిచకిచలు మొదలు పెట్టింది.పిచ్చుకను చూడటంతోటే మహానందం కలిగింది. ఇండియాలో అయితే పిచ్చుకలు కనబడటం ఎప్పుడో మానేశాయి.ఇక్కడ మాత్రం రకరకాల పక్షులు ఇంకా సజీవంగా ఉన్నాయి.ఇక్కడ ప్రకృతిని మనిషి నాశనం చెయ్యడం లేదు గనుక అవి ఇంకా నిలిచి ఉన్నాయి. మనదేశంలో మాత్రం ఊరపిచ్చుక లేహ్యాలకూ, సెల్ ఫోన్ టవర్ల దెబ్బకూ అవి ఎప్పుడో అంతరించి పోయాయి.

అదే బాల్కనీలో కాసేపు కూచుని రాజూ నేనూ ధ్యానస్థితిని ఎంజాయ్ చేశాము.

ఆ తరువాత కాలకృత్యాలు తీర్చుకుని ఆశ్రమానికి బయలుదేరాము.అక్కడకు కొందరు శిష్యులు వచ్చి చేరారు.వారితో పిచ్చాపాటీగా ఆధ్యాత్మిక సంభాషణలు జరిగాయి.

'ప్రపంచంలోని వస్తువులలో అల్టిమేట్ ఆనందం లేదు.మనుషులలోనూ లేదు.కానీ మనం ఈ రెంటిలోనూ దానిని వెదుకుతున్నాం.ఈ వెదుకులాటే మనిషి యొక్క అసంతృప్తికి కారణం.ఇలా బయట బయట వెదుకుతున్నంత వరకూ మనిషికి నిజమైన ఆనందం ఎన్నటికీ దొరకదు.దీనినే కఠోపనిషత్తు -' న విత్తేన తర్పణీయో మనుష్యో...(మనిషి ధనంతో ఎన్నటికీ సంతృప్తి చెందలేడు)..' అనే శ్లోకంలో చెప్పింది.ఇక్కడ 'విత్తం' అంటే ధనం అని ఒకటే అర్ధం కాదు.భౌతికమైన బాహ్యమైన అన్ని వస్తువులనూ 'విత్తం' అన్న మాటతో వేదం ఇక్కడ సూచించింది.కనుక అల్టిమేట్ ఆనందం కావాలంటే మనిషి బయట వెదుకులాట ఆపేసి లోపల వెదకడం నేర్చుకోవాలి.అదే మెడిటేషన్ లేదా ధ్యానం లేదా సాధన అంటే.' - అని ఆశ్రమంలో కూడుకున్న శిష్యులకు మొదటిరోజున చెప్పాను.

మా అబ్బాయి ఇలా అన్నాడు.

'నాన్నా.ఆనంద్ గారు మొన్న నాతో మాట్లాడుతూ ఇలా అన్నారు - ' మాధవ్ !అమెరికాకు వచ్చికూడా, నాకు ఏదీ చూడాలని లేదు.ఎక్కడకూ వెళ్లాలని లేదు.అన్నవారిలో బహుశా అమెరికా చరిత్ర మొత్తం మీద నాన్నే ఫస్ట్ అనుకుంటా.'

నవ్వాను.

'చెప్పానుగా నాన్నా! అల్టిమేట్ ఆనందం బయట లేదు.అది లోపల ఉన్నది.దానిని చేరడానికి ఒక స్పార్క్ మనిషికి కావాలి.ఒక ట్రిగ్గర్ కావాలి.చూడగలిగితే ఆ స్పార్క్ ఆ ట్రిగ్గర్ ప్రతిచోటా ఉన్నది.నీ చుట్టూ ఎక్కడ బడితే అక్కడ అది ఉన్నది.నీ చుట్టూ ఉన్న దేనిని చూచినా నీ మనస్సు పైకి ఎగసి అనంతంలో లీనం అవుతున్నప్పుడు ఇక నీకు ఎక్కడెక్కడో తిరగాలనీ ఏవేవో చూడాలనీ ఎందుకు అనిపిస్తుంది? అనిపించదు.

ఈ టెక్నిక్ తెలిసినవాడికి ఒక చిన్న గాలి అల చాలు.ఒక చిన్న పువ్వును చూస్తే చాలు.ఒక పక్షి కిచకిచ వింటే చాలు.ఒక నది ఒడ్డున ఊరకే కూచుంటే చాలు.ఆకాశంలో మేఘాలను ఊరకే చూస్తే చాలు.ఒక సూర్యోదయపు ఎండ చాలు.ఒక చిరుజల్లు చాలు.ఇవన్నీ కూడా అతన్ని అధ్బుతమైన ఆనందపు ఒడ్డుకు చేరవేస్తాయి.ఈ న్యాక్ తెలిస్తే నీకు ఎక్కడికీ తిరగాలని అనిపించదు.అది తెలీకే మనుషులు పిచ్చికుక్కల్లా సైట్ సీయింగ్ అంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.కానీ ఎక్కడా వాళ్లకు ఏదీ దొరకదు.మిగలదు.అలా తిరగడంలో ఆనందం ఉన్నదనుకోవడం పెద్ద భ్రమ.అదే అసలైన మాయ.

ఎప్పుడైనా వర్తమానపు క్షణికం లోనుంచే అనంతానికి డోర్ ఉంటుంది.ఆ తలుపులోనుంచి ప్రయాణించే కిటుకు తెలిస్తే ఎక్కడికీ కదలనక్కరలేదు.ఉన్నచోటినుంచే అనంతాన్ని అందుకోవచ్చు.ఈ కిటుకు తెలీకపోతే ఎన్నిచోట్ల తిరిగినా ప్రయోజనం ఏమీ ఉండదు.ఇదే అసలైన కీలకం.

అయినా,నేను ఇక్కడకు వచ్చింది మీకోసం.అంతేగాని సైట్ సీయింగ్ కు తిరగడానికి కాదు.నాకు ప్రదేశాలూ వస్తువులూ డబ్బూ ముఖ్యం కాదు.నాకు మనుషులు ముఖ్యం.మానవ సంబంధాలు ముఖ్యం.నేను ప్రదేశాల ఆరాను కూడా తేలికగా ఫీల్ అవగలను.అక్కడున్న సూక్ష్మ శక్తులతో అనుసంధానం అవ్వగలను.కానీ దానికంటే నాకు మనుషులతో సంబంధాలు,వారిని ఆధ్యాత్మికంగా సరియైన దారిలో గైడ్ చెయ్యడం ఇష్టం.' - అన్నాను.

సంభాషణ తర్వాత పక్కనే ఉన్న లేక్ ఒడ్డుకు వెళ్లి అక్కడ మన మెంబర్స్ కొందరు ధ్యానం చేసుకున్నారు.అక్కడ ధ్యానంలో కూచున్న కొందరికి 'బగళాముఖి మాత' దర్శనం కలిగింది.ఇంకొందరికి - 'తమనే గమనిస్తున్న ఒక చాలా అందమైన దేవత ఎడమ కన్ను' కనిపించింది.ఏదో తెలియని ప్రశాంతత మాత్రం అందరికీ కలిగింది.

ఆ లేక్ ఒడ్డున 'తూజా ఆక్సిడెంటాలిస్' పెద్ద పెద్ద చెట్లను చూచాను.ఇది హోమియోలో సైకోటిక్ మయాజం కు మహత్తరమైన రెమెడీ.

శనివారం రోజున ఉదయం 10 గంటలకు ఆనంద్ దంపతులు వచ్చి చేరుకున్నారు.అందరం వారితో కలసి దగ్గరలోనే ఉన్న పరాశక్తి ఆలయానికి వెళ్ళడం జరిగింది.ఈ ప్రదేశానికి ఒక స్థలమహత్యం ఉన్నది.పురాతన కాలంలో రెడ్ ఇండియన్స్ ఇక్కడ ఉండేవారు.వాళ్ళు ప్రకృతి ఆరాధకులు. ప్రకృతినే తల్లిగా పూజించే సంస్కృతి వారిది.ఇప్పుడు పరాశక్తి ఆలయం ఉన్న ప్రదేశంలో ఈ రెడ్ ఇండియన్స్ ఎన్నో వందల ఏళ్ళుగా అమ్మను ఆరాధించేవారు.వాళ్ళూ వాళ్ళ సంస్కృతీ చాలావరకూ నశించిపోయాక ఈ ప్రదేశంలో పరాశక్తి ఆలయం ఆవిర్భావం జరిగింది.

ఒక ప్రదేశంలో జరిగిన ఉపాసనలు ఎన్నటికీ అంతరించిపోవు. ఆ శక్తి, తరంగాల రూపంలో ఆ ప్రదేశంలోనే ఆవరించి ఉంటుంది.మళ్ళీ కొన్ని తరాల తర్వాత ఎవరో ఇంకొందరు ఆ శక్తిని ఇంకొక రూపంలో ఆరాధించడం మొదలు పెడతారు.దేవత ఆకారం మారవచ్చు,పూజించేవారి భాష మారవచ్చు, మతాలు మారవచ్చు.కానీ అక్కడి శక్తి మారదు.పరాశక్తి ఆలయం కూడా అలాంటిదే.

దీనిని మదరాసీ వైష్ణవులు కట్టించారట.అమ్మవారి విగ్రహం చాలా కళగా ఉన్నది.శ్రీచక్రం మేరుప్రస్తారం ప్రతిష్ట చేసి ఉన్నది.అమ్మవారికి ఇరుపక్కలా వారాహి, రాజమాతంగి విగ్రహాలు, కొంచం ముందుగా భువనేశ్వరి విగ్రహం ఉన్నాయి.ఆలయంలో ఉన్నంతసేపూ అమెరికాలో ఉన్న ఫీల్ రాలేదు.ఎక్కడో తమిళనాడులో ఒక ఆలయంలో ఉన్న ఫీల్ కలిగింది.అదే వాతావరణాన్ని ఇక్కడ సృష్టించడంలో ఆలయ నిర్వాహకులు చక్కగా కృతకృత్యులైనారనే చెప్పాలి.

అమ్మవారి సమక్షంలో అద్భుతమైన అనుభవం కలిగి చాలాసేపు అలా నిలబడి ఉండిపోయాను.అందరికీ కన్నీళ్లు ధారగా కారిపోతున్నాయి. మేమెవరం ఏమీ చెప్పకపోయినా అక్కడ ఉన్న పూజారి, అమ్మవారి మెడలో ఉన్న గులాబీ దండను తీసి నా మెడలో వెయ్యడం ఒక మరపురాని అనుభవాన్ని మిగిల్చి నన్ను ట్రాన్స్ లోకి తీసుకెళ్ళింది.అమ్మ ఆ విధంగా నన్ను అనుగ్రహించినట్లు తోచింది.నేను చెయ్యబోతున్న అంతరిక కార్యాన్ని అమ్మకు చెప్పి అమ్మ పర్మిషన్ కోసం ప్రార్ధించాను.ప్రసన్న వదనంతో అమ్మ చిరునవ్వు నవ్వినట్లు నా మనోనేత్రానికి తోచింది.

పై వచ్చే శుక్రవారం రోజు ఇక్కడే 'శ్రీవిద్య' గురించి మాట్లాడాలి.దానికి కూడా అమ్మ పర్మిషన్ అర్ధించి చాలాసేపు ఆలయంలో ఉండి తిరిగి ఇంటికి చేరుకున్నాము.

భోజనం తర్వాత ఆశ్రమానికి బయలుదేరాము.ఆశ్రమం ఓనర్ - మిస్టర్ నెల్సన్ - అనే ఒక అమెరికన్.అతను పద్మజ గారిని ఇలా అడిగాడట.

'మీ గురువుగారు హీలరా?'

'అవును.కానీ అది ఆయన చేసే ముఖ్యమైన పని కాదు.ప్రాధమికంగా ఆయనొక మిస్టిక్.' అని తను చెప్పింది.

'నేను,నా భార్యా పిల్లలతో ఆయన్ను ఒకసారి కలవాలని అనుకుంటున్నాను.వీలవుతుందా?' అని అతను అడిగాడు.

'ఆయనతో కనుక్కుని చెబుతాను' అని తను జవాబు చెప్పింది.

'మధ్యాన్నం ఒంటిగంటకు ఆశ్రమానికి వస్తాము.అక్కడ ఆయన మమ్మల్ని కలవవచ్చు.' - అని ఆమెతో చెప్పాను.

కానీ మేమక్కడకు వెళ్లేసరికి బాగా ఆలస్యం కావడంతో వాళ్ళను కలవడానికి వీలుకాలేదు.ఇంకోసారి వాళ్ళను తీరికగా రమ్మనమని చెప్పాను.

ఆశ్రమంలో కూడుకున్న శిష్యులతో ఈ క్రింది టాపిక్స్ మాట్లాడాను.

>>ప్రకృతిలోని అంతరిక సమగ్ర కనెక్టివిటీ
>>కొన్ని జంతువులకు, పక్షులకు, చెట్లకు ఉన్న విచిత్ర శక్తులు.వాటికీ ఆధ్యాత్మిక భూమికలకూ ఉన్న సంబంధాలు.
>>అంతం లేని ఆనందం - అంతం అయ్యే ఆనందం.
>>నా పద్ధతిలో సాధనా మార్గం ఎలా ఉంటుంది? దానిలో ఎలా నడవాలి?దానికి కావలసిన అర్హతలు ఏమేమిటి?

ఈ సంభాషణ జరుగుతున్నపుడే ఒక శక్తివంతమైన ధ్యానోన్ముఖ వాతావరణం ఆ హాల్లో సృష్టింపబడింది.దాని ప్రభావ ఫలితంగా - వింటున్నవారు అందరూ వారంతట వారే సైలెంట్ గా అయిపోయి ఏ ప్రయత్నమూ చెయ్యకుండానే  ధ్యానంలోకి ప్రవేశించారు.

అలా చాలాసేపు ఆశ్రమంలో ఉండి,అందరం మళ్ళీ ఇంటికి బయలుదేరాము.
read more " మా అమెరికా యాత్ర - 2 "