Spiritual ignorance is harder to break than ordinary ignorance

22, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఏప్రియల్ 2016 - పౌర్ణమి ప్రభావం

19 రాత్రి హైదరాబాద్ లో బయలుదేరి అబూదాబీ,చికాగోల మీదుగా డెట్రాయిట్ చేరుకున్నాము.ఈ ప్రయాణం అంతా పౌర్ణమి నీడలో జరిగింది. అబూదాబీ ఎయిర్ పోర్ట్ లో ఉండగా ఈక్వడార్ లో వచ్చిన భూకంపం గురించి టీవీ న్యూస్ లో చూడడం కాకతాళీయంగా జరిగింది.ఇందులో 570 మంది చనిపోయారు. ఇది పౌర్ణమి ప్రబావమేనని నేనూ రాజూ అనుకున్నాము.

అబూదాబీ నుంచి చికాగో 15 గంటల ఫ్లైట్ ప్రయాణంలో ఉన్నప్పుడు మెడిటరేనియన్ సముద్రంలో ఒక ఓడ మునిగి దాదాపు 500 మంది మునిగిపోయిన వార్తను న్యూస్ లో చూడడం జరిగింది.

మొత్తం మీద పౌర్ణమి ప్రభావం చాలా గట్టిగానే ఉందని మళ్ళీ అనుకున్నాము.

అలాగే బెంగుళూరులో అల్లర్లు జరగడం,తమ కోరిక తీర్చదానికి నిరాకరించిన 250 ఆడవారిని ఇస్లామిక్ తీవ్రవాదులు దారుణంగా తలలు నరికి చంపడం(ఇలాంటి సంఘటనలు చూచాక కూడా ఇస్లాం అంటే శాంతేనని మనం నమ్మాలి!!!) ఇంకా అనేక చెదురుమదురు సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా అనేకం జరుగుతున్నాయి.

ఇవన్నీ ఈ పౌర్ణమి ప్రభావాలే. గమనించండి.