“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, డిసెంబర్ 2014, మంగళవారం

పుస్తకావిష్కరణ సభ జయప్రదంగా ముగిసింది- ఒక నూతనాధ్యాయం మొదలైంది

28.12.2014 న తలపెట్టిన 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకావిష్కరణ సభ దిగ్విజయంగా ముగిసింది.

జగన్మాత అనుగ్రహంతో వెలుగుచూచిన ఈ పుస్తకం అమ్మ(దుర్గమ్మ) పాదాల చెంత,కృష్ణాతీరంలో విజయవాడలో ఆవిష్కరింప బడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది.

ఉదయం 10.30 ప్రాంతంలో మొదలైన సభ దాదాపు మధ్యాన్నం 1.30 ప్రాంతంలో వందన సమర్పణతో ముగిసింది.

దాదాపుగా 60 మంది ఈ సభకు వచ్చారు.వారిలో విజయవాడ వాస్తవ్యులే గాక,హైదరాబాద్,అనంతపూర్,బెంగుళూరు,ఒంగోలు,తిరుపతి,విజయనగరం,విశాఖపట్నం మొదలైన దూరప్రాంతాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు.అమెరికా నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు.

ఆహూతులందరూ దాదాపు 3 గంటలపాటు కదలకుండా నిశ్శబ్దంగా ఉండి కార్యక్రమాన్ని ఆసాంతమూ ఆస్వాదించారు.

మహాలక్ష్మీ పబ్లికేషన్స్ విశ్వమోహన్ గారి మాటల్లో చెప్పాలంటే -' ఇంత క్రమశిక్షణతో జరిగిన పుస్తకావిష్కరణ సభను నేను ఇంతవరకూ చూడలేదు.ఎన్నో ఫంక్షన్స్ నేను చూచాను.పుస్తకావిష్కరణ అయిపోవటం తోనే అందరూ లేచి వెళ్ళిపోతారు.కానీ మీ ఫంక్షన్ లో మాత్రం పుస్తకావిష్కరణ తర్వాత కూడా ఇంకొక రెండుగంటల పాటు అంత శ్రద్ధగా కూచుని మీ ఉపన్యాసం విన్నారంటే  చాలా వింతగా ఉన్నది.మిగిలిన ఫంక్షన్స్ లో వాలంటీర్స్ ను పెట్టి చెప్పిస్తాము మొబైల్స్ ఆఫ్ చెయ్యండి.మౌనంగా ఉండండి.అని.కానీ ఈ కార్యక్రయంలో ఎవరికీ ఏమీ చెప్పవలసిన పని లేకపోయింది.ఎవరికి వారే ఎంతో సెల్ఫ్ డిసిప్లిండ్ గా ఉన్నారు." అని ఆయన అన్నారు.

'వీళ్ళు మామూలు ఆడియన్స్ కారు.ఈ సబ్జెక్ట్ మీద ఎంతో శ్రద్దతో,ఆధ్యాత్మికత అంటే తపనతో,అమ్మ మీద నమ్మకంతో వచ్చినవారు.అందుకే వారు అంత ఓపికగా అన్ని గంటలు కూర్చున్నారు.అంత డిసిప్లిన్ గా ఉన్నారు.' అని నేను చెప్పాను.

నేను దాదాపు ఒక గంటన్నర పైనే మాట్లాడాను.నా ఉపన్యాసంలో 'శ్రీవిద్యోపాసన' గురించీ ఈ పుస్తకం ఎలా ఉద్భవించింది అన్న విషయం గురించీ వివరంగా మాట్లాడాను.

శ్రోతలను నా ఉపన్యాసం రంజంపచేయగలిగింది అనే నేను అనుకుంటున్నాను.

ఫంక్షన్ అయిపోయిన తర్వాత,వచ్చిన వారందరూ నన్ను కలిసి మాట్లాడారు. వేదాంతం గురించి,తంత్రసాధన గురించి అడిగిన వారు కొందరైతే,జ్యోతిష్యం గురించి,ఈతిబాధల గురించి,రోగబాధల గురించి అడిగినవారు కొందరు.ఎవరికి కావలసిన పరిష్కారం వారికి చూపబడింది.అక్కడ మాట్లాడలేని వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి అనుకున్న వారికి నా ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది.

కార్యక్రమంలో పాల్గోన్నవారివి చాలామందివి అడ్రసులూ ఫోన్ నంబర్లూ సేకరించడం జరిగింది.కానీ ఇంకా కొందరి వివరాలు దొరకలేదు.కనుక వారందరికీ నా అభ్యర్ధన ఏమంటే,పుస్తకం మీద నా ఫోన్ నంబర్ ఉన్నది,ఇక్కడ కూడా ఇస్తున్నాను గనుక,ఈ పుస్తకం మీద మీమీ అభిప్రాయాలనూ సూచనలనూ,అలాగే ఈ ఫంక్షన్ ఎలా జరిగింది అన్నదానిమీద మీమీ అభిప్రాయాలనూ,ఇంకా మీమీ వ్యక్తిగత సమస్యలనూ,మీరు అడగాలనుకుని అడగలేక పోయిన విషయాలనూ,తరువాత మీకు గుర్తొచ్చిన విషయాలనూ, నాకు ఫోన్ ద్వారా తెలియజెయ్యండి.

నేనేదో బిజీగా ఉంటానని,మీరు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నామనీ అనుకోకండి.సిన్సియర్ గా మీరు అడిగితే మీమీ సందేహాలను తీర్చడానికి (అది అర్ధరాత్రి అయినా,అపరాత్రి అయినా సరే) నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానన్న విషయం గమనించండి.

ఇంకొక్క ముఖ్య విషయం:--

ఈ కార్యక్రమంలో పాల్గొని 'శ్రీవిద్య' మీద నా ఉపన్యాసాన్ని విన్న చాలామంది దీక్ష ఇవ్వమనీ వారికి మార్గనిర్దేశనం చెయ్యమనీ వారిని ఆధ్యాత్మిక పధంలో ప్రాక్టికల్ గా నడిపించమనీ అడిగారు.

ఈ అభ్యర్ధనకు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను.

నావద్ద దీక్ష తీసుకోవాలని అనుకునేవారు ఎటువంటి సంకోచాలూ పెట్టుకోకుండా నన్ను సంప్రదించండి.ఎవరెవరి కోరికలను బట్టి,సంస్కారాలను బట్టి,అంతరిక శక్తిని బట్టి,అర్హతను బట్టి వారివారికి దీక్ష ఇవ్వబడుతుంది.నా వద్ద దీక్షాస్వీకారం చేసిన,చెయ్యబోతున్న గ్రూపు సభ్యులతో కలసి అతిత్వరలో 'సాధనా సమ్మేళనాలు' జరుపబడతాయి.

ఆ సమ్మేళనాలలో -- శుద్దమైన నిజమైన ఆధ్యాత్మిక సాధనను వారిచేత దగ్గరుండి చేయించడం, వారి సందేహాలను తీర్చడం,వారిని సత్యమైన ఆధ్యాత్మికమార్గంలో ప్రాక్టికల్ గా ముందుకు నడిపించడం జరుగుతుంది.దీనికి కులంతోనూ మతంతోనూ వయస్సుతోనూ ప్రాంతంతోనూ సంబంధం లేదు.

హృదయపూర్వకమైన 'తపన' ఒక్కటే నిజమైన అర్హత.

ఇన్నాళ్ళూ విషయాలను స్థూలంగా వివరించడం మాత్రమే జరిగింది. ఇకనుంచి వాటిని ప్రాక్టికల్ గా ఎట్లా అనుభవంలోకి తెచ్చుకోవాలి?అంతరిక యోగసాధన ఎలా చెయ్యాలి?జీవితాన్ని ఎలా సఫలం చేసుకోవాలి? అనే విషయాన్ని ప్రాక్టికల్ గా నేర్పించడం జరుగుతుంది.

అంతేగాక,జ్యోతిష్యవిద్యార్ధులకు ఆసక్తి ఉన్నవారికి Astrology workshops నిర్వహించి రెండు దశాబ్దాల సాధనా ఫలితంగా నేను తయారు చేసుకున్న నా ప్రత్యేక జ్యోతిష్య విశ్లేషణా విధానాన్ని నేర్పించడం కూడా ముందు ముందు జరుగుతుంది.

నా ఫోన్ నంబర్ - 9700076750.

ఇది పుస్తకం మీద కూడా ఉన్నది.సాధనా మార్గంలో నా మార్గనిర్దేశనం కావలసినవారు,శ్రద్ధ ఉన్నవారు సంప్రదించవచ్చు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్నెన్నో పనులను మానుకొని దూరాభారాన్ని లెక్కచెయ్యకుండా వచ్చి దీనిని జయప్రదం చేసిన అందరికీ మళ్ళీ ఈ బ్లాగుముఖంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మీరు చూపించిన గౌరవానికీ మీ అభిమానానికీ నా ప్రతిస్పందనను నేను మాటలలో చెప్పలేను.

నాతో వ్యక్తిగత పరిచయాన్ని పెంచుకోవాలనీ,నిజమైన ఆధ్యాత్మిక రహస్యాలను గ్రహించాలనీ,ఆ మార్గంలో ముందుకు నడవాలనీ అనుకునేవారిని "పంచవటి గ్రూపు" లోకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. 

కావలసినవారు నాకు 'ఈ మెయిల్' చేస్తే వారికి గ్రూప్ యాక్సెస్ ఇస్తాను.

మరొక్క విషయం:--

కార్యక్రమానికి వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాటు చెయ్యాలన్న మా కోరిక పూర్తిగా తీరలేదు.దానికి కారణం ఆ ఫంక్షన్ హాలు వారు అక్కడ భోజనాలు చెయ్యడానికి అనుమతించకపోవడమే.కనుక దూరంగా ఉన్న శ్రీ మైథిలీ రాం గారి ఇంటిలో భోజన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది.దూరం గనుక అక్కడకు రాలేక పోయినవారిని, మమ్మల్ని మన్నించమని  ఈ సందర్భంగా కోరుతున్నాను.

ముందు ముందు రాబోయే మరిన్ని పుస్తకావిష్కరణ సభలలో ఈ లోపాన్ని దిద్దుకునే ప్రయత్నం జరుగుతుంది.

ధన్యవాదాలతో,

మీ 

సత్యనారాయణ శర్మ
read more " పుస్తకావిష్కరణ సభ జయప్రదంగా ముగిసింది- ఒక నూతనాధ్యాయం మొదలైంది "

24, డిసెంబర్ 2014, బుధవారం

ఆహ్వానం


read more " ఆహ్వానం "

20, డిసెంబర్ 2014, శనివారం

Hindi Melodies-Ch.Atma-Yaro mujhe maaf karo...




ఇది 70 ఏళ్ళ నాటి పాట.

దీనిని పాడిన గాయకుడు Ch.Atma ఒక లెజెండ్.ఈయన పాతకాలపు హిందీ మధుర గాయకులలో ఒకరు.ఈ మధురగీతం ఆయన పాడిన ప్రైవేట్ పాటలలో ఒకటి.ఇప్పటివారికి ఇలాంటి మధుర గాయకుల గురించి అసలు తెలుసో లేదో అనుమానమే.

ఈయన 1923 లో జన్మించాడు.కాలేజీ రోజులనుంచే పాడటం ప్రారంభించిన ఈయన 1945 లో 'ప్రీతం ఆన్ మిలో' అనే పాటతో రంగప్రవేశం చేశాడు. దాదాపు 70 ఏళ్ళు గడచినా ఇప్పటికీ ఆ పాటను పాతపాటల ప్రేమికులు వింటూ పాడుకుంటూనే ఉంటారంటే దాని సాహిత్యపు విలువా,సంగీతపు విలువా అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుత గీతం కూడా అలాంటిదే.

70 ఏళ్ళు గడచినా ఈనాటికీ ఇది మరపురాని మధురగీతంగానే నిలిచి ఉన్నది.అప్పట్లో పెద్దగా వాయిద్యాలు లేవు.నేటిలాగా ఎలెక్ట్రానిక్ వాయిద్యాల హోరు లేదు.కానీ అతి తక్కువ వాయిద్యాలతో,'ఘటం' లాంటి వాయిద్యాలు వాడి,రాగప్రధానంగా పాడిన ఆనాటి పాటలు కాలపరీక్షకు తట్టుకుని ఈనాటికీ నిలిచి ఉన్నాయంటే ఆ గొప్పదనం ఆ అమరరాగాలదే.

ఈ పాట చాలా గొప్ప మార్మికగీతం.దీనిని వ్రాసిన కవి "మీర్ తాకీ మీర్" సూఫీ భావజాలం ఉన్న వ్యక్తి.ఆయన వ్రాసిన అసలు పాటలో ఇంకా చాలా చరణాలున్నాయి.అవన్నీ చదివితే ఈ పాట అసలు భావం ఏమిటో అర్ధం అవుతుంది.

ఇందులో గాయకుడు 'మిత్రులారా నన్ను క్షమించండి.నేను మత్తులో ఉన్నాను' అంటాడు.అతడు చెబుతున్న ఈ మత్తు సారాయి త్రాగితే వచ్చే మత్తుకాదు.దివ్యప్రేమతో హృదయం నిండిపోయినప్పుడు కలిగే ఒక అద్భుతమైన మత్తు ఇది.ఆ కోణంలో ఈ పాటను అర్ధం చేసుకుంటే దీనిలో ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మికార్ధం కనిపిస్తుంది.

ఈ పాటలో "యారోం.."  అంటే అప్పటివరకూ తనను అదుపులో ఉంచుకుని నడిపిస్తున్న ఇంద్రియదాస్యం అని అర్ధం.

"ఇన్నాళ్ళూ మీ స్నేహం చేశాను.ఇక చాలు.నన్ను క్షమించండి.ఇప్పుడు నన్ను మీకర్ధం కాని ఒక మత్తు ఆవహించింది.కనుక ఇంక మీ అవసరం నాకు లేదు.ఒకవేళ మీరు ఇంకా నాతో త్రాగించాలని అనుకుంటే(ఇంతకు ముందులాగా ఇంద్రియాకర్షణలతో ప్రలోభపెట్టాలని అనుకుంటే) కుదరదు. కనుక ఒక ఖాళీ పానపాత్రను ఇవ్వండి.చాలు.ఎందుకంటే ఇప్పటికే నాకు బాగా మత్తెక్కి ఉన్నది" అంటాడు.

"ఈ మత్తులో నా అడుగులు తడబడవచ్చు.అంటే మీకర్ధం కాని మాటలు నేను మాట్లాడవచ్చు.మీ దారిలో నేను రాకపోవచ్చు.నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు మీకర్ధం కాని మత్తెక్కింది." అంటాడు. 

మీరిప్పుడు రెండు పనులు చెయ్యవచ్చు.

ఒకటి-నా చేతులను మీ చేతులలోకి తీసుకోండి.అంటే నేను పొందుతున్న ఆనందాన్ని మీరూ స్వీకరించండి.అది మీకూ అందాలంటే ఒక పానపాత్రను ప్రేమగా తీసుకున్నట్లు నా చేతులను మీరు పట్టుకోవాలి.

రెండు-ఒకవేళ నన్ను తాకడం మీకిష్టం లేకపోతే, నాతో కొంతదూరం నడచి చూడండి.అంటే, నేను నడుస్తున్న మార్గంలో మీరూ కొంతదూరం నడచి రండి.అప్పుడే నేను ఎలాంటి మత్తులో ఉన్నానో మీకూ తెలుస్తుంది." అంటాడు.

ఆధ్యాత్మిక సాధనలో ఇవి రెండే మార్గాలు.ఇవి తప్ప ఇంకే మార్గమూ అక్కడ లేదు.ఉండబోదు.

చాలా గొప్ప మార్మికార్ధం ఉన్న ఆధ్యాత్మిక గీతం.

కాకపోతే నాకెందుకు నచ్చుతుంది?

Song:--Yaro mujhe maaf karo mai nashe me hoo...
Movie:--Non film song (year not known)
Lyrics:-Mir Taqi Mir
Music:-Murali Manohar Swarup
Singer:-Ch.Atma
Karaoke Singer:- Satya Narayana Sarma

Enjoy
-------------------------------------------------

Yaro mujhe maaf karo-mai nashe me hoo-2
Ab do to jaam khaali hi do-mai nashe me hoo
Yaro mujhe maaf karo

Maajoor ho jo paav mera-Betara pade-2
Betaraa pade
Tum Sargaraa to mujh se na ho
Mai nashe me hoo..                       

Yaro mujhe maaf karo

Ya haatho haath lo mujhe-Jaise ke jaame mai-2
Jaise ke jaame mai
Ya thodi door saath chalo
Mai nashe me hoo

Yaro mujhe maaf karo
Mai nashe me hoo

Yaro mujhe maaf karo....

Meaning:--

Friends ! Forgive me ! I am intoxicated.
If you want to give, give me an empty goblet
For I am already intoxicated
Friends! Forgive me.

I seek your pardon if my feet take a mis-step
You wont be angry with me.
Will you?
For I am intoxicated.
Friends! Forgive me.

Either take me hand in hand,as you would a glass of wine
or walk a little distance with me
For I am intoxicated.

Friends! Forgive me.
I am intoxicated.
read more " Hindi Melodies-Ch.Atma-Yaro mujhe maaf karo... "

19, డిసెంబర్ 2014, శుక్రవారం

28-12-2014 ఆదివారం - 'శ్రీవిద్యా రహస్యమ్' పుస్తకావిష్కరణ

ఆంధ్రదేశానికి,తెలుగు ప్రజలకు,ఒక అద్భుతమైన కానుక.

తెలుగుపద్య సాహిత్య చరిత్రలోనూ,ఆధ్యాత్మిక చరిత్రలోనూ,శుద్ధ శ్రీవిద్యాసాంప్రదాయం లోనూ చిరస్థాయిగా నిలిచిపోయే సంఘటన.

చాలామంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంఘటన.
జగజ్జనని అనుగ్రహంతో ఎట్టకేలకు సాకారం కానున్నది.

రాబోయే ఎంతోకాలంపాటు అటు ఆధ్యాత్మికరంగంలోనూ ఇటు సాహిత్యరంగంలోనూ ధృవతారగా నిలిచి ఉండి,ఎంతమంది చేతనో చదవబడుతూ,ఎంతమంది జీవితాలనో దివ్యత్వంతో వెలిగించబోయే అద్భుతమైన ఆధ్యాత్మికగ్రంధం 'శ్రీవిద్యారహస్యమ్' వెలుగు చూడబోతున్నది.

1200 పైగా తెలుగు పద్యాల ద్వారా,వాటి వివరణద్వారా,శుద్ధ శ్రీవిద్యోపాసన ఎలా ఉంటుందో,ఈ ఉపాసనకు గల తాంత్రిక మూలములు ఏమిటో,దానికి గల వేదప్రామాణికత ఏమిటో,ఈ గ్రంధంలో అత్యంత సరళమైన వ్యావహారిక భాషలో వివరించబడింది.అంతేగాక,నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మిక సాధన ఎలా ఉంటుంది?దానికి కావలసిన అర్హతలు ఏమిటి? దానిని చేసే విధానాలు ఎలా ఉంటాయి?దాని పరమ గమ్యం ఏమిటి?దానిని ఎలా సాధించాలి?మొదలైన అనేక విషయాలు కూడా సందర్భోచితములుగా వివరించబడ్డాయి.

28-12-2014 ఆదివారంనాడు విజయవాడలో 'శ్రీవిద్యారహస్యమ్' గ్రంధావిష్కరణ జరుగుతుంది.అందరికీ అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఆదివారంనాడు పెట్టుకోవడం జరిగింది.

ఆ తర్వాత, జనవరి 1 నుంచి 10 వరకు విజయవాడ P.W.D గ్రౌండ్స్ లో జరుగబోయే 'పుస్తక మహోత్సవం (Book Exhibition)' లోని 'శ్రీ మహాలక్ష్మీ బుక్ కార్పోరేషన్' వారి స్టాల్లో ఈ పుస్తకం లభ్యమౌతుంది.

దూరప్రాంతాలలో ఉన్నవారికోసం ఈ పుస్తకం ఆన్ లైన్ లో కూడా లభ్యమౌతుంది.'కినిగే' వారితోగానీ,ఇతర ఆన్ లైన్ బుక్ ప్రొవైడర్స్ తో గాని అనుసంధానం అవ్వడం ద్వారా ఈ సౌకర్యం కల్పించబడుతుంది.ఆ పని జరుగుతున్నది.

నా శిష్యులను,అభిమానులను,నా బ్లాగు పాఠకులను,నన్ను కలవాలని అనుకునే అందరినీ ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాను.నాతో ముఖాముఖీ మాట్లాడాలనుకునే వారికి,సందేహాలు తీర్చుకోవాలనుకునేవారికి ఇదే నా స్వాగతం.

చాలామంది నన్ను ఎప్పటినుంచో అడుగుతున్నారు.మీ 'శ్రీవిద్యా రహస్యమ్' పుస్తకం రిలీజ్ చేసేది ఎప్పుడో చెప్పండి? అని.

అనేక కారణాల వల్ల ఈ కార్యక్రమం ఆలస్యం అవుతూ వస్తున్నది.అందుకే అడిగినవారికందరికీ 'ఒకవారం ముందుగా చెప్తాను' అని చెబుతూ వస్తున్నాను.చెప్పిన విధంగా ఒక వారం ముందుగా బ్లాగుముఖంగా ఈ సభను ఎనౌన్స్ చేస్తున్నాను.

ఆ రోజున-'శ్రీవిద్యోపాసన' గురించి,ఈ పుస్తకం గురించి,నా ఉపన్యాసం ఉంటుంది.అలాగే,ఆధ్యాత్మిక రంగంలో అనుభవజ్ఞులైన మిత్రులు మరికొందరు కూడా మాట్లాడతారు.ఈ సభకు రాలేని వారికోసమై,మరియు విదేశాలలో ఉన్న నా అభిమానుల కోసమై,సభాకార్యక్రమం వీడియో అంతా ఈ బ్లాగ్లో కాలక్రమేణా అప్ లోడ్ చెయ్యబడుతుంది.

తేదీ
28-12-2014 (ఆదివారం)

సమయం
ఉదయం 10.00 గంటలకు.

పుస్తకావిష్కరణ వేదిక
విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అసోసియేషన్ హాల్
అంజనం బిల్డింగ్
సివిల్ కోర్టుల ఎదురుగా
గవర్నర్ పేట.
విజయవాడ.

అందరూ ఆహ్వానితులే.
read more " 28-12-2014 ఆదివారం - 'శ్రీవిద్యా రహస్యమ్' పుస్తకావిష్కరణ "

16, డిసెంబర్ 2014, మంగళవారం

Hindi Melodies-Mohd.Rafi-Deewana Mujh Sa Nahin...






మహమ్మద్ రఫీ గొంతుతో నాకు చాలా తేలికగా శృతి కలుస్తుంది.ఆయన పాటలు పాడేటప్పుడు నాకు చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది.నేను అభిమానించే గాయకులలో రఫీ మొదటి వరుసలో ఉంటాడు.

ఇప్పటివరకూ ఆయన పాటలు నా బ్లాగ్ లో అప్ లోడ్ చెయ్యలేదు.ఆ వరుసలో ఇదే మొదటిపాట అవుతుంది. ముందు ముందు రఫీ పాడిన మధురగానాలలో ఎన్నో ఎన్నెన్నో నా బ్లాగ్ లో మీకు కన్పించబోతున్నాయి.

ఈ మధురగీతం 'తీస్రీ మంజిల్' అనే సినిమా లోది.

ఈ పాటకు నటించినది- షమ్మి కపూర్, ఆశా పరేఖ్.

షమ్మికపూర్ విలక్షణ నటుడు.పాటలలో ఆయన చేసే నటన చాలా నవ్వు పుట్టిస్తుంది.ఆయనకు డాన్స్ రాదు.కానీ ఆయనేది చేస్తే అదే డాన్స్ అయ్యేది. తలనూ శరీరాన్నీ అష్టవంకరలుగా తిప్పుతూ పాటలలో ఆయన చేసే డాన్స్ ఆయనకే ప్రత్యేకమైన శైలి.కామెడీ చేసినట్లు కనిపించినప్పటికీ చాలా సీరియస్ రోల్స్ కూడా ఆయన చెయ్యగలడు.

ఈ పాటను వ్రాసిన నాసిర్ హుసేన్ ఈ చిత్ర నిర్మాత కూడా.అప్పటి చిత్ర నిర్మాతలకు కూడా మంచి టేస్ట్ ఉండేదని చెప్పడానికి ఈ విషయమే నిదర్శనం.

Movie:--Teesri Manzil (1966)
Song:--Deewaana Mujh Sa Nahin
Lyrics:--Nasir Hussain
Music:--R.D.Burman
Singer:--Mohammad Rafi
Karaoke singer:--Satya Narayana Sarma

Enjoy
--------------------------------------------------


Deewana Mujh Sa Nahin,

Is Ambar Ke Neeche



{Deewana Mujh Sa Nahin,

Is Ambar Ke Neeche


Aage Hai Qatil Mera,

Aur Mein Peeche Peeche..}-2


Paaya Hai Dushman Ko,

Jab Se Pyaar Ke Kabil,

Tab Se Ye Aalam Hai,

Rasta Yaad Na Manzil,

Neend me Jaise Chalta Hai Koyi,

Chalna Yunhi Aankhen Meeche..     ||Deewana||


Hamne Bhi Rakh Di Hai,

Kal Pe Kal Ki Baaten,

Jeevan Kaa Hasil Hai,

Pal Do Pal Ki Baaten,

Do Hi Ghadi Ko Saath Rahega,

Karna Kya Hai Tanha Jeeke..            ||Deewana||


Meaning:--

Insane fellow like me there is none

under this sky..

Ahead of me is my killer,

and I am following behind


I found a killer worthy of love

since then I forgot my path or my goal

I am just walking behind with my eyes shut

like one who walks in sleep


I have decided-'let future do whatever it likes'

because life's summary is only this moment..

We live only for a few moments here

then what shall we achieve by living alone?


Insane fellow like me there is none

under this sky..

Ahead of me is my killer,

and I am following behind...
read more " Hindi Melodies-Mohd.Rafi-Deewana Mujh Sa Nahin... "

14, డిసెంబర్ 2014, ఆదివారం

లక్ష్మీగణపతి హోమం

మొన్నీ మధ్యన ఒక గ్రూపువాళ్ళు నా దగ్గరకు వచ్చి కలిశారు.

అదీ ఇదీ మాట్లాడాక,వచ్చిన విషయం చెప్పారు.

'మేము ఫలానా రోజున సామూహిక లక్ష్మీగణపతి హోమం చేస్తున్నాం.మీ పేరు కూడా చేర్చుకుందామని వచ్చాం.'-అన్నారు.

వాళ్ళ ముఖాలలోకి తేరిపార చూచాను.

బొట్లు పెట్టుకుని ఉన్నారుగాని,ఒక్కడి ముఖంలోనూ తేజస్సుగానీ వర్చస్సుగానీ లేదు.దొంగల ముఖాలలాగా ఉన్నాయి.

వీళ్ళకు జ్ఞానభిక్ష పెట్టక తప్పదనుకున్నా.

'లక్ష్మీ గణపతియా? అదేంటి? లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కదా? లక్ష్మీ గణపతి ఎక్కడనుంచి వచ్చాడు?ఆయన పుట్టు పూర్వోత్తరాలెంటి?ఎప్పుడూ వినలేదే?' అడిగాను ఏమీ తెలీనట్లు.

నా అజ్ఞానానికి వాళ్ళ లీడర్ చిరునవ్వు నవ్వాడు.

'పెద్దవారు మీరు కూడా అలా అంటే ఎలా సార్?కోరికలు తీరడానికి లక్ష్మీ గణపతి హోమాన్ని మించింది లేదు' అన్నాడు.

'ఓరి మీ కోరికలు పాడుగాను.ఎవడిని కదిలించినా కోరికలు కోరికలు అంటూ చస్తున్నారు' అనుకున్నా లోలోపల.

వీడికి ఇలా కాదు జవాబు చెప్పాల్సింది అని రూటు మార్చా.

'మీకూ చూడబోతే ఒక ఏభై ఏళ్ళు ఉన్నట్టు కనిపిస్తున్నాయి.మీరూ పెద్దవారే కదా.మరి మీకు ఇంకా కోరికలేమిటి?అంత తీరని కోరికలు మీకు ఇంకా ఏం మిగిలున్నాయి?'అడిగాను.

చెప్పగానే ఎగిరి గంతేసి "నా పేరు కూడా వ్రాసుకోండి" అనకుండా వాదన పెట్టుకున్నందుకు వారి ముఖాలలో చికాకూ అసహనమూ ప్రత్యక్షమయ్యాయి.

'ఏవో ఒకటి ఉంటాయి కదా సార్.కోరికలో బాధ్యతలో.'అన్నాడు.

'అవి తీరాలంటే హోమాలు చేస్తే తీరుతాయా?లేక ఆ మార్గంలో ప్రయత్నం చేస్తే తీరుతాయా?' అడిగాను.

'పొద్దున్నే అనవసరంగా వీడి దగ్గరికి ఎందుకొచ్చాంరా దేవుడా?' అన్న ఫీలింగ్ వాళ్ళ ముఖాలలో కనిపించింది.

'ఇంతకీ లక్ష్మీగణపతి పుట్టు పూర్వోత్తరాల గురించి నా సందేహం మీరు తీర్చనే లేదు?' అడిగాను.

'పోదాం పదండి సార్.ఈయన ఇచ్చేటట్లు లేడు' అన్నాడు వాళ్ళ గ్రూపులో ఒక వ్యక్తి అసహనంగా.

'ఉండు బాబు.అప్పుడే ఒక నిర్ణయానికి రాకు.ఇవ్వనని నేను చెప్పలేదు కదా. కానీ విషయం ఏమిటో తెలుసుకోకుండా మీరడిగిన వెంటనే ఎలా ఇస్తాను?నేనూ ఒక లక్ష రూపాయలు అడుగుతాను.నీవు వెంటనే ఇచ్చేస్తావా?' అడిగాను.

వాళ్లకు బాగా కోపం వచ్చేసిందని వాళ్ళ ముఖాలు చూస్తూనే తెలుస్తున్నది.

'ఆయన ఒక దేవత' అన్నాడొకడు.

'ఏమిటో ఆయన ప్రత్యేకత?'- అన్నాను ప్రాస కలుపుతూ.

'చెప్పాం కదా సార్.కోరికలు తీరుతాయని.' అన్నాడు ఇంకొకడు.

అలా అంటూ నాకొక ఫోటో చూపించారు.

'ఇంతకు ముందు చేసిన హోమంలో ఫోటో తీస్తే మంటల్లో వినాయకుడి ఆకారం ఎంత స్పష్టంగా పడిందో చూడండి.'అని చెప్పారు.

వాళ్ళ మొహం మీదే నవ్వాను.

'హోమజ్వాలలో వినాయకుడి రూపం ఒక సెకన్ పాటు కనిపిస్తే మీకేం ఒరిగింది?' అడిగాను.

జవాబు లేదు.

'మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ హోమం చేస్తున్నారు?' అడిగాను.

'అయిదేళ్ళ నుంచి వరుసగా చేస్తున్నాం' అన్నాడు లీడర్.

'మరి మీమీ కోరికలు అన్నీ తీరాయా? నిజంగా చెప్పండి.ఒకవేళ తీరితే ఇంకా మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు?' అడిగాను.

'లోకకల్యాణం కోసం చేస్తున్నాం.' అన్నాడొకడు.

'లోకానికి కల్యాణం ఒక్కటేనా శోభనం కూడా మీరే చేస్తారా?' అని అందామని నోటిదాకా వచ్చి ఆగిపోయింది.

'మీరేం అనుకోకపోతే ఒకమాట చెప్తాను' అన్నాను.

వాళ్ళు ప్రశ్నార్ధకంగా చూస్తున్నారు.

'మీ ఇల్లెక్కడ' అడిగాను ఆ లీడర్ని.

'అరండల్ పేట' అన్నాడు.

'రైల్వే స్టేషన్ మీ దగ్గరలోనే ఉన్నది కదా' అడిగాను.

'అవును' అన్నాడు.

'గత వారం రోజులుగా ఒక దిక్కులేని ఆడది ఒంటిమీద చీర కూడా సరిగ్గా లేకుండా స్టేషన్ పరిసరాలలో తిరుగుతున్నది.గమనించారా మీలో ఎవరైనా?' అడిగాను.

వాళ్ళు ముఖముఖాలు చూచుకున్నారు.

'మీకు నిజంగా లోకకల్యాణం చెయ్యాలని ఉంటే,అలాంటి దిక్కులేని వాళ్లకి సాయం చెయ్యండి.చలికాలం కదా మీరు దుప్పట్లు కప్పుకుని వెచ్చగా ఇంట్లో పడుకుంటున్నారు.ఆ ఆడది ఒంటిమీద బట్టలు కూడా సరిగ్గా లేకుండా ఈ చలిలో దోమలతో కుట్టించుకుంటూ ఆరుబయట తెల్లవార్లూ ఎలా ఉంటున్నదో ఆలోచించారా?మీరు బాగా తిని రోజుకు పదిసార్లు టీలో కాఫీలో తాగుతారు. ఆమెకు అసలు తిండి ఉందో లేదో ఎన్నాళ్ళ నుంచీ అలా పస్తుంటున్నదో ఆలోచించారా?మీకు నిజంగా లోకానికి మేలు చెయ్యాలని ఉంటె అలాంటి వారికి సాయం చెయ్యండి.అంతేగాని ఇలాంటి పిచ్చిపిచ్చి హోమాలు కాదు.

మీ హోమానికి అయ్యే ఖర్చుతో ఒక బీదవిద్యార్ధి చదువుకు సాయం చెయ్యండి. లేదా ఆకలితో ఉన్న ఒక దీనుడికి ఒక పూట అన్నం పెట్టండి.లేదా ఇంకా మీకు ఓపికుంటే అతని బ్రతుకు తెరువుకు మార్గం చూపండి.దేవుడు నిజంగా సంతోషిస్తాడు.' అన్నాను సీరియస్ గా.

'అది వారివారి ఖర్మ.మనమే చేస్తాం?' అన్నాడొకడు.

'మీ కోరికలు తీరకపోవడం కూడా మీ ఖర్మే అని దేవుడూ అనుకోవచ్చుగా.మీ హోమాలకు ఆశపడి మీకెందుకు ఆయన సాయం చెయ్యాలి?' అడిగాను.

అందరూ లేచి నిలబడ్డారు.

'సార్.మీకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని డైరెక్ట్ గా చెప్పండి.ఈ డొంక తిరుగుడు మాటలెందుకు?' అన్నాడొకడు సీరియస్ గా.

వాళ్ళ పౌరుషం చూచి నాకు చచ్చే నవ్వొచ్చింది.

'దీన్నే వీరముష్టి అంటారు.అడుక్కుండే వాళ్లకి అంత బలుపు ఉండకూడదు.' అన్నా నేనూ సీరియస్ గానే.

'పోదాంపదండి సార్.లక్ష్మీగణపతి గురించి ఈయనలాంటి వాళ్ళకెలా తెలుస్తుంది?' అన్నాడొక పిలకాయన నిర్లక్ష్యంగా చూస్తూ.

'బాబూ నీ వయసెంత?' అడిగాను పిలకని.

'నలభై ఒకటి' అన్నాడు.

"నీకు ఇంకా లాగూ సరిగ్గా కట్టుకోవడం రాకముందే నాకు లక్ష్మీగణపతి మంత్రానుష్టాన విధానం తెలుసు.ప్రపంచంలో నీతోనే అన్నీ పుట్టాయని అనుకోకు.అనుష్టానవిధానమే కాదు,కామ్యకర్మలలో ప్రయోగ ఉపసంహార విధానాలు కూడా తెలుసు." అంటూ "ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే..."అనే లక్ష్మీగణపతి శ్లోకం చదివాను.

వాళ్ళు బిత్తరపోయారు.

'మరి తెలిసి ఎందుకు మమ్మల్ని అడిగారు?పరీక్షా?' అన్నాడు వాళ్ళ లీడర్.

'పరీక్షేమీ లేదు.మీకు నిజంగా తెలుసో లేదో తెలుసుకుందామని అడిగాను. మీకు తెలీదని తెలిసిపోయింది.మీకే తెలీనిదాన్ని పట్టుకుని ఇంకొకరి దగ్గరకు మీరెలా వచ్చారు?' నేనూ ఎదురు ప్రశ్నించాను.

వాళ్ళందరూ మూకుమ్మడిగా నా గదిలోనుంచి బయటకు వెళ్ళిపోయారు.

లోకం అంతా ఇలాంటి దొంగలతో నిండి ఉన్నది.

ఏదో ఒక దేవతని పట్టుకోవడం,గుడో గోపురమో హోమమో ఏదో ఒక ప్రాజెక్ట్ పెట్టుకుని ఇక జనాల భయాన్నీ ఆశనీ ఆసరాగా తీసుకుని వాళ్ళను రెలిజియస్ బ్లాక్ మెయిల్ చేస్తూ పబ్బం గడుపుకునే ఇలాంటి వెధవలు ఎంతో మంది మన చుట్టూ ఉన్నారు.

చుట్టూ ఉన్న దీనుల బాధలు పట్టని మనం,మన బాధలు మాత్రం తీర్చమని దేవుడిని అడుగుతాం.దేవుడికి కూడా లంచం ఇవ్వబోతాం.ఆయనతో వ్యాపారం మొదలుపెడతాం.దేవుడేం పిచ్చివాడా మన దొంగపూజలకూ ట్రిక్కులకూ కరిగిపోవడానికి?నీ సాటిమనిషి బాధ నీకు పట్టనప్పుడు నీ బాధను దేవుడెందుకు పట్టించుకుంటాడు?

సాటి మనిషిలో దైవాన్ని చూడమని వివేకానందస్వామి అన్నారు.అదే అత్యుత్తమమైన పూజ అని ఆయన చెప్పారు.మనం ఆయన్ను మరచిపోయాం.ఆయనేం చెప్పారో మరచిపోయాం.సాటి మనిషిలో దైవాన్ని చూడలేని వాడు హోమగుండంలో పూజల్లో రాతి విగ్రహాలలో ఏం చూడగలడు?

ప్రసిద్ధ దేవాలయాలలో దర్శన సమయంలో పక్క మనిషిని చేతులతో కాళ్ళతో తోసేస్తూ తొక్కుతూ గర్భగుడిలోని విగ్రహాన్ని చూడాలని ఎగబడే అర్భకుల వంటి వారే వీళ్ళు కూడా.

మానవత్వమే లేనివారికి దైవం గురించి మాట్లాడే హక్కెక్కడిది?
read more " లక్ష్మీగణపతి హోమం "

12, డిసెంబర్ 2014, శుక్రవారం

June 21-World Yoga Day

జూన్ 21 ని 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'గా ఐక్యరాజ్యసమితి ప్రకటించడం చాలా ముదావహం.ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగాభిమానుల కందరికీ ఇది ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నది.అదికూడా సమ్మర్ సోల్స్టైస్ అయిన జూన్-21 ఆరోజుగా ఎంచుకోవడం జ్యోతిష్యశాస్త్ర పరంగా కూడా చాలా సరిగ్గా ఉన్నది.

నరేంద్రమోడీగారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన దేశ విధానాలలో ఎన్నో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి.ఎన్నోరంగాలలో ఆరోగ్యకరమైన మార్పులు వస్తున్నాయి.అలాగే సాంస్కృతిక ధార్మికరంగాలలో కూడా వస్తున్నాయనడానికి ఇదొక సూచన.

నా ఉద్దేశ్యం ప్రకారం ఇది ఇప్పటికే ఎంతో ఆలస్యం అయిన సంఘటన.

అన్నిదేశాల వాళ్ళూ వారివారి సంస్కృతిలో ముఖ్యమైన అంశాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుకోసం ప్రయత్నాలు చేస్తూ ఆ గుర్తింపును సాధించుకుంటూ ఉంటె,మనం మాత్రం లోలోపలకు ముడుచుకుపోతూ ఆత్మన్యూనతా భావంతో బ్రతుకుతూ ఉన్నాం.

మనదేశం ప్రపంచానికి ఇచ్చిన బహుమతులు ఎన్నో ఉన్నాయి.పెట్టిన జ్ఞానభిక్ష ఎంతో ఉన్నది.కానీ వాటిని మనం క్లెయిం చేసుకోవడం లేదు.అలా చేసుకోవడానికి మనకు సెక్యులర్ ఇమేజి ఒకటి అడ్డోస్తూ ఉన్నది.

'యోగా' అనేది ఎంత విలువైనదో ప్రపంచవ్యాప్తంగా బుద్ధి అనేది ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తించారు.దాదాపు ఏభై ఏళ్ళ క్రితం నుంచే హాలీవుడ్ సెలెబ్రిటీలతో సహా ఎందఱో 'యోగా' చేస్తూ దేహసౌష్టవాన్నీ ఆరోగ్యాన్నీ కాపాడుకుంటూ వస్తున్నారు.కాని మనకుమాత్రం నేటికీ యోగామీద పూర్తి అవగాహన లేదు.ఇది శోచనీయం.

నిజమైన 'యోగా' అంటే శరీర ఆరోగ్యాన్ని మాత్రమే కాపాడుకునే ఒక వ్యాయామం కాదు.అది ఒక ఆధ్యాత్మికమైన జీవనవిధానం.పోనీ ఈ మాట అందరికీ నచ్చకపోయినా,యోగాలోని కొన్ని అంశాలైన ఆసనాలు, ప్రాణాయామం,కొన్ని ముద్రలు,కొన్ని క్రియలు చెయ్యడంవల్ల ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండే మాట వాస్తవమే.

యోగా అనేది మన హిందూమతంలో అంతర్భాగమే.యోగా అనేది మతం కాదు ఇదొక జీవనవిధానం అంటూ మనం నంగినంగిగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు.ఇందులోని కాన్సెప్ట్స్ అన్నీ హిందూమతానికి ముడిపడి ఉన్నట్టివే.ఇందులో ఏమీ అనుమానం లేదు.అయితే యోగా చేసినంత మాత్రాన మతం మార్చుకోవలసిన పనేమీ లేదు.ఈ విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలి.

కొందరు పాశ్చాత్య పిడివాదులు అనుకునేటట్లు యోగా అనేది 'సైతాన్ ఆరాధన' కానేకాదు.యోగా అనేది భగవంతుని చేరుకునే అనేక మార్గాలలో ఒకటని మన మతం ఎప్పుడో చెప్పేసింది.

మనకు స్వాత్రంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ళకైనా కనీసం మన విద్యకంటూ ఒక అంతర్జాతీయ గుర్తింపు లభించినందుకు యోగాభిమానులంతా పండుగ చేసుకోవలసిన శుభదినం ఇది.

వివేకానందస్వామి వల్ల ప్రపంచానికి మన దేశపు ధార్మికఔన్నత్యం అర్ధమైతే, ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత ఆయన అనుచరుడైన నరేంద్రమోడీ వల్ల మన 'యోగా'కి ఒక అంతర్జాతీయ గుర్తింపు అఫీషియల్ గా వచ్చింది.

ఈ విషయంలో నరేంద్ర మోదీగారిని మనస్ఫూర్తిగా అభినందించక తప్పదు.
read more " June 21-World Yoga Day "

11, డిసెంబర్ 2014, గురువారం

భగ్నప్రేమ

మొన్నీ మధ్యన ఒక తెలిసినాయన ఫోన్లో మాట్లాడుతూ ఇలా అన్నాడు.

'సార్.మీరేం అనుకోకపోతే ఒక మాట చెప్తాను.'

'ఏమనుకుంటానో ముందే చెప్పలేనుగాని మీరు చెప్పాలనుకున్నది చెప్పండి' అన్నాను.

'మీ పోస్ట్ లు చదివి మా ఆవిడ ఒక మాటన్నది.ఈయన భగ్నప్రేమికుడై ఉంటాడు.'-అన్నది సర్.

ఫకాల్న ఫోన్లోనే నవ్వేశాను.

'ఎందుకు నవ్వుతున్నారు?' అడిగాడాయన.

'ఎందుకలా అన్నారో మీ శ్రీమతి?' అన్నాను.

'అంటే మీరు వ్రాసే కవితలు,పాడే పాటలను బట్టి అలా అనిపించింది' అన్నాడు.

ఈ సారి ' హ హ్హ హ్హ' అంటూ వికటంగా పెద్దగా నవ్వాను.

'ఇప్పుడు మీరూ ఏమీ అనుకోకూడదు.నేనూ ఒక విషయం చెప్తాను.' అన్నాను.

ఆయన గొంతులో అనుమానం ధ్వనించింది.

'చెప్పండి.'

'అసలు మీ ఆవిడే ఒక భగ్నప్రేమికురాలేమో కనుక్కోండి.'

'అదేంటి అలా అన్నారు?'

'అవును.మన లోపల ఏముందో అదే బయట కనిపిస్తుంది. నా పోస్ట్ లలో భగ్నప్రేమ ఆమెకు కనిపించిందీ అంటే ఆమెకూడా ఒక భగ్నప్రేమికురాలే అయి ఉంటుంది.సైకాలజీ ఇంతే చెప్తుంది.' అన్నాను.

ఆయనేమీ మాట్లాడలేదు.ఫోన్ పెట్టేశాడు.

మొన్నీ మధ్యన ఒక స్నేహితురాలు కూడా ఇదే చెప్పింది.ఆమె ఫ్రెండ్ కి కూడా నా కవితలు చదివి ఇలాగే అనిపించిందిట.

ఆమెతో ఇంకా సూటిగా చెప్పాను.

"మేకకి దేనినైనా తినడమే తెలుసు.అంతకంటే దానికి ఇంకేం తెలుస్తుంది?" అన్నాను.

ఆమెకి అర్ధం కాలేదు.

'అదేంటి అలా అన్నారు?' అంది.

'ఒక గులాబీ పువ్వును తీసుకెళ్ళి మేక ముందు ఉంచామనుకో.దాని సౌందర్యాన్ని ఆస్వాదించడం దానికి రాదుకదా.అందుకని నోట్లో వేసుకుని పరపరా నమిలి పారేస్తుంది.దానికి తెలిసిన 'టేస్ట్' అంతే.మీ స్నేహితురాలు కూడా ఒక మేకలాంటిదే.' అన్నాను.

వింటున్న తనకు కోపం వచ్చి ఉండవచ్చు.కానీ నేను నిజం చెప్పక తప్పదు.

ఒక గులాబీ అందాన్నీ సౌందర్యాన్నీ ఆస్వాదించాలంటే ఆపని ఒక భావుకత ఉన్న హృదయం వల్లే అవుతుంది.మొరటు మనిషికి మొగలి పువ్వు ఇస్తే ఏం జరుగుతుందో సామెత ఊరకే పుట్టలేదు.ఇదీ అంతే.ఒక ఉదాత్తమైన భావనను అర్ధం చేసుకోవాలంటే ఉదాత్తమైన హృదయం ఉన్నపుడే అది కుదురుతుంది. అది లేనప్పుడు ఒక అతీతమైన భావాన్ని పొందుపరచిన కవిత కూడా భగ్నప్రేమ లాగే చీప్ గా కనిపిస్తుంది.ఎందుకంటే మనకు తెలిసిన దానినిబట్టే మనం దేనినైనా చూస్తాం.తెలీని దాన్ని బట్టి చూడలేం.మనదగ్గర గజంబద్ద ఉంటే దానితోనే దేనినైనా కొలవగలం.లేనిదానితో ఎలా కొలుస్తాం?

జిల్లెళ్ళమూడి అమ్మగారు ఒక మాట అనేవారు.

'గజంలో అంగుళాలున్నాయి గాని అంగుళంలో గజాలు లేవు నాన్నా' అనేవారు.

ఇదెంత అద్భుతమైన మాటో?

ఎవరైనా ఒక మంచి హృద్యమైన కవిత వ్రాసినా,ఒక పాథోస్ సాంగ్ పాడినా వెంటనే వినేవారు అనుకునే మాట -"భగ్నప్రేమ".

మార్మికులందరూ (Mystics) లోకానికి భగ్నప్రేమికుల లాగానో,పిచ్చివారి లాగానో మాత్రమే కనిపించారు.ఇదేమీ కొత్తవిషయం కాదు.ఎప్పటినుంచో జరుగుతున్న పాతకధే.సూఫీ యోగులందరూ లోకానికి పిచ్చివారిగానే కనిపించారు.మీరాబాయిని లోకం పిచ్చిదనే అన్నది.వేశ్య అని కూడా అన్నది. బస్రా నివాసి 'రబియా' అనే ఒక సూఫీ మహాత్మురాలిని కూడా లోకం వేశ్య అనే అనుకుంది.అక్కడిదాకా ఎందుకు?కులాన్నీ మతాన్నీ ప్రాంతాన్నీ లెక్కచెయ్యకుండా అందర్నీ ప్రేమగా దగ్గరకు తీసుకునే జిల్లెళ్ళమూడి అమ్మగారి గురించి కూడా లోకులు రకరకాలుగా అనుకునేవారు.

ఆ విషయం అలా ఉంచితే,అసలు 'ప్రేమ' అనేది ఎలా భగ్నం అవుతుందో నాకెప్పటికీ అర్ధం కాదు. భగ్నమయ్యేది ప్రేమ కానే కాదని నేను నమ్ముతాను. మన ఆశ భగ్నం కావచ్చు,మన కోరిక భగ్నం కావచ్చు,మన ఎక్స్ పెక్టేషన్ భగ్నం కావచ్చు.కానీ 'ప్రేమ' ఎలా భగ్నం అవుతుంది? అది అసంభవం.

లోకంలో అత్యంత బలమైన శక్తి 'ప్రేమ'.అది భగ్నం అవుతుందీ అంటే,పైనుంచి కింద పడేస్తే 'వజ్రం' పగిలిపోయింది అన్నట్లుగా ఉంటుంది.పైనుంచి కింద పడేస్తే గాజు పగులుతుంది కానీ వజ్రం పగలదు.

మనుషులలో ఎక్కువమందికి 'ప్రేమ' అంటే ఏమిటో తెలీదని నా ప్రగాఢవిశ్వాసం.ఆడామగా మధ్య ఉండే ఆకర్షణనే ప్రేమ అని లోకంలోని చవకబారు మనుషులు అనుకుంటారు.నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు ఈ ప్రపంచం మొత్తం మీద ఒక పదిమంది కూడా ఉంటారో ఉండరో అని నా ఊహ.

పగిలిపోవడానికీ భగ్నం కావడానికీ 'ప్రేమ' అనేది గాజుబొమ్మ కాదు.అది వజ్రం.దానికి చావు లేదు.

మార్మికులనేవాళ్ళు (Mystics) భగ్నప్రేమికులు కారు.వాళ్ళు అన్వేషకులు. ఈ ప్రపంచంలో దొరకని ఏదో ఒక అతీతసౌందర్యాన్నీ సత్యాన్నీ స్వచ్చతనీ వాళ్ళు నిరంతరం వెదుకుతూ ఉంటారు.దాన్ని అందుకోవాలని వాళ్ళు పరితపిస్తూ ప్రయత్నిస్తూ ఉంటారు.చాలాసార్లు వాళ్ళా ప్రయత్నంలో సఫలీకృతులౌతారు కూడా.

అయితే వాళ్ళ ప్రయత్నం అంతా అంతరికంగా ఉంటుంది.వాళ్ళ అన్వేషణ కూడా అంతరికంగానే ఉంటుంది.వాళ్లకు కలిగే సిద్ధి కూడా బయటకు కనపడకుండా అంతరికంగానే జరుగుతుంది.అయితే దానిని వాళ్ళు బయటకు వ్యక్తపరిచే తీరు,లోకానికి తెలిసిన భగ్నప్రేమికుల తీరుకు దగ్గరగా ఉంటుంది.

ఈ విషయం తెలియనివారు,మార్మిక అన్వేషకులను చూచి భగ్నప్రేమికులని అనుకోవడం వింతేమీ కాదు.

శ్రీ రామకృష్ణులిలా అంటారు.

'పుచ్చు వంకాయలు అమ్ముకునేవారికి వజ్రం విలువెలా తెలుస్తుంది?దాని విలువను కూడా వాళ్ళు వంకాయలలోనే కొలుస్తారు."కోహినూర్ వజ్రాన్ని చూచి -- "మహా అయితే రెండుకేజీల వంకాయల విలువ దీనికి ఉండవచ్చు"- అంటారు.అనుభవజ్ఞుడైన వజ్రాల వర్తకునికే దాని అసలైన విలువ తెలుస్తుంది.'

ఈ మాటలు అక్షర సత్యాలు.

ఎవరెస్ట్ శిఖరం మీద ఏముందో లోయలో ఉన్నవారికెలా కనిపిస్తుంది?
read more " భగ్నప్రేమ "

గురువుగారి వక్రస్థితి - ఫలితాలు

డిసెంబర్ 9 నుంచి గురువు గారి వక్రస్థితి మొదలైంది.ఈ స్థితి  2015 ఏప్రిల్ 8 వరకూ నాలుగు నెలలపాటు ఉంటుంది.

ఈ నాలుగునెలల క్రమంలో గురువుగారు ప్రస్తుతం ఉన్న ఆశ్లేషా నక్షత్రం 4 పాదంనుంచి క్రమంగా వెనక్కు వెళుతూ ఒకటోపాదం వరకూ సంచరిస్తాడు.ఆ తర్వాత ఋజుగతిలోకి ప్రవేశించి మళ్ళీ ఆశ్లేషానక్షత్రం మొత్తాన్నీ దాటుతాడు.

ఈ ప్రతి మార్పూ మనుషుల జీవితాలలో మార్పులు తీసుకొస్తుంది.

చంద్రుడు లేదా గురువు ఆయా రాశులలో ఉన్నవారికి ఆయా ఫలితాలు వర్తిస్తాయి.గమనించండి.

మేషరాశి
చదువు మీద దృష్టి ఎక్కువౌతుంది.ప్రేమవ్యవహారం ముగుస్తుంది.షేర్ మార్కెట్లో నష్టాలోస్తాయి.సంతానానికి చేటుకాలం.

వృషభరాశి
వృత్తి ఉద్యోగాలలో,ఇంటి వ్యవహారాలలో పనిభారం ఎక్కువౌతుంది.

మిధునరాశి
తండ్రికి,పితృసమానులకు,తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు ఆరోగ్య భంగం.కష్టకాలం.

కర్కాటక రాశి
ఖర్చులు నష్టాలు ఎక్కువౌతాయి.మానసిక చింత పీడిస్తుంది.

సింహరాశి
భార్యకు/భర్తకు కష్టకాలం.దూరప్రాంత నివాసం.ఉన్నత స్థాయిలో వారితో విరోధం.

కన్యారాశి
అజీర్ణ బాధలు.గృహసౌఖ్యలోపం.అనుకోని ఆకస్మిక ఖర్చులు.త్రిప్పట ఉంటుంది.

తులారాశి
సంతాన విషయంలో,విద్యావిషయంలో చింత ఎక్కువౌతుంది.స్నేహితుల సాయం అందుతుంది.

వృశ్చికరాశి
ఇంటిలో సమస్యలు కలుగుతాయి.గృహసౌఖ్యం లోపిస్తుంది.తండ్రికి లేదా పితృ సమానులకు కష్ట కాలం.వృత్తిలో ఇబ్బందులు.

ధనూరాశి
కమ్యూనికేషన్ లోపాలు.చికాకులు.విద్యాభంగం.ఇంటిలోని పెద్దవారికి ఆరోగ్య సమస్యలు.

మకరరాశి
తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు కష్టకాలం.నేత్రరోగాలు.విద్యా,ధన సంబంధ విషయాలలో చికాకులు.

కుంభరాశి
అజీర్ణ,కాలేయ సంబంధ సమస్యలు.భార్య/భర్తకు కష్ట కాలం.డబ్బుకు ఇబ్బంది పడతారు.

మీనరాశి
రహస్యవిషయాలలో శ్రద్ధ పెడతారు.మతదృక్పధాలు మారుతాయి. మార్మిక,మాంత్రికవిద్యలలో సాధన చేస్తారు.గుళ్ళు గోపురాలు సందర్శిస్తారు. వాటి కొరకు ఖర్చు పెడతారు.

ఈ ఫలితాలు నేటినుంచి జనవరి 12 వరకూ కనిపిస్తాయి.
read more " గురువుగారి వక్రస్థితి - ఫలితాలు "

10, డిసెంబర్ 2014, బుధవారం

నీ ఇమేజ్ సంగతి ఆలోచించావా?

మొన్న నాలుగో తేదీన ఇక్కడ వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో ఘంటసాల జయంతి సందర్భంగా మ్యూజికల్ నైట్ జరిగింది.అదేమంత ఊహించినంత గొప్పగా సాగలేదు.నాకే నచ్చలేదంటే ఇంక అనుభవజ్ఞులైన ఆడియన్స్ కి నచ్చకపోవడం వింతేముంది?

మంచిపాటలు పాడగల సింగర్స్ ఉన్నప్పటికీ వారికి సరియైన పాటలు ఇవ్వకపోవడం,అసలు ప్రోగ్రాం కంటే కొసరు 'సన్మాన కార్యక్రమం' ఎక్కువ సమయాన్ని ఆక్రమించడం,ఘంటసాల మాస్టారి పాటలకంటే ఒక స్పాన్సర్ తను స్వంతంగా వ్రాసుకున్న ప్రైవేట్ పాటలు పాడి విసిగించడం ప్రేక్షకులలో నిరాశను మిగిల్చింది.ఘంటసాల మాస్టారి అభిమానులు ఎందఱో ఆ కార్యక్రమాన్ని చూద్దామని వచ్చారు.కానీ నిర్వహణాలోపం వల్ల కార్యక్రమం ఫెయిలైంది.

ఆయన పాడుతుంటే జనం 'ఒద్దు ఒద్దు ఆపు దిగిపో దిగిపో' అని ఒకటే గోల.కానీ ఆయనెవరో స్తితప్రజ్ఞుడిలా ఉన్నాడు.తను వ్రాసుకున్న సొంత పాటలన్నీ తాపీ ధర్మారావులా నిదానంగా పాడి చివరిలో 'మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి' అంటూ ఏమీ జరగనట్లుగా స్టేజీ దిగిపోయాడు.ఒక రాగంలేదు, తాళంలేదు,గాత్రధర్మం లేదు. స్టేజీకింది ప్రేక్షకులూ స్టేజీ మీద మేమూ కూడా వినలేక చచ్చాం.

మధ్యలో నేను ఏదో పనుండి బైటకు వచ్చాను.అప్పుడు కొందరు ప్రేక్షకులు నన్ను గుర్తుపట్టి వారి నిరాశను వ్యక్తం చేశారు."సార్.ఇది ఘంటసాల గారి ప్రోగ్రామా?ఆ ప్రైవేట్ పాటలాయన ప్రోగ్రామా?ఆయన ఇంకాసేపు పాడినట్లైతే స్టేజీమీద చెప్పులు పడి ఉండేవి సార్" అని ఒకతను నాతో అన్నాడు.

నేను సరిగ్గా ఆయన వెనుకే కూచుని ఉన్నాను.ఒకవేళ అదే జరిగి ఉంటే, ఉన్నట్టుండి ఒక పల్టీ కొట్టి,చెప్పుల నుంచి తప్పుకుని స్టేజీ కిందకు దూకే అవకాశం మిస్సయింది కదా? మన మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడే అవకాశం పోయిందే? అని బాధపడ్డాను.

'బాబూ.నేను కార్యక్రమ ఆర్గనైజర్ ను కాను.నేనూ ఒక గాయకుడిని మాత్రమే.ప్రోగ్రాం సరిగ్గా జరగకపోవడంలో నా బాధ్యత ఏమీలేదు.' అంటూ నా నిస్సహాయతను వ్యక్తం చేశాను.ఒక చిన్న ప్రోగ్రాములో కూడా ఎన్ని రాజకీయాలు జరుగుతాయో ప్రత్యక్షంగా చూచిన నాకు ఒక్కసారిగా ఇలాంటి ప్రోగ్రాములంటే విరక్తి వచ్చేసింది.

అక్కడున్న ప్రతి ఒక్కరూ వారివారి రాజకీయాలు నడిపారు.గాయకులకు ఎలాట్ చేసిన పాటలు చివరి నిముషంలో మారిపోయాయి.ఆర్కెష్ట్రా వారు బిట్ వర్క్ సరిగ్గా ఇవ్వలేదు.ఘంటసాల మాస్టారి మాటలకంటే జానకి,సుశీల గార్ల సోలో పాటలు ఎక్కువగా పడ్డాయి.నిర్వాహకులలోనూ ఆర్కేష్ట్రా లోనూ ఒక్కరిలో కూడా చిత్తశుద్ధి గానీ ఓపన్ మైండు గాని లేనేలేదు.ఒక టౌన్ లెవల్ ప్రోగ్రాం లోనే ఇన్ని రాజకీయాలుంటే ఇంక కోట్ల రూపాయలతో నడిచే సినిమా ఫీల్డ్ లో ఇంకెన్ని ఉంటాయో అనిపించింది.

ఆరోజు స్టేజీమీద 'మల్లియలారా మాలికలారా' సోలో సాంగ్ పాడాను.వ్యాఖ్యాత ఆ పాటను పొరపాటుగా ఇది 'తోడికోడళ్ళు' చిత్రంలో ఆత్రేయగారు వ్రాసిన పాట అని ఎనౌన్స్ చేశాడు.ప్రేక్షకులలో సంగీతం బాగా వచ్చినవారూ బాగా పాడగలిగిన వారూ ఘంటసాల మాస్టారి వీరాభిమానులూ ఉన్నారు.ఎవరో ఒకాయన లేచి 'అయ్యా ఇది "నిర్దోషి" చిత్రంలోని పాట.నారాయణ రెడ్డిగారు వ్రాసిన పాట.సంగీతం ఘంటసాల మాస్టారు.సరిగ్గా ఎనౌన్స్ చెయ్యండి.'అని అరిచాడు.

నేను పాడటానికి రెడీగా మైకు పుచ్చుకుని ఉన్నాను గనుక వెంటనే 'అవును ఇది సి.నారాయణ రెడ్డిగారు వ్రాయగా ఘంటసాల మాస్టారు స్వరపరచిన పాట.నిర్దోషిలోదే. మీరు చెప్పినది కరెక్టే.' అని మైకులో చెప్పి అతన్ని శాంతింప చేశాను.

ఆ విధంగా 'ఘంటసాల నైట్' నిరాశాజనకంగా ముగిసింది.

ఆ మర్నాడు బృందావన్ గార్డెన్స్ లో జరిగిన "సావిత్రి జయంతి" కార్యక్రమంలో భాగంగా ఆమె నటించిన చిత్రాలలోని గీతాలను కొన్ని ఆలపించాము.

'ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది' పాటను నేనూ,హెలెన్ కుమారీ కలసి పాడాము.

మూడు రోజుల తర్వాత ఒక స్నేహితుడు ఫోన్ చేశాడు.

మామూలు విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఇలా అన్నాడు.

'స్టేజీమీద  పాటల వరకూ బాగానే ఉన్నాయి.బ్లాగులో పాటలు కూడా వింటున్నాను.బాగుంటున్నాయి.కాని ఒక్క విషయం మాత్రం నువ్వు మర్చిపోతున్నావ్.బ్లాగుల్లో ఇప్పటివరకూ ఒక ఆధ్యాత్మిక ఇమేజ్ నీకున్నది. నీ అనాధ్యాత్మిక పోస్ట్ ల వల్ల అది పాడైపోతున్నది.నీ ఇమేజ్ సంగతి ఆలోచించావా?ఉద్యోగపరంగా చూద్దామా అంటే ప్రభుత్వంలో ఒక ఉన్నతాధికారిగా ఉన్నావు.అలాంటి నీవు గుళ్ళలో గోపురాలలో పాటలు పాడటానికి వెళ్ళడం ఏమిటి?

సరే పాడితే పాడావు.బాగా పాడుతున్నావని ముందుముందు వినాయకచవితి పందిళ్ళలో, శ్రీరామనవమి పందిళ్ళలో కూడా రమ్మంటారు.ఆ తర్వాత పెళ్లి ఫంక్షన్స్ లో పాడమంటారు.ఆ తర్వాత రోడ్డుమీద బ్యాండ్ మేళంలో పాడమని పిలుస్తారు.వెళతావా? ఎంత చండాలంగా ఉంటుంది? ఆలోచించు.

బ్లాగుల్లో ఒక్కసారిగా నీ ఆధ్యాత్మిక ధోరణి మార్చేసి సినిమా పాటలు ఇంకా ఏవేవో ఇతర విషయాలూ మొదలుపెట్టావు.నిన్ను గురువుగా భావించే వాళ్ళు కొందరున్నారు.వాళ్ళు ఎంత నొచ్చుకుంటారు?" అంటూ ఈ ధోరణిలో నాకు హితబోధ గావించాడు.

నాకు చచ్చే నవ్వొచ్చింది.

'నీ బాధ నాకర్ధమైందిలే గాని ఒక విషయం చెప్తా శాంతంగా వింటావా?' అడిగాను.

'చెప్పు.తప్పుతుందా?' అన్నాడు.

'ఓషో రజనీష్ అమెరికాలో ఉపన్యాసాలు ఇస్తున్నపుడు అక్కడి క్రిష్టియన్స్ ఒక దుమారం లేవదీశారు."నీ ఉపన్యాసాల వల్ల మా మతం దెబ్బతింటున్నది. నీ బోధలు ఆపు" అంటూ గొడవ చేశారు.

దానికి ఆయన భలే జవాబిచ్చాడు.ఆయనేమన్నాడో తెలుసా?

"నేనిచ్చే రెండు ఉపన్యాసాలతో,రెండువేల ఏండ్ల చరిత్రగలిగిన మీ మతం కూలిపోయే పనైతే అటువంటి మతం ఉంటే ఎంత? ఊడితే ఎంత?" అన్నాడు.

నేనూ అదే అందామనుకుంటున్నాను.నేను పాడే పాటలతోనూ నా ఇతర పోస్ట్ ల తోనూ నాకున్న ఆధ్యాత్మిక ఇమేజి దెబ్బతినే పనైతే అదెంత గొప్ప ఇమేజో అక్కడే అర్ధం చేసుకోవచ్చు.అలాంటి చవకబారు ఇమేజి నాకక్కరలేదు. అలాంటి ఇమేజి కోసం ప్రాకులాడే ఖర్మా నాకొద్దు.

అయినా,ఆధ్యాత్మికత అంటే నీకేమీ అర్ధం కాలేదని నీ సలహావల్ల నాకర్ధమైంది.ముందు మీకు అసలైన ఆధ్యాత్మికత ఏంటో అర్ధమైతే కదా ఆ తర్వాత నేనేంటో అర్ధం కావడానికి?

పైగా నేను ఇమేజి మీద ఆధారపడి బ్రతకడంలేదు.అలా ఒళ్ళు చూపించుకుని బ్రతకడానికి నేను సినిమా హీరోయిన్ని కాను.నేను ఏది చేసినా ఇతరుల కోసం చెయ్యడంలేదు.నా ఆత్మానందం కోసం చేస్తున్నాను. ఆధ్యాత్మిక పోస్ట్ లు వ్రాసినా నాకోసమే వ్రాస్తున్నాను.పాటలు పాడినా నాకోసమే పాడుకుంటున్నాను.జాతకాలు చూసినా నా ఆనందం కోసమే చూస్తున్నాను.మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసినా నా కోసమే,యోగాభ్యాసం చేసినా నాకోసమే.ఇంకేం చేసినా నా ఆనందం కోసమే చేస్తున్నాను.ఇదంతా నా ఆనందం కోసమే.అంతేగాని ఇతరుల మెప్పుకోసం కానేకాదు.ఇతరుల మెప్పు మీద బ్రతికేంత చీప్ టేస్ట్ నాకులేదు.ఎవరికి ఏది నచ్చినా నచ్చకపోయినా నాకనవసరం.వాళ్ళేదో అనుకుంటారని నా పధ్ధతి నేను చస్తే మార్చుకోను.

నువ్వు భయపడినంతగా చివరికి రోడ్డుమీద బ్యాండ్ మేళంలో పాడనులే. భయపడకు.మంచి ప్రోగ్రాం అయితేనే చేస్తాను.లేకుంటే చెయ్యను.మొన్న రెండుసార్లకే బుద్ధొచ్చింది.ఆ కుళ్ళు రాజకీయాలు మనకు గిట్టవని నీకూ తెలుసుగా.

ఇక గురుత్వం సంగతి చెప్తా విను.

నాకు శిష్యులంటూ ఎవరూ లేరు.శిష్యుల్ని పోగేసుకోవాలనే దురద నాకేమీ లేదు.వాళ్ళు ఊరకే 'గురువుగారు' అని పిలిచినంత మాత్రాన నేనేమీ పొంగిపోయి పగిలిపోను.ఇలాంటి పిలుపు నాకు చిన్నప్పటినుంచీ అలవాటే. ఇది నాకేమీ కొత్తకాదు.కనుక నేనేమీ ఉబ్బిపోను.ఈ పిలుపు ఊరకే మాటవరసకు పిలిచే పిలుపని నాకు బాగా తెలుసు.నిజంగా నేను ఉపదేశం ఇస్తానంటే ఎగురుకుంటూ వచ్చి తీసుకునేవాళ్ళు ఎవరూ లేరు.ఉన్నా నేను పెట్టే పరీక్షలకు వాళ్ళు క్షణంకూడా తట్టుకోలేరు.నా మార్గాన్ని వాళ్ళు అనుసరించలేరు.అలా ట్రై చేసిన వాళ్ళు ఎందఱో ఇప్పటికి మళ్ళీ కనపడకుండా పత్తా లేకుండా పారిపోయారు.

వాళ్ళ  స్వార్ధంకోసం స్వలాభం కోసం నన్ను అలా 'గురువుగారు' అంటూ పిలుస్తున్నారని నాకు తెలుసు.స్వార్ధాన్ని ఒదిలిపెట్టి నేను చెప్పేదారిలో మనస్ఫూర్తిగా నడిచేవారు ఒక్కరూ లేరు.అదీ నాకు తెలుసు.

ఇలాంటి చెత్త ఇమేజిల మీదా,చెత్త మనుషులమీదా నాకు ఎలాంటి నమ్మకమూ లేదు.కనుక నువ్వేమీ భయపడకు.అయినా ఆధ్యాత్మికత అనేది అలా ఊరకే పొయ్యేదికాదు.అంత త్వరగా వచ్చేదీకాదు.ఆధ్యాత్మికత అంటే విడాకులు కాదు,నచ్చకపోతే వరుసగా ఇచ్చుకుంటూ పోవడానికి.అంత చెయ్యకూడని పని నేనేమీ చెయ్యలేదు.ఒకవేళ పాడినా పిచ్చిపిచ్చి పాటలేమీ పాడను.కనుక నీవు నిశ్చింతగా ఉండు." అని చెప్పాను.

మా ఫ్రెండ్ కొంచం కన్విన్స్ అయినట్లే కనిపించాడు.కానీ పూర్తిగా అయినట్లు అనిపించలేదు.ఏదేమైనా నేను స్టేజీలెక్కి సినిమాపాటలు పాడటం తనకు నచ్చలేదని అర్ధమైంది.

లోకులేమనుకుంటారో అని అనుక్షణం భయపడుతూ ఉండటం ఇంకేదైనా అవుతుందేమో గాని ఆధ్యాత్మికత మాత్రం కానేకాదు.అలా భయపడేవారు ఇంక సాధనేమి చెయ్యగలరు?ఆధ్యాత్మికంగా ఎలా పురోగమించగలరు?అసంభవం.నిజమైన ఆధ్యాత్మికులు సంఘాన్ని గడ్డిపోచతో సమానంగా చూస్తారు.లోకుల అభిప్రాయం అంటే వారికి చెత్తతో సమానం.

మా ఫ్రెండ్ మాటలను బట్టి లోకుల అభిప్రాయాలకు మనుషులు ఎంత విలువనిస్తారో, ఇమేజి అనే చట్రంలో బంధింపబడి తమ జీవితాన్ని ఎంతగా కోల్పోతుంటారో మళ్ళీ ఇంకొకసారి నాకర్ధమైంది.

ఒక తాత్వికుడు హేళనగా ఇలా అంటాడు.

"ఇతరుల కళ్ళలో మనమీద మెచ్చుకోలే మన జీవం.అది లేకుంటే మనలో ప్రాణం ఉన్నా లేనట్లే.ఇతరులు మనల్ని మెచ్చుకోకపోతే మనం శవాలతో సమానమే."

ఇమేజి అనేది ఒక దిష్టిబొమ్మ.దానికేమీ విలువనివ్వవలసిన పనిలేదు. ఆత్మవిశ్వాసం లేనివారే ఇమేజికి విలువనిస్తారని నా ప్రగాఢ విశ్వాసం.

ఇమేజి అంటే తెలుగులో ప్రతిబింబం అని అర్ధం.ప్రతిబింబం మాయ.దానికి ఉనికి లేదు.అది నిజం కాదు.బింబమే నిజం.బింబాన్ని మర్చిపోయినవారే ప్రతిబింబం వెంట పడతారు.దానికి విలువనిస్తారు.

తన విలువ తనకు తెలియనివారు మాత్రమే ఇతరులు తనకిచ్చే విలువ మీద ఆధారపడతారు.తానేమిటో తనకు తెలిసినవారు ఇమేజికి ఏమాత్రం విలువనివ్వరు.తనమీద తనకు నమ్మకం ఉన్నవారు 'ఇతరులేమనుకుంటారో' అని ఒక్క క్షణం కూడా భయపడరు.

తాను సత్యం.ఇమేజి అబద్దం.మనిషి సత్యాన్నే అనుసరించాలి గాని అసత్యాన్ని కాదు.

మనిషనేవాడు తనకోసం తాను బ్రతకాలి.ఇమేజి కోసం బ్రతకకూడదు.
read more " నీ ఇమేజ్ సంగతి ఆలోచించావా? "

9, డిసెంబర్ 2014, మంగళవారం

Hindi Melodies-Kishore Kumar-Ye kya hua kaise hua...





అమరగాయకుడు కిషోర్ కుమార్ స్వరంలో నుంచి జాలువారిన ఇంకొక మధురగీతం ఇది.

1971 లో వచ్చిన Amar Prem అనే చిత్రంలో చాలా మంచి పాటలున్నాయి.వాటిలో ఇదొకటి.ఒక వేశ్యావాటికలో తీసిన పాట కూడా,చక్కటి స్వరాన్ని సమకూర్చి డీసెంట్ గా తీస్తే ఎంత మధురగీతంగా రూపుదిద్దుకుంటుందో ఈ పాట నిరూపిస్తుంది. దానికి భిన్నంగా,దేవాలయాలలో తీసే పాటలు కూడా నేటి సినిమాలలో మనం చూడలేకపోతున్నాం.అదీ తేడా !!

ఈ పాటకు స్వరగతులు సమకూర్చి RD Burman చిరస్మరణీయునిగా నిలచిపోతే,అంతకంటే మధురంగా దీనిని పాడి కిషోర్ కుమార్ ఇంకొక చిర స్మరణీయునిగా నిలిచిపోయాడు.

ఇక రాజేష్ ఖన్నా,షర్మిలా టాగూర్,ఓంప్రకాష్ ల నటన చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఆ పాటలో వేశ్యలుగా,విటులుగా నటించిన ప్రతిఒక్కరి నటనా చాలా సందర్భానుసారంగా ఉంది.

Movie:--Amar Prem (1971)
Lyrics:-Anand Bakshi
Music:-RD Burman
Singer:-Kishore Kumar
Karaoke singer:-Satya Narayana Sarma

Enjoy
------------------------------------------------

{Ye kya hua,kaise hua,kab hua,kyo hua,jab hua,tab hua
O chodo ye na socho
oo hu hu Ye kya hua}-2

{hum kyon,shikawaa kare jhootha
kya hua jo dil toota}-2
sheeshe ka khilona tha
kuch naa kuch to honaa tha,
hua                                   ||Ye kya hua||


{Humne jo dekha tha suna tha

Kya bataye O kya tha}-2

Sapna salona tha

Khatam to hona tha

Hua                                  ||Ye kya hua||


{Ay dil chal peekar jhoome

Inhi galiyon me ghoome}-2

Yaha tujhe khona tha

Badnam ho na tha

Hua                                  ||Ye kya hua||


Meaning:-


What happened? How did it happen?

When did it happen? Why did it happen? 

Ok.Leave it.Dont think about it anymore.


Why should I lie?

But what to do when the heart breaks?

It was a toy made of glass.

One day something will happen to it.

It did.


That which I saw and heard about,

How can I say what it is?

It was a beautiful dream

It had to end sometime.

It did.


O my heart! Let us drink and roam around,

And wander in these bylanes,

Here you have to lose yourself

and become infamous

It happened.
read more " Hindi Melodies-Kishore Kumar-Ye kya hua kaise hua... "