అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః
కాలజ్ఞానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కాలజ్ఞానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, ఫిబ్రవరి 2021, గురువారం

షష్ఠగ్రహ కూటమి

ఈ రోజు అమావాస్య .

దీనికితోడుగా  మకరరాశిలో షష్టగ్రహకూటమి జరుగుతున్నది. మకరరాశిలో ఆరుగ్రహాలున్నాయి.  అవి -  సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, నీచగురువు, శని.

వీరిలో గురుశుక్రులిద్దరూ ఒకే డిగ్రీ మీదున్నారు. బుధ చంద్రులిద్దరూ ఒకే డిగ్రీ మీదున్నారు. అపసవ్యపు పోకడలు, కుటుంబాలలో, అయినవాళ్ల మధ్యన కీచులాటలు,  గొడవలను ఈ గ్రహస్థితి సూచిస్తున్నది.

ఈ ప్రభావం వల్ల అనేకమంది జీవితాలు ఈ సమయంలో అతలాకుతలం అవుతాయి.చిన్నాపెద్దా కష్టనష్టాలనుంచి, మనుషులు హఠాత్తుగా  చనిపోవడం వరకూ అన్ని స్థాయిలలోనూ మనుషులు అనేక విపత్తుల నెదుర్కొంటారు.

మానసిక సమస్యలు ఎక్కువౌతాయి. గొడవలౌతాయి. దీర్ఘరోగాలతో బాధపడుతున్నవారు పరలోక ప్రయాణమౌతారు. యాక్సిడెంట్లు జరుగుతాయి. ఇవన్నీ గత రెండు రోజులనుంచి మొదలయ్యాయి. ఇంకా రెండు రోజులుంటాయి. 

ఈ షష్టగ్రహకూటమి వల్ల బాగా దెబ్బతినేవారు ఎవరంటే -

మిథునరాశి/ లగ్నం వారు - వీరికి దీని దెబ్బ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, వారికి అష్టమంలో ఈ కూటమి ఏర్పడుతున్నది గనుక. వీరికి నష్టం, కష్టం క్కువగా ఉంటుంది. త్రిప్పట అధికంగా ఉంటుంది. కష్టం  ఎక్కువ ఫలితం తక్కువ. చిన్న పనికి కూడా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది.

తులారాశి/ లగ్నం వారు - వీరికి చతుర్దంలో ఈ కూటమి ఏర్పడుతున్నది. అందుకని వారికి ఇంటిలో, చదువులో సమస్యలు ఎక్కువౌతాయి. మానసికంగా టెన్షన్లతో నలిగిపోతారు.

మేషరాశి/ లగ్నం వారు - వీరికి దశమంలో ఈ కూటమి ఏర్పడుతునందున వీరికి వృత్తిపరంగా టెన్షన్ ఎక్కువౌతుంది. కొంతమంది ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. పనివత్తిడి బాగా ఇబ్బంది పెడుతుంది. 

మీనరాశి/ లగ్నం వారు - వీరికి దీర్ఘరోగాలు తలెత్తి బాధలు పెడతాయి. వీరి స్నేహితులు, అన్నలు, అక్కలు గతిస్తారు. లేదా నానాబాధలు వారిని చుట్టుముడతాయి. 

ధనూరాశి/ లగ్నం వారు - వీరికి కుటుంబపరంగా చాలా చిక్కులు సమస్యలు, త్రిప్పట ఎదురౌతాయి. డబ్బులు పోగొట్టుకుంటారు. నష్టాలు ఎదురౌతాయి.

కర్కాటక రాశి/ లగ్నం వారు - వీరికి సప్తమంలో ఇది ఏర్పడుతున్నది. కనుక, ఉద్యోగంలో పని వత్తిడి ఎక్కువౌతుంది. మానసిక చింత ఎక్కువౌతుంది. పార్ట్ నర్లతో గొడవలొస్తాయి. అన్నీ ఎదురౌతుంటాయి.

కన్యా రాశి/ లగ్నం వారు - వీరికి మానసిక చింత, డిప్రెషన్ ఎక్కువగా ఉంటాయి. సంతానం వల్ల చాలా బాధలు ఎదురౌతాయి. షేర్ మార్కెట్లో నష్టాలొస్తాయి.

కుంభరాశి/ లగ్నం వారు - వీరికి యాక్సిడెంట్లు అవుతాయి. లేదా దీర్ఘరోగాలు తలెత్తుతాయి. ఆస్పత్రిలో చేరవలసి వస్తుంది. డాక్టర్ల చుట్టూ, క్లినికల్ ల్యాబ్ ల చుట్టూ తిరగవలసి వస్తుంది. 

అంతా చెడేనా అంటూ భయపడకండి ! మంచీ చెడూ అనేవి సాపేక్షాలు. ఎక్కువా తక్కువా అంతే. కాలచక్ర పరిభ్రమణంలో రెండూ కలిసే తిరుగుతూ  ఉంటాయి. మకర, వృషభ, కన్యా, తులా లగ్నాలవారికి చెడుతోబాటు ఇదే సమయంలో మంచి కూడా జరుగుతుంది.

ఈ ఫలితాలన్నీ ఈ అయిదు రోజులలోనే జరుగుతాయి. మీ చేతుల్లో లేనివాటి విషయంలో మీరేమీ చెయ్యలేరు. కనీసం అలా ఉన్నవాటి విషయంలోనైనా కాస్త గమనించుకుని జాగ్రత్తపడండి మరి !

read more " షష్ఠగ్రహ కూటమి "

22, నవంబర్ 2020, ఆదివారం

పంచవటిలో కొన్ని మార్పులు - గమనించండి

శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందని సామెతున్నది. పైపైన జ్యోతిష్యం తెలిసినవారు కూడా కర్మకు అతీతులేమీ కారు. అసలైన జ్యోతిష్యం రానంతవరకూ, సాధనాబలం లేనంతవరకూ, వారు కూడా గ్రహప్రభావానికి డామ్మని పడిపోతూనే ఉంటారు.

మకరంలో గురుశనుల గోచారం పంచవటిమీద కూడా ప్రభావం చూపిస్తున్నది. ఎందుకంటే, పంచవటిలో కొన్ని కీలకస్థానాలలో ఉన్న వ్యక్తుల జీవితాలను అది ఊహించని మార్పులకు గురిచేస్తున్నది గనుక.

అవేంటంటే - 'పుస్తకం. ఆర్గ్', 'సత్యజ్యోతిష్' ఈ రెండు యాప్స్ ను డెవలప్ చేసి, వాటిని మేనేజ్ చేస్తున్న వ్యక్తి ఆ పనులనుంచి హఠాత్తుగా విరమించుకున్నాడు. ఏం చేస్తున్నాడో తెలీనంతగా విచక్షణాశక్తిని కోల్పోవడం ఆ వ్యక్తి తప్పు.  ఒక వ్యక్తిని నమ్మి అతనిమీద ఎక్కువగా ఆధారపడటం మేం చేసిన తప్పు. ఈ తప్పును దిద్దుకుంటున్నాం.

గత పదేళ్ళ ప్రయాణంలో ఈ విధమైన పరిస్థితులు చాలాసార్లు ఎదురయ్యాయి. ప్రతిసారీ ఒక క్రొత్త పాఠాన్ని నేర్చుకుంటూ మా ప్రయాణం సాగుతోంది. ఈ సారి కూడా అంతే !

ఈ క్రింది మార్పులను గమనించవలసిందిగా మా పాఠకులు, అభిమానులను  కోరుతున్నాము.

>> ఇకమీద 'పుస్తకం. ఆర్గ్' నుంచి మా పుస్తకాలు లభించవు. అందుకోసం వేరే యాప్ ను డెవలప్ చేస్తున్నాము. ఇకపై, పరాయివాళ్ళ యాప్స్ మీద ఆధారపడటం జరగదు. మా సొంత యాప్ వచ్చేవరకూ వేరే అడ్రస్ నుంచి మా ప్రింట్ పుస్తకాలు మాత్రమె లభిస్తాయి. 'ఈ బుక్స్' లభించవు. ఆ అడ్రస్ త్వరలో ఇదే బ్లాగ్ లో ఇవ్వబడుతుంది. యాప్ రెడీ అయ్యాక, అందులో మా పుస్తకాలన్నీ ఇంతకుముందులాగే లభిస్తాయి. 

>> అట్టహాసంగా ప్రారంభించిన 'సత్యజ్యోతిష్ సాఫ్ట్ వేర్' అర్ధాంతరంగా మూతపడింది. దానికి కారణాలు - మా దగ్గర బిజినెస్ యాటిట్యూడ్ లేకపోవడం, మనుషులను మేము అతిగా నమ్మడం, పనిచేస్తున్నవారికి తగినంత చిత్తశుద్ధి లేకపోవడం మాత్రమే. వ్యక్తులకు చిత్తశుద్ధి ఉండకపోవచ్చు. వాళ్ళు మమ్మల్ని మోసం చెయ్యవచ్చు. కానీ మా ప్రయాణం ఆగదు. మా ఆలోచనకు మరణం లేదు. ఈ సాఫ్ట్ వేర్ ను మళ్ళీ మొదటినుంచీ తయారుచేసి అందిస్తాం. దానికి కొంత సమయం పడుతుంది.

ఈ అసౌకర్యానికి మన్నించమని కోరుతున్నాం.

read more " పంచవటిలో కొన్ని మార్పులు - గమనించండి "

5, జూన్ 2020, శుక్రవారం

చంద్రగ్రహణం - జూన్ 2020

ఈ రోజు పౌర్ణమి. నేటి రాత్రి 11 నుండి 2.30 వరకూ బలహీనమైన చంద్రగ్రహణం రాబోతున్నది. గ్రహణం బలహీనమైనదైనప్పటికీ , చంద్రుడు ఈ సమయంలో నీచస్థితిలో ఉంటాడు గనుక దీని ఫలితాలు మనస్సు మీద ఎక్కువగా ఉంటాయి. రక్తపోటు, గుండెజబ్బులు ఉన్నవారికి ఈ సమయం అటూఇటూ అవుతుంది.

పౌర్ణమిఛాయ మొన్నటినుండే మొదలైంది. రేపు, ఎల్లుండి కూడా ఉంటుంది. ఈ పౌర్ణమి వృషభం, వృశ్చికరాశులలో జరుగుతుంది. కనుక ఈ రాశులు/లగ్నాలవారు బాగా ప్రభావితం అవుతారు. వీరు చాలా చెదిరిపోతారు. మానసికంగా డిప్రెషన్ లో పడతారు.

వీరి తర్వాత మానసికంగా బాగా చెదిరిపోయేది మకర, కర్కాటక రాశుల/లగ్నాలవారు. వీరంతా సంయమనం పాటించాలి.

కుంభ, సింహరాశుల/లగ్నాలవారు ఇంటా బయటా ఇబ్బందులు పడతారు. మీన, కన్యారాశులు/లగ్నాలవారు ఆత్మపరిశీలన చేసుకుని  సమయాన్ని ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది.

మిధున, దనూరాశుల/లగ్నాలవారు అనవసరంగా గొడవలు/శత్రుత్వాలను పెంచుకుని ఇబ్బంది పడతారు.

మేష, తులారాశులవారు ఇంటిలో గొడవలతో, మాట పట్టింపులతో, డబ్బు ఇబ్బందులతో బాధలు పడతారు. వీరు కూడా జాగ్రత్తగా ఆత్మనిగ్రహంతో ఉండాలి.
read more " చంద్రగ్రహణం - జూన్ 2020 "

29, మే 2020, శుక్రవారం

కాలజ్ఞానం - 30

నిన్నా ఇవాళా రేపూ ఎల్లుండీ - అనవసరంగా మనస్సులు పాడవడం, మాట తేడాలు రావడం,  గొడవలు జరగడం, అన్నిచోట్లా జరుగుతాయి. మానవసంబంధాలు దెబ్బతింటాయి. చిలికి చిలికి గాలివానలు అవుతాయి. మనస్పర్ధలు వస్తాయి. సంయమనం అవసరం.

కంప్యూటర్లు పాడవడం, మొబైల్స్ క్రింద పడి పగిలిపోవడం, లేదా గీతలు పడటం జరుగుతాయి. నెట్ వర్క్ సమస్యలు తలెత్తుతాయి. జాగ్రత్త అవసరం.

ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వాటిల్లో అనుకోని చికాకులు తలెత్తుతాయి. ముందు చూపు అవసరం.
read more " కాలజ్ఞానం - 30 "

24, మార్చి 2015, మంగళవారం

సూక్ష్మ జ్యోతిష్యం

సూక్ష్మజ్యోతిష్యం అనేది ఒకటుందన్న విషయాన్ని చాలా పాత పోస్ట్ లలో, అంటే దాదాపు మూడేళ్ళ క్రితం వ్రాసిన పోస్ట్ లలో ప్రస్తావించి ఉన్నాను.ఆ తర్వాత నన్ను అనుసరించే అతి దగ్గరివారితో తప్ప ఈ విషయాన్ని ఎవరితోనూ చర్చించలేదు.

జగన్మాత కృపవల్ల, ఈ సూక్ష్మజ్యోతిష్య రహస్యాలు అనేకం నాకు వాటంతటవే స్ఫురిస్తూ ఉంటాయి.వీటిని ఆమధ్య అప్పుడప్పుడూ వ్రాస్తూ ఉండేవాడిని. తర్వాత కొంతకాలం పాటు ఈ విషయాలు వ్రాయడం ఆపాను.

నా బీరువాకు అనేక సొరుగులున్నాయి.వాటిలో అనేక విషయాలు ఒకేసారి నడుస్తూ ఉంటాయి.ఒక్కొక్కసారి ఒక్కొక్క సొరుగులో విషయాలను గురించి వ్రాస్తూ ఉంటాను.ఇప్పుడు జ్యోతిష్యపు సొరుగును తెరిచి కొన్ని విషయాలను చూద్దాం.

మొన్న మధ్యాహ్నం నాకొక అలౌకికమైన సూచన వచ్చింది.దాని ప్రకారం గమనించగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిశాయి.మొన్న మధ్యాహ్నం నుంచి మనుషుల జీవితాలలో- పదిహేనురోజుల పాటు- జరగబోయే మార్పులు ఎలా ఉంటాయో దానివల్ల నాకర్ధమైంది.

వాటిని ఈ క్రింద వ్రాస్తున్నాను.

లగ్నం/రాశిని బట్టి ఈ ఫలితాలు ఖచ్చితంగా జరుగుతాయి.గమనించండి.

మేషరాశి
కొత్త ఆలోచనలు కలుగుతాయి.రచనలు గావిస్తారు.ప్రేమ వ్యవహారాలు, కొత్త స్నేహాలు మొదలౌతాయి.కానీ అవి అనుకున్న ఫలితాన్ని ఇవ్వవు.

వృషభరాశి
ఇంట్లో ఊహించని గొడవలు మొదలౌతాయి.చికాకు ఎక్కువౌతుంది. మనశ్శాంతి లోపిస్తుంది.వాహన ప్రమాదాలు ఎదురౌతాయి.

మిధునరాశి
కాసేపు ధైర్యం కాసేపు పిరికితనం కలిగే పరిస్థితులు ఎదురౌతాయి.సోదర సోదరీలకు కష్టాలు ఎదురౌతాయి.మాట తేలికగా అపార్ధం చేసుకోబడుతుంది.

కర్కాటకరాశి
ఇంట్లో పరిస్థితులు చికాకులు కలిగిస్తాయి.మాట తీరు వల్ల గొడవలు జరుగుతాయి.ధననష్టం ఉంటుంది.

సింహరాశి
హటాత్ అనారోగ్య సూచన ఉన్నది.మానసిక క్రుంగుబాటు ఉంటుంది.ధైర్యం తగ్గుతుంది.పరిస్థితులు ఎదురు తిరుగుతాయి.

కన్యారాశి
నష్టాలు ఎదురౌతాయి.అనుకోని హటాత్ ప్రయాణాలు గావిస్తారు.రోగాలకు ఖర్చు పెరుగుతుంది.ఆస్పత్రులు సందర్శిస్తారు.

తులారాశి
ఇరుగు పొరుగువారికి,బంధువులకు,స్నేహితులకు,నౌకర్లకు కష్టకాలం. చెడువార్తలు వింటారు.డబ్బు నష్టపోతారు.

వృశ్చికరాశి
అనుకున్న పనులు జరగవు.మందగమనంతో నడుస్తాయి.వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి.ఇంట్లో కూడా వాతావరణం అశాంతిమయం అవుతుంది.

ధనూరాశి
పెద్దలు తీవ్ర అనారోగ్యం పాలు అవుతారు.కొందరికి పెద్దలు గతిస్తారు. జీవితంలో అనైతిక ధోరణులు పెరుగుతాయి.

మకరరాశి
డబ్బు ఖర్చు అనుకోకుండా పెరుగుతుంది.హటాత్తుగా డబ్బు ఖర్చైపోతుంది. నష్టాలు చవిచూస్తారు.ఆరోగ్య భంగం ఉంటుంది.

కుంభరాశి
జీవిత భాగస్వామికి చెడుకాలం.సమాజంలో నీలాపనిందలు ఎదుర్కోవలసి వస్తుంది.వ్యాపారంలో నష్టం వస్తుంది.

మీనరాశి
అనుకోని శత్రువుల నుంచి తాకిడి పెరుగుతుంది.మొండి బాకీలు వసూలౌతాయి.మొండి పనులు అనుకోకుండా అయిపోతాయి.విచక్షణ పెరుగుతుంది.దీర్ఘరోగాలు అదుపులోకి వస్తాయి.జీవితంలో ఆశ పెరుగుతుంది.

రెండు రోజులనుంచీ (సరిగ్గా చెప్పాలంటే మొన్న మధ్యాహ్నంనుంచీ) ఈ మార్పులు అనేకమంది జీవితాలలో మొదలయ్యాయి.నిన్నటినుంచీ స్పష్టంగా ఎక్కువయ్యాయి.గమనించండి.
read more " సూక్ష్మ జ్యోతిష్యం "

7, డిసెంబర్ 2014, ఆదివారం

మార్గశిర పౌర్ణమి+రోహిణీ శకటం=ప్రమాదాలు

రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కుమారుడు జానకిరాం మరణించడం నిన్న సాయంత్రం 6.30 ప్రాంతంలో జరిగింది.

ఇది యాదృచ్చికం కాదు.ఎందుకంటే పౌర్ణమి ఘడియలలోనే ఈ సంఘటన జరిగింది.గ్రహస్థితులు బాలేనప్పుడు వచ్చే అమావాస్య పౌర్ణమి ఘడియలు చాలా మందికి ప్రమాదాలను కొనితెస్తాయన్న విషయాన్ని నేను గతంలో లెక్కలేనన్ని పోస్ట్ లలో ఉదాహరణలతో సహా నిరూపించాను.ఈ సంఘటన కూడా అలాంటిదే.మనుషులమీద పౌర్ణమి అమావాస్యల ప్రభావానికి మళ్ళీ ఇదొక తిరుగులేని రుజువు.

నిజం చెప్పాలంటే ఈ సృష్టిలో యాదృచ్చికమూ కాకతాళీయమూ అంటూ ఏదీ లేదు,ఉండదు.కారణాలు తెలియనిదానిని కాకతాళీయం అనుకుంటాం అంతే. కారణాలు మనకు అర్ధం కానంత మాత్రాన అసలు లేవని అనుకోవడం పొరపాటు.

నిన్న మార్గశిర పౌర్ణమి.ప్రతి మార్గశిర పౌర్ణమికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమంటే ఆరోజున సూర్యుడు బలహీనుడుగా ఉంటాడు.చంద్రుడు ఉచ్చ స్థితిలో చాలా బలంగా ఉంటాడు.ఇద్దరి మధ్యనా సంపూర్ణ సమసప్తక దృష్టి ఉంటుంది.అలాంటి సమయంలో ప్రకృతిలోని సమతుల్యతలో తేడాలు వస్తాయి.అందువల్ల మనుషుల మనస్సులు తీవ్రంగా సంక్షోభానికి గురౌతాయి.అయితే తీవ్రమైన ఉద్రేకమయినా కలుగుతుంది.లేదా తీవ్రమైన డిప్రెషన్ అయినా కలుగుతుంది.కొందరికి ఆరోగ్యాలలో తేడా వస్తుంది. ఇంకొందరికి మానసికంగా చికాకులు ఎక్కువై పోతాయి.వారివారి జాతకాలలో సూర్యచంద్రుల స్థితులను బట్టి ఒక్కొక్కరినీ ఈ మార్గశిర పౌర్ణమి ఒక్కొక్క విధంగా ఊపుతుంది.

అదీగాక ఇప్పుడు శనీశ్వరుడు సూర్యునితో కలసి ఉన్నాడు.రోహిణీ నక్షత్రాన్ని త్వరలో తన వీక్షణద్వారా స్పర్శించబోతున్నాడు.కనుక ఈ చెడుప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది.రోహిణీ శకటభేదనం యొక్క చెడు ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయో కొద్ది నెలలక్రితం ముందే హెచ్చరించాను.

అసలీ "శకట భేదనం" అనే పదం మన ప్రాచీనులు ఎలా పెట్టారో మన ఊహకు అందదు గాని,ప్రస్తుతం జానకిరాం విషయంలో జరిగింది అదే.శకట భేదనం అంటే "బండి విరిగిపోవడం" అనే కదా అర్ధం !!

జ్యోతిష్య పరమైన వివరాలను అలా ఉంచితే,రోడ్డు ప్రమాదాల గురించి నేను గతంలో వ్రాసిన ఒక పోస్ట్ లో మన దేశంలో ఎవడూ రోడ్డు రూల్స్ పాటించకపోవడాన్ని తూర్పార బట్టాను.మన దేశంలో ఒక టూ వీలర్ గాని ఫోర్ వీలర్ గాని తీసుకుని రోడ్డెక్కిన చాలామంది తమకు ఏ రూలూ వర్తించదని భావిస్తారు.వాళ్లకు సినిమా హీరో ఆవహిస్తాడు.రోడ్డుమీద తాము తప్ప ఇంకెవరూ లేరనీ తాము ఏ రూల్సూ పాటించనవసరం లేదనీ భావిస్తారు.డ్రైవ్ చేస్తున్న వాహనాన్ని ఎటునించి ఎటు తిప్పినా ఎవరూ అడిగేవారు మన దేశంలో ఉండరన్నది వాస్తవమే.సగటు ఇండియన్ కు రోడ్ సెన్స్ ఎప్పుడూ ఉండదు.పొరపాటు ఎవరిదైనా,ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల ఎన్నెన్ని విలువైన ప్రాణాలు రోడ్డు పాలు అయిపోతున్నాయో మనం ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం.

ట్రాఫిక్ రూల్స్ ను సగటు భారతీయపౌరుడు ఎవడూ తనంతట తానుగా పాటించడు.అంతటి సివిక్ సెన్స్ ఉంటె మన దేశం ఎప్పుడో ఇంకా చాలా బాగా ఉండేది.రోడ్ రూల్స్ ని పౌరులు ఖచ్చితంగా పాటించేలా చెయ్యడం ప్రభుత్వ బాధ్యత అయి కూచుంది మన దేశంలో.

ఒక రాంగ్ టర్న్ తీసుకున్నా,రాంగ్ సైడ్ లో ఓవర్ టేక్ చేసినా,రాంగ్ సైడ్ లో వచ్చినా,రాంగ్ ప్లేస్ లో డివైడర్ని దాటినా వెంటనే భారీ పెనాల్టీ పడే విధంగా మన వ్యవస్థలో మార్పులు వచ్చిననాడే ప్రాణాలతో పెనాల్టీ చెల్లించే ఇలాంటి పరిస్థితులు తప్పుతాయి.

ఎక్కడ చూచినా స్వార్ధపూరితులైన ప్రజలతో నిండి ఉన్న మన దేశంలో,'ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందిలే' అని ప్రతివారూ అనుకునే సమాజంలో, వ్యవస్థాపరంగా అంతటి గొప్ప పరిణతి అంత స్పీడుగా వస్తుందని ఊహించడం తప్పేమో?

డ్రైవర్ ను తీసుకుని బయలుదేరి ఉంటె ఇతని ప్రాణాలు దక్కి ఉండేవని కొందరు అనడం చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది.అప్పుడు డ్రైవర్ పోయి ఉండేవాడు.అంటే డ్రైవర్ ది ప్రాణం కాదా?ఈ మాట ఎంత స్వార్ధపరమైనదో?ఎవరివైనా సరే ప్రాణాలు పోవాలని మనం ఎందుకు కోరుకోవాలి?అది డ్రైవరైనా, యజమాని అయినా, ఎవరి ప్రాణమూ ఈ విధంగా పోకూడదు.ప్రయాణం సుఖంగా ముగించి వారు ఇళ్ళకు చేరుకోవాలనే మనం ఆశించాలి.ఎందుకంటే వారివారి భార్యాబిడ్డలు వారికోసం ఎదురుచూస్తూ ఉంటారు గనుక.వారి మీద ఎందరి ఆశలో అల్లుకుని ఉంటాయి గనుక.

లాంగ్ డ్రైవ్స్ అనేవి ఇండియాలో చాలా రిస్క్ తో కూడుకున్నవనేది అక్షరసత్యం.ఎందుకంటే గమ్యం చేరేలోపల కొన్ని వందల రోడ్ రిస్క్ లను దాటుకుని ఇల్లు చేరవలసి ఉంటుంది.ఎటువైపు నుంచి ఎవడు ఎలా హటాత్తుగా అడ్దోస్తాడో తెలియదు గనుక అనుక్షణం ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేస్తూ వెళ్ళవలసి ఉంటుంది.అందులో రాత్రిపూటా,తెల్లవారే సమయంలో, పొగమంచు ఉన్నప్పుడూ ఇంకా జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యవలసి ఉంటుంది.

రోడ్డు ప్రయాణం సేఫ్ గా జరిగే విధంగా మన రోడ్డు రవాణావ్యవస్థ రూపు దిద్దుకోవడమే దీనికి ఉన్న ఏకైక పరిష్కారం.పౌరులందరూ విధిగా రోడ్ రూల్స్ పాటించడమే ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి ఏకైక మార్గం.

ఆ దిశగా పౌరులలోనూ ప్రభుత్వ విధానాలలోనూ మార్పు రావలసి ఉన్నది. అంతవరకూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.

జానకిరాంకు ఆత్మశాంతి కలగాలని ప్రార్ధిద్దాం.
read more " మార్గశిర పౌర్ణమి+రోహిణీ శకటం=ప్రమాదాలు "

13, నవంబర్ 2014, గురువారం

ఊహించినవి-జరిగినవి-28

శనీశ్వరుని వృశ్చికరాశి ప్రవేశ ఫలితాలను ఊహిస్తూ వ్రాసిన రెండు విషయాలు నిజమయ్యాయి.

ఒకటి

ముస్లిం ఉగ్రవాదం పెరుగుతుంది- అని వ్రాశాను.

ఆ తర్వాత కొన్ని రోజులకే వాఘా బార్డర్ సంఘటన జరిగింది.మన ప్రదానమంత్రికే డైరెక్ట్ గా హెచ్చరిక పంపేంత స్థాయిలో రెచ్చిపోయి వాళ్ళు తెగబడుతున్నారు.ఉగ్రవాదం పెరుగుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రెండు

స్త్రీలలో గైనిక్ సమస్యలు ఎక్కువౌతాయి-అని సూచనాప్రాయంగా చెప్పాను.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలై అంతమంది చనిపోవడమూ అంతమంది చావుబతుకుల్లో ఉండటమూ నిన్న విన్నాం.ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది పెద్ద ఆపరేషన్ కానేకాదు.ఒక సర్జన్ అనేవాడు దీనిని అతి తేలికగా చెయ్యగలడు.పైగా గత 30 ఏళ్ళుగా ఈ రకమైన ఆపరేషన్లు ఈ స్థాయిలో ఫెయిలైన దాఖలాలు ఎక్కడా లేవు.మరి ఇప్పుడే శనీశ్వరుడు వృశ్చికరాశిలోకి మారిన వెంటనే మాత్రమే ఇవి ఎందుకు జరుగుతున్నాయి?

మానవజీవితం మీద గ్రహాల పాత్ర లేదంటారా?

కళ్ళు తెరిచి చూచే అలవాటుంటే ఉన్నదని మీరే ఒప్పుకోవలసి వస్తుంది.

ఆలోచించండి.
read more " ఊహించినవి-జరిగినవి-28 "

1, ఆగస్టు 2014, శుక్రవారం

కాలజ్ఞానం 27 (శ్రావణ మాస ఫలితాలు)

శ్రావణమాసం 27-7-2014 న ఉదయం 4.13 కి శనివారం పుష్యమీ నక్షత్రంలో హైదరాబాద్ లో మొదలైంది.ఆ సమయానికి ఉన్న గ్రహస్తితులను బట్టి ఈ నెల మన రాష్ట్రం ఎలా ఉన్నదో చూద్దాం.

శ్రావణమాసం మొదలయ్యే సమయానికి మిధున లగ్నం నడుస్తున్నది.వజ్రయోగంలో కింస్తుఘ్న కరణంలో గురుహోరలో ఈ మాసం మొదలైంది.


ఈ మాసం లో ఫోకస్ అంతా ఆర్ధికరంగం మీద ఉంటుంది.ఉన్న వనరులను ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికి ఎలా సర్దుకోవాలా అన్నదానిమీదనే అధికారుల ఆలోచన అంతా కేంద్రీకృతమై ఉంటుంది.

శుక్లపాడ్యమి నాడు ఏర్పడిన కింస్తుఘ్న కరణం ఈ మాసంలో వైశ్వదేవ యోగాన్ని కలిగిస్తున్నది. కనుక ఈ మాసంలో రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడతాయి.ఆ నిర్ణయాలు భవిష్యత్తును అనుకున్నట్లుగా తీర్చిదిద్దేవి అవుతాయి.

ధనాదాయం విషయంలో రాష్ట్ర పరిస్థితి ఇంకా సందిగ్ధం గానే ఉంటుంది. కాకపోతే,ఆదాయం పెంచుకోడానికి కొన్ని ప్రణాళికలు ఈ మాసంలో రూపు దిద్దుకుంటాయి.అవి దీర్ఘకాల ప్రణాళికలు గనుక ఫలితాలు మాత్రం అంత త్వరగా కనిపించే అవకాశం లేదు.

కేంద్రసహాయం అందే విషయంలో రాష్ట్ర ప్రభుత్వపు ఆశలు గట్టిగా ఉంటాయి.

ఆర్ధికరంగం తర్వాత ఈ నెల ప్రాముఖ్యతను సంతరించుకునేది విద్యారంగం. ఈ రంగంలో చికాకులు తప్పవు.విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది.ఇది పరిపాలన మీదా కూడా ప్రభావం చూపుతుంది.కాని చివరకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనబడుతుంది.

రాష్ట్ర అంతర్గత వ్యవహారాలలో బయటి వారి జోక్యం చికాకును కలిగిస్తుంది. విడిపోయిన తమ్ముళ్ళ ధోరణి విసుగు పుట్టిస్తుంది.

పరిపాలన అనుకున్నంత సజావుగా జరగదు.అనుకోని విఘ్నాలు తలెత్తుతాయి.విసుగు పుట్టించే నిరంతర ప్లానింగ్ తో రోజులు గడుస్తాయి.

ప్రక్క రాష్ట్రంతో పోటీ పడటానికి ఎత్తులకు పై ఎత్తులు వెయ్యవలసి వస్తుంది. ఒకే కుటుంబంగా ఉన్న తెలుగువారు ఇలా చీలిపోయి పరస్పర ఎత్తులు వేసుకోవలసి రావడం బాధాకరం అవుతుంది.

మేధావులకు కళాకారులకు విశిష్టవ్యక్తులకు ప్రమాదం పొంచి ఉన్నది.

స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఉగ్రవాదులను ఒక కంట కనిపెట్ట వలసిన అవసరం ఉన్నది.

మతపరమైన దుర్ఘటన ఒకటి జరిగే అవకాశం ఉన్నది.

చెడు తేదీలు:
6-8-14 నుంచి 10-8-14 వరకు.
19-8-14,20-8-14.
read more " కాలజ్ఞానం 27 (శ్రావణ మాస ఫలితాలు) "

24, జులై 2014, గురువారం

మొదలౌతున్న ఆషాడ అమావాస్య ప్రభావం

ఈరోజు ఆషాడ బహుళ త్రయోదశి.

ఎల్లుండి అమావాస్య.

ఆ ప్రభావం అప్పుడే మొదలైంది.అమావాస్య పౌర్ణమి ప్రభావాలు మూడు రోజులు అటూ ఇటూ ఉంటాయి అని నేను ఎన్నోసార్లు వ్రాసినది నిజం అని మళ్ళీమళ్ళీ ఎన్నిసార్లైనా రుజువౌతూనే ఉన్నది.

కుజ శని రాహు ప్రభావాలు నిత్యజీవితాలలో ఎలా ఉంటాయో ఒక్క వారం నుంచి మీమీ చుట్టు పక్కల జరుగుతున్న సంఘటనలు గమనించండి.

చాలామందికి నిన్నటి నుంచి ఏదో తెలియని చికాకుగా,అసహనంగా,స్థిమితం లేకుండా ఉంటుంది.కారణం లేకుండా ఊరకే గొడవలు అవుతుంటాయి. కుటుంబాలలో చిరాకులు ఎక్కువౌతుంటాయి.ఎటన్నా బయటకు పోయి తిరుగుదామని అనిపిస్తుంది.గమనిస్తే అర్ధమౌతుంది.

మరికొంతమందికి ఈ అయిదురోజులలో అనవసరమైన భక్త్యుద్రేకం కలగడం గమనించవచ్చు.పూజలు మానుకున్న వారు మళ్ళీ మొదలుపెట్టి చెయ్యడం ఇప్పుడు చూడవచ్చు.ఇంకొంతమంది గుడులూ గోపురాలూ అంటూ తిరగడం మొదలుపెడతారు.కొంతమంది పెద్దవాళ్ళు ముఖ్యంగా పాతకాలపు మనుషులు ఈ సమయంలో గతిస్తారు.

మన చుట్టుపక్కలే ఈ వారంలో ఎంతోమంది చనిపోయారు.కొంతమంది దీర్ఘ వ్యాధులతో అయితే,కొంతమంది ప్రమాదాలలో పోయారు.మరికొంతమంది బాగా ఉన్నవారు హటాత్తుగా చనిపోయారు.ఇంకొంతమందిని అంతు తెలియని రోగాలు బాధిస్తున్నాయి.

ఈ రోజు ఉదయం తెలంగాణా మెదక్ జిల్లాలో మనోహరాబాద్ స్టేషన్ దగ్గర కాపలా లేని లెవల్ క్రాసింగ్ గేట్ లో ఒక స్కూల్ బస్సును నాందేడ్ పాసింజర్ రైలు డీ కొట్టింది.బస్సులో ఉన్న 30 మందిలో 26(?) మంది చిన్నపిల్లలు ఈ ప్రమాదంలో చనిపోయారు.

అమావాస్య సమయంలో చంద్రునికి బలం చాలా తక్కువగా ఉంటుంది.అమావాస్య సమయంలో చంద్రహోరలో ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. దానికి తోడు కుజుడు రాహువు శని వంటి ఇతర గ్రహాల పాత్ర ఉన్నప్పుడు ఇక చెప్పనవసరం లేదు.

22,23 తేదీలలో విద్యాపరమైన ప్రమాదాలు ఉంటాయని వ్రాశాను.ఒక్కరోజు తేడాతో స్కూలు బస్సు ప్రమాదం జరగడం గమనించండి.

రాబోయే అయిదు రోజులలో ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎన్నెన్ని జరుగుతాయో వేచి చూద్దాం.
read more " మొదలౌతున్న ఆషాడ అమావాస్య ప్రభావం "

ఊహించినవి-జరిగినవి(26)

కాలజ్ఞానం 26 లో ఊహించినట్లు ఈ క్రింది సంఘటనలు 22,23 తేదీలలో జరిగాయి.

తన కర్ణాటక సంగీతజ్ఞానంతో కొన్ని వందల కచేరీలు చేసి చుట్టు పక్కల గ్రామాలలో 'సంగీతం మామ్మ'గా ఎంతో పేరు సంపాదించిన మేదరమెట్ల పర్వతవర్ధని(82) దుగ్గిరాల మండలంలో 22.7.2014 న చనిపోయారు.

ప్రపంచవ్యాప్తంగా కొంతమంది మ్యుజీషియన్స్ ఈ రెండు రోజులలో చనిపోయారు.వారి వివరాలు నెట్ లో చూడవచ్చు.

అలాగే,మతపరమైన రంగాలలో చూస్తే--అమర్నాథ్ యాత్రలో గ్యాస్ సిలెండర్ పేలి నలుగురు చనిపోయారు.శివసేన MP ఒకాయన రంజాన్ దీక్షలో ఉన్న ఒక ముస్లిం చేత బలవంతంగా రొట్టె తినిపించబోయారని లోక్ సభలో గందరగోళం అయ్యింది.తాము మోసగించబడుతున్నామని ముస్లిం కమ్యూనిటీలో కొందరు భావిస్తున్నారు.దానికి ఉద్ధవ్ ధాకరే సంజాయిషీ కూడా ఇవ్వవలసి వచ్చింది.

షిర్డీ సాయిబాబా దేవుడు కాడు ఒక ముస్లిం సెయింట్ మాత్రమే అని అన్నందుకు ద్వారకా శంకరాచార్యను కోర్టుకు వచ్చి హాజరు అయ్యి తన వాదనను వినిపించవలసిందిగా న్యాయస్థానం ఆదేశించింది.

ఈరోజు(24-7-2014) న జరిగినవి:--

>>మనోహరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర లెవల్ క్రాసింగ్ ప్రమాదంలో స్కూల్ బస్ ను నాందేడ్ పాసింజర్ రైలు డీ కొట్టి 26(?) మంది చిన్నపిల్లలు చనిపోయారు.

>>ప్రముఖ సాహిత్య విమర్శకుడు భాషా శాస్త్రవేత్త  చేకూరి రామారావు ఈరోజున అకస్మాత్తుగా గతించారు.
read more " ఊహించినవి-జరిగినవి(26) "

21, జులై 2014, సోమవారం

కాలజ్ఞానం -26

జూలై 22,23 తేదీలలో ఈ క్రింది సంఘటనలు జరుగవచ్చు.

సాంస్కృతిక,కళా,విద్యారంగాలలోని వారు ప్రమాదాలకు గురవ్వడం గాని. గతించడం గాని జరుగుతుంది.

ధార్మిక,మతరంగాల్లో ఉన్నవారికి మనశ్శాంతి కరువయ్యే,లేదా మోసపోయే సూచనలున్నాయి.
read more " కాలజ్ఞానం -26 "

17, జులై 2014, గురువారం

కాలజ్ఞానం -25 (కన్యా రాశిలో రాహుస్థితి-దేశగోచారం)

13-7-2014 నుంచి రాహువు కన్యారాశిలో ప్రవేశించడం జరిగింది.ఒకటిన్నర సంవత్సరం పాటు ఇక్కడ ఉండటం జరుగుతుంది.ఈ సమయంలో మన దేశంలో జరిగబోయే కొన్నికొన్ని సంఘటనలు ఎలా ఉంటాయో చూద్దాం.

మన దేశానికి సహజరాశి మకరం.స్వాతంత్రం వచ్చినది వృషభ లగ్నంలో అయినప్పటికీ దేశ లక్షణాలను బట్టి సహజరాశి మకరమే అని చాలామంది ప్రాచ్య పాశ్చాత్య జ్యోతిష్యశాస్త్రవేత్తల అభిప్రాయం.

ఆ మకరరాశినుంచి ప్రస్తుతం నవమస్థానంలో రాహుసంచారం జరగబోతున్నది.నవమస్థానం విదేశాలకు,మత విషయాలకు,పెద్దలకు, గురువులకు,పుణ్యక్షేత్రాలకు,ధార్మిక కార్యక్రమాలకు సూచిక.రాహువు యొక్క కారకత్వాలలో విధ్వంసమూ,కుట్రలూ,కుత్రంత్రాలూ,విదేశీ మతశక్తులూ,మత పరమైన గొడవలూ ఉన్నాయి.

కనుక ఈ రెంటినీ కలిపి చూస్తె కొన్ని విషయాలు స్ఫుటంగా కనిపిస్తున్నాయి.

1.విదేశీ వ్యవహారాలలో మంచి కదలిక వస్తుంది.ప్రస్తుతం మన ప్రధాని విదేశీ యాత్రలు చెయ్యడమూ,అనేక దేశాధినేతలతో కలవడమూ,చెడిపోయిన/పోతున్న సంబంధాలను మళ్ళీ బాగు చేసుకునే ప్రయత్నం చెయ్యడమూ ఇందులో భాగాలే.ఫారిన్ పాలసీ మేటర్స్ ఉన్నట్టుండి బాగా క్రియాశీలకంగా మారడం నవమంలో అడుగుపెట్టిన రాహుప్రభావమే.

2.రాహువు ముస్లిం చాందసవర్గాలకు సూచకుడు గనుక మన దేశానికి ఆల్ ఖైదా,తాలిబాన్ వంటి పొరుగుదేశాల ఉగ్రవాద సంస్థలతో ప్రమాదం పొంచి ఉన్నది.వాళ్ళు మన దేశంలో మళ్ళీ కుతంత్రాలూ విధ్వంసమూ ప్లాన్ చేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.మతకలహాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతాయి.

3.ఆ కుట్రలలో దేవాలయాలూ,పుణ్యక్షేత్రాలూ,ప్రసిద్ధ మతగురువులూ టార్గెట్ అయ్యే అవకాశం బలంగా కనిపిస్తున్నది.

4.వయసు మళ్ళిన పెద్దలూ,మతనాయకులూ ప్రమాదాలలోగాని ప్రాణాంతక రోగాలతో గాని ప్రాణాలు కోల్పోయే సూచన ఉన్నది.

5.కన్య సహజరాశిచక్రంలో రోగస్థానం గనుక మొండి ఎపిడెమిక్ వ్యాధులు సమాజంలో తలెత్తే అవకాశం ఉన్నది.ముఖ్యంగా మలేరియా,డెంగ్యూ,చికెన్ గున్యా,జపనీస్ ఎన్కెఫలైటిస్ వంటి వ్యాధులూ ఈగలూ దోమల వల్ల వచ్చే వ్యాధులూ వైరల్ జ్వరాలూ విజృంభించే ప్రమాదం ఉన్నది.

6.భూకంపాల వంటి ప్రకృతి ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి.

7.మతసంస్థలలో అంతర్గతకలహాలూ,కల్లోలాలూ తలెత్తే అవకాశాలున్నాయి

ఎంతసేపూ చెడ్డ సంఘటనలేనా?మంచి అసలు జరగదా?అని కొందరికి అనుమానం రావచ్చు.మంచికూడా తప్పకుండా జరుగుతుంది.కాని దానికి ముందు జాగ్రత్తలు అవసరంలేదు.కనుక వాటిమీద ఎక్కువ ఫోకస్ ఉండదు. ఉదాహరణకు కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం.

8.ముస్లిం వర్గాలకు మంచిచేసే ఒక దీర్ఘకాలిక నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటిస్తుంది.దానివల్ల మోడీ ప్రభుత్వం అంటే వారిలో కొందరిలో ఉన్న వ్యతిరేకత తొలగిపోతుంది.

9.దేశంలో మతటూరిజం కొత్త పుంతలు తొక్కుతుంది.ఆ దిశగా అనేక టూరిస్ట్ ప్యాకేజీలు అందుబాటులోకి వస్తాయి.

10. షేర్ మార్కెట్ ఉత్సాహంగా ముందుకు దూసుకు పోతుంది.

పైన సూచించిన ప్రమాదకర రంగాలలో(1-7) ముందు జాగ్రత్తలు చాలా అవసరం.వీటిలో పౌరులు తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్నైతే ప్రభుత్వం తీసుకోవలసినవి మరికొన్ని.

ఏదైనా జరిగిన తర్వాత బాధపడే కంటే,ముందే మేలుకొని జాగ్రత్తపడటం మంచిది కదా.
read more " కాలజ్ఞానం -25 (కన్యా రాశిలో రాహుస్థితి-దేశగోచారం) "

4, జులై 2014, శుక్రవారం

కాలజ్ఞానం -24(ఆషాఢమాస ఫలితాలు)


జూన్ 27 న 13-39 గంటలకు హైదరాబాద్ లో ఆషాఢమాసం మొదలైంది.

ఈమాసం ప్రారంభం కావడమే అనేక దుస్సంఘటనలతో మొదలైంది.లగ్నం కన్యా తులల మధ్యన సున్నా డిగ్రీలలో ఖచ్చితమైన శపితయోగ పరిధిలో ఉన్నది.

శుక్రవారం ఆర్ద్రానక్షత్రం వృద్దియోగంలో ఈ మాసం మొదలైంది.

ఈ నెల రాష్ట్రపరంగా ఆర్ధికపరంగా ఏమంత మంచి ఫలితాలను ఇవ్వదు.

భాగ్యభావం దెబ్బతినడంతో డబ్బు సమస్యలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తాయి.చెయ్యాలనుకుంటున్న పనులకు డబ్బులు ఎక్కడనుంచి తేవాలో అర్ధం కాదు.

అయితే ఏదో ఒక రకమైన ప్లానులు వేసి కష్టాలనుంచి గట్టెక్కాలని ప్రయత్నాలు జరుగుతాయి.

దశమంలో ఉన్న ఉచ్ఛగురువు ఒక్కడే ఈ కుండలికి మంచియోగాన్ని ఇస్తున్నాడు.కనుక పరిపాలన నడుస్తూనే ఉంటుంది.అదే లేకపోతే పరిస్తితి అధ్వాన్నంగానే ఉన్నదని చెప్పాలి.కాకుంటే,ధనాధిపతి అయిన కుజుడు అక్కడే నీచలో ఉండటంతో గురువుగారి మంచిప్రభావం చాలావరకూ న్యూట్రలైజ్ అయిపోతున్నది.

ఉద్దేశాలు ప్లానులు మంచివేగాని డబ్బులు ఎక్కడనుంచి వస్తాయో అర్ధంకాని పరిస్తితి ఉంటుంది.

జూలై 6,7,8,9 తేదీలలో మళ్ళీ ప్రమాదాలు దుర్ఘటనలు జరుగుతాయి.కొందరికి పదవీగండం ఉన్నది.కొందరు ప్రముఖులు గతిస్తారు.ప్రభుత్వానికి ఒక విజయం చేకూరుతుంది.

జూలై 13 న కొందరి జీవితాలలో ఒక బలీయమైన ఆధ్యాత్మికసంఘటన జరుగుతుంది.

లౌకికంగా చూస్తే,ఒక ఉగ్రవాదచర్యగాని,లేక ఒక దుస్సంఘటనగాని జరుగుతుంది.సాంస్కృతిక కళారంగాలలో ఒక నష్టం ఉంటుంది.

జూలై 16 నుంచి 18 లోపు ఆర్ధికపరమైన ప్రజాపరమైన చికాకులు రాష్ట్రాన్ని పీడిస్తాయి.న్యాయశాఖారంగంలో,మతరంగంలో దుర్ఘటనలు జరుగుతాయి.

భవిష్యత్ ప్లానింగ్ తోనూ,ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలన్న ఆందోళనతోనే ఈ నెల రాష్ట్రపరిపాలన సాగుతుంది.
read more " కాలజ్ఞానం -24(ఆషాఢమాస ఫలితాలు) "

29, మే 2014, గురువారం

కాలజ్ఞానం 23-జ్యేష్టమాసం 2014 ఫలితాలు

నిన్న రాత్రి 00-11 నిముషాలకు న్యూడిల్లీలో జ్యేష్ట శుక్ల పాడ్యమి మొదలైంది.ఈ సమయం ఆధారంగా దేశానికి ఈనెల ఎలా ఉండబోతున్నదో చూద్దాం.

స్వాతంత్ర్య లగ్నానికి మకరం నవమం అవడం వల్ల ఈ నెల అంతా విదేశీ వ్యవహారాలతోనూ దానికి సంబంధించి ఇతరదేశాలతో విధాన సర్దుబాట్ల తోనూ సరిపోతుంది.

హోరానాధుడు కుజుడు కావడం ఆయన నవమంలో ఉండటం కూడా దీనినే బలపరుస్తున్నది.

మన దేశంలో కూడా ధార్మిక విషయాలపైన దృష్టి కేంద్రీకృతమౌతుంది. ధార్మిక విషయాలంటే దేశాన్ని ప్రక్షాళన చెయ్యడం,గంగానదిని ప్రక్షాళన చెయ్యడం,ధార్మిక సంస్థలను బలోపేతం చెయ్యడం,సంఘంలోని అవినీతిని ప్రక్షాళన చెయ్యడం మొదలైనవి.

మన దేశానికి గంగానది జీవనాడి వంటిది.అది కలుషితం కావడం మొదలైనప్పుడే దేశానికి భ్రష్టత్వం పట్టడం మొదలైంది.ఇన్నాళ్ళూ వచ్చిన ప్రభుత్వాలు ఊరకే మాటలకే పరిమితమైనాయి గాని గంగానదిని ప్రక్షాళన చెయ్యాలన్న పనిని మొదలు పెట్టలేదు.మోడీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వెయ్యడం గొప్ప మార్పుకు నాంది కాబోతున్నది.

చాలామంది భౌతికవాదులకు గంగానది ఒక మామూలు నీటిగుంట కావచ్చు. కాని భారతీయుల ధార్మికవిశ్వాసం వేరు.యుగయుగాలుగా కోట్లాదిజనుల ధార్మికవిశ్వాసాలకు గంగానది కేంద్రబిందువుగా ఉంటున్నది. అలాంటి పవిత్రనది కుళ్ళుగుంటగా మారడం వెనుక మార్మికమైన అర్ధాలే కాదు.కోట్లాది జనుల నీచమైన కర్మలూ సూచితం అవుతున్నాయి.ఇన్నాళ్ళకు గంగానది శుభ్రపడబోతున్నది.అంటే దేశం కూడా బాగుపడబోతున్నది అని అర్ధం.ఏ దేశమైనా తన ధార్మికవిశ్వాసాలను పునాదిగా కలిగి ఉన్నపుడే పురోగమించ గలుగుతుంది.

నాలుగింట శుక్రకేతువుల వల్ల
ప్రభుత్వానికి సోకాల్డ్ కుహనా మేధావులతో చుక్కెదురు అవుతుంది. ప్రభుత్వం ఏది చేయ్యబోయినా దేశాన్ని కాషాయీకరణం చేస్తున్నారు అన్న గోలను ఈ కుహనామేధావులు రేకెత్తిస్తారు.వారి వెనుక దేశ వ్యతిరేకశక్తులు పని చేస్తూ ఉంటాయి.

ప్రజలలో కూడా కొంత అనిశ్చితి ఏర్పడుతుంది.కొత్త ప్రభుత్వంమీద కొంత నమ్మకమూ కొంత భయమూ ఏర్పడుతూ ఉంటాయి.

అయిదింట రవిచంద్రులవల్ల
ప్రతిపక్షాలూ దుష్టశక్తులూ కలసి చేసే దుష్ప్రచారాన్ని ప్రభుత్వం సమర్ధవంతంగా తిప్పికొట్టగలుగుతుంది.ప్రభుత్వం తీసుకుంటున్న వేగమైన చర్యలవల్ల దేశంలో మేధోమధనం ప్రారంభమౌతుంది.జూన్ ఎనిమిదో తేదీన ఈ మార్పులను స్పష్టంగా చూడవచ్చు.

నక్షత్రనాధుడు చంద్రుడు పంచమంలో ఉండటం వల్ల మేధోపరమైన విధాన నిర్ణయాలు తీసుకోబడతాయి అనీ అవి చాలామందికి నచ్చినా నచ్చకపోయినా దేశానికి మంచి చేసేవి అయి ఉంటాయనీ సూచన ఉన్నది.

ఆరింట గురుబుధులు
కార్మిక,కమ్యూనికేషన్ రంగాలలో వేగమైన విధాననిర్ణయాలు తీసుకోబడతాయి.యధావిధిగా కుహనా మేధావులతో ప్రభుత్వానికి విరోధం ఏర్పడుతుంది.కానీ అంతిమంగా ప్రభుత్వానిదే విజయం అవుతుంది.

నవమంలో కుజుడు
ప్రజలకు చాలా మేలు జరిగే నిర్ణయాలు తీసుకోబడతాయి.ఆర్ధికరంగంలో ఆశాజనకమైన మార్పులకు దారితీసే చర్యలకు శ్రీకారం చుట్టబడుతుంది.షేర్ మార్కెట్ లాభపడుతుంది.శత్రుదేశాలనుంచి కుట్రలు మొదలౌతాయి.

విదీశీ వ్యవహారాలలో మన దేశానికి స్పష్టమైన శక్తివంతమైన వైఖరి ప్రారంభం అవుతుంది.ఇతర దేశాలకు మనమంటే భయమూ గౌరవమూ పెరగడం ప్రారంభం అవుతుంది.

పదింట రాహు శనులు
పరిపాలన ఎత్తులకు పైఎత్తులతో ముందుకు సాగుతుంది.ప్రతిపక్షాలకు మింగుడు పడని గట్టి నిర్ణయాలు తీసుకోబడతాయి.ఏ నిర్ణయాలు తీసుకోబడినా అవి ప్రజలకు మేలు చేసేవిగా ఉంటాయి.

ఇప్పుడు జ్యేష్టమాసంలో మన ఆంద్రరాష్ట్రం ఎలా ఉండబోతున్నదో చూద్దాం. సామాన్యంగా దేశానికీ రాష్ట్రానికీ మాసకుండలి ఒకే విధంగా ఉంటుంది.అయితే ప్రస్తుతం మాత్రం హైదరాబాద్ నగరానికి లగ్నం మారింది.కనుక రాష్ట్రం వరకూ మాసఫలితాలు వేరుగా ఉండబోతున్నాయి.అవి ఏమిటో చూద్దాం.

స్వతంత్రలగ్నానికి మాసలగ్నం దశమలగ్నం వల్ల ఈ నెల అంతా రాష్ట్రంలో పరిపాలనా సంబంధ విషయాలు చక్కదిద్దుకోవడమే సరిపోతుంది.

మూడింట శుక్రకేతువుల వల్ల రాష్ట్రవిభజన ప్రక్రియ వేగవంతం అయ్యేకొద్దీ ప్రజలు అనేకమందిలో,ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర ప్రజలకు భయాందోళనలు పెరుగుతాయి.ధైర్యం సన్నగిల్లుతుంది.

నాలుగింట రవిచంద్రులవల్ల
చాలామందిలో,ముఖ్యంగా హైదరాబాద్ వాసులలో నైరాశ్యమూ అయోమయమూ భయమూ ఎక్కువౌతాయి.జూన్ ఎనిమిదికి ఈ ఆందోళనలు ఊపందుకుంటాయి.వాటికి కారణాలు కూడా ఉంటాయి.

అయిదింట గురుబుదులవల్ల
ప్ర్రజలకు ఒకవైపు ఆశా ఇంకొకవైపు భయమూ ముప్పిరిగొంటాయి.కొంత లాభమూ కొంత నష్టమూ ఎదురుగా దర్శనమిస్తుంటాయి.ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తెలియని అయోమయం ఎదురౌతుంది.

ఎనిమిదింట కుజునివల్ల
ప్రజలలో భయం ఎక్కువౌతుంది.అనైతిక కోరికలూ కార్యకలాపాలూ పెరిగిపోతాయి.ఆవేశమూ దూకుడు ఎక్కువైపోతాయి. కొత్త ప్రభుత్వాలు పని చేసే తీరులో అనేక అనిశ్చితులూ గందరగోళాలూ మొదలౌతాయి. ఒకరినొకరు విమర్శించుకోవడం మొదలౌతుంది.ముందుముందు ఇదంతా జరుగుతుంది అని ఇంతకు ముందే కొన్ని పోస్ట్ లలో వ్రాశాను.కావలసిన వారు పాతపోస్ట్ లు ఒకసారి తిరగెయ్యండి.రాష్ట్రవిభజన అనేది సమస్యలకు అంతంకాదు -- ఆరంభం మాత్రమే.

తొమ్మిదింట రాహు శనులవల్ల
మతపరమైన విచ్చిన్నకర దుష్టశక్తుల ప్లానులు ఎక్కువౌతాయి.రాష్ట్ర విభజన పరంగా కొత్తరాష్ట్రాలలో వారి కార్యకలాపాలు ఎలా ఉండాలో ప్లానులు వెయ్యబడతాయి.

కేంద్రం నుంచి రాష్ట్రానికి మేలుచేసే సహాయాలు అందుతాయి.
read more " కాలజ్ఞానం 23-జ్యేష్టమాసం 2014 ఫలితాలు "

27, ఏప్రిల్ 2014, ఆదివారం

కాలజ్ఞానం 22-వైశాఖమాసం(మే -2014) ఫలితాలు


వైశాఖమాసం ఏప్రియల్ 30 నుంచి మొదలౌతున్నది.హైదరాబాద్ నగరానికి ఏప్రియల్ 29 న 11.44 నిముషాలకు వేసిన కుండలిని ఇక్కడ చూడవచ్చు.

దీనిని విశ్లేషించి మే నెలలో ఏయే సంఘటనలు జరుగబోతున్నాయో గమనిద్దాం.

దేశంలో జరుగబోతున్న ప్రస్తుత సాధారణ ఎన్నికలదృష్ట్యా ఈనెల చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నది.

ఈ కుండలిలో కర్కాటకలగ్నం ఉదయిస్తూ ఈ నెలలో దేశ రాజకీయ పరిస్థితిలో రాబోతున్న విపరీతమైన ఆటుపోట్లను సూచిస్తున్నది.దశమంలో చరరాశిలో ఉన్న చతుర్గ్రహ కూటమి త్వరలో జరుగబోతున్న అధికార మార్పిడిని స్పష్టంగా సూచిస్తున్నది.

లగ్నంలోని మాందీ గుళికులు ప్రజాజీవితంలో రాబోతున్న మార్పులను సూచిస్తున్నారు.

అక్కడే ఉన్న ఘటీలగ్నం వల్ల అంతర్జాతీయంగా మన దేశప్రతిష్టలో రాబోతున్న మంచిమార్పు సూచితం అవుతున్నది.ఇన్నాళ్ళూ పనికిమాలిన దేశంగా,అవినీతి దేశంగా ముద్రపడిన మన దేశంకూడా తలెత్తుకుని తిరిగే పరిస్థితులు ముందుముందు ఉంటాయని,భారతదేశప్రజలు అభివృద్ధిని కోరుకుంటారనీ,అదే దిశగా ఓటేస్తారనీ,నాయకులకున్నంత అవినీతి ప్రజలలో లేదనీ,అంతర్జాతీయ సమాజం అర్ధం చేసుకుంటుందన్న సూచనను ఘటీలగ్నం ఇస్తున్నది.

చతుర్ధంలోని రాహుశనులు ప్రజాజీవితంలో రాబోతున్న కల్లోలాన్ని (ఆంధ్రరాష్ట్ర విభజనపరంగా) సూచిస్తున్నారు.

ఈ నెలప్రారంభంలోనే కొందరు నాయకులమీద చీకటి కమ్ముకుంటుంది. వారు చేసిన పాపాలకు శిక్షలు పడటం మొదలౌతుంది.

ఇప్పటివరకూ అధికారంలో ఉన్నవారికి ఈ నెలలో రాజ్యాధికారం గల్లంతౌతుంది.దోచుకున్నది చాల్లే ఇక ఆపండి అంటూ రాజ్యలక్ష్మి వారిని వీడిపోతుంది.ఇన్నాళ్ళూ అధికార దుర్వినియోగానికి పాల్పడినవారికి ముందుముందు ఏమౌతుందో అన్న భయమూ మానసికచింతా పట్టి పీడించడం మొదలౌతుంది.

ఈ పరిస్థితి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా ఉంటుంది.

మతపార్టీగా పొరపాటుగా ముద్రపడిన ఒక పార్టీ,మిత్రుల సహకారంతో మంచి మెజారిటీని సాధిస్తుంది.ప్రజలు సమర్ధవంతమైన క్రొత్త ప్రభుత్వం కోసం ఎదురుచూడడం ప్రారంభిస్తారు.

ప్రజలలో ఉన్న దుష్టశక్తులనూ వర్గాలనూ కనిపించని దైవశక్తి నిగ్రహిస్తుంది.

యువకులలోనూ ఆశావహులైన ప్రజలలోనూ కష్టించి పనిచేసేవారిలోనూ క్రొత్త ఉత్సాహం నిండుతుంది.నిజమైన మేధావులలోనూ దేశభక్తుల లోనూ ఆనందం వెల్లివిరుస్తుంది.

ఆంధ్ర రాజకీయాలలో రెండు స్పష్టమైన అధికార కేంద్రాలు మొదలౌతాయి. ఆంధ్రా తెలంగాణా రాష్ట్రాలు విడిపోయే ప్రక్రియలో గందరగోళాలు ఉంటాయి.ఇవి మే 6,7 తేదీలలో జరుగుతాయి.

అదే తేదీలలో వాహన ప్రమాదాలూ రహదారి మరణాలూ ఉంటాయి.

మే 16,17,18 తేదీలలో కొన్ని చోట్ల ఉత్సవాలూ కొన్ని చోట్ల మతపరమైన అల్లర్లు జరుగుతాయి.బీసీ నేతలు గద్దెనెక్కుతారు.నిమ్న వర్గాలకు అధికారం అందుబాటులోకి వస్తుంది.వారిలో ఆనందం కలుగుతుంది.

కొందరు నేతల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది.

విదేశాలలో మన మహిళల మీద ఉన్న కేసులు ఒక కొలిక్కి వస్తాయి. కొందరు భారతీయ మహిళలు విదేశాలలో మంచి పేరు ప్రతిష్టలూ ఆదరణా పొందుతారు.

మే 20,21,22 తేదీలలో అధికారపరమైన మార్పులు ప్రారంభం అవుతాయి. అదే సమయంలో అనేకమంది అధికారులకు పదవీగండం,కొందరు నేతలకు ఆరోగ్యభంగం,మరికొందరికి పరలోక ప్రయాణ సూచనలున్నాయి.
read more " కాలజ్ఞానం 22-వైశాఖమాసం(మే -2014) ఫలితాలు "

4, డిసెంబర్ 2013, బుధవారం

కాలజ్ఞానం -21

డిసెంబర్ 3 నుంచి 15 వరకూ ఉన్న ఒక గ్రహస్తితి వల్ల రాష్ట్ర పరిస్తితి మరింత దురదృష్టకరమైన పీటముడిగా మారుతుంది.రాజకీయపరిస్తితి ఇంకా దిగజారుతూ పోతుంది.డిసెంబర్ 9 న నాయకత్వం సందిగ్ధపరిస్థితిలో పడుతుంది.నాయకులు ప్రజలపైనే కుట్ర చేస్తున్నారా అన్న అనుమానం ప్రజలలో బలపడుతుంది.15 వ తేదీ దగ్గరకు వచ్చేకొద్దీ ఆవేశాలు ఎక్కువౌతాయి.సంయమనం కోల్పోయిన నాయకులు రకరకాల ప్రకటనలతో ప్రజలను గందరగోళంలోకి ప్రవేశపెడతారు.ఆ తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దాం.
read more " కాలజ్ఞానం -21 "

4, జులై 2013, గురువారం

కాలజ్ఞానం-20

ప్రముఖులకేమో గండాలు 
పెద్దవారికే ప్రమాదాలు 
అందే పైలోక పిలుపులు 
ఒకటీ రెండు రోజుల్లో 

కర్మ ప్రభావం దురూహ్యం 
తప్పుకోవడం అసాధ్యం 
విర్రవీగితే ఫలితం శూన్యం 
లయమే కాలపు మలుపుల్లో
read more " కాలజ్ఞానం-20 "

14, మార్చి 2013, గురువారం

కాలజ్ఞానం - 19

ఊహించని కొత్త మార్పు
ఒక్కసారి కుదుపుతుంది
అదుపులేని శక్తంతా
వెల్లువగా ఉరుముతుంది

ప్రమాదాల అగ్నులలో
మానవులే  మిడతలు
మారణహోమాలలోన
మాడిపోవు సమిధలు

మతోన్మాద రక్కసికి
మళ్ళీ బలమొస్తుంది
వింతయైన ధ్వంసరచన
కళ్ళెదుటే జరుగుతుంది

మిడిసిపడే సీమలోన
మిత్తి నృత్యమాడేను
మానవులా దుర్బుద్ధికి
కన్నులెర్ర చేసేను 

విప్లవాల అగ్నిలోన
రాజ్యమొకటి ఉడికేను
అధికారము చెల్లదనుచు
అట్టహాస మెగసేను

ఏకాదశి సమయంమున
ఇంతకింత జరిగేను
ఎవ్వరెవరి ఖర్మంబులు
వారి నంటి తిరిగేను
read more " కాలజ్ఞానం - 19 "

28, నవంబర్ 2012, బుధవారం

కాలజ్ఞానం -17

మొదలు నందనమ్ము మార్గశీర్షమ్ములో   
తుదిని  జయము యాషాఢసీమ వరకు    
బాధలెన్నో రేగి తలకిందు చేసేను 
వేషాలు జనులలో హెచ్చు మీరేను 
ఎవరి గోతిని వారు తవ్వుకొబోతారు  

విప్లవం రేగేను రాజ్యాలు కూలేను 
యుద్ధాలు ముప్పులు ప్రకృతి భీభత్సాలు 
సాధారణమ్ముగా జరిగేను
ఏలికలు పయనమ్ము కట్టేరు

మార్గశిర ద్వాదశి మార్పులను తెచ్చేను 

కళ్ళు మూసినా గట్టి రుజువులగుపించేను  
పెంచుకున్నపాపమ్ము బద్దలై పగిలేను 
వికటాట్టహాసమ్ము కాళికయే చేసేను

రానున్న వత్సరమున  భూలోక స్వర్గమున 

గడ్డుకాలమ్మొకటి వచ్చేను కలి ప్రభావమ్ము చూపేను
విపరీత బుద్ధులే వెలిగేను విధ్వంసమే జూడ పెరిగేను 
మ్లేచ్చవర్గాలలో చిచ్చులే రేగేను మృత్యువే నాట్యమ్ము చేసేను  
   
విర్రవీగేవారు వెర్రివారౌతారు బుద్ధి నిలిచేవారు ఒడ్డెక్కి వస్తారు
తప్పదీ మాట తధ్యమింకను జూడ తెలివి తోడను జూచి తేటబడుము 
read more " కాలజ్ఞానం -17 "

23, నవంబర్ 2012, శుక్రవారం

కాలజ్ఞానం - 16

వాహనాలు రిపెర్లతో చికాకు పుట్టిస్తాయి
నటులకు కళాకారులకు సాహితీవేత్తలకు 
చెడుకాలంతో చుక్కెదురౌతుంది
ఒక ఆధ్యాత్మిక నేతకు గండం పొంచి ఉంది 
మేధావుల గోడు ఎవరికీ పట్టదు

అంతా తానే అని భావించే మనిషి 
తానొక అణువుననే సత్యం గ్రహించాలి
విశాల విశ్వపు కధలో తనదొక 
చిన్నపాత్ర మాత్రమేనని గుర్తించాలి


read more " కాలజ్ఞానం - 16 "