Once you stop learning, you start dying

23, ఏప్రిల్ 2025, బుధవారం

మా 69 వ పుస్తకం Indian Astro Numerology విడుదల

ఇంతకు ముందు నాచే తెలుగులో వ్రాయబడిన 'భారతీయ జ్యోతిష సంఖ్యాశాస్త్రము' అనే పరిశోధనా గ్రంధం, ఇప్పుడు ఇంగ్లీషులోకి తర్జుమా చేయబడి, Indian Astro Numerology అనే E-Book గా నేడు విడుదల అవుతున్నది. 

ఇది నా కలం నుండి వెలువడుతున్న 69 వ గ్రంధం. ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా విడుదల అవుతుంది.

పాశ్చాత్య సంఖ్యాశాస్త్రానికి భిన్నమైన మన భారతీయ సంఖ్యాశాస్త్రాన్ని నా పరిశోధనలో కనిపెట్టి  52 జాతకచక్రాల సహాయంతో సోదాహరణంగా ఈ గ్రంధంలో వివరించాను.

ఈ గ్రంధం తెలుగులో చాలా ప్రజాదరణను పొందింది. హైద్రాబాద్, విజయవాడ పుస్తకప్రదర్శనలలో ఎక్కువగా పాఠకులు తీసుకున్న గ్రంధాలలో ఇదీ ఒకటిగా నిలిచింది. ఈ పద్ధతి చాలా బాగుందని, జాతకాల విశ్లేషణలో బాగా ఉపయోగపడుతున్నదని చదువరుల నుండి నాకు మంచి రివ్యూలు కూడా వచ్చాయి.  

అంతర్జాతీయ పాఠకుల ఉపయోగార్ధమై ప్రస్తుతం దీనిని ఇంగ్లీషులోకి అనువదించి విడుదల చేస్తున్నాము.

తెలుగు పుస్తకమును ఇంగ్లీషులోకి అనువాదం చేసిన నా శిష్యురాలు స్నేహలతారెడ్డికి ఆశీస్సులు తెలుపుతున్నాను.

ఇంగ్లీషు చదివేవారిలో దీనికి విస్తృత పబ్లిసిటీని కల్పించాలని Panchawati USA టీమ్ వారిని కోరుతున్నాను.

read more " మా 69 వ పుస్తకం Indian Astro Numerology విడుదల "

చైనా ఇజ్రాయెల్ లను చూచి బుద్ధితెచ్చుకోండి

35 ఏళ్ల క్రితం, హైద్రాబాద్ వాసి సందీప్ కుమార్ భట్టాచార్య, కాశ్మీర్ యాత్రకని కుటుంబంతో సహా వెళ్లి, శ్రీనగర్ గడియారస్థంభం సెంటర్లో బాంబుపేలుడులో చనిపోయాడు. అతను నా స్నేహితుడు. 

నిన్న 27  మంది అమాయక టూరిస్టులు పహల్గావ్ లో హత్యకు గురయ్యారు. మతం అడిగి మరీ ఈ హత్యలు చేశారు. 35 ఏళ్ళు గడచినా, కాశ్మీర్ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు

మొన్న శ్రీనగర్, నిన్న ముజఫర్ నగర్, నేడు పహల్ గావ్, రేపు ఇంకెక్కడో. దారుణాలు కిరాతకాలు మళ్ళీమళ్ళీ జరుగుతూనే ఉంటాయి. మనం మాత్రం క్షమించేస్తూ ఉంటాము. కళ్ళు మూసుకుని అన్నీ మర్చిపోయి హాయిగా బ్రతికేస్తూ ఉంటాము.

మన మధ్యనే ఉన్న రాక్షసులు మనకు నీతులు చెబుతూనే ఉంటారు. మతాలన్నీ ఒకటేనంటారు. శాంతిసూత్రాలు వల్లిస్తారు.  సరిహద్దు అవతల ఉన్న వారి సోదరులు కూడా, అదే గ్రంథం ప్రాతిపదికగా హత్యలు చేస్తూ ఉంటారు. అడిగితే, మేమేం చెయ్యలేదంటారు. మిమ్మల్ని మీరే చంపుకుని అమాయకులమైన మామీద తోస్తున్నారంటారు.

మనమేమో డబ్బుకు అమ్ముడుపోతూనే ఉంటాము. వాళ్ళచేతే తన్నించుకుంటూ ఉంటాము. దేశాన్ని తాకట్టుపెడుతూ ఉంటాము. అదే మనకు ఆనందం !

సమస్య టెర్రరిజంలో లేదు. మనలో ఉంది. వాళ్ళ పనిని వాళ్లు తెలివిగా చేస్తూనే ఉన్నారు. మనమే చేతులు కట్టుకుని కూర్చున్నాం.

పరిష్కరించనంత వరకూ సమస్య ఉంటూనే ఉంటుంది. జండుబామ్ తో కేన్సర్ తగ్గదు. మంచిమాటలు రాక్షసులకు వినిపించవు. 

దెబ్బకు దెబ్బచాలదు. ఒక దెబ్బకు పది దెబ్బలు పడాలి. చైనా ఇజ్రాయెల్ లను చూచి మన దేశం నేర్చుకోవాలి. లేదంటే ముందుముందు సర్వనాశనమే.

read more " చైనా ఇజ్రాయెల్ లను చూచి బుద్ధితెచ్చుకోండి "

17, ఏప్రిల్ 2025, గురువారం

చేతకానివాళ్ళు

గొర్రెలు కసాయినే నమ్ముతాయి

కొన్ని రాష్ట్రాలు ఇంకా కాంగ్రెస్ నే నమ్ముతున్నాయి

ఆ పార్టీ పుణ్యమాని దేశం మూడు ముక్కలైంది.

ఎన్నో సంక్షోభాలలో చిక్కుముళ్లలో ఇరుక్కుపోయింది


ముందుముందు ఇంకెన్ని ముక్కలు కానుందో?

ఇంకెన్ని గడ్డుపరిస్థితులను ఎదుర్కోబోతోందో?


మొన్న కాశ్మీర్ లో పండితులు నిన్న మణిపూర్లో మైతీలు 

నేడు బెంగాల్లో హిందువులు తమదేశంలోనే తాము శరణార్థులై

ఇళ్ళూ వాకిళ్ళూ వదిలి పారిపోయి

శిబిరాలలో దాక్కొని ఉంటున్నారు.


రోడ్లమీద కొట్టుకునే రోజొస్తుందని 

సివిల్ వార్ కి దారితీస్తుందని

పదేళ్లనుంచి చెబుతున్నాను

నిజమౌతోంది చూడండి


కాశ్మీర్, పంజాబ్, బెంగాల్, తెలంగాణా, కర్ణాటక, కేరళ

ఇలా ఒక్కొక్క రాష్ట్రానికీ మతోన్మాద వైరస్ సోకుతోంది

మతనిష్పత్తి రూపంలో ప్రమాదం

చాపక్రింద నీరులా ముంచుకొస్తోంది

దీనికొకటే పరిష్కారముంది


గాంధీ నెహ్రూలు కాంగ్రెస్ నాయకులు

ఇన్నేళ్లు కష్టపడి ఇంత నాశనం చేశాక

ఇక మనమేం బాగుచెయ్యగలం?

మనమే కాదు ఎవరూ ఏమీ చెయ్యలేరు


ఈ యుద్ధాన్ని గెలవడం అసాధ్యం

అందుకే ఒక పనిచేద్దాం


అన్ని రాష్ట్రాలూ కాంగ్రెస్ కే ఓటెయ్యాలి

మిగతా పార్టీలను రద్దు చేయాలి

బార్డర్స్ బార్లా తెరవాలి

ఎవరొచ్చినా నోర్మూసుకోవాలి


తంతే తన్నించుకోవాలి

చంపితే చంపించుకోవాలి

ఇళ్లనూ వాకిళ్ళనూ ఆడాళ్ళనూ భూమినీ లాక్కుంటే

వదిలేసి పారిపోయి గుడారాలలో దాక్కోవాలి

శాంతియుతంగా అన్నీ అప్పజెప్పాలి


లేదా,


అందరూ ఇస్లాంలోకి మారిపోవాలి

రాజ్యాంగం పోయి షరియా రావాలి

ఇండియా ఇస్లామిక్ దేశం కావాలి

మిగతావాళ్లకు ఓటుహక్కు తీసేయాలి


కనీసం సివిల్ వార్ తప్పుతుంది

కుట్రలూ కుతంత్రాలూ అరాచకాలూ

హింసా చావులూ అల్లకల్లోలాలూ తప్పుతాయి

కనీసం అదైనా చేద్దాం

చేతకానివాళ్ళు ఇంకేం చెయ్యగలరు మరి?

read more " చేతకానివాళ్ళు "

13, ఏప్రిల్ 2025, ఆదివారం

అశాంతి నిలయం

'ఆ మధ్యన అమెరికా నుండి కొంతమంది స్నేహితులొస్తే అశాంతినిలయం వెళ్ళొచ్చాము' అన్నదొక శిష్యురాలు. 

'అమెరికా - అశాంతినిలయం, ప్రాస బాగుందిగాని, విషయం చెప్పు' అన్నాను.

'పటాటోపం తప్ప అక్కడేమీ లేదు' అందామె.

'ఇరవై ఏళ్ళనుంచీ నేనుకూడా ఇదే చెబుతున్నాను' అన్నాను ప్రాస కలుపుతూ.

'వాలంటీర్లకూ భక్తులకూ మా ఎదురుగానే గొడవైంది' అన్నదామె. 

'వాలంటీర్లకు వాలం ఉందా?' అడిగాను.

'అర్ధం కాలేదు' అంది 

'పోనీ భక్తులకు రెక్కలున్నాయా?' అడిగాను.

'మళ్ళీ అర్ధం కాలేదు' అంది 

'వాలం అంటే తోక, తోక ఉన్నవారే వాలంటీర్లు. అంటే కోతులు. బకము అంటే కొంగ. నేటి భక్తులందరూ బకులే. అంటే  కొంగజపం చేసే అవకాశవాదులన్నమాట. గట్టిగా అదిలించామంటే తుర్రున ఎగిరిపోతారు. మరి కోతులూ కొంగలూ ఒకచోట చేరితే అశాంతినిలయం కాక ఇంకేమౌతుంది? అడిగాను.

'మరి స్వామి ఏం చేస్తున్నట్టు?' అనుమానమొచ్చింది శిష్యురాలికి.

'ఉన్నప్పుడేం చేశాడు ఇప్పుడు చెయ్యడానికి?' అడిగాను.

'మళ్ళీ అర్ధం కాలేదు' అంది

'విచారణ జరుగుతోంది. బోనులో నిలబడి ఉన్నాడు' అన్నాను.

'ఏంటో మీ మాటలేవీ అర్ధం కావు' అందామె.

'కొన్ని అర్ధం కాకపోవడమే మంచిది' అన్నాను.

read more " అశాంతి నిలయం "

11, ఏప్రిల్ 2025, శుక్రవారం

చెప్పేది చెయ్యకు

మెదడుకు శస్త్రచికిత్స చేయించుకున్న గురువుగారు

ఆరోగ్యసూత్రాలు చెబుతున్నారు

అణువులు గంతులేస్తున్నారు


యోగాను భక్తులకు బోధించే ఇంకో గురువుగారు

తనేమో జిమ్ము చేస్తున్నారు

పరమాణువులు పల్టీలు కొడుతున్నారు


చెప్పేది చెయ్యమని శాస్త్రంచెబుతోంది

చెప్పేది చెయ్యక్కర్లేదని  వీరంటున్నారు

కలియుగంలో ఇలాగే ఉంటుందని నేనంటున్నాను

అణువులూ పరమాణువులూ వర్ధిల్లండి !

read more " చెప్పేది చెయ్యకు "

రాత్రి భజనలు

దుకాణం దగ్గర గుడి పూజారి కలిశాడు.

'ఊర్లోకొచ్చారు కదా ! మా ఇంటికెళదాం రండి. కాఫీ త్రాగుతూ మాట్లాడుకుందాం' అన్నాడు మర్యాదగా.

'లేదండి. నేను త్రాగను, ఇంకోసారి వస్తాలెండి మీ ఇంటికి' అన్నాను.

'గుడికి రండి. రాత్రి పదకొండుదాకా భజన చేస్తారు' అన్నాడాయన.

'అవన్నీ చిన్నప్పుడే అయిపోయాయి. క్రొత్తగా ఇప్పుడెందుకు?' అన్నాను

ఆశ్చర్యంగా చూశాడాయన.

'అయినా, అంత రాత్రిపూట భజనలు చేయకూడదు. రాత్రిళ్ళు పూజలు చేసేది రాక్షసులు. పైగా శబ్దకాలుష్యం. ఆ టైంకి మేమొక నిద్రతీసి లేస్తాం' అన్నాను.

మళ్ళీ ఆశ్చర్యంగా చూశాడాయన.

'ఏదైనా వేళకి చెయ్యాలి. అలా చేయకపోవడమే రోగాలకు ఒక కారణం' అన్నాను.

ఆయనలా చూస్తున్నాడు.

'ధర్మాన్ని మనం అనుసరించాలి. మనం చేసే ప్రతిదీ ధర్మం అనుకోకూడదు' అన్నాను

ఇంకా అలాగే చూస్తున్నాడాయన.

నేనొచ్చేశాను.

read more " రాత్రి భజనలు "

మేం చేస్తున్నదేంటి?

నిన్నొక పనిమీద ఊర్లోకెళ్ళాను.

మాటల మధ్యలో, 'ఫలానా మాతాజీకి 102 ఏళ్ళుట. నిన్న చనిపోయింది' అన్నారొకరు.

'మర్రిచెట్టు కూడా బ్రతుకుతుంది. ఉపయోగం?' అన్నాను

'సాధువుగా మంచిగా బ్రతికింది కదా అన్నేళ్లు?' అన్నదామె.

'మాయసాధువుగానా? వాళ్ళు చెప్పేదంతా ధర్మవిరుద్ధం. బూటకం.' అన్నాను.

'మరి మంచిగా ఉంటూ అన్నేళ్లు ఆరోగ్యంగా బ్రతకాలంటే ఏం చెయ్యాలి?' అన్నదామె.

'మేము చేస్తున్నదేంటి?' అన్నాను. 

read more " మేం చేస్తున్నదేంటి? "