“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, ఫిబ్రవరి 2020, శుక్రవారం

సేవ చెయ్యకండి ! దాని పని అయిపోయింది !

'మానవసేవే మాధవసేవ' అన్న సూత్రం మనకు బాగా తెలుసు. రాజకీయ నాయకులూ, లెక్చరర్లూ, వక్తలూ అందరూ ఈ మాటను కొన్ని వేలసార్లు వాడి ఉంటారు. చివరకు లారీల వెనుకా ఆటోల వెనుకా కూడా దీనిని మనం గమనిస్తూ ఉంటాం.

నా ఉద్దేశ్యంలో మాత్రం ఈ సూక్తి తన విలువను కోల్పోయింది. నేటి సమాజంలో సేవ అనేది ఎవరికీ అవసరం లేదని నా ప్రగాఢమైన నమ్మకం. ఈ నమ్మకం నిరాధారమైనది కాదు. గట్టి పరిశీలన తర్వాతే నేనీ నమ్మకానికి వచ్చాను.

మొన్నీ మధ్యన రామకృష్ణా మిషన్ కు చెందిన స్వామీజీ ఒకాయన నాకు వాట్సప్ లో కొన్ని ఫోటోలు పంపారు. ఏదో పేదల కాలనీకి వెళ్లి అక్కడ ఉన్న కుష్టువారికీ ఇతర నిర్భాగ్యులకూ దుప్పట్లూ బట్టలూ పంచుతున్న ఫోటోలవి. కేరళలో ఎక్కడో ఈ కార్యక్రమం జరిగింది. ఆ ఫోటోలను ఆయన నాకు పంపారు. ఆయనకు ఇలా మెసేజి ఇచ్చాను.

'మీరు చేస్తున్న సేవకు అర్ధం లేదు. ప్రస్తుతం మన సమాజంలో ఈ రకమైన సేవ ఎవరికీ అవసరం లేదు. వివేకానందస్వామి టైములో ఈ రకమైన సేవ అవసరం ఉన్నది. కానీ ఇప్పుడు లేదు. కనుక మీరు ఈ పనులు చెయ్యనవసరం లేదని నా ఉద్దేశం. మీ ఫోటోలు చాలా కామెడీగా ఉన్నాయి. అన్నీ ఉన్నవాడికి ఏమీ లేనివాడు బట్టలు పంచుతున్నాడు. ఇది కామెడీ కాకపోతే మరేంటి?'.

దానికాయన షాకైనారు. బహుశా ఇలా ఆయనకు ఎవరూ చెప్పి ఉండరు.

ఆయన షాక్ ను చూసి ఇలా చెప్పాను.

'చూడండి స్వామీజీ ! మీరు సర్వసంగ పరిత్యాగులు. మీకు బ్యాంక్ ఎకౌంట్ లేదు. ఆదాయం లేదు. పూర్తిగా భగవంతునిమీద ఆధారపడి మీరు ఉంటున్నారు. ఇకపోతే, మీరు సేవ ఎవరికి చేస్తున్నారో గమనించండి. ఆ కుష్టువారికీ, ఇతర నిర్భాగ్యులకూ అందరికీ ఇప్పుడు ఇళ్ళస్థలాలున్నాయి, బ్యాంక్ ఎకౌంట్లున్నాయి, ఆదాయమార్గాలున్నాయి. ప్రభుత్వమే లెక్కలేనన్ని welfare schemes ఇస్తోంది. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరయ్యా అంటే, పేదవాడే. వాడికి అన్నీ ఫ్రీనే. టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. స్కీమ్స్ అన్నీ వాడుకుని ప్రభుత్వం నుండి డబ్బులు తీసుకుంటాడు. ఇళ్ళస్థలాలు తీసుకుంటాడు. అవి అమ్ముకుని మళ్ళీ ఇంకో స్కీం లో మళ్ళీ తీసుకుంటాడు. వాడికన్నీ ఉన్నాయి. మీకేమో ఏమీ లేవు. నిజంగా పేద మీరే. మీకే సేవ అవసరం. మీరు ఇంకొకరికి చేయ్యనక్కర లేదు.

ఇంకో కోణం వినండి.

మీ దగ్గర సహాయం తీసుకుంటున్న ఎవరికీ మీమీద కనీస కృతజ్ఞత ఉండదు. వాళ్ళలో చాలామంది ఇప్పటికే క్రైస్తవులుగా మారినవాళ్ళు. చర్చిల నుండి సహాయాన్ని పొందుతున్న వాళ్ళు. ఇంకోపక్క ప్రభుత్వం కూడా వారికి ఇస్తోంది. మీరిస్తే మీ దగ్గర తీసుకుంటారు, కానీ మీ వెనుక మిమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడతారు. మీరు చూడలేదేమో? నేనిది చాలాకాలం క్రితమే గమనించాను.

ఈ దేశంలో బెగ్గర్ అనేవాడు రోజుకు సగటున వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడు. అంటే కొత్తగా చేరిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కంటే ఒక బెగ్గర్ ఎక్కువ సంపాదిస్తున్నాడు. TCS లో కొత్తగా చేరిన ఉద్యోగికి 18000 మాత్రమే వస్తోంది, సెంటర్లో హోటల్ దగ్గర పొద్దుటనుంచీ సాయంత్రం దాకా ఊరకే కూచుని అడుక్కునే బెగ్గర్ గాడు 30000 సంపాదిస్తున్నాడు. వాడి భార్య ఇంకో సెంటర్లో ఇంకో 30000 సంపాదిస్తోంది. TCS లో కొత్తగా చేరిన సాఫ్ట్ వేర్ ఇంజనీరేమో పెళ్లి చేసుకోవాలంటే ఈ 18000 ఏ మూలకీ చాలవు. ఏం చెయ్యాలి? అని దిక్కులు చూస్తున్నాడు. అందులోనే పనిచేసే సాటి అమ్మాయి వీడిని చేసుకోదు. ఎందుకంటే వాడికి కూడా తనలాగే 18000 వస్తుంది మరి !. అందుకని, తన అందాన్ని ఎరగా వేసి ఏ కాలిఫోర్నియాలోనో ఉన్న గూగుల్ ఇంజనీరుకి ఆమె గాలం వేస్తూ ఉంటుంది.

ఈలోపు ఈ బెగ్గర్ ఫామిలీ ఇంకో నలుగురు పిల్లల్ని కని సమాజం మీదకు వదుల్తారు. వాళ్ళుకూడా ఏదో ఒక సెంటర్లో ఒక మంచిహోటలు చూసుకుని రోడ్డుమీద హాయిగా సెటిలై పోతారు. ప్రభుత్వం వాళ్లకు కూడా ఇళ్ళస్థలాలు ఇస్తుంది. వాళ్ళకూ బ్యాంక్ ఎకౌంట్లు వస్తాయి. వాళ్ళు కూడా మొబైల్స్ వాడుతూ ఉంటారు. అందరూ కలసి బేవార్స్ గా సంపాదిస్తూ ఉంటారు. దీనికితోడు, ప్రభుత్వం ఇచ్చే welfare schemes అన్నీ వాడుకుని డబ్బులు తీసుకుంటూ ఉంటారు. నిజాయితీగా చదువుకుని ఉద్యోగం చేసేవాడు మాత్రం 'ఈ జీతంతో ఈ సిటీలో ఎలా బ్రతకాలిరా దేవుడా?' అని ఏడుస్తూ ఉంటాడు. ఇదీ మన దేశం పరిస్థితి ! 

బెగ్గర్స్ మాఫియా గురించి చెబితే మీరు కళ్ళు తిరిగి పడిపోతారు. కొన్ని సెంటర్స్, కొన్ని హోటల్స్ దగ్గర కొందరే బెగ్గర్స్ ఉంటారు. అవి వారి సొంత స్థలాలన్నమాట. వేరే బెగ్గర్ అక్కడ కొచ్చి అడుక్కోవాలంటే, ఎప్పటినుంచో అక్కడ ఉన్న బెగ్గర్ కి వాడు రాయల్టీ కట్టాలి. వాళ్లకు సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సంఘాల నాయకులు అడుక్కోవడం మానేసి, బెగ్గర్స్ ఇచ్చే మామూళ్ళతో బ్రతికేస్తూ ఉంటారు. వీళ్ళలో చాలామంది స్కూటీలో అన్ని సెంటర్స్ కీ తిరుగుతూ మామూళ్ళు వసూలు చేస్తూ ఉంటాడు. వీటిని మీరు నమ్మలేరు, కానీ నిజాలే.

ఆయన ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే నేను చెబుతున్నది నిజమే అని ఆయనకూ తెలుసు మరి ! ఆయనలో 'ఆలోచనాతరంగాలు' మొదలై ఉంటాయని నాకనిపించింది.

సేవ అనే పదం ప్రస్తుతం తన విలువనే కాదు. తన ప్రాణాన్నే కోల్పోయింది. అందుకే నా శిష్యులందరికీ నేను చెబుతాను. 'ఏ బెగ్గర్ కీ మీరు డబ్బులు ఇవ్వకండి. ఎవడి సైకలాజికల్ బ్లాక్ మెయిల్ కీ మీరు పడకండి. అలా ఇస్తే మీరు ఒక దరిద్రపు బద్దకాన్ని సమాజంలో పెంచి పోషిస్తున్నట్లే.'

అంతేకాదు, నేను ఇంకో మాట కూడా తరచుగా చెబుతూ ఉంటాను. నాకే గనుక అధికారం ఉంటే, నేను ఈ బెగ్గర్స్ కీ, పనీపాటా చెయ్యకుండా సమాజం మీద పడి బ్రతికే వాళ్ళకీ ఒకే రకమైన 'సేవ' చేస్తాను.  ఈ దరిద్రపు జీవితం నుంచి వాళ్లకు శాశ్వతంగా విముక్తి ప్రసాదిస్తాను. అదెలాగంటే, ముందుగా ఒక వారం గడువు వాళ్ళందరికీ ఇస్తాను. "అడుక్కోవడం మానుకొని చేతనైన పనులు చేసుకుని బ్రతకండి" అని. ఆ గడువు అయిపోయిన తర్వాత ఇలాంటి వాళ్ళందరినీ ఒకచోటకు చేర్చి ఆర్మీ చేత షూట్ చేయించి పారేస్తాను. ఆ తర్వాత మాస్ క్రిమేషన్ చేయిస్తాను. ఒకే ఒక్క రోజులో ఇండియాలో అడుక్కునేవాళ్ళ బెడద తప్పిపోతుంది. ఇండియా బెగ్గర్ ఫ్రీ కంట్రీ అవుతుంది.

మొన్నటికి మొన్న పాండిచేరి బస్టాండ్ లో చూచాను. కొందరు ఫారినర్స్ బెంగుళూరు బస్స్టు ఎక్కబోతూ, ఒక స్టాల్ దగ్గర ఏవో కొంటున్నారు. ఒక బెగ్గర్ గారు వాళ్ళను ఘోరంగా సతాయిస్తున్నాడు. వాళ్లకు విసుగోచ్చి ఒక పాకెట్లో పదికి పైగా సమోసాలు కొని వాడికిచ్చారు. వాడు ఆ సమోసాల పొట్లాన్ని కొంచం దూరంలో కూచుని ఉన్న ఇంకొక బెగ్గర్ దగ్గర డిపాజిట్ చేసి మళ్ళీ వీళ్ళ దగ్గరకొచ్చి మళ్ళీ బెగ్గింగ్ మొదలు పెట్టాడు. అప్పుడు ఆ ఫారినర్స్ ముఖాలు చూడాలి ! నాకు భలే నవ్వొచ్చింది. మన దేశం గురించి వాళ్ళు ఎంత చండాలంగా మాట్లాడుకుంటారో నవ్వుకుంటారో ఆలోచిస్తే నాకు చాలా బాధ కలిగింది. పోనీ ఆ బెగ్గర్ గాడు నిజంగా దరిద్రంలో ఉన్నాడా అంటే అదీ లేదు ! అంతా డ్రామా !

మొన్నా మధ్యన ఇంకో సంఘటన జరిగింది. ఎవరో నాకు ఒక రిక్వెస్ట్ పంపారు. 'ఒక తండ్రి తన కూతురుకి పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నాడు. అందుకనే అందరం డబ్బులు వేసుకుని ఆ పెళ్లి చేస్తున్నాం. మీరు కూడా కొంత సాయం చెయ్యండి' అని దాని సారాంశం. దానికిలా జవాబిచ్చాను.

'మొదటగా, అలాంటి పరిస్థితిలో ఉన్నవాడు అసలు పిల్లల్ని కనకూడదు. ఎందుకు కన్నాడు? అందుకు వాడిని ముందుగా శిక్షించాలి. రెండోది - అంత అప్పు చేసి ఆ పెళ్లి చెయ్యనవసరం లేదు. ఈ రోజుల్లో పెళ్ళే చెయ్యాలంటే, చాలా మార్గాలున్నాయి. గుళ్ళో దండలు మార్చుకుని సింపుల్ గా చేసుకోవచ్చు. లేదా రిజిస్టర్ మేరేజి చేసుకోవచ్చు.  ఈ రెండిట్లో ఎదో ఒకటి చెయ్యమని ఆ తండ్రికి నా మాటగా చెప్పండి. అడుక్కుని ఆర్భాటంగా  పెళ్లి చెయ్యవలసిన పని ఏ మాత్రమూ లేదు. ఇంకా చెప్పాలంటే, నా దృష్టిలో ఆ అమ్మాయికి అర్జంట్ గా కావలసింది పెళ్లి కాదు. ముందు ఆర్ధిక భద్రత కావాలి.  అడుక్కుని పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్ళైన రెండో రోజునుంచీ ఎవర్ని అడుక్కుంటారు? పెళ్లి చేస్తే జీవితం అయిపోదు, మొదలౌతుంది. మరి అప్పుడెవరిని అడుక్కుంటారు? కనుక, తనకు చేతనైనది ఏదో ఒక ఉద్యోగమో, పనో చేసుకుని కొన్నాళ్ళు డబ్బులు దాచిపెట్టుకుని ఆ తర్వాత కులమూ మతమూ అన్న చెత్తమాటలు మాట్లాడకుండా తనకు నచ్చినవాడిని చేసుకోమని  ఆ అమ్మాయికి నా మాటగా చెప్పండి. ఇలాంటి సహాయాలు చెయ్యడం 'సేవ' కాదు. నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఆ పెళ్లిని ఆపమని నా మాటగా వారికి చెప్పండి' అన్నాను.

యధావిధిగా నా మాటలకు వాళ్ళు షాకైనారని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను.

మొన్నొక రోజున స్కందగిరి సుబ్రమణ్యస్వామి గుడికి వెళ్ళాము నేనూ మా ఆవిడా. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి యధావిధిగా బెగ్గర్స్ చుట్టుముట్టారు. నేను డబ్బులివ్వకుండా వచ్చేస్తుంటే వాళ్ళ సైకాలజీ అస్త్రాలు సంధించడం మొదలు పెట్టారు.

'దరమం చేసుకో, పున్నెం వస్తాది' అని ఒకామె అంది.

'నాకే నువ్వు చేసుకో, నీకింకా వస్తాది. వచ్చే జన్మలో కూడా ఈ గుడిదగ్గరే ఉంటావ్' అన్నా నేను.

చివరకు బెగ్గర్స్ కూడా షాకైనారు నా మాటలకి. నా ఖర్మకి నాకే నవ్వొచ్చింది. పెద్దగా నవ్వుతూ బైక్ స్టార్ట్ చేశా. బహుశా నేనొక పిచ్చోడినో లేదా దురహంకారినో అనుకోని ఉంటారు వాళ్ళంతా.

వివేకానందస్వామి టైంలో బ్రిటిష్ పాలన ఉంది. అంతా దోపిడీనే. చదువు లేదు. ఉద్యోగాలు లేవు. పరిశ్రమలు లేవు. అవకాశాలు లేవు. అంతా దరిద్రమే. అలాంటి పరిస్థితిలో 'సేవ' అనేది అవసరం అని స్వామి అన్నారు. కానీ అప్పటినుంచి ఇప్పటికి 120 ఏళ్ళు గడిచిపోయాయి. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ రకమైన సేవ ఇప్పుడు ఎవరూ చెయ్యవలసిన అవసరం లేదు. ఇప్పుడు గనుక 'అయ్యోపాపం' అని ఎవరైనా అనుకుంటే వారికే పాపం చుట్టుకుంటుంది ! అలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం !

'ఆత్మనో మోక్షార్ధం జగద్ధితాయచ' - 'తన మోక్షంకోసం, జగత్తుకు హితం చెయ్యడం కోసం' - అనే బుద్ధుని వాక్యాన్ని వివేకానందస్వామి తన ఆదర్శంగా స్వీకరించారు. జగత్తుకు హితం చెయ్యడం అనేదానిని ఆరోజులలో ఉన్న అవసరాలను బట్టి ఆయన నిర్దేశించారు. ఈ వందేళ్ళలో ఆ అవసరాలు ఆ పరిస్థితులు పూర్తిగా తల్లక్రిందులైనాయి. ఒకప్పుడు తినడానికి ముద్దలేని పరిస్థితి ఇండియాది. ప్రస్తుతం ఇండియాను పీడిస్తున్న అతి పెద్ద సమస్యలు ఊబకాయమూ, బానపొట్టా, అవెలా తగ్గుతాయన్న చింతా. ఇంతే !

ఇంతకంటే ఎక్కువగా చెప్పనవసరం లేదనుకుంటాను !

నేడు చెయ్యవలసిన సేవ వేరే ఉంది. దాని టైటిల్ 'ఆత్మసేవే అత్యున్నత సేవ'. 'మానవసేవే మాధవసేవ' అన్నసూత్రానికి ఇప్పుడు అర్ధం లేదు. 'ఆత్మసేవే సర్వసేవ' అనేదే నేటి సూత్రం ! దానిగురించి ఆ రామకృష్ణా మిషన్ స్వామీజీకి ఇంకోసారి ఉపదేశం ఇస్తాను. అలాగే మీకు కూడా ! అంతవరకూ ఓపికగా వేచిచూడండి. ఈ లోపల నేను చెప్పినది నిజమో కాదో మీరే గమనించి, ఆలోచించి, విచారించి చూడండి. సత్యం మీకే అర్ధమౌతుంది !