“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

3, జనవరి 2013, గురువారం

రాహుకేతువుల రాశిమార్పు - 2013 ఫలితాలు

డిసెంబర్ 24 ప్రాంతంలో రాహుకేతువులు రాశులు మారినారు.రాహువు వృశ్చికంలో నుంచి తులలో ప్రవేశించాడు.కేతువు వృషభం నుంచి మేషంలోకి ప్రవేశించాడు.గత ఏడాదిన్నరగా వారు నీచస్తితిలో ఉండి ప్రపంచవ్యాప్తంగా ఎంతో విధ్వంసాన్ని కలిగించారు.

విధ్వంసాన్ని రాహుకేతువులు కలిగించారు అనడం కంటే,భయంకరమైన చెడుకర్మను పోగుచేసుకున్న ప్రజలకు వారివారి కర్మానుసారం తగిన ఫలితాలిచ్చారు అనడం సరిగ్గా ఉంటుంది.గ్రహాలు మనకు మిత్రులూ కావు, శత్రులూ కావు.అవి దైవస్వరూపాలు.ఎవరెవరి కర్మానుసారం వారికీ ఆయా ఫలితాలనిస్తుంటాయి.

గత ఏడాదిన్నరలో ఎంతోమంది ప్రముఖులు పరలోకానికి ప్రయాణం కడతారని ముందే వ్రాశాను.అలా పోయిన వారి లిస్టు చూస్తె ఒక పెద్ద పేజీకి వచ్చేలా ఉంది.ఎన్నో నీచమైన ఘోరమైన సంఘటనలు జరుగుతాయని కూడా ముందే వ్రాశాను.అవీ జరిగాయి.కావలసిన వారు 2011 లో రాహుకేతువులు రాశులు మారిన సమయంలో వ్రాసిన పోస్ట్ లు చదవవచ్చు.

ఇప్పుడు మళ్ళీ వారు రాశులు మారినారు.డిసెంబర్ 2012 నుండి జూలై 2014 వరకూ మారిన స్తితిలో కొత్త రాశులలో ఉంటారు.కనుక ప్రపంచవ్యాప్తంగా అనేక కొత్త సంఘటనలు మళ్ళీ జరుగుతాయి.అవి ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

Coming events cast their shadows అంటారు.రాహువు 1-12-2012 నుంచీ సున్నా డిగ్రీలలో ప్రవేశించాడు.అంటే సంధికాల ప్రవేశం జరిగింది.ఇక అక్కణ్ణించి అనేక చెడు సంఘటనలు మొదలయ్యాయి.మీరెవరైనా సూక్ష్మంగా గమనిస్తే ఆ రోజునించీ అనేక చెడువార్తలను ప్రపంచవ్యాప్తంగానూ మన దేశంలోనూ కూడా జరిగినట్లుగా చూడవచ్చు.

తులారాశి శుక్రస్థానం,అక్కడ ఇప్పటికే చాలా బలంగా ఉన్న శనీశ్వరుడు కొలువై ఉన్నాడు.అక్కడికి ఇప్పుడు రాహువు కూడా వచ్చి చేరుకున్నాడు. కేతువు కుజునిదైన మేషంలో ప్రవేశించాడు. దీనిఫలితాలు ఊహించడం కష్టమేమీ కాదు.శుక్రుని ఇంటిలో రాహువూ,బలమైన శనీ తిష్ట వెయ్యడం పరికిస్తే భవిష్యత్తు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

కొంతమంది నన్ను అడిగారు.మన దేశంలో రేప్ కేసులు కొన్ని దశాబ్దాలనుంచీ జరుగుతూనే ఉన్నాయి.ఇంతకంటే ఇంకా ఘోరమైన కేసులు కూడా జరిగాయి.మరి ఇప్పుడు మాత్రమె, డిల్లీ రేప్ కేసుకు ఇంత ప్రాచుర్యం ఎందుకు వచ్చింది అని? అంతేకాదు,దాని తర్వాత కూడా వరుసగా ప్రతి రాష్ట్రం లోనూ రేప్ కేసులు నమోదు అవుతున్నాయి.ఉన్నట్టుండి ఫోకస్ దీనిమీదకు ఎందుకు వచ్చింది? ఏమిటిది?

దీనికి ఒకటే కారణం ఉన్నది.రాహువు,శుక్రుడు,శని కలిస్తే ఇలా జరగక ఇంకెలా జరుగుతుంది? రాహువు వృశ్చిక తులారాశుల సంధిలో ప్రవేశించగానే ఇలాంటి ఫలితాలు చూపడం మొదలైంది. దీనిని సంధ్యాప్రభావం అంటారు.స్త్రీల మీద దాడులు,లైంగిక నేరాలు,వ్యభిచారం ఊపందుకోవడం,అక్రమ సంబంధాలు మితిమీరడం ఇలా ఎన్నో ఉన్నట్టుండి వెలుగులోకి వస్తున్నాయి.డిసెంబర్ 24 ప్రాంతంలో రాహువు పూర్తిగా తులారాశిలో ప్రవేశించాడు.కనుక ఇక ఇలాంటి సంఘటనలు స్థిరంగా ఇంకా ఇంకా జరుగుతాయి.

ఈ గ్రహమార్పు వల్ల ఇంకా ఏ రకమైన ఫలితాలు జరుగవచ్చో చూద్దామా?

>>వాయుయాన ప్రమాదాలు,జలయాన ప్రమాదాలు అధికం అవుతాయి.మొన్న డిసెంబర్ 24,25,26 తేదీలలో రాహువు రాశి మారినప్పుడు అనేకమంది జారిపడటం,వాహనాల యాక్సిడెంట్లు కావడం,దెబ్బలు తగలడం,అనారోగ్యం పాలుగావడం జరిగాయి.ఈ సంఘటనలే నిదర్శనాలు.

>>శనీశ్వరుని ఉచ్చస్తితి వల్ల ప్రజాఉద్యమాలు ఊపందుకుంటాయి. ఇంతకు ముందు ఎన్నో కేసులు జరిగినప్పటికీ డిల్లీ రేప్ కేసుకు మాత్రమె ఇంతటి ప్రజాస్పందన రావడం,ఇంత ఉద్యమం జరగడం వెనుక శనీశ్వరుని ఉచ్చస్తితి యొక్క బలీయమైన ప్రభావం ఉన్నది.

>>లైంగిక నేరాలు,మహిళలపైన దాడులు ఇంకా అధికం అవుతాయి. 

>>సినిమారంగంలో కళారంగంలో పెద్దలు గతిస్తారు. ఆ రంగంలో అనుకోకుండా కొన్ని యాక్సిడెంట్లు జరిగి కళాకారులు ఇతరులు గాయపడతారు.ఆడనటులు మోసానికి,ద్రోహానికి గురౌతారు.

>>మేషరాశి యూరోప్ దేశాలకు, ముఖ్యంగా బ్రిటన్ కు సూచిక.కనుక ఆ దేశాలలో ఘోరాలు,ప్రకృతి వైపరీత్యాలు,దుస్సంఘటనలు,హటాత్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి.గ్రహద్రుష్టి ఆ దేశాలమీద పడుతుంది.ముస్లిం ఉగ్రవాదులు ఈ దేశాలను తమ కార్యకలాపాలకు స్థావరాలుగా మార్చుకుంటారు.

>>తులారాశి ముస్లిం దేశాలకు సూచిక.కనుక ముస్లిం తీవ్రవాదం మళ్ళీ నిద్రలేస్తుంది.దీనివల్ల యూరోప్ లోనూ మన దేశంలోనూ కూడా దాడులు,అసాంఘిక సంఘటనలు పెరుగుతాయి.ప్రభుత్వమూ ప్రజలూ అప్రమత్తంగా ఉండాలి. 

>>పాకిస్తాన్ బలం పుంజుకోవడం వల్ల, మన దేశంలో వారి కుట్రలు మళ్ళీ ఊపందుకుంటాయి.పాకిస్తాన్ అభిమానులూ క్రియాశీలకులౌతారు.

>>ప్రస్తుతం రాహువు గురునక్షత్రంలో సంచరిస్తున్నందువల్ల, గురువుల ప్రతిష్ట మసకబారుతుంది.సుభాష్ పత్రీ ఉదంతం దీనికి నిదర్శనం.అందులోనూ అమ్మాయిల పాత్ర ఉందని ఆరోపణలు రావడం వెనుక రాహువు శని శుక్రుల పాత్ర పోషణ అమోఘం.

>>ఆర్ధిక నేరాలు,మోసాలు,బ్లాక్ మెయిలింగ్,కిడ్నాపులు  వెలుగుచూస్తాయి.రవాణా రంగంలో ప్రమాదాలు జరుగుతాయి.

>>రాహువు నడుస్తున్న వాహనాలకు సూచకుడు.కనుక వాహన ప్రమాదాలు ఎక్కువ అవుతాయి. అతడు పెట్రో కెమికల్ ఉత్పత్తులకూ సూచకుడే.కనుక పేలుళ్లు,అగ్నిప్రమాదాలూ అధికం అవుతాయి.

>>దేశం ఉలిక్కిపడేలా ఊహించని ఘోరాలు కొన్ని పశ్చిమదిక్కున ఉన్న విలాసనగరంలో జరుగుతాయి.

ఇతరులను హింసపెట్టినవారూ,చెడు పనులు చేసినవారూ,అడివిలో దాక్కున్నా ప్రమాదం తప్పించుకోలేరు.అలాగే మంచివారు,ఇతరులకు ఉపకారం చేసేవారు సముద్రం అడుగున దాక్కున్నా మంచిఫలితాలను తప్పించుకోలేరు.వారి కర్మల ఫలితాలు అక్కడికే డెలివరీ చెయ్యబడతాయి అనేది వాస్తవం.

ఈ ఒకటిన్నర ఏడాది కాలంలో ఆయా సంఘటనలు జరుగబోయే ముందుగా వాటి గురించి సూచనాప్రాయంగా వ్రాస్తాను.