“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, మే 2022, బుధవారం

'జ్ఞానవాపి' మసీదెలా అవుతుంది? బుద్దుందా అసలు?

కాశీలోని విశ్వనాధాలయ ప్రాంగణంలో ఉన్న జ్ఞానవాపిమసీదులో శివలింగం బయటపడింది. ఈ విషయం తెలుసుకోవడానికి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళు పట్టింది. అదికాదు విచిత్రం. అసలైన విచిత్రం వేరే ఉంది.

జ్ఞానవాపి అంటే, 'జ్ఞానజలం కలిగిన బావి' అని అర్ధం. ఇది కాశీవిశ్వనాధాలయ ఆలయ కాంప్లెక్స్ లోనే ఉంటుంది, ఈ మసీదుకు ఒక పక్కన ప్రాచీన విశ్వనాధాలయ గోడలే ఉంటాయి. సుల్తానుల కాలంలో, ఆలయాన్ని ఆక్రమించి, కూలగొట్టి, దానిలో ఉన్న పవిత్రమైన జలంతో కూడిన బావిని మాత్రం అట్లాగే ఉంచి, దానిని కబ్జా చేసి మసీదు కట్టుకున్నారు. ఈ విషయం చిన్నపిల్లోడైనా చెప్పగలడు. అది ఖచ్చితంగా శివాలయమే.  

అయితే, ఈ మసీదును తొలగించి, సుల్తానులు చేసిన ఘోరమైన నేరాన్ని తుడిచివేసి, మన శివాలయాన్ని మనం సొంతం చేసుకోవడానికి ఒక చట్టం అడ్డొస్తున్నది. అది మళ్ళీ మనం రాసుకున్న చట్టమే. అదే Places of worship Act - 1991.

ఈ చట్టం ప్రకారం, 14 ఆగస్టు 1947 న ఏది ఉందో దానిని కదిలించకూడదు. మార్చకూడదు. ఆరోజున  దేవాలయం ఉంటే, ఎప్పటికీ దేవాలయంగానే ఉండాలి. ఆ రోజున మసీదై ఉంటే, అది అంతకు ముందున్న దేవాలయాన్ని కూలగొట్టి కట్టినదైనా సరే, దానిని మసీదుగానే పరిగణించాలి. భలే ఉంది కదూ !

ఇది కరెక్ట్ చట్టమైతే, మరి ఇదే సూత్రం మతమార్పిడికి వర్తించదా? 14 ఆగస్టు 1947 న హిందువుగా ఉంటే, ఎప్పటికీ హిందువుగానే ఉండాలి. క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా ఇదే రూలు. మతాలు మారకూడదు' అని చట్టం ఎందుకు రాదు?

దేవాలయాలకు ఒక న్యాయమూ, మతమార్పిడికి ఇంకొక న్యాయమా? అసలిది న్యాయమేనా? న్యాయమంటే ఇలాగే ఉంటుందా?

ఈ చట్టం రూపొందినప్పుడు ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటినుంచీ ఏం చేస్తూ వచ్చింది.? కాశ్మీర్ ను రావణకాష్టం చేసింది.  అమాయకులైన కాశ్మీర్ పండిట్లను లక్షలాదిగా ముస్లిములు చంపుతుంటే చూస్తూ ఊరుకుంది. చైనాకు లక్షలాది చదరపు కిలోమీటర్ల భారతభూభాగాన్ని ధారాదత్తం చేసింది. మహారాష్ట్రలో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ను, ఇంకా ఇతర ముస్లిం టెర్రరిస్ట్ గ్యాంగులను పెంచి పోషించింది. యూనివర్సిటీలలో మతవిషాలను నూరిపోసింది. మతమార్పిళ్లకు దన్ను కాచింది. పాస్టర్లు హిందూమతాన్ని, హిందూదేవతలను ఇష్టం వచ్చినట్లు తిడుతుంటే, మతాలు మారుస్తుంటే, వాళ్లకు FCRA రూపంలో ఫారిన్ ఫండ్స్ అందించింది. ముస్లిం టెర్రరిస్టులు అరాచకాలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంది. వెరసి మన దేశాన్ని సర్వనాశనం చేసేసింది.  ఇదన్నమాట 50 ఏళ్లపాటు మనం ఓట్లేసి గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వపు ఘనత !

1947 లో మనకు స్వతంత్రం వస్తే, 1991 దాకా ఊరుకుని, 44 ఏళ్ల తర్వాత హడావుడిగా Places of worship Act - 1991 ను తేవలసిన అవసరం ఏమిటి? అయోధ్య, మధుర, కాశీ, కుతుబ్ మినార్ ఇంకా వేలాదిచోట్ల దేవాలయాలను ముస్లిములు కూలగొట్టి, ఆక్రమించి, వాటిని మసీదులుగా మార్చినట్లు చరిత్ర చెబుతున్నది, ఆర్కియాలజీ రుజువులు కనిపిస్తున్నాయి. ఇవి మెజారిటీ హిందూ మనోభావాలను  దెబ్బతీస్తున్నాయి. వాటిని చూచిన ప్రతిసారీ, హిందువుల రక్తం ఉడికిపోతున్నది. ఈ చారిత్రక తప్పిదాలను సరిచేయవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందా లేదా? మరి అదేం చేసింది? అగ్నికి ఆజ్యం పోసింది. పైగా ఇలాంటి చట్టాన్ని తెచ్చి ఈనాడు సమస్యను ఇంకా జటిలం చేసి కూచుంది. ప్రభుత్వం ఉండేది సమస్యలు తీర్చడానికా, ఇంకా పెంచడానికా? కంచె చేను మెయ్యడం అంటే ఇదేనా కాదా?

Places of worship Act - 1991 తో హిందువులకే దెబ్బ. దీనిని ఒప్పుకున్నామంటే ఏమిటి అర్ధం? 14 ఆగస్టు 1947 వరకూ మన దేశంలో జరిగిన ఘోరాలన్నిటినీ మనం ఆమోదించి ఒప్పుకున్నట్టు అయింది. దీనిని ఆమోదించింది ఎవరు? కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఎంపీలు. ఈ చట్టం ఆమోదింపబడినప్పుడు, హిందువుల మనోభావాలను లెక్కలోకి తీసుకుని ఈ పనిని చేశారా? లేకపోతే, మైనారిటీలను దువ్వడానికి భరతమాత పరువూ మర్యాదల్ని అమ్ముకున్నారా? వీళ్ళు ప్రజాప్రతినిధులా? సిగ్గుందా అసలు?

ఇప్పుడు, 2022లో, Anti Conversion Bill రాకుండా ఉంటే ఎవరికీ నష్టం? మళ్ళీ హిందువులకే నష్టం. ఎందుకని? మతమార్పిళ్ళతో దేశ డెమోగ్రఫీ మారిపోతున్నది గనుక. ప్రతిమత మార్పిడీ, మతవిద్వేషాన్ని రెచ్చగొట్టడమే. అమాయకులైన హిందూనిమ్నకులాలలో  హిందూమతం పైన విద్వేషాన్ని నింపడమే. ఇదే ట్రెండ్ ఇలాగే కొనసాగితే, త్వరలో ఈ దేశం సివిల్ వార్ వచ్చే దిశగా ప్రయాణిస్తున్నది. మరి, ఈ బిల్లును రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? మళ్ళీ అదే కాంగ్రెస్, దాని భజనపార్టీలు. అసలీ దేశంలోని మెజారిటీలైన హిందువుల ప్రయోజనాలకు అనుగుణంగా ఒక్క చట్టమూ రాదా? ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాపాలకులు చేయవలసింది ఇదేనా? వీళ్ళు ప్రజా రక్షకులా లేక ప్రజా భక్షకులా?

'జ్ఞానవాపి మసీదు' అనే పేరే, 'ఇల్లీగల్ సంతానం' అన్నట్లు, వినడానికి చాలా అసహ్యంగా ఉంది, అదొక అపభ్రంశ పదం. అదొక చారిత్రిక తప్పిదం. అక్కడున్న మసీదును వెంటనే తొలగించి, దానిని తిరిగి కాశీ విశ్వనాధ మందిరంలో కలపాలి. ఇది హిందువుల డిమాండ్ !

ఈ పరిస్థితిలో, ఒవైసీ వంటి మతోన్మాదులు కల్పించుకుని అర్ధంలేని స్టేట్ మెంట్లు ఇస్తూ, ప్రజలలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అక్కడేదో తన పర్సనల్ ప్రాపర్టీ పోగొట్టుకున్న రీతిలో ఒవైసీ మాట్లాడుతున్నాడు. మన దేవాలయాల్ని ఆక్రమించి కూలగొట్టింది వాళ్ళు. ఇప్పుడు ఖాళీ చెయ్యమంటే, ఇదేం వాగుడు?

మరిప్పుడు ముస్లిములు ఏం చెయ్యాలి?

నేనే గనుక ఈ మతిలేని ముస్లిముల లీడర్ని అయితే, వాళ్ళకి ఇలా చెబుతాను.

'ఇతరమతాల స్థలాల మీద మసీదును కట్టకూడదని, అలా కట్టిన మసీదులో అల్లా ఉండదని ఇస్లాం చెబుతున్నది. కనుక, మనంతట మనమే గౌరవంగా జ్ఞానవాపి స్థలాన్ని, హిందువులకు అప్పగిద్దాం.  దానిని బదులుగా, ప్రత్యామ్నాయ స్థలాన్ని తీసుకుని అక్కడ మన మసీదును ఇంకా మంచిగా కట్టుకుందాం. దుబాయ్ నుంచి, సౌదీ నుంచి అక్రమ ఫండ్స్ ఎలాగూ మనకు బోలెడన్ని వస్తాయి. అక్కడిదాకా ఎందుకు? ఇండియా మొత్తం మీద టాక్స్ కట్టకుండా రోడ్లమీద పండ్ల వ్యాపారాలు చేస్తున్న మనవాళ్లంతా ఆ బ్లాక్ మనీలో 1% ఇస్తేచాలు, ఆ ప్లేస్ లో బ్రహ్మాండమైన మసీదును కట్టుకోవచ్చు. అలా కట్టుకుందాం. జ్ఞానవాపిని వదిలేద్దాం' అని నేనంటాను.

సమస్య పరిష్కారమై పోయింది ! ఇలా చేస్తే, ముస్లిమ్స్ అన్నా, ఇస్లాం అన్నా, హిందువులలో గౌరవమూ ప్రేమా పెరుగుతాయి. ముస్లిమ్స్ మీదున్న టెర్రరిస్టులు అనే ముద్ర ఒక్క దెబ్బతో మాయమై పోతుంది.

ఇలా విశాలమైన దృష్టిలో ముస్లిం లీడర్స్ ఎందుకు ఆలోచించరు? దీనివల్ల వాళ్లకు పోయేదేముంది? 'ఇస్లాం అంటే శాంతి, అది, ఇది' అంటూ వాళ్ళు చెప్పే నీతులు ప్రాక్టికల్ గా ఆచరించి చూపిస్తే ఎంత బాగుంటుంది? వాళ్లిలా ఎందుకు చెయ్యలేరు?

అది విశ్వనాధ ఆలయమే అని అందరికి తెలుసు. గుడి గోడలే సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.  గుడి ఆవరణలోనే మసీదు ఉంది. ఇంకా పట్టుదలలెందుకు? గొడవలెందుకు? ప్రభుత్వమే ఇంకొక చోట స్థలాన్నిస్తుంది. అక్కడ మసీదు కట్టుకోండి. ఎవరొద్దన్నారు? హిందువుల మనోభావాలను గాయపరుస్తూ ఉంటే మీకేమొస్తుంది?

వక్ఫ్ బోర్డులు, ముస్లిం లీడర్స్ ఈ కోణంలో ఎందుకు ఆలోచించరు? మీ తాతముత్తాతలు చేసిన ఘోరమైన నేరాన్ని మీరెందుకు సరిదిద్దుకోలేరు? ఇలా చేస్తే మీకేంటి నష్టం?

ఆలోచించండి మరి !